Nalgonda

News January 14, 2025

NLG: మీ ముచ్చటైన ముగ్గులు Way2Newsలో

image

సంక్రాంతి, కనుమ సందర్భంగా మీ వాకిట్లో వేసిన మీ ముగ్గులనూ Way2Newsలో చూడాలనుకుంటే 9100153883 నంబర్‌కు వాట్సాప్ చేయండి. నోట్: ఫొటో, మీ పేరు, గ్రామం, మండలం, జిల్లా పేర్లు ఖచ్చితంగా పంపగలరు. పండుగను ప్రతిబింబించే ముగ్గులు మాత్రమే (వాట్సాప్ పోస్టు) పబ్లిష్ అవుతాయి.

News January 13, 2025

NLG: ఢిల్లీలో సత్తా చాటిన మోడల్ స్కూల్ విద్యార్థులు

image

తుర్కపల్లి మండలం రాంపూర్ తండాలోని మోడల్‌‌‌ స్కూల్ విద్యార్థులు సత్తా చాటారు. ఢిల్లీలో భారతి మండపంలో నిర్వహించిన జాతీయ స్థాయి వికసిత్ భారత్ సైన్స్ ఎగ్జిబిషన్ మోడల్ స్కూల్ విద్యార్థులు తయారుచేసిన చార్జింగ్ ఎలక్ట్రిక్ నానో ట్రాక్టర్ ప్రాజెక్ట్ ఎంపికైంది. పాఠశాలకు చెందిన 10వ తరగతి విద్యార్థులు లూనావత్ అఖిల్, బానోతు తరుణ్‌లను ఉపాధ్యాయ బృందం అభినందనలు తెలిపారు.

News January 13, 2025

NLG: పండగ తర్వాత రంగంలోకి బృందాలు

image

ఉమ్మడి నల్గొండ జిల్లాలో పండుగ తర్వాత సాగు యోగ్యం కాని రాళ్లు, రప్పలు, గుట్టలతో కూడిన భూములను పక్కాగా గుర్తించనున్నారు. నివాస స్థలాలు, రియల్ ఎస్టేట్ భూములు, రహదారులు, పరిశ్రమలు, గోదాములు, మైనింగ్ అవసరాలకు సేకరించిన స్థలాలను పూర్తిగా పరిహరిస్తారు. ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం ఉమ్మడి జిల్లాలో మునుపటి కంటే ‘రైతు భరోసా’ లబ్ధిదారుల సంఖ్య గణనీయంగా తగ్గే అవకాశం కనిపిస్తోంది.

News January 13, 2025

NLG: ఉమ్మడి జిల్లాలో భోగి సంబురం

image

మూడు రోజుల సంక్రాంతి పండగకు ఉమ్మడి జిల్లాలోని పల్లెలు, పట్టణాలు ముస్తాబయ్యాయి. తొలి రోజు భోగి వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. పట్టణాలు, పల్లెల్లో మహిళలు వాకిట్లో రంగురంగుల ముగ్గులు వేస్తున్నారు. తీపి వంటకాల తయారీలో మహిళలు నిమగ్నమయ్యారు. పల్లెల్లో ఉదయమే భోగిమంటలతో ప్రజలు పండుగకు ఆహ్వానం పలికారు. మరోవైపు చిన్నారులు పతంగులు ఎగరేస్తూ సంబరాలు చేసుకుంటున్నారు.

News January 13, 2025

సూర్యాపేట: తాగి వచ్చి వేధింపులు.. భర్త హత్య 

image

సూర్యాపేట జిల్లాలో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. స్థానికులు తెలిపిన వివరాలిలా.. చివ్వెంల మండలం గుర్రంతండాకు చెందిన సైదులు కారు డ్రైవర్. అతనికి రమ్య, సుమలత అనే ఇద్దరు భార్యలున్నారు. సైదులు తాగి వచ్చి వారిని వేధిస్తున్నాడు. ఈక్రమంలో ఇద్దరు భార్యలు కలిసి సైదులును ఆదివారం అర్ధరాత్రి హత్య చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం సూర్యాపేట ఏరియా ఆస్పత్రికి తరలించారు. మరింత సమాచారం తెలియాల్సి ఉంది. 

News January 13, 2025

సాగర్‌తో మందా జగన్నాథంకు అనుబంధం

image

నాగర్ కర్నూల్ మాజీ ఎంపీ మందా జగన్నాథం ఆదివారం అనారోగ్యంతో మృతిచెందారు. ఆయన స్వస్థలం MBNR జిల్లా ఇటిక్యాల మండలం కొండేరు. జగన్నాథం తండ్రి పెద్దపుల్లయ్య నాగార్జునసాగర్ ప్రాజెక్టు నిర్మాణ సమయంలో ఇక్కడకు వచ్చి మెకానిక్ విభాగంలో వాచ్మెన్‌గా పనిచేశారు. ఆయన తల్లి సవరమ్మ హిల్ కాలనీలోని ప్రాజెక్టు హెల్త్ ఆఫీస్‌లో ఆయాగా పనిచేశారు. జగన్నాథం హిల్ కాలనీలోని ప్రభుత్వ పాఠశాలలో ఎనిమిదో తరగతి వరకు చదువుకున్నారు.

News January 13, 2025

NLG: కానరాని డూడూ బసవన్నలు

image

‘అయ్యగారికి దండం పెట్టు.. అమ్మవారి ముందు డాన్స్ చెయ్.. చిన్న దొరను సంబరపెట్టు’.. అంటూ సంక్రాంతి వేళ గంగిరెద్దుల వాళ్లు చేసే సందడి మామూలుగా ఉండదు.  సన్నాయి, మృదంగం వాయిస్తూ తిరిగే వ్యక్తులు, బసవన్నకు చాలా ప్రాధాన్యం ఉంటుంది. పండుగకు నెల ముందే అన్ని ప్రాంతాల్లోనూ ఈ బసవన్నలు బయలుదేరుతారు. కాగా ఉమ్మడి NLG జిల్లాలో మాత్రం ఈ కళ అంతరించిపోయే దశలో ఉంది. మీ ఏరియాలో బసవన్నలు కనిపించారా.. కామెంట్ చేయండి.

News January 12, 2025

నల్గొండ: సంక్షేమ పథకాలపై సమన్వయ సమావేశం

image

నల్గొండ: ఉదయాధిత్య భవనంలో ఉమ్మడి జిల్లాల అధికారులతో రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, కొత్త రేషన్ కార్డులు& ఇందిరమ్మ ఇండ్ల పథకాల అమలుపై ముందస్తు సమన్వయ సమావేశం నిర్వహించారు. అర్హులైన పేదలకు సంక్షేమ పథకాలను అందించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, ఎమ్మెల్యేలు, జిల్లా కలెక్టర్ తదితరులు పాల్గొన్నారు.

News January 12, 2025

యాదాద్రిలో మూడో రోజు కొనసాగుతున్న అధ్యయనోత్సవాలు

image

యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహా స్వామి ఆలయంలో మూడో రోజు అధ్యయనోత్సవాలు కొనసాగుతున్నాయి. ఉదయం శ్రీరామవతార అలంకారంలో భక్తులకు నరసింహుడి దర్శనమిచ్చారు. సాయంత్రం వెంకటేశ్వర స్వామి అలంకారంలో భక్తులకు యాదగిరీషుడు దర్శనం ఇవ్వనున్నారు. ఆదివారం సెలవు దినం కావడంతో భక్తుల రద్దీ పెరుగుతోంది.

News January 12, 2025

MLG: ప్రణయ్ హత్య కేసులో ట్విస్ట్ 

image

MLGలో 2018లో రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ప్రణయ్ పరువు హత్య కేసులో ట్విస్ట్ చోటుచేసుకుంది. ప్రణయ్ హత్య కేసులో ప్రధాన నిందితుడు సుభాశ్ శర్మ, మరో ఇద్దరు బెయిల్ కోసం సమర్పించిన ష్యూరిటీలు నకిలీవి అని పోలీసులు గుర్తించారు. వారిని MLG పోలీసులు అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరచగా 14 రోజుల జుడీషియల్ రిమాండ్ విధించింది. కాగా, ఈ కేసులో బెయిల్‌పై బయటికొచ్చిన అమృత తండ్రి మారుతిరావు సూసైడ్ చేసుకున్నారు.