India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
హుజూర్నగర్లోని టౌన్ హాల్లో బుధవారం పాస్టర్ ఫెలోషిప్ ఆధ్వర్యంలో మెగా ఉచిత గుండె, కిడ్నీ, ఎముకల వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ఐఎన్టీయూసీ ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఎరగాని నాగన్న గౌడ్ ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించారు. ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని అయన సూచించారు.
2024-25 విద్యా సంవత్సరానికి గాను ఉపకారవేతనాలు, ఫీజు రియంబర్స్మెంట్ల కొరకు ఈపాస్ అన్లైన్లో ఇంకనూ ధరఖాస్తు చేయని బీసీ, EBC విద్యార్ధులు మార్చి 31వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి అధికారి ఖాజా నాజిమ్ అలీ అప్సర్ ఒక ప్రకటనలో కోరారు. ఈపాస్ వెబ్సైట్ ద్వారా తమ కళాశాల విద్యార్థుల వివరాలను ఆయా కళాశాలల ప్రిన్సిపల్లు నమోదు చేయించే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు.
నకిరేకల్ ఎమ్మెల్యే వేముల మరోసారి మానవత్వం చాటుకున్నారు. నకిరేకల్ మండలం కడపర్తిలో బుధవారం జరిగిన ప్రజా పాలన గ్రామ సభకు హజరైన ఆయనకు ఓ మహిళ పెన్షన్ రావడంలేదని తెలిపింది. ఏడేళ్ల నుంచి నరాల వ్యాధితో బాధపడుతున్న తన భర్త సత్తయ్యకు పెన్షన్ రావడం లేదని గంగమ్మ ఎమ్మెల్యే దృష్టికి తీసుకెల్లింది. పెన్షన్ మంజూరు అయ్యేంతవరకు తానే సొంత డబ్బులు ఇస్తానని హామీ ఇచ్చి డబ్బులు అందించారు.
ఎంజీ యూనివర్సిటీ పరిధిలోని డిగ్రీ 1, 3, 5 సెమిస్టర్ల ఫలితాలను ఉపకులపతి ఆచార్య కాజా అల్తాఫ్ హుస్సేన్ విడుదల చేశారు. డిగ్రీ మొదటి సెమిస్టర్లో 6300 మంది విద్యార్థులకు గాను 1338 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించగా, 3వ సెమిస్టర్లో 4509 మందికి గాను 1569 మంది, 5వ సెమిస్టర్లో 5378 మందికి గాను 2380 మంది ఉత్తీర్ణత సాధించినట్లు సీఓజీ డా. ఉపేందర్ రెడ్డి తెలిపారు.
నల్గొండ జిల్లా కేంద్రంలో ఈనెల 28న బీఆర్ఎస్ రైతు ధర్నా నిర్వహించనున్నారు. క్లాక్ టవర్ సెంటర్లో జరిగే రైతు మహా ధర్నా కార్యక్రమంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొననున్నారు. ఉదయం 11 గం.నుంచి మధ్యాహ్నం 2 గం. వరకు కార్యక్రమానికి హైకోర్టు అనుమతి ఇచ్చినట్లు పార్టీ నాయకులు తెలిపారు. రైతు ధర్నాను పెద్ద ఎత్తున నిర్వహించేందుకు బీఆర్ఎస్ శ్రేణులు ఏర్పాట్లు చేస్తున్నారు.
భూపాల్ రెడ్డిపై దాడిని ఖండిస్తున్నట్లు KTR చెప్పారు. ‘పేరుకే ప్రజా పాలన. మాజీ ఎమ్మెల్యేకే రక్షణ లేకుండా పోయింది. బీఆర్ఎస్కు భయపడి నల్గొండ మహాధర్నాకు అనుమతి ఇవ్వలేదు. ఫ్లెక్సీలను చింపేసి ఏకంగా మాజీ ఎమ్మెల్యేనే బూతులు తిడుతూ కోమటిరెడ్డి గూండాలు దాడికి పాల్పడ్డారు. ఇది కాంగ్రెస్ అరాచక పాలన ‘ అని కేటీఆర్ ట్వీట్ చేశారు. చర్యలు తీసుకోవాలని డీజీపీని కోరారు.
నల్గొండ రీజియన్ డిపోలను సంక్రాంతి పండుగ లాభాల బాట పట్టించింది. NLG, DVK, KDD, MLG, SRPT, గుట్ట, నార్కెట్ పల్లి డిపోల పరిధిలో 995 ప్రత్యేక బస్సులు నడపగా రూ.2.78 కోట్ల ఆదాయం వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. పండుగ సందర్భంగా 32 లక్షల మంది ప్రయాణించారని తెలిపారు. అత్యధికంగా సూర్యాపేటలో రూ.74,62,545 ఆదాయం రాగా, తక్కువగా నార్కెట్ పల్లిలో రూ.17,91,455 వచ్చింది.
ఛత్తీస్గఢ్లోని గరియాబాద్లో జరిగిన భారీ ఎన్ కౌంటర్ నల్గొండ జిల్లాకు చెందిన మావోయిస్ట్ మృతి చెందారు. చండూరు మం. పుల్లెంలకు చెందిన పాక హన్మంతు మరణించినట్టు ఛత్తీస్గఢ్ పోలీస్ అధికారులు వెల్లడించారు. దీంతో ఆ గ్రామంలో విషాదం నెలకొంది. 45 ఏళ్ల క్రితం హనుమంతు మావోయిస్టు పార్టీలోకి వెళ్లారు. నల్గొండలోని ABVP నాయకుడు శ్రీనివాస్ హత్యలో హనుమంతు నిందితుడుగా ఉన్నాడు.
అమెరికాలో దోపిడీ దొంగలు జరిపిన కాల్పుల్లో NLG జిల్లాకు చెందిన రవితేజ <<15210729>>దారుణ హత్యకు<<>> గురైన సంగతి తెలిసిందే. ‘HYDలో క్యాబ్ డ్రైవర్గా పని చేస్తున్నాను. ఉన్న పొలాన్ని మొత్తం అమ్మి రవితేజను ఉన్నత చదువుల కోసం 2022లో అమెరికా పంపాం. MS పూర్తి చేసిన రవితేజ ఉద్యోగాన్వేషణలో ఉన్నాడు. తాత్కాలికంగా ఓ రెస్టారెంట్లో పనిచేస్తూ ఫుడ్ డెలివరీ చేసి వస్తుండగా ఈ ఘటన జరిగింది’ అని రవితేజ తండ్రి ఆవేదన వ్యక్తం చేశారు.
తనకున్న 70 ఎకరాల విస్తీర్ణంలో అడవిని సృష్టించిన సూర్యాపేట జిల్లా మోతె మండలం రాఘవపురానికి చెందిన దుశ్చర్ల సత్యనారాయకు తెలంగాణ గవర్నర్ అవార్డ్స్ ఫర్ ఎక్సలెన్స్ 2024 అవార్డు వరించింది. వివిధ రంగాల్లో సేవలందించిన వ్యక్తులు, సంస్థలకు ఈ అవార్డు అందిస్తారు. గవర్నర్ జిష్ణుదేశ్ వర్మ ఈనెల 26న అవార్డును ప్రదానం చేయనున్నారు. రూ.2లక్షల నగదు, జ్ఞాపిక అందజేస్తారు.
Sorry, no posts matched your criteria.