Nalgonda

News August 12, 2024

కరెంటు షాక్‌తో వ్యక్తి మృతి

image

కరెంటు షాక్‌తో వ్యక్తి మృతి చెందిన సంఘటన యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం ములకలపల్లి గ్రామ సమీపంలో జరిగినది. బీహార్‌కు చెందిన మున్నా కుమార్ మల్లాపూర్ ఐడిఏలో స్క్రాప్ కూలి పని చేస్తుండేవాడు. వృత్తిలో భాగంగా ములకలపల్లి గ్రామంలోని డీసీఎం లో ఇనుప పైపులను లోడ్ చేస్తున్న క్రమంలో ప్రమాదవశాత్తు కరెంటు వైర్లు తగిలి మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేశారు.

News August 12, 2024

విద్యుదాఘాతంతో యువకుడి మృతి

image

మోటకొండూరు మండలం ఇక్కుర్తి వీధి దీపాలు బిగిస్తుండగా విద్యుత్ షాక్‌తో యువకుడు తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఎస్సై పాండు వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన గిరిధర్ ఈనెల 9న గ్రామంలో వీధి దీపాలు బిగిస్తుండగా విద్యుత్ ఘాతానికి గురయ్యాడు. కుటుంబ సభ్యులు గిరిధర్‌ను ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. పరిస్థితి విషమించడంతో మృతి చెందాడు. తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.

News August 12, 2024

నల్గొండ జిల్లాలో పశు సంపద లెక్క తగ్గింది!

image

నల్గొండ జిల్లాలో పశు సంపద ఏటేటా తగ్గిపోతుండడం ఆందోళన కలిగిస్తుంది. ఐదేళ్ల క్రితం పోల్చితే ఈసారి లెక్క తగ్గింది. గత ప్రభుత్వం గొర్రెల పంపిణీ పథకం చేపట్టకముందు జిల్లాలో ఉన్న గొర్రెలు మేకల సంఖ్య కంటే పథకం అమలు చేశాకే తక్కువ ఉన్నట్లు అధికారులు గుర్తించారు. జిల్లాలోని 31 మండలాల్లో 9,12,625 గొర్రెలు ఉండగా, 3,36,182 మేకలు ఉన్నట్లు తేలింది. రాయితీపై పంపిణీ చేసిన గొర్రెలు లెక్కలోకి రావడం లేదు.

News August 12, 2024

రూ.2 లక్షల రుణమాఫీపై మంత్రి ఉత్తమ్ కీలక ప్రకటన

image

రెండు లక్షల రుణమాఫీపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. ఈనెల 15వ తేదీన కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం పూసుగూడెంలోని సీతారామ ప్రాజెక్ట్ పంప్ హౌస్ సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభిస్తారని తెలిపారు. అదే రోజు రూ.2 లక్షల రుణమాఫీ చేయబోతున్నట్లు ప్రకటించారు.

News August 11, 2024

నల్గొండ: వారంలో పెళ్లి.. గుండెపోటుతో మృతి

image

వారంలో పెళ్లి ఉందనగా గుండెపోటుతో యువకుడు మృతిచెందిన ఘటన నిడమనూరు మండలం ముప్పారంలో జరిగింది. మృతుడి బంధువులు తెలిపిన వివరాలిలా.. గ్రామానికి చెందిన శంకరయ్య, పద్మల కుమారుడు శివకుమార్(23) ఇంట్లో శుక్రవారం రాత్రి ఇంట్లో నిద్రించాడు. శనివారం ఉదయం వచ్చి లేపినా లేవలేదు. నిద్రలో గుండెపోటు రావడంతో మృతి చెందినట్లు గుర్తించారు. శివ వివాహం ఈనెల 18న జరగాల్సి ఉంది.

News August 11, 2024

నాగార్జున సాగర్‌ కాలువలో యువకుడి గల్లంతు 

image

సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండలం వెలిదండలో పెళ్లికి వచ్చిన యువకుడు సాగర్ కాలవలో గల్లంతు అయిన ఘటన ఆదివారం జరిగింది. స్నానం కోసం సాగర్ కాలువ దిగి ప్రమాదవశాత్తు కాలు జారి గల్లంతు అయ్యాడు. యువకుడు హుజూర్నగర్‌కు చెందిన వెంకట్‌గా(20) స్థానికులు గుర్తించారు. యువకుడి కోసం గరిడేపల్లి పోలీసులు గాలిస్తున్నారు.

News August 11, 2024

శ్రావణమాస బోనాల పండుగ వేడుకలో మిర్యాలగూడ ఎమ్మెల్యే

image

శ్రావణమాసం బోనాల సందర్భంగా మిర్యాలగూడ పట్టణంలోని వీధిలో కూడా నందు శ్రీ ముత్యాలమ్మ పరమేశ్వరి అమ్మవారి బోనాల మహోత్సవంలో స్థానిక ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి పాల్గొన్నారు. అనంతరం అమ్మవారికి నైవేద్యం సమర్పించి మాట్లాడుతూ.. నియోజకవర్గ ప్రజలందరూ ఆయురారోగ్యాలతో ఉండాలని రైతులకు మంచిగా పంటలు పండాలని అమ్మవారిని ప్రార్థించినట్లు తెలిపారు.

News August 11, 2024

నాగార్జునసాగర్ ప్రాజెక్టు పరిసరాల్లో పోలీసుల ఆంక్షలు

image

నాగార్జునసాగర్ ప్రాజెక్టు పరిసరాల్లో పోలీసులు ఆంక్షలు విధించారు. నేడు ఆదివారం కావడంతో సాగర్ అందాల చూసేందుకు పర్యాటకులు పోటెత్తారు. మెయిన్ డ్యామ్, పవర్ హౌస్ పరిసరాల్లోకి టూరిస్టులను అనుమతించమని పోలీసులు ఆంక్షలు విధించారు. ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా గేట్ల వద్దకు వెళ్లే వాహనాలను దూరంలోనే పార్కింగ్ చేయిస్తున్నారు.

News August 11, 2024

‘నల్గొండ’కు జ్వరమొచ్చింది!

image

జిల్లా వ్యాప్తంగా విషజ్వరాల బారిన పడి ప్రజలు విలవిలలాడుతున్నారు. జిల్లాలో ఇటీవల ముసురుతో కూడిన వర్షాలతో పల్లెల్లో పారిశుద్ధ్యం పడకేయడంతో దోమల వ్యాప్తి పెరిగింది. దీంతో జిల్లాలో ఎక్కువగా డెంగ్యూ, చికున్‌గున్యా, మలేరియా, టైఫాయిడ్ ప్రబలుతున్నాయి. కీళ్లనొప్పులు, కాళ్లు, ఒంటి నొప్పుల కారణంగా వందలాది మంది రోగులు నడవలేక అల్లాడుతున్నారు. ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటివరకు 466 డెంగ్యూ కేసులు నమోదయ్యాయి.

News August 11, 2024

శాలిగౌరారం ప్రాజెక్టుకు యాదగిరిరెడ్డి పేరు పెట్టాలని వినతి

image

శాలిగౌరారం ప్రాజెక్టుకు స్వాతంత్ర్య సమరయోధుడు, ప్రాజెక్టు నీటి సంఘం మాజీ ఛైర్మన్ చామల యాదగిరి రెడ్డి పేరు పెట్టాలని మండలానికి చెందిన పలువురు నేతలు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని కోరారు. శనివారం మంత్రి ఉత్తమ్‌ను HYDలో ప్రెస్ అకాడమీ ఛైర్మన్ శ్రీనివాసరెడ్డి, కోమటిరెడ్డి ప్రతీక్ రెడ్డి మెమోరియల్ ట్రస్ట్ కన్వీనర్ మారం గోనారెడ్డి, కాంగ్రెస్ నాయకుడు చామల వెంకటరమణారెడ్డి కలిసి వినతిపత్రం అందజేశారు.