India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
విద్యార్థుల్లో ఆంగ్ల భాష నైపుణ్యాలు పెంపే లక్ష్యంగా ఇంటర్ విద్యాశాఖ ప్రత్యేక ప్రణాళిక అమలు చేస్తోంది. ఇందులో భాగంగానే ఇంటర్ విద్యార్థులకు ఆంగ్ల ప్రయోగ పరీక్షలు నిర్వహిస్తున్నారు. జనవరి 31న, ఫిబ్రవరి 1న నిర్వహించనున్నారు. ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థులు, వృత్తి విద్యా కోర్సులు చదివేవారు తప్పనిసరిగా ఆంగ్ల ప్రయోగ పరీక్షలకు హాజరుకావాల్సి ఉంటుందని DIEO దస్రూ నాయక్ తెలిపారు.
చైనా మాంజా దారం తగిలి బైక్పై వెళ్తున్న దంపతులకు గాయాలైన ఘటన బుధవారం యాదగిరిగుట్ట మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా జరిగింది. స్థానికుల వివరాలిలా.. దంపతులు యాదాద్రీశుడి దర్శనానికి వచ్చారు. ఈ క్రమంలో మున్సిపల్ ఆఫీసు ఎదురుగా చైనా మాంజా దారం తగలడంతో బైక్ నడుపుతున్న వ్యక్తికి గొంతు తెగింది. అతడి భార్య వాహనం పైనుంచి పడడంతో గాయాలయ్యాయి. వారిని స్థానికులు భువనగిరి ఏరియా ఆస్పత్రికి తరలించారు.
పండగపూట ఆనందంగా గడపాల్సిన కుటుంబంలో తీవ్ర విషాదంలో నెలకొంది. సరదాగా గాలిపటం ఎగరవేస్తూ ప్రమాదవశాత్తు ఓ వ్యక్తి భవనంపై నుంచి పడి ప్రాణాలు కోల్పోయిన ఘటన యాదాద్రి జిల్లా మూటకొండూర్ మండలం అమ్మనబోలులో మంగళవారం జరిగింది. జూపల్లి నరేందర్ పిట్టగొడ లేని భవనంపై గాలిపటం ఎగురవేస్తూ ప్రమాదవశాత్తూ కింద పడ్డాడని స్థానికులు తెలిపారు. తీవ్ర గాయాలపాలైన అతణ్ని ఆస్పత్రికి తరలించగా అప్పటికే ఆయన మృతి చెందాడని చెప్పారు.
మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి బుధవారం వేములపల్లి మండల కేంద్రంలో పర్యటిస్తారని కాంగ్రెస్ పార్టీ నాయకులు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 10 గంటలకు ఆమనగల్లు గ్రామంలోని శ్రీ శ్రీ పార్వతి రామలింగేశ్వర స్వామి దేవస్థాన ఆవరణలో అభివృద్ధి పోస్టర్ ఆవిష్కరణ చేయనున్నారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు, గ్రామ నాయకులు, గ్రామ ప్రజలు ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.
సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలంలో ఆదివారం రాత్రి సైదులు అనే వ్యక్తిని అతని ఇద్దరి భార్యలు <<15142827>>మర్డర్ చేసిన<<>> సంగతి తెలిసిందే. పోలీసుల వివరాలిలా.. చివ్వెంల మండలానికి చెందిన సైదులు కారు డ్రైవర్. కొన్ని రోజులుగా పెద్ద భార్య కూతురిని అతను లైంగికంగా వేధిస్తున్నాడు. దీంతో ఇద్దరు భార్యలు రోకలిబండతో సైదులును హతమార్చినట్లు విచారణలో తేలిందని పోలీసులు తెలిపారు.
మునిసిపల్ పాలకవర్గాల గడువు దగ్గర పడుతోంది. SRPT జిల్లాలో నేరేడుచర్ల, HZNR, KDD, SRPT, తిరుమలగిరి, NLG జిల్లాలో నందికొండ, NLG, NKL, MLG, HLY, DVK, CTL, CDR, యాదాద్రి BNG జిల్లాలో యాదగిరి గుట్ట, పోచంపల్లి, మోత్కూరు, CPL, BNG, ఆలేరు మున్సిపాలిటీల పదవీకాలం ఈనెల 26తో గడువు ముగియనుంది. ఈ మున్సిపాలిటీలకు ప్రభుత్వం ఎప్పుడు ఎన్నికలు నిర్వహిస్తుందనే అంశం రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
ఈ నెల 25నుంచి జాన్పహాడ్ ఉర్సు ఉత్సవాలు జరగనున్నాయి. సూర్యాపేట జిల్లా పాలకవీడు మండలంలో ఉన్న ఈ దర్గాకు 400 ఏళ్ల చరిత్ర ఉందని స్థానికులు చెబుతున్నారు. చుట్టుపక్కల నుంచే కాకుండా ఏపీ నుంచి కూడా భక్తులు వస్తారని అంటున్నారు. మత సామరస్యానికి జాన్ పహాడ్ సైదన్న దర్గా ప్రతీక. కోరిన కోరికలు తీర్చే దైవంగా భక్తుల నమ్మకం. కాగా ఈ దర్గాకు నేరేడుచర్ల, దామరచర్ల నుంచి వెళ్లొచ్చు.
సంక్రాంతి, కనుమ సందర్భంగా మీ వాకిట్లో వేసిన మీ ముగ్గులనూ Way2Newsలో చూడాలనుకుంటే 9100153883 నంబర్కు వాట్సాప్ చేయండి. నోట్: ఫొటో, మీ పేరు, గ్రామం, మండలం, జిల్లా పేర్లు ఖచ్చితంగా పంపగలరు. పండుగను ప్రతిబింబించే ముగ్గులు మాత్రమే (వాట్సాప్ పోస్టు) పబ్లిష్ అవుతాయి.
తుర్కపల్లి మండలం రాంపూర్ తండాలోని మోడల్ స్కూల్ విద్యార్థులు సత్తా చాటారు. ఢిల్లీలో భారతి మండపంలో నిర్వహించిన జాతీయ స్థాయి వికసిత్ భారత్ సైన్స్ ఎగ్జిబిషన్ మోడల్ స్కూల్ విద్యార్థులు తయారుచేసిన చార్జింగ్ ఎలక్ట్రిక్ నానో ట్రాక్టర్ ప్రాజెక్ట్ ఎంపికైంది. పాఠశాలకు చెందిన 10వ తరగతి విద్యార్థులు లూనావత్ అఖిల్, బానోతు తరుణ్లను ఉపాధ్యాయ బృందం అభినందనలు తెలిపారు.
ఉమ్మడి నల్గొండ జిల్లాలో పండుగ తర్వాత సాగు యోగ్యం కాని రాళ్లు, రప్పలు, గుట్టలతో కూడిన భూములను పక్కాగా గుర్తించనున్నారు. నివాస స్థలాలు, రియల్ ఎస్టేట్ భూములు, రహదారులు, పరిశ్రమలు, గోదాములు, మైనింగ్ అవసరాలకు సేకరించిన స్థలాలను పూర్తిగా పరిహరిస్తారు. ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం ఉమ్మడి జిల్లాలో మునుపటి కంటే ‘రైతు భరోసా’ లబ్ధిదారుల సంఖ్య గణనీయంగా తగ్గే అవకాశం కనిపిస్తోంది.
Sorry, no posts matched your criteria.