Nalgonda

News June 26, 2024

NLG: అరకొరగానే చిరుధాన్యాల సాగు

image

ఉమ్మడి జిల్లాలో రాను రాను చిరుధాన్యాల సాగు తగ్గిపోతున్నది. కందులు మినహా ఇతర పంటల సాగుపై రైతులు ఆసక్తి చూపడం లేదు. సాగు లాభదాయకంగా ఉన్నా సరైన గిట్టుబాటు ధరలు లభించకపోవడం, మార్కెట్లలోనూ మద్దతు లేకపోవడం తదితర కారణాల వల్ల రైతులు వీటివైపు మొగ్గు చూపడం లేదని తెలుస్తుంది. ప్రస్తుత రబీ సీజన్లో ఉమ్మడి జిల్లాలో కందులు 3940, ఇతర పప్పు దినుసులు 1578 ఎకరాల్లో మాత్రమే సాగు చేనున్నట్లు అధికారులు తెలిపారు.

News June 26, 2024

బోర్‌వెల్ లారీపై నుంచి పడి కార్మికుడు మృతి

image

బోర్‌వెల్ లారీ పైనుంచి పడి కార్మికుడు మృతి చెందిన ఘటన మిర్యాలగూడలో జరిగింది. ఎస్సై నరేష్ వివరాల ప్రకారం.. చత్తీస్‌గఢ్‌కు చెందిన బోటి రామ్ భగేల్ చింతపల్లిలో నివాసం ఉంటూ బోర్‌వెల్ కార్మికుడిగా పనిచేస్తున్నాడు. బోర్ వేయడానికి వెళ్తుండగా లారీ పైనుంచి పడి అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడి అన్న భువనేశ్వర్ భగేల్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

News June 26, 2024

నకిలీ బంగారంతో రూ.53.89లక్షణ రుణం

image

నకిలి బంగారంతో రూ.53.89 లక్షల రుణం తీసుకున్న ఏడుగురు నిందితులను, సహకరించిన గోల్డ్ అప్రజయిర్‌ను హుజూర్‌నగర్ పోలీసులు అరెస్ట్ చేసి కోర్డుకు రిమాండ్ చేశారు. సీఐ చరమంద రాజు తెలిపిన వివరాలిలా.. నేరేడుచర్ల మండలం వైకుంఠపురానికి రాజేశ్ మిర్యాలగూడలో బంగారం దుకాణాన్ని పెట్టాడు. నష్టం రావడంతో అప్పులు తీర్చేందుకు నకిలీ ఆభరణాలు తయారు చేయించి మిత్రులతో కలిసి భారీ మొత్తంలో లోన్ తీసుకున్నాడు.

News June 25, 2024

కేంద్రమంత్రి కిషన్ రెడ్డిని కలిసిన రాష్ట్ర మంత్రులు

image

ఢిల్లీ కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్‌ రెడ్డిని మర్యాద పూర్వకంగా తెలంగాణ రాష్ట్ర రోడ్డు, భవనాలు, సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కలిశారు. తెలంగాణ బిడ్డ కేంద్ర మంత్రిగా పదవి చేపట్టిన సందర్భంగా పార్టీలకు అతీతంగా సహచర మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో కలిసి సత్కరించారు. అలాగే తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి సహకరించాలని కేంద్రమంత్రిని వారు కోరారు.

News June 25, 2024

నాగార్జునసాగర్ ప్రాజెక్టు సమాచారం

image

నాగార్జునసాగర్ జలాశయంలో నీటి నిల్వలు మంగళవారం ప్రాజెక్టు అధికారులు తెలిపారు. పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులకు గాను 504.30 అడుగులు, పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 312.00 టీఎంసీలకు గాను 122.1967 టీఎంసీల నీటి నిల్వ ఉంది. ఇక జలాశయానికి ఇన్ ఫ్లో నిల్ ఉండగా, అవుట్‌లో 800 క్యూసెక్కులుగా ఉంది.

News June 25, 2024

నల్గొండ జిల్లాలో పత్తి మొక్కలకు జీవం

image

పొడి దుక్కుల్లో విత్తనాలు వేసిన రైతుల ఆశలు మొలకెత్తుతున్నాయి. మొలిచిన పత్తి మొక్కలు ఏపుగా పెరుగుతున్నాయి. సోమవారం 16 మండలాల్లో 2.0 మి.మీ వర్షం కురిసింది. 4 రోజులుగా నల్గొండ జిల్లాలోని అన్ని మండలాల్లో వర్షపాతం నమోదైంది. ఈ సీజన్‌లో పంటల సాగుకు అనుకూలమైన వర్షం పడటంతో పత్తి విత్తనాలు వేసిన రైతుల్లో హర్షం వ్యక్తమవుతోంది. ఇప్పటికీ వ్యవసాయ శాఖ అంచనా మేర 2 లక్షల ఎకరాల్లో పత్తి వేశారు.

News June 25, 2024

NLG: డబ్బు రెట్టింపు చేస్తామని దగా

image

డబ్బు రెట్టింపు చేస్తామని ఓ వ్యక్తిని సొంత బంధువులే మోసం చేశారు. NLG మండలం చందనపల్లికి చెందిన ఆర్ఎంపీ వైద్యుడు చారిని అతడి సమీప బంధువులు నమ్మించారు. ఇది నమ్మిన చారి వారికి మొదటగా రూ.2 లక్షలు ఇస్తే వారు రూ.4లక్షలు తిరిగి ఇచ్చారు. దీంతో ఆర్ఎంపీ వైద్యుడు వారికి రూ.33లక్షలు ఇవ్వగా.. రూ.66 లక్షలు ఇస్తామని చెప్పి రెండు అసలు నోట్ల మధ్యలో తెల్ల కాగితాలు పెట్టి ఇచ్చారని బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

News June 25, 2024

MLG: అత్యాచారం కేసులో నిందితుడికి రిమాండ్

image

మహిళపై అత్యాచారానికి పాల్పడిన నిందితుడిని పోలీసులు సోమవారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. డిఎస్పి రాజశేఖర్ రాజు వివరాలు.. మిర్యాలగూడ పట్టణంలోని అశోక్ నగర్‌కు చెందిన అశోక్ ఓ గిరిజన మహిళపై గత కొద్దిరోజులుగా భయపెట్టి అత్యాచారానికి పాల్పడుతున్నాడు. అంతే కాకుండా వీడియోలు తీసి ఆమె భర్తకు పంపిస్తానని బెదిరిస్తుండటంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

News June 25, 2024

హైదరాబాద్- విజయవాడ రహదారిని త్వరగా పూర్తి చేయాలి: మంత్రి కోమటిరెడ్డి

image

ఢిల్లీలో కేంద్ర జాతీయ రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీతో తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పుష్పగుచ్చం అందజేసి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మంత్రి వెంకటరెడ్డి మాట్లాడుతూ.. ఎన్నికల కారణంగా పెండింగ్‌లో ఉన్న హైదరాబాద్- విజయవాడ ఆరు లైన్ల జాతీయ రహదారి పనులను పునర్ ప్రారంభించి త్వరగా పూర్తి చేయాలని కేంద్రమంత్రిని కోరినట్లు ఆయన తెలిపారు.

News June 25, 2024

BNGR: కుటుంబ కలహాలతో యువకుడు సూసైడ్

image

ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ కలహాలతో పురుగుల మందు తాగి ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసుల వివరాలు.. భువనగిరి మండలంలోని చీమల కొండూరు గ్రామానికి చెందిన మహేష్ వ్యవసాయ కూలీల పనిచేస్తున్నాడు. ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ కలహాలతో మనస్తాపం చెందిన మహేష్ తన వ్యవసాయ బావి వద్ద పురుగు మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గొర్రెల కాపరులు చూసి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.