India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఇచ్చిన మాటకు కట్టుబడి జులైలోనే రైతులకు రెండు లక్షల రుణమాఫీ చేస్తామని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. నల్గొండ జిల్లా పరిషత్ సమావేశంలో పాల్గొన్న సందర్భంగా ఆయన మాట్లాడారు. రైతు సంక్షేమమే తమ ప్రభుత్వ ధ్యేయమని పేర్కొన్నారు. రైతు భరోసాపై ఇప్పటికే సీఎం ఆధ్వర్యంలో మంత్రులతో కమిటీ వేశామన్నారు.
తన సొంత గ్రామమైన బ్రాహ్మణ వెల్లంలలో మిషన్ భగీరథ నీరు రావటం లేదని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. శనివారం జరిగిన జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో ఆయన ఈ విషయాన్ని ప్రస్తావించారు. గత ప్రభుత్వం ఇంటింటికీ తాగు నీరు అంటూ మిషన్ భగీరథ పథకాన్ని తీసుకువచ్చిందని అన్నారు. అధికారులు క్షేత్రస్థాయిలో సందర్శించి నీరందడానికి చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.
ఆలయ అభివృద్ధికి సాధ్యమైనంత కృషి చేస్తానని యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహ స్వామి దేవస్థానం ఈవో భాస్కరరావు అన్నారు. ఆయన బాధ్యతలు చేపట్టి వంద రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా మాట్లాడారు. దాతల సహకారం, ఆలయ నిధులతో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సదుపాయాలు కల్పించినట్లు పేర్కొన్నారు.
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిపై సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి మండిపడ్డారు. ‘రాష్ట్రానికి చెందిన వ్యక్తికి కేంద్రంలో పదవి వస్తే అదృష్టం. రాష్ట్రానికి మంచిది. కానీ కిషన్ రెడ్డికి ఎన్ని పదవులు వచ్చినా తెలంగాణకు ఉపయోగపడే ఒక్క పని చేయలేదు. సింగరేణిని నట్టేట ముంచి దానికి ఉరి పెట్టే పని చేశాడు” అని ధ్వజమెత్తారు.
2018 DEC 12 నుంచి 2023 DEC 9 వరకు తీసుకున్న రైతుల రుణాలను ఒకేసారి మాఫీ చేస్తామని CM రేవంత్ ప్రకటించడంతో మూడు జిల్లాల అధికారులు అర్హుల జాబితా తయారు చేసేందుకు సన్నద్ధమవుతున్నారు. NLG, SRPT యాదాద్రి జిల్లాల్లో కలిపి సుమారు 5.3 లక్షల మంది రైతులు రూ.2 లక్షల రుణమాఫీకి అర్హులుగా ఉన్నారని.. ఇందుకు రూ.7 వేల కోట్ల వరకు అవసరం అవుతాయని అధికారులు ఇప్పటికే ప్రాథమికంగా అంచనా వేశారు.
చివ్వెంల మండల కేంద్రానికి చెందిన విద్యార్థిని గుగులోత్ భాగ్య శ్రీ ఐఐటి చెన్నైలో సీటు సాధించింది. 2022లో భాగ్యశ్రీ స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సీటు సాధించింది. పేద కుటుంబంలో పుట్టి కష్ట పడి చదివి విజేతగా నిలిచింది. ఈ సందర్భంగా పాఠశాల ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు భాగ్యశ్రీని అభినందిస్తూ శుభాకాంక్షలు తెలిపారు. ఉన్నత విద్యలు అభ్యసించి ఉన్నత లక్ష్యాలను సాధించాలని ఆకాంక్షించారు.
జిల్లాలో వాహనాలకు నంబర్ ప్లేట్లు లేకుండా నడపవద్దని, ప్రతి రోజూ జిల్లా వ్యాప్తంగా స్పెషల్ డ్రైవ్లు నిర్వహిస్తూ ట్రాఫిక్ నిబంధనల విరుద్ధంగా వాహనాలు నడిపే వారిపై కేసులు నమోదు చేయబడుతాయని జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవర్ తెలిపారు. ఈ రోజు జిల్లా వ్యాప్తంగా స్పెషల్ డ్రైవ్ నిర్వహించి 551 వాహనాలను పట్టుబడి చేయడం జరిగిందని తెలిపారు. ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘించే వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు.
రామన్నపేట మండలం ఇంద్రపాలనగరం (తుమ్మల గూడెం) చెరువులో గుర్తుతెలియని మృతదేహం లభ్యమైంది. స్థానికులు జాలర్లు, వలల సహాయంతో మృతదేహాన్ని బయటకి తీశారు. మృతుడు బ్లూ కలర్ చొక్కా, ధరించి ఉన్నాడు, వయసు సుమారు 35 నుండి 45 సంవత్సరాలు ఉంటుందని స్థానికులు తెలిపారు. హత్యా.? ఆత్మహత్యా.? అని చుట్టుపక్కల వారు భయభ్రాంతులకు గురవుతున్నారు. ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
నాగార్జునసాగర్ జలాశయంలో నీటి మట్టం రోజు రోజుకూ తగ్గుతుంది. పూర్తి స్థాయి నీటిమట్టం 590 అడుగులకు గాను 504.40 అడుగులు, పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 312.00 టీఎంసీలకు గాను 122.3596 టీఎంసీల నీటి నిల్వ ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు. జలాశయానికి ఇన్ఫో నిల్ ఉండగా, ఔట్ ఫ్లో 800 క్యూసెక్కులు ఉందని పేర్కొన్నారు.
నిత్యం రద్దీగా ఉండే హైదరాబాద్ – విజయవాడ జాతీయ రహదారి నుండి చౌటుప్పల్ ప్రజలకు తొందర్లోనే ట్రాఫిక్ అలాగే ప్రమాదాల నుంచి ఉపశమనం కలగనుంది. 375 కోట్ల రూపాయలతో ఫ్లైఓవర్ నిర్మాణానికి వచ్చేనెలలో శంకుస్థాపన చేసే దిశగా అడుగులు పడుతున్నాయి. ఇందులో భాగంగా హైవేకి ఇరువైపులా ఉన్న సర్వీస్ రోడ్డు ని చదును చేసి ఫ్లైఓవర్ పనులు ప్రారంభించనున్నట్లు అధికారులు తెలిపారు.
Sorry, no posts matched your criteria.