Nalgonda

News August 9, 2024

నల్గొండ: పెరుగుతోన్న కేసులు

image

ఉమ్మడి నల్గొండ జిల్లాలో డెంగీ కేసులు పెరుగుతోన్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో పారిశుద్ధ్యం అస్తవ్యస్తంగా ఉండడమే కేసుల పెరుగుదలకు కారణమవుతోంది. ఫాగింగ్ చర్యలు చేపట్టకపోవడంతో దోమల బెడద తప్పడం లేదు. మే నుంచి ఇప్పటికి వరకు మూడు నెలల్లోనే సూర్యాపేట జిల్లాలో 155 డెంగీ కేసులు నమోదయ్యాయి. మలేరియా, టైఫాయిడ్ లాంటి వైరల్ ఫీవర్స్ వస్తున్నాయి. పరిసరాలతో పాటు వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని వైద్యులు సూచిస్తున్నారు.

News August 9, 2024

స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు ఏర్పాట్లు : కలెక్టర్

image

ఎలాంటి పొరపాట్లకు ఆస్కారం ఇవ్వకుండా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను నిర్వహించాలని కలెక్టర్ సి.నారాయణరెడ్డి అధికారులను ఆదేశించారు. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల ఏర్పాట్లపై గురువారం ఆయన జిల్లా అధికారులతో టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. పోలీస్ పరేడ్ మైదానంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను నిర్వహించడం జరుగుతుందని తెలిపారు.

News August 8, 2024

సుంకిశాల అవసరం లేని సాగునీటి పథకం: గుత్త సుఖేందర్ రెడ్డి

image

శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి గురువారం మీడియాతో చిట్ చాట్ నిర్వహించారు. కృష్ణా బేసిన్, నల్లగొండ జిల్లా సాగునీటి ప్రాజెక్టు నిర్మాణ నిర్లక్ష్యానికి గత ప్రభుత్వమే కారణమని తెలిపారు. గత ప్రభుత్వం కాళేశ్వరంపై చూపిన శ్రద్ధ కృష్ణా బేసీన్ పై చూపలేదన్నారు. మూసీ రివర్ ఫ్రంట్ ఏర్పాటు మంచి పరిణామమని సుంకిశాల అవసరం లేని సాగునీటి పథకం అన్నారు.

News August 8, 2024

సుంకిశాల అవసరం లేని సాగునీటి పథకం: గుత్త సుఖేందర్ రెడ్డి

image

శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి గురువారం మీడియాతో చిట్ చాట్ నిర్వహించారు. కృష్ణా బేసిన్, నల్లగొండ జిల్లా సాగునీటి ప్రాజెక్టు నిర్మాణ నిర్లక్ష్యానికి గత ప్రభుత్వమే కారణమని తెలిపారు. గత ప్రభుత్వం కాళేశ్వరంపై చూపిన శ్రద్ధ కృష్ణా బేసీన్ పై చూపలేదన్నారు. మూసీ రివర్ ఫ్రంట్ ఏర్పాటు మంచి పరిణామమని సుంకిశాల అవసరం లేని సాగునీటి పథకం అన్నారు.

News August 8, 2024

నల్లగొండలో రాజకీయ దుమారం

image

నల్లగొండ రాజకీయాలు మళ్లీ హీటెక్కిస్తున్నాయి. NLG నడిబొడ్డున బీఆర్ఎస్ నిర్మించిన జిల్లా పార్టీ ఆఫీసుపై రాజకీయ దుమారం రేగుతోంది. నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన పార్టీ ఆఫీసును కూల్చివేయాలని జిల్లా మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అధికారులను ఆదేశించారు. నిబంధనల ప్రకారమే నిర్మించామని బీఆర్ఎస్ నాయకులు చెబుతున్నారు. ఈ అంశం ఇప్పుడు జిల్లాలో హాట్ టాపిక్‌గా మారింది.

News August 8, 2024

NLG: మాల మహానాడు నేతల ఢిల్లీ బాట

image

ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా మాల మహానాడు చేపట్టిన చలో ఢిల్లీ కార్యక్రమానికి ఆ సంఘం రాష్ట్ర నేతలు పలువురు నల్గొండ నుంచి ఇవాళ బయలుదేరి వెళ్లారు. ఈనెల 8, 9,10 వ తేదీలలో ఢిల్లీలో ధర్నా కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర నాయకులు పరిమి కోటేశ్వరరావు, నల్గొండ, సూర్యాపేట జిల్లా అధ్యక్షులు లకుమాల మధుబాబు, పిట్టల భాగ్యమ్మ తెలిపారు. రంగరాజు స్వర్ణలత, లలితలు కూడా ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు.

News August 8, 2024

NLG: యూనిట్ చెడిపోయి రెండేళ్లు

image

నాగార్జునసాగర్ ఎడమకాల్వపై ఉన్న విద్యుత్తు ఉత్పత్తి కేంద్రంలో రెండు యూనిట్లను ఏర్పాటు చేశారు. ఇందులో ఒక యూనిట్ 2014 సంవత్సరంలో పెన్ స్టాక్ గేటు పనిచేయక నీరు వచ్చి మరమ్మతులకు గురైంది. జెన్కో అధికారులు దీనికి 2015లో మరమ్మతులు నిర్వహించినప్పటికీ తిరిగి 2022లో మరమ్మతులకు గురైంది. యూనిట్ చెడిపోయి రెండేళ్లు అవుతున్నా… జెన్కో అధికారులు మరమ్మతులకు చర్యలు తీసుకోకపోవడంపై విమర్శలు వెలువెత్తుతున్నాయి.

News August 8, 2024

నిండుకుండలా నాగార్జున సాగర్

image

శ్రీశైలం ప్రాజెక్టుకి వరద కొనసాగుతుండటంతో బుధవారం 10 గేట్లను ఎత్తి 3,09,890 క్యూసెక్కులు, విద్యుదుత్పత్తి కోసం 64,768 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. దాంతో నాగార్జునసాగర్‌లోకి 2,95,919 కూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తోంది. సాగర్ నుంచి 18 గేట్ల ద్వారా 2,49,300 క్యూసెక్కులను నదిలోకి వదులుతున్నారు. సాగర్ పూర్తి నీటిమట్టం 590 అడుగులు కాగా ప్రస్తుతం 584.50 అడుగులుగా ఉంది.

News August 8, 2024

రుణ మంజూరులో జాప్యం.. రైతన్నలకు ఇక్కట్లు

image

దేవుడు వరమిచ్చినా పూజారి కరుణించడం లేదనే చందంగా ఉంది జిల్లాలో బ్యాంక్ అధికారుల తీరు. కాంగ్రెస్ ప్రభుత్వం రూ.1.50 లక్షల లోపు రైతు మాఫీ చేసిన విషయం తెలిసిందే. అయితే బ్యాంక్ అధికారులు రుణమాఫీ అయిన రైతులకు తిరిగి వెంటనే నూతన రుణాలు ఇవ్వాల్సి ఉంది. కానీ రైతులకు నూతన రుణాలు అందించడంలో జిల్లాలోని పలు బ్యాంకుల అధికారులు తీవ్ర జాప్యం చేస్తుండడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

News August 8, 2024

NLG: కృష్ణమ్మ పరవళ్లు.. పర్యాటకుల సందడి

image

నాగార్జునసాగర్ వద్ద కృష్ణమ్మ పరవళ్లు తిలకించేందుకు పర్యాటకులు భారీగా తరలివచ్చారు. ఆ మనోహర దృశ్యాన్ని సెల్ఫోన్లలో బంధించడంతో పాటు సెల్ఫీలు దిగారు. కొత్త బ్రిడ్జి దగ్గర నుంచి శివాలయం వెంట విద్యుదుత్పత్తి కేంద్రం వరకు పర్యాటకులు బారులుతీరి ప్రకృతి అందాలను తిలకిస్తూ గడిపారు. కాగా సాగర్ జలాశయానికి బుధవారం రాత్రి 9 గంటలకు 3,51,844 క్యూసెక్కుల ఇన్ ఫ్లో వస్తోంది.