Nalgonda

News April 23, 2025

NLG: బీసీ గురుకుల జూనియర్ కాలేజీల్లో ప్రవేశాలు

image

బీసీ గురుకుల జూనియర్ కాలేజీల్లో మొదటి సంవత్సరం ప్రవేశాలకు నోటిఫికేషన్ వెలువడింది. వచ్చే నెల 12వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరిస్తామన్నారు. పదో తరగతిలో వచ్చిన మార్కుల ఆధారంగా సీట్ల కేటాయింపు ఉంటుంది. రాష్ట్రవ్యాప్తంగా 130 కాలేజీలు బాలురకు 127 కాలేజీలు బాలికలకు ఉన్నాయి. మరిన్ని వివరాలకు https://mjpabcwreis.cgg.gov.in/ TSMJBCWEB/లేదా 040-23328266 నంబర్‌ను సంప్రదించగలరు.

News April 23, 2025

NLG: కొనసాగుతున్న ఓపెన్ ఇంటర్ పరీక్షలు

image

నల్గొండ జిల్లాలో ఓపెన్ ఇంటర్ పరీక్షలు కొనసాగుతున్నాయి. మంగళవారం నిర్వహించిన పొలిటికల్ సైన్స్ పరీక్షకు 1454 మంది విద్యార్థులకు గాను,1238 మంది పరీక్ష కు హాజరు కాగా, 216 మంది పరీక్షకు గైరాజరయ్యారు. అదేవిధంగా గణితం పరీక్షకు1481 మందికి 1252 మంది హాజరు కాగా,122 మంది గైర్హాజరయ్యారు. కెమిస్ట్రీ పరీక్షకు 467 మందికి 397 మంది హాజరు కాగా, 70 మంది గైర్హాజరైనట్లు డీఈవో బిక్షపతి తెలిపారు.

News April 22, 2025

పదవీవిరమణ పొందిన హోమ్ గార్డ్‌ను సన్మానించిన ఎస్పీ

image

పోలీస్ శాఖలో 33 సంవత్సరాలుగా సేవలందించడం అభినందనీయమని ఎస్పీ శరత్ చంద్ర పవార్ అన్నారు. జిల్లా పోలీస్ శాఖలో నార్కట్పల్లి పోలీస్ స్టేషన్లో హోమ్ గార్డ్‌గా పనిచేస్తూ మంగళవారం పదవి విరమణ పొందుతున్న ఆర్.వెంకటేశ్వర్లును జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ ఘనంగా సత్కరించి వారు పోలీసు శాఖకు అందించిన సేవలను కొనియాడారు.

News April 22, 2025

ఉమ్మడి నల్గొండ జిల్లాల STATE ర్యాంకులు ఇవే..!

image

☞ ఫస్ట్ ఇయర్‌లో (స్టేట్)
నల్గొండ – 56.74 శాతంతో 21వ ర్యాంక్
యాదాద్రిభువనగిరి – 58.54 శాతంతో 17వ ర్యాంక్
సూర్యాపేట – 54.78 శాతంతో 24వ ర్యాంక్
☞సెకండ్ ఇయర్‌..
నల్గొండ – 68.97 శాతంతో 17వ ర్యాంక్
యాదాద్రిభువనగిరి – 67.92 శాతంతో 22వ ర్యాంక్
సూర్యాపేట – 66.28 శాతంతో 26వ ర్యాంక్

News April 22, 2025

ఇంటర్ రిజల్ట్స్: నల్గొండ పాస్ పర్సంటేజ్ ఇలా..

image

నల్గొండ జిల్లాలో ఫస్టియర్ పరీక్షను 13,977 మంది రాయగా 7931 మంది పాసయ్యారు. ఉత్తీర్ణతా శాతం 56.74 శాతంగా ఉంది. సెకండియర్‌లో 12,992 విద్యార్థులకు గాను 8,960 మంది పాసయ్యారు. పాస్ పర్సంటేజ్ 68.97శాతంగా ఉంది.

News April 22, 2025

నాగార్జునసాగర్ జలాశయం నేటి సమాచారం

image

నాగార్జునసాగర్ జలాశయం సమాచారాన్ని అధికారులు మంగళవారం వెల్లడించారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు ఉండగా ప్రస్తుతం 514.60 అడుగులుగా ఉంది. కుడి, ఎడమ కాలువలకు నీరు విడుదల చేయడ లేదు. జలాశయానికి ఇన్ ఫ్లో నిల్ ఉండగా, అవుట్ ఫ్లో 1,350 క్యూసెక్కులు ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు.

News April 22, 2025

NLG: కొత్త కార్డులు ఇచ్చేది ఎప్పుడో..!

image

జిల్లాలో కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తుదారులకు నిరీక్షణ తప్పడం లేదు. కొత్తగా ఏర్పాటైన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలనలో దరఖాస్తులు స్వీకరించింది. దీంతో జిల్లాలో 1,25,733 మంది దరఖాస్తులు చేసుకున్నారు. బీసీ కుల గణన సమయంలో 27, 523 మంది.. సవరణల కోసం 37,229 మంది దరఖాస్తు చేసుకున్నారు. వీటన్నింటిని పరిశీలించిన అధికారులు 69,473 దరఖాస్తులకు అప్రూవల్ చేసినా సివిల్ సప్లై శాఖ ఓకే చెప్పలేదు.

News April 22, 2025

NLG: ఇంటర్న్‌షిప్ పథకం దరఖాస్తులకు ఇవాళే లాస్ట్

image

ప్రధానమంత్రి ఇంటర్న్‌షిప్ పథకం 2వ దశ దరఖాస్తు గడువు ఇవాల్టి వరకు పొడిగించినట్లు నల్గొండ జిల్లా పరిశ్రమల కేంద్రం జాయింట్ డైరెక్టర్ వి.కోటేశ్వరరావు తెలిపారు. ఈ ఇంటర్న్‌షిప్‌కు ఎంపికైన విద్యార్థులకు నెలవారి భత్యం రూ.5,000 మంజూరు చేస్తారని తెలిపారు. 12 నెలల ఇంటర్న్‌షిప్‌ కాల వ్యవధిలో కనీసం 6 నెలలు ఉద్యోగ శిక్షణ ఉంటుందని తెలిపారు. ఈ అవకాశానికి విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

News April 22, 2025

NLG: 20 దేశాలకు మన తాటి ముంజలు!

image

వేసవి వచ్చిందంటే చాలు తాటి ముంజలకు గిరాకీ పెరుగుతుంది. వివిధ ప్రాంతాల నుంచి పలువురు తాటి ముంజలను NLGకు తీసుకువచ్చి విక్రయిస్తున్నారు. డజన్ రూ.70 వరకు అమ్ముతున్నట్లు తెలిపారు. NLG జిల్లాకు చెందిన మువ్వ రమేశ్ అనే యువ పారిశ్రామికవేత్త వీటిని విదేశాలకు ఎగుమతి చేస్తూ డబ్బులు సంపాదిస్తున్నాడు. గుడిమల్కాపూర్ ఇండస్ట్రియల్ పార్కులోని తేజస్ ఫుడ్ ఇండస్ట్రీస్ ద్వారా 20 దేశాలకు తాటి ముంజలు ఎగుమతి చేస్తున్నారు.

News April 22, 2025

చిట్యాల: రోడ్డు ప్రమాదంలో డ్రైవర్ మృతి

image

చిట్యాల సమీపంలో జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతిచెందాడు. పోలీసులు తెలిపిన వివరాలిలా.. జహీర్ పటేల్ అనే వ్యక్తి బీదర్ నుంచి విశాఖపట్నం వెళ్తున్నాడు. కంటైనర్‌ను పక్కకు ఆపి ఎదురుగా ఉన్న హోటల్లో భోజనం చేయడానికి రోడ్డు దాటుతున్నాడు. ఈ క్రమంలో హైదరాబాద్ వైపు వెళ్తున్న కారు ఢీకొట్టడంతో జహీర్ అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.