Nalgonda

News June 29, 2024

NLG: ప్రాదేశిక ఎన్నికలు ఇప్పట్లో లేనట్లే!

image

ఉమ్మడి జిల్లాలో జిల్లా పరిషత్, మండల పరిషత్, ప్రాదేశిక ఎన్నికలు ఆలస్యమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. పదవీకాలం కొద్ది రోజులే ఉండటంతో ఇంతలో ఎన్నికలు జరిగే అవకాశాలు లేవు. జులై 4న జిల్లా, మండల పరిషత్ సభ్యులు, ఎంపీపీలు, జడ్పీ ఛైర్మన్ల పదవీకాలం ముగియనుంది. ఈ నేపథ్యంలో వారిని కొనసాగిస్తారా? లేక ప్రత్యేక అధికారులకు బాధ్యతను అప్పగిస్తారా అనే విషయం సందిగ్ధంగా మారింది.

News June 29, 2024

నల్గొండ జిల్లాలో పడిపోతున్న బీఆర్‌ఎస్..!

image

బీఆర్‌ఎస్ బలం ఉమ్మడి నల్గొండ జిల్లాలో అంతకంతకూ పడిపోతోంది. ఐదేళ్ల క్రితం జరిగిన సర్పంచ్, MPTC, ZPTCఎన్నికల్లో అత్యధికం BRS కైవసం చేసుకుంది. పురపాలిక ఎన్నికల్లోనూ 19 పురపాలికల్లో అన్నింట్లోనూ ఆ పార్టీకి చెందిన వారే ఛైర్మన్‌లుగా గెలిచారు. 3 ZPలను సైతం కైవసం చేసుకుంది. ప్రస్తుతం కేవలం SRPT, NKL, పోచంపల్లి, చండూరులో మాత్రమే BRS‌కుచెందిన వారు ఛైర్మన్‌లుగా ఉండగా..మిగతా చోట్లా కాంగ్రెస్‌ వారు ఉన్నారు.

News June 29, 2024

సూర్యాపేట: అబార్షన్ ఘటనలో ఏడుగురిపై కేసు

image

చివ్వెంల మండలం ఎంజీనగర్‌ తండాకు చెందిన 7 నెలల గర్భిణి సుహాసిని మృతికి కారకులైన ఆమె భర్త హరిసింగ్‌తోపాటు మరో ఆరుగురిపై కేసు నమోదు చేసినట్లు సూర్యాపేట ఇన్‌స్పెక్టర్‌ రాజశేఖర్‌ తెలిపారు. మూడో కాన్పులో గర్భణి అయిన ఆమెకు భర్త లింగనిర్ధారణ పరీక్షలు చేయించి.. పుట్టబోయేది ఆడబిడ్డగా తెలుసుకొని హుజూర్‌నగర్‌ కమల ఆసుపత్రిలో గర్భవిచ్ఛిత్తి చేయించాడు. దీంతో చికిత్స వికటించి ఆమె మృతి చెందింది.

News June 29, 2024

ఫిర్యాదులను త్వరగా పరిష్కరించాలి: కలెక్టర్

image

ప్రజావాణి, ధరణి ద్వారా స్వీకరించిన ఫిర్యాదులను సాధ్యమైనంత త్వరగా పరిష్కరించాలని అధికారులను కలెక్టర్ సి.నారాయణరెడ్డి ఆదేశించారు. దీని వల్ల నిజమైన లబ్ధిదారులకు జాప్యం లేకుండా సమస్యలకు పరిష్కరం దొరుకుతుందన్నారు. శుక్రవారం ఆయన చందంపేట తహశీల్దార్, ఎంపీడీవో కార్యాలయాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. గత సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో 266 ఫిర్యాదులు స్వీకరించినట్లు తహశీల్దార్ శ్రీనివాస్ తెలిపారు.

News June 28, 2024

ఉప్పల్‌లో నల్గొండ జిల్లా నిరుద్యోగి సూసైడ్

image

ఉద్యోగం రాకపోవడంతో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన HYD ఉప్పల్ PS పరిధిలో శుక్రవారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలు.. నల్గొండ జిల్లా అడవిదేవులపల్లి వాసి వెంకట రాముడు(21) HYDకు ఉద్యోగం కోసం వచ్చాడు. ఎంత తిరిగినా జాబ్ రాకపోవడంతో డిప్రెషన్‌లోకి వెళ్లాడు. ఈ క్రమంలో రామాంతాపూర్‌లోని తన బావమరిది సాయికిరణ్ ఇంటికి వచ్చి తండ్రికి ఫోన్ చేశాడు. పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకుంటున్నట్లు తెలిపి చనిపోయాడు.

News June 28, 2024

నల్గొండ ఎస్పీని కలిసిన ట్రాన్స్ జెండర్స్

image

నల్గొండ జిల్లా ఎస్పీ శరద్ చంద్ర పవార్‌ను ట్రాన్స్ జెండర్స్ కలిశారు. అనంతరం ఆ సంఘం జిల్లా అధ్యక్షురాలు నందిని మాట్లాడారు. ‘నల్గొండలోని శ్రీనగర్ కాలనీ రోడ్ నంబర్ 8లో గుంటన్నర స్థలం కొన్నాం. ఆ స్థలంలో ఇల్లు కట్టుకుందామంటే స్థానికులు అడ్డుకుంటున్నారు’ అని చెప్పారు. ఈ విషయంలో జిల్లా ఎస్పీ జోక్యం చేసుకొని తమకు న్యాయం చేయాలని కోరామన్నారు.

News June 28, 2024

ఆర్అండ్బీ అధికారులతో మంత్రి కోమటిరెడ్డి సమీక్ష

image

ఆర్అండ్బీ అధికారులతో మంత్రి కోమటిరెడ్డి సమీక్ష నిర్వహించారు. ఉమ్మడి నల్గొండ వ్యాప్తంగా రోడ్లు, బ్రిడ్జి పనుల పురోగతిపై చర్చించారు. త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. వరంగల్ హైవేపై వున్న రామక్రిష్ణాపురం, సింగన్నగూడెం, కొండమడుగుతో పాటు విజయవాడ హైవేలోని అండర్ పాస్‌లను పూర్తిచేయాలన్నారు. 

News June 28, 2024

విషమంగా మోతిలాల్ నాయక్ ఆరోగ్యం

image

గాంధీ ఆసుపత్రిలో ఆమరణ నిరహార దీక్ష కొనసాగిస్తున్న సూర్యాపేట జిల్లాకు చెందిన విద్యార్థి నాయకుడు మోతిలాల్ నాయక్ ఆరోగ్య పరిస్థితిపై గాంధీ ఆస్పత్రి వైద్యులు బులిటెన్ విడుదల చేశారు. ఐదు రోజుల క్రితం మోతిలాల్ నిరుద్యోగుల సమస్యలపై ఆమరణ నిరహార దీక్ష ప్రారంభించిన విషయం విదితమే. పలువురు ప్రముఖులు మోతిలాల్‌కు ఇప్పటికే మద్దతు తెలిపారు. కాగా గ్రూప్ 2,3 పోస్టులు పెంచాలని మోతీలాల్ నాయక్ డిమాండ్ చేస్తున్నారు.

News June 28, 2024

NLG: పంచాయతీ కార్మికుల వేతన వెతలు

image

గ్రామ పంచాయతీల్లో పనిచేస్తున్న పారిశుధ్య కార్మికులను ప్రభుత్వం చిన్న చూపు చూస్తుంది. నెల నెలా సరిగ్గా వేతనాలు అందక కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఉమ్మడి జిల్లాలోని 1,740 గ్రామ పంచాయతీల్లో మల్టీపర్పస్ పారిశుద్ధ్య కార్మికులతోపాటు ట్రాక్టర్ డ్రైవర్లు, వాటర్ మెన్లు, ఇతర సిబ్బంది మొత్తం 2578 మంది పని చేస్తున్నారు. ఇప్పటికే పారిశుద్ధ్య కార్మికులు చాలీచాలని వేతనాలతో ఇబ్బందులు పడుతున్నారు.

News June 28, 2024

సూర్యాపేట: వ్యక్తిపై 50 కోతుల దాడి, తీవ్ర గాయాలు

image

మఠంపల్లి మండల పరిధిలోని రఘునాథపాలెం గ్రామానికి చెందిన ఓ వ్యక్తిపై సుమారుగా 50 కోతులు మూకుమ్మడిగా దాడి చేయగా వ్యక్తి తీవ్ర గాయాలై ఆసుపత్రికి తరలించినట్లు బంధువులు తెలిపారు. గ్రామంలో కోతుల బెడద తీవ్రంగా ఉందని గ్రామస్థులు తెలిపారు. అధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా పట్టించుకోవడంలేదని ఆవేదన చెందారు. ఇప్పటికైనా స్పందించాలని కోరుతున్నారు.