India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
పాఠశాలలో విద్యార్థుల నిష్పత్తి అనుగుణంగా ఉపాధ్యాయుల పని సర్దుబాటుకు అందరూ సహకరించాలని, ఉపాధ్యాయులు, విద్యార్థుల రోజువారి హాజరు మెరుగుపరుచుకోవాల్సిన ఆవశ్యకత ఉందని కలెక్టర్ తేజస్ నందాలాల్ పవార్ తెలియజేశారు. బుధవారం కలెక్టరేట్లో మండల విద్యాధికారులు, కోఆర్డినేటర్లు, మండల నోడల్ అధికారులతో సమావేశం నిర్వహించారు. రెండో దశ ఏకరూప దుస్తులు విద్యార్థులకు వారం రోజులలో అందజేయాలని కలెక్టర్ పేర్కొన్నారు.
ఎర్రబెల్లికి చెందిన కోడి శ్రీరాములు గుండెపోటుతో మరణించగా లైన్స్ క్లబ్ ఆఫ్ నల్గొండ సభ్యులు సంప్రదించగా కుటుంబ సభ్యులు నేత్రదానానికి అంగీకరించారు. వైద్యులు డా.హరనాథ్, డా.పుల్లారావు ఈ నేత్రదాన కార్యక్రమం నిర్వహించారు. తాను మృతి చెంది అంధులకు చూపును ప్రసాదించాడని శ్రీరాములును పలువురు ప్రశంసించారు.
రాష్ట్ర రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రెటరీ, CCAL నవీన్ మిట్టల్ నాగార్జునసాగర్ ప్రాజెక్టు డ్యాంను సందర్శించారు. సాగర్ ప్రాజెక్టు క్రస్ట్ గేట్ల నుంచి పారుతున్న నీటిని, సాగర్ పరిసర ప్రాంతాలను ఆయన పరిశీలించారు. ఆయన వెంట జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డి, అదనపు కలెక్టర్ జె.శ్రీనివాస్, సీసీఎల్ఏ కార్యాలయ అధికారి లచ్చిరెడ్డి, ధరణి కమిటీ రాష్ట్ర సభ్యులు భూమి సునీల్, డీఎఫ్ఓ రాజశేఖర్ ఉన్నారు.
నేతన్న బీమా పథకానికి ఈనెల 9వ తేదీ వరకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు చేనేత జౌళిశాఖ ఏడీ ఎస్.ద్వారక్ ఒక ప్రకటనలో తెలిపారు. చేనేత, మర మగ్గాలు వాటి అనుబంధ కార్మికులు 18 నుంచి 59 ఏళ్లలోపు వారు పథకానికి దరఖాస్తు చేసుకోవడానికి అర్హులని పేర్కొన్నారు. ఈ పథకంలో నమోదైన కార్మికులు ఏదైనా కారణంతో మరణిస్తే బాధిత కుటుంబానికి రూ.5 లక్షల బీమా వస్తుందని తెలిపారు.
నాగార్జునసాగర్ గేట్లు తెరవడంతో ప్రాజెక్ట్ అందాలను చూసేందుకు వెళ్లే పర్యాటకుల తాకిడి పెరిగింది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ MGBS బస్టాండ్ నుంచి నేరుగా సాగర్కు ప్రత్యేక బస్సులు నడుపుతున్నారు. ఈ సర్వీసులు ఉదయం 5, 6.45, 7.15, 7.30, 8, 9.45, 10.45 గంటలకు.. తర్వాత మధ్యాహ్నం 2.30, సాయంత్రం 5, 5.40 గంటలకు డీలక్స్ బస్సులు MGBS బస్టేషన్ నుంచి నేరుగా సాగర్కు వెళ్తాయని అధికారులు తెలిపారు.
ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ సార్ సేవలను తెలంగాణ ప్రజలు స్మరించుకుంటారని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. నేడు ప్రొఫెసర్ జయశంకర్ సార్ జయంతిని పురస్కరించుకొని వారి సేవలను ఎంపీ గుర్తు చేసుకున్నారు, తెలంగాణ రాష్ట్రం కోసం నిరంతరం తపించి, రాష్ట్ర సాధన కోసం తన జీవితాన్నే త్యాగం చేసిన మహనీయులు ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ సార్ అన్నారు.
అన్నా చెల్లెలు ఒకే సారి ప్రభుత్వ ఉద్యోగాలు సాధించి తల్లిదండ్రులతో పాటు బంధువులను ఆనందోత్సవాలతో ముంచారు. సూర్యాపేట జిల్లా కేంద్రానికి చెందిన సమ్మెట విజయ్ కుమార్, రేణుక ఎల్లమ్మల కుమారుడు రాహుల్ గౌడ్, కుమార్తె ఐశ్వర్య ఉన్నారు. వీరు ఇటీవల వెలువడిన ఫలితాలలో రాహుల్ పంచాయతీ రాజ్లో ఏఈఈ, ఐశ్వర్య పబ్లిక్ హెల్త్లో ఏఈఈ ఉద్యోగం పొందారు.
నాగార్జునసాగర్ ప్రాజెక్టు ద్వారా ఈ ఏడాది పూర్తిస్థాయిలో 2 పంటలకు సాగునీరు అందిస్తామని కలెక్టర్ సి.నారాయణరెడ్డి తెలిపారు. ప్రాజెక్టు పూర్తి రిజర్వాయర్ నీటి సామర్థ్యానికి చేరువలో ఉన్నందున సోమవారం ఆయన ప్రాజెక్టు క్రస్ట్ గేట్లను తెరిచి సాగునీటిని దిగువకు వదిలివేశారు. ప్రస్తుతం ప్రాజెక్టులో 584 అడుగుల మేర నీరు ఉందని, 14 గేట్ల ద్వారా 2 లక్షల క్యూసెక్కుల నీటిని కిందికి వదిలేందుకు ప్రణాళిక సిద్ధం చేశారు.
ఇవాళ నాగార్జున సాగర్ క్రస్ట్ గేట్లు తెరుచుకోనున్నాయి. నీటి మట్టం గరిష్ఠ స్థాయికి చేరువ కావడంతో అధికారులు క్రస్ట్ గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేయనున్నారు. ఈ కార్యక్రమానికి కలెక్టర్ నారాయణరెడ్డి హాజరుకానున్నారు. 2లక్షల క్యూసెక్కుల వరద నీటిని దిగువకు విడుదల చేయనున్నట్లు ఎన్ఎస్పీ అధికారులు ప్రకటించారు.
నాగార్జునసాగర్ ప్రాజెక్టు రేడియల్ క్రస్ట్ గేట్లను ఆటోమెటిక్ మిషన్ ద్వారా ఎత్తనున్నారు. ఏ గేటు ద్వారా ఎంత నీరు వెళ్లాలో ఈ మిషన్లో ఫీడ్ చేస్తే.. ఆ గేటు అంతే ఎత్తు లేచి అంతే నీరు బయటికి వెళ్తుంది. వెళ్లే నీరు స్క్రీన్పై కనబడుతుంది. గతంలోనే ఈ ఆటోమెటిక్ మిషన్ ఏర్పాటు చేయగా మరమ్మతులకు గురికావడంతో కొన్నాళ్లు మ్యానువల్గా గేట్లు ఎత్తారు. ఈ ఏడాది మరమ్మతులు చేయించి వినియోగంలోకి తెచ్చారు.
Sorry, no posts matched your criteria.