Nalgonda

News August 5, 2024

ఏటేటా తగ్గుతున్న జీవాల సంఖ్య

image

జిల్లాలో గొర్రెలు, మేకల సంఖ్య తగ్గుతోంది. గత నెలలో జిల్లా పశుసంవర్ధక శాఖ నిర్వహించిన క్షేత్ర స్థాయి సర్వేలో జీవాల సంఖ్య తగ్గినట్లు లెక్కలు తేలాయి. జిల్లాలో ఐదేళ్ల తర్వాత గత నెలలో నిర్వహించిన సర్వేలో మొత్తం 12,48,807 జీవాలు ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. అందులో గొర్రెలు 9,12,625 ఉండగా మేక లు 3,36,182 ఉన్నట్లు సర్వేలో తేలింది. 2019లో నిర్వహించిన సర్వే లెక్కలతో పోల్చితే 46,584 జీవాల సంఖ్య తగ్గింది.

News August 5, 2024

మూసీకి తగ్గిన ఇన్ ఫ్లో

image

మూసీ ప్రాజెక్టు ఎగువ ప్రాంతాల నుంచి వరద తగ్గుముఖం పట్టింది. మూసీ ఎగువన ఉన్న HYD నగరంతో పాటు పరిసర ప్రాంతాల్లో గత వారం రోజుల నుంచి వర్షాలు కురవడం లేదు. దీంతో మూసీకి గత మూడు రోజుల నుంచి 500 క్యూసెక్కులకు పైగా వస్తున్న ఇన్ ఫ్లో ఆదివారం నాటికి కేవలం 60 క్యూసెక్కులకు తగ్గిపోయింది. ఇన్ ఫ్లో తగ్గటం, ఆయకట్టులో వానాకాలం పంటల సాగుకు నీటిని విడుదల చేస్తుండటంతో ప్రాజెక్టులో నీటిమట్టం తగ్గిపోతుంది.

News August 5, 2024

నల్గొండ: ఎస్సై కావడమే లక్ష్యం.. ప్రాణాలు తీసిన గొడవ

image

క్యాబ్ డ్రైవర్‌పై దాడి చేసిన ఘటనలో యువకుడు <<13779301>>మృతి చెందిన విషయం<<>> తెలిసిందే. NLGకి చెందిన వెంకటేశ్ రైతు బిడ్డ. అంజయ్య గౌడ్, వెంకటమ్మలకు నలుగురు ఆడపిల్లల తర్వాత వెంకటేశ్ ఐదో సంతానం. SI ప్రిపరేషన్ కోసం LBనగర్లో ఉంటూ రాత్రి పాకెట్ మనీ కోసం క్యాబ్ నడిపేవాడు. ఈ క్రమంలోనే రూ.200 కోసం జరిగిన ఘర్షణలో వెంకటేశ్ ప్రాణాలు కోల్పోయాడు. ఎకరంన్నర పొలం అమ్మి వైద్యానికి రూ.2 కోట్లు ఖర్చు పెట్టినా ఫలితం దక్కలేదు.

News August 5, 2024

రెండేళ్ల నరకయాతన.. రూ.2 కోట్లు పెట్టినా బతకలేదు

image

రూ.200 కోసం మొదలైన గొడవతో యువకుడి ప్రాణం పోయింది. పోలీసుల ప్రకారం.. NLG జిల్లా చింతపల్లి మండలానికి చెందిన వెంకటేశ్ HYDలో క్యాబ్ డ్రైవర్‌గా పనిచేసేవాడు. 2022 జులై 31న వివేక్‌రెడ్డి అనే వ్యక్తి క్యాబ్ బుక్ చేసుకున్నాడు. బిల్ రూ.900 కాగా రూ.700 ఇవ్వడంతో గొడవైంది. వివేక్ 20 మంది స్నేహితులతో వెంకటేశ్‌పై దాడి చేశాడు. రూ.2కోట్ల మేర ఖర్చు చేసినా రెండేళ్లపాటు మంచాన పడ్డ వెంకటేశ్ ఆదివారం మృతిచెందాడు.

News August 5, 2024

టీటీసీ లోయర్ థియరీ పరీక్షలు ప్రశాంతం: డీఈఓ భిక్షపతి

image

నల్గొండలో ఆదివారం నిర్వహించిన టెక్నికల్ టీచర్స్ సర్టిఫికెట్ లోయర్ గ్రేడ్ థియరీ పరీక్ష ప్రశాంతంగా ముగిసినట్లు డీఈఓ భిక్షపతి తెలిపారు. పట్టణంలోని రెండు పరీక్ష కేంద్రాల్లో ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పేపర్-1, మధ్యాహ్నం 2 గంటల నుంచి 3 గంటల వరకు పేపర్-2 మధ్యాహ్నం 3.30 గంటల నుంచి 4.30 గంటల వరకు పేపర్-3 పరీక్షలు జరిగాయి. ఈ పరీక్షలకు మొత్తం 362 మంది విద్యార్థులు హాజరైనట్లు డీఈఓ తెలిపారు.

News August 5, 2024

యాదాద్రి ఆలయ ఎలక్ట్రిసిటీ ఈఈపై సస్పెన్షన్ వేటు

image

యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ ఎలక్ట్రిసిటీ ఈఈ రామారావును సస్పెండ్ చేసినట్లు ఆలయ ఈవో భాస్కరరావు తెలిపారు. దేవస్థానం విద్యుత్ విభాగంలో పనిచేస్తున్న 12 మంది ఒప్పంద ఉద్యోగులు వ్యక్తిగత కారణాలతో జాబ్ మానేశారని.. వారి స్థానాల్లో కొత్తవారిని తప్పు దోవలో ఉద్యోగాల్లో చేర్పించారని విచారణలో తేలడంతో సస్పెన్షన్ వేటు వేసినట్లు తెలిపారు. ఇన్‌ఛార్జ్ ఈఈగా దయాకర్ రెడ్డిని నియమిస్తున్నట్లు తెలిపారు.

News August 5, 2024

NLGలో నైపుణ్యాల అభివృద్ధి సంస్థ: మంత్రి కోమటిరెడ్డి

image

చదువుకున్న నిరుద్యోగ యువతీ, యువకులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించేందుకుగాను NLGలో నైపుణ్యాల అభివృద్ధి సంస్థను నిర్మిస్తున్నట్లు రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. ఆదివారం ఆయన నల్గొండలోని తన క్యాంపు కార్యాలయం సమీపంలో ఉన్న మున్సిపల్ పార్కులో న్యాక్ ఆధ్వర్యంలో శిక్షణ పొందిన 30 మంది మహిళలకు ప్రతీక్ ఫౌండేషన్ ద్వారా ఉచిత కుట్టు మిషన్లను పంపిణీ చేశారు.

News August 4, 2024

NLG: 1,2 కాదు.. ఏకంగా 4 ప్రభుత్వ ఉద్యోగాలు

image

నల్గొండ జిల్లా పెద్దవూర మండలం తుంగతుర్తిలో వ్యవసాయ కుటుంబానికి చెందిన నడ్డి గోపాలకృష్ణ నాలుగు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించాడు. 2018 డిసెంబర్లో పంచాయతీ కార్యదర్శి, 2019 నవంబర్లో రైల్వేలో గ్రూప్-డీ ఉద్యోగం, 2020లో సివిల్ కానిస్టేబుల్‌గా ఎంపికై ప్రస్తుతం భువనగిరి పోలీస్ స్టేషన్లో విధులు నిర్వర్తిస్తున్నాడు. తాజాగా ప్రకటించిన టీజీపీఎస్సీ ఫలితాల్లో ఏఈఈ సివిల్ ఇంజినీర్ (గెజిటెడ్) ఉద్యోగం సాధించాడు.

News August 4, 2024

భువనగిరి: మూత్రశాల పక్కనే భోజన శాల

image

భువనగిరిలోని ప్రభుత్వ హైస్కూల్ పరిస్థితి ఆగమ్యగోచరంగా మారింది. పాఠశాల ఆవరణలో మూత్రశాలల పక్కనే భోజనశాల ఏర్పాటు చేయడంతో సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దాదాపు 500 మంది విద్యార్థులకు అరకొర మూత్రశాలలతో పాఠశాల అంతా కంపు కొడుతోంది. విద్యార్థులు రోగాల బారిన పడాల్సి వస్తోందని తల్లిదండ్రులు వాపోతున్నారు. ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలలపై దృష్టి పెట్టాలని కోరుతున్నారు.

News August 4, 2024

రైలు కింద పడి NG కాలేజ్ స్టూడెంట్ సూసైడ్ 

image

రైలు కింద పడి యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన నల్గొండ రైల్వే పోలీస్ స్టేషన్ పరిధిలో తెల్లవారుజామున జరిగింది. శేషమ్మ గూడెం గ్రామానికి చెందిన బొల్లెద్దు చందు (20) నల్గొండ ఎన్జీ కళాశాలలో డిగ్రీ చదువుతున్నాడు. శనివారం రాత్రి ఇంటి నుంచి వెళ్లిన చందు దుప్పలపల్లి సమీపంలో రైలుకింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. సూసైడ్‌కు గల కారణాలు తెలియాల్సి ఉంది.