Nalgonda

News February 20, 2025

పెద్దగట్టు జాతరకు వెళ్లి వస్తుండగా ఘోర ప్రమాదం

image

సూర్యాపేట జిల్లాలో గురువారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాలు.. ఇద్దరు యువకులు పెద్దగట్టు లింగమంతుల స్వామి జాతరకు బైక్‌పై వెళ్లి వస్తుండగా సూర్యాపేట రూరల్ పరిధి కేసారం గ్రామం సమీపంలోని వాగులో పడ్డారు. ఈ ప్రమాదంలో కాసరాబాద్ గ్రామానికి చెందిన సుధీర్(21) మృతి చెందగా, సంపత్‌కు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రుణ్ని ఆసుపత్రికి తరలించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

News February 20, 2025

ఎస్ఎఫ్ఐ నల్గొండ జిల్లా నూతన కమిటీ ఎన్నిక

image

ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో నల్గొండలో నిర్వహిస్తున్న 46వ మహాసభలో జిల్లా నూతన కమిటీని ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా నూతన కమిటీని రాష్ట్ర కార్యదర్శిగా నాగరాజు ప్రకటించారు. అధ్యక్ష, కార్యదర్శులుగా నరేష్, శంకర్‌లు, ఉపాధ్యక్షుడుగా కుర్ర సైదానాయక్ మిగతా కమిటీ సభ్యులుగా జగన్ నాయక్, వీరన్న, న్యూమన్, ప్రసన్న, పుట్ట సంపత్‌లు ఎన్నికయ్యారు. నూతనంగా ఎన్నికైన జిల్లా కమిటీకి పలువురు శుభాకాంక్షలు తెలిపారు.

News February 20, 2025

NLG: ఇసుక అక్రమ రవాణాపై ఇక ఉక్కుపాదం

image

ఇసుక అక్రమ రవాణాను అరికట్టడంలో భాగంగా నిఘాను, తనిఖీలను తీవ్రతరం చేయాలని NLG కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదేశించారు. ఇసుక అక్రమ రవాణాను అరికట్టే విషయమై గురువారం ఆమె జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్‌తో కలిసి అధికారులతో ఉదయాదిత్య భవన్లో సమావేశం నిర్వహించారు. ప్రభుత్వం ద్వారా ఆయా ఇసుక రీచ్ లలో అనుమతించిన వాహనాలు, అనుమతించిన వారికి మాత్రమే ఇసుకను తీసుకువెళ్లే అధికారం ఉందని అన్నారు.

News February 20, 2025

NLG: మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ థార్ గ్యాంగ్ లీడర్ అరెస్ట్

image

అంతర్రాష్ట్ర దొంగల ముఠా.. థార్ గ్యాంగ్‌కు చెందిన ప్రధాన నిందితుడు మహమ్మద్ అష్రఫ్ ఖాన్‌‌ను అరెస్టు చేసినట్లు ఎస్పీ శరత్ చంద్ర పవార్ తెలిపారు. గురువారం ఎస్పీ ఆఫీస్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అరెస్ట్ వివరాలను వెల్లడించారు. మరో ముగ్గురు పరారీలో ఉన్నారని, ప్రధాన నిందితుడిపై దేశవ్యాప్తంగా పలు దొంగతనాల కేసులు ఉన్నాయని అన్నారు. అతడి నుంచి రూ.25 లక్షలు స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు.

News February 20, 2025

నల్గొండ: ‘రెవిన్యూ మేళాను సద్వినియోగం చేసుకోవాలి’

image

నల్గొండ పురపాలక సంఘం ఆధ్వర్యంలో ఆస్థి పన్ను సమస్యల పరిష్కారం కోసం రెవెన్యూ మేళా నిర్వహించడం జరుగుతుందని మున్సిపల్ కమిషనర్ సయ్యద్ ముసాబ్ హమ్మద్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ మేళాలో భాగంగా ప్రతి మంగళ, గురు, ఆదివారాలలో దరఖాస్తులు స్వీకరించబడునని, ఈ అవకాశాన్ని పట్టణ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని పేర్కొన్నారు.

News February 20, 2025

NLG: వ్యవసాయ యోగ్యం కానీ భూములు 12వేల ఎకరాలు

image

రైతు భరోసా ఫిర్యాదుల స్వీకరణకు జిల్లాలోని అన్ని మండల వ్యవసాయ అధికారుల కార్యాలయాల్లో ఫిర్యాదుల విభాగాలు ఏర్పాటు చేయాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదేశించారు. బుధవారం ఆమె కలెక్టరేట్ నుంచి రైతు భరోసాపై జిల్లా, మండల అధికారులతో టెలికాన్ఫరెన్స్ ఏర్పాటు చేసి మాట్లాడారు. జిల్లాలో మొదటి విడతలో భాగంగా సుమారు 12వేల ఎకరాలు వరకు వ్యవసాయ యోగ్యంకాని భూములను గుర్తించామన్నారు.

News February 20, 2025

NLG: ఉపకార వేతనాలకు దరఖాస్తుల ఆహ్వానం

image

జిల్లాలోని 1 నుంచి 10వ తరగతి వరకు ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలల్లో చదువుతున్న దివ్యాంగ విద్యార్థుల (అంధ, బధిర, మానసిక, శారీరక దివ్యాంగులు)కు ఉపకార వేతనాలు అందించేందుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామని జిల్లా మహిళా, శిశు, దివ్యాంగుల, వయో వృద్ధుల సంక్షేమశాఖ అధికారి కేవీ.కృష్ణవేణి తెలిపారు. దరఖాస్తులను మార్చి 31వ తేదీ సాయంత్రం 5 గంటల్లోగా telanganaepass.cgg.gov.inలో దరఖాస్తు చేసుకోవాలన్నారు.

News February 20, 2025

NLG: 23న గుట్టకు సీఎం రేవంత్

image

యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయ స్వర్ణ దివ్య విమాన గోపురానికి మహా కుంభాభిషేక సంప్రోక్షణ మహోత్సవంలో పాల్గొనేందుకు సీఎం రేవంత్ ఈ నెల 23న రానున్నారు. సీఎంతో పాటు ఆరుగురు మంత్రులు కూడా రానున్నట్లు సమాచారం. సీఎం రానున్న నేపథ్యంలో బుధవారం దేవాదాయశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజరామయ్యర్ యాదగిరికొండ కింద హెలిపాడ్ స్థలాన్ని పరిశీలించారు.

News February 20, 2025

NLG: మహిళా సంఘాలకు మార్చిలో ఎన్నికలు!

image

మహిళా సంఘాలకు మార్చిలో ఎన్నికలు జరగనున్నట్లు సమాచారం. ఈ మేరకు జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు కసరత్తు ప్రారంభించారు. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ముగిసిన వెంటనే ప్రక్రియను మరింత వేగవంతం చేయనున్నారు. మార్చి నెలాఖరులోగా ఎన్నిక ప్రక్రియను పూర్తి చేయాలని నిర్ణయించారు. జిల్లాలో గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు మహిళా సంఘాలు ఉన్నాయి. ఆయా సంఘాలకు కొత్త అధ్యక్షులను త్వరలో ఎన్నుకోనున్నారు.

News February 20, 2025

హాలియాలో బైక్ కవర్ నుంచి రూ.2 లక్షలు చోరీ

image

హాలియా SBI బ్రాంచ్ సమీపంలో చోరీ జరిగింది. పోలీసుల వివరాలిలా.. బుధవారం పెద్దవూర మం. తెప్పలమడుగుకి చెందిన కొండలు రూ.2లక్షలు డ్రా చేశారు. బైక్ కవర్‌లో పెట్టి DVK రోడ్‌లోని ఫర్టిలైజర్ షాపులోకి వెళ్లాడు. తిరిగొచ్చేసరికి గుర్తుతెలియని వ్యక్తులు బైక్‌పై వచ్చి డబ్బు దొంగిలించారు. అనుమానితుల దృశ్యాలు CC కెమెరాల్లో రికార్డయ్యాయి. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు హాలియా SI సతీశ్ తెలిపారు.