Nalgonda

News January 30, 2025

అమరవీరులకు నివాళులర్పించిన కలెక్టర్

image

అమరవీరుల దినోత్సవాన్ని పురస్కరించుకొని గురువారం జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి జిల్లా కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో అమరవీరులకు నివాళులర్పించారు. ఈ సందర్భంగా అమరులైన వారి స్పృత్యర్థం 2 నిమిషాలు మౌనం పాటించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ జె. శ్రీనివాస్, కలెక్టర్ కార్యాలయ పరిపాలన అధికారి మోతిలాల్, జిల్లా అధికారులు, కలెక్టర్ కార్యాలయ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

News January 30, 2025

నల్గొండ: చెట్టుపై నుంచి కిందపడి గీత కార్మికుడి మృతి

image

తాటి చెట్టుపై నుంచి కిందపడి గీత కార్మికుడు మృతి చెందిన ఘటన నల్గొండ మండలంలో జరిగింది. స్థానికులు తెలిపిన వివరాలు.. రాములబండ గ్రామానికి చెందిన గీత కార్మికుడు వెంకన్న గురువారం మధ్యాహ్నం స్థానిక క్రషర్ మిల్లు వద్ద ఉన్నతాటి చెట్లకు లొట్లు కట్టేందుకు చెట్టు ఎక్కాడు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు కిందపడి అక్కడికక్కడే మృతి చెందాడు. వెంకన్న మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

News January 30, 2025

నల్గొండ: మహాత్మా గాంధీకి గుడి కట్టారు..

image

స్వాతంత్ర్య సమరయోధుడు, భారతదేశాన్ని బ్రిటిష్ వారి పాలన నుంచి విముక్తి చేయడంలో ప్రధాన పాత్ర పోషించిన మహాత్మా గాంధీకి చిట్యాల మండలం పెద్ద కాపర్తి శివారులో గుడి కట్టి పూజలు చేస్తున్నారు. మహాత్మా గాంధీ ఛారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ గుడిని నిర్మించారు. దేశానికి స్వాతంత్ర్యం తెచ్చిన మహనీయుని గురించి భావి తరాలకు తెలియాలనే ఉద్దేశంతో గుడి కట్టినట్లు నిర్వాహకులు చెబుతున్నారు. కాగా నేడు గాంధీ వర్ధంతి.

News January 30, 2025

నాగర్జున సాగర్‌‌లో ఎకో టూరిజం అభివృద్ధి: సీఎం

image

నాగార్జున సాగర్‌లో ఎకో టూరిజం అభివృద్ధి చేసే అంశాన్ని పరిశీలించాలని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. బుధవారం టూరిజం పాలసీపై మంత్రి జూపల్లి, టూరిజం కార్పొరేషన్ ఛైర్మన్ పటేల్ రమేశ్, CS శాంతి కుమారి, ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. పర్యాటక అభివృద్ధితో రాష్ట్రానికి మరింత గుర్తింపు, ఆదాయం వచ్చేలా పాలసీ రూపొందించాలని CM సూచించారు.

News January 29, 2025

NLG: ఉచిత శిక్షణకు ఆఖరి తేదీ ఫిబ్రవరి 9

image

ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన అర్హులైన BS, EBC, SC, ST అభ్యర్థులకు SSC, RRB, బ్యాంకింగ్ ఉద్యోగాల కోసం ఉచిత శిక్షణ ఇవ్వడానికి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు తెలంగాణ వెనుకబడిన తరగతుల ఉపాధి నైపుణ్య అభివృద్ధి శిక్షణ కేంద్రం సంచాలకుడు ఖాజా నజీమ్ అలీ అఫ్సర్ తెలిపారు. దరఖాస్తు చేసుకునే వారు డిగ్రీ ఉత్తీర్ణులై, 18 నుంచి 39 సంవత్సరాల వయస్సు కలిగి ఉండాలన్నారు. ఫిబ్రవరి 9 లోపు దరఖాస్తు చేసుకోవాలన్నారు.

News January 29, 2025

NLG: మున్సిపల్ ఎన్నికలు ఇప్పట్లో లేనట్టేనా!

image

NLG జిల్లాలోని మున్సిపాలిటీలకు ఎన్నికలు ఇప్పట్లో జరిగే అవకాశాలు లేదని ప్రభుత్వ వర్గాలు చర్చించుకుంటున్నాయి. మున్సిపల్ పాలకవర్గాల పదవీ కాలానికి తెరపడిన విషయం తెలిసిందే. పాలకవర్గాల పదవీకాలం ముగియడంతో ఆ మరుసటి రోజు నుంచి ప్రత్యేక అధికారుల పాలన ప్రారంభమైంది. మరో ఆరు నెలలు లేదా ఏడాది పాటు ప్రత్యేక పాలన కొనసాగే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. కాగా మున్సిపాలిటీలలో పలు సమస్యలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.

News January 29, 2025

గాంధీభవన్‌లో కోమటిరెడ్డితో ముఖాముఖీ 

image

హైదరాబాద్ గాంధీ భవన్‌లో నేడు మంత్రులతో ముఖాముఖీ జరుగుతుందని కాంగ్రెస్ శ్రేణులు వెల్లడించాయి. మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొంటారని తెలిపాయి. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు నిర్వహించనున్నట్లు చెప్పాయి. ప్రజలు తమ సమస్యలను చెప్పుకోవచ్చని సూచించాయి. 

News January 29, 2025

నకిరేకల్: సీఎంకు ఆహ్వాన పత్రిక అందజేత

image

నార్కట్‌పల్లి మండలం చెర్వుగట్టు గ్రామంలోని పార్వతి జడల రామలింగేశ్వర స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఫిబ్రవరి 3 నుండి 9వ తేదీ వరకు జరగనున్నాయి. ఈ మేరకు బ్రహ్మోత్సవాలకు రావాలని కోరుతూ సీఎం రేవంత్ రెడ్డికి ఎమ్మెల్యే వేముల వీరేశం ఆలయ అర్చకులతో కలిసి ఆహ్వాన పత్రికను అందజేశారు. 

News January 28, 2025

యూరియా బ్లాక్‌లో అమ్మితే లైసెన్స్ రద్దు: ఇలా త్రిపాఠి 

image

నల్గొండ జిల్లాలో ఫర్టిలైజర్ షాపుల యజమానులు కృత్రిమ కొరత సృష్టిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి హెచ్చరించారు. మంగళవారం కనగల్ మండల కేంద్రంలో ఆ షాపులను ఆకస్మిక తనిఖీ చేశారు. యూరియా బ్లాక్‌లో అమ్మితే లైసెన్స్ రద్దు చేస్తామని హెచ్చరించారు.

News January 28, 2025

NLG: ఆ భూములకు రైతు భరోసా లేనట్లే!

image

రాష్ట్రంలో ‘రైతు భరోసా’ పథకం ప్రారంభమైంది. కాగా NLG జిల్లాలో తొలిరోజు 31 మండలాలకు సంబంధించిన 35,568 మంది రైతులకు రూ. 46.93 కోట్లను ప్రభుత్వం రైతుల ఖాతాల్లో జమ చేసింది. NLG జిల్లా వ్యాప్తంగా గత బీఆర్ఎస్ ప్రభుత్వం రైతుబంధు ద్వారా పెట్టుబడి కింద సాగుకు యోగ్యంగా లేని 12,040 ఎకరాల భూములకు కూడా రైతు భరోసా చెల్లించిన విషయం తెలిసిందే. కాగా ఇప్పుడు ఆ భూములకు రైతు భరోసా నిలిపివేసినట్లు అధికారులు తెలిపారు.