Nalgonda

News January 6, 2025

సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలి : జిల్లా ఎస్పీ

image

సైబర్ నేరాల పై అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ తెలిపారు. సైబర్ నేరగాళ్లు స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పేరుతో పలు యాప్‌లు డౌన్లోడ్ చేయించి ప్రలోభ పెట్టి ప్రజల బ్యాంకు ఖాతా నుంచి నగదు దోచుకుంటున్నారని తెలిపారు. ఇలాంటి ఘటన నల్గొండ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిందన్నారు. ఈ కేసులో సైబర్ నేరగాళ్లు ఓ బాధితుడికి సుమారు 2కోట్లను మార్కెట్లో ఇన్‌వెస్ట్‌మెంట్‌ చేయించి మోసం చేశారన్నారు.

News January 5, 2025

నిర్మాణ పనులు త్వరగా పూర్తి చేయాలి: కోమటిరెడ్డి

image

గర్భస్థ, శిశు పరీక్షలకు సంబంధించి నూతనంగా నిర్మిస్తున్న తాత్కాలిక ఏఎన్‌సీ భవనాన్ని సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆదేశించారు. నల్గొండ జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో తాత్కాలిక భవన పనుల నిర్మాణానికి ఆదివారం పూజ చేశారు.

News January 5, 2025

కేసీఆర్‌‌తో నల్గొండ జిల్లా నేతల భేటీ

image

ఉమ్మడి NLG జిల్లాకు చెందిన నేతలతో మాజీ సీఎం, బీఆర్ఎస్ అధ్యక్షుడు కే. చంద్రశేఖర రావు ఎర్రవెల్లి ఫామ్ హౌస్‌‌లో శనివారం భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పార్టీ నేతలకు కేసీఆర్ దిశా నిర్దేశం చేశారు. ప్రభుత్వం పై పోరాడేందుకు తొందర ఏం లేదని.. వేచి చూద్దామని పేర్కొన్నట్లు తెలుస్తోంది. కేసీఆర్‌ను కలిసిన వారిలో మాజీ మంత్రి జగదీశ్ రెడ్డితో పాటు పలువురు మాజీ మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలు పాల్గొన్నారు.

News January 5, 2025

NLG: స్థానిక పోరుకు సన్నద్ధం…

image

NLG జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు అధికారులు ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ముందుగా గ్రామపంచాయతీ ఎన్నికలా? ప్రాదేశిక ఎన్నికలా? అనే విషయంపై ప్రభుత్వం నుంచి స్పష్టత రావాల్సి ఉంది. కాగా ఇప్పటికే ఎన్నికల కమిషన్ నుంచి ఎన్నికల సామగ్రిని జిల్లాలకు పంపించే ప్రక్రియ ప్రారంభమైంది. మరోవైపు ప్రస్తుత రాజకీయ వాతావరణం దృష్ట్యా ఏ ఎన్నికలు ముందుగా వస్తాయనే విషయంపై గ్రామాల్లో చర్చ జోరుగా జరుగుతోంది.

News January 5, 2025

మానవ వ్యాధుల నివారణలో ఔషధ మొక్కల పాత్ర కీలకం

image

మానవ వ్యాధుల నివారణలో ఔషధ మొక్కల పాత్ర కీలకమని కాకతీయ విశ్వవిద్యాలయం విశ్రాంత ఆచార్యులు ఆచార్య ముస్తఫా అన్నారు. శనివారం మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయం వృక్షశాస్త్ర విభాగం ఆధ్వర్యంలో ఔషధ మొక్కలపై నిర్వహించిన అతిథి ఉపన్యాస కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. వృక్షాల వర్గీకరణ, ఔషధ మొక్కలు, వృక్షజాతుల గుర్తింపు , ముఖ్యంగా వ్యాధుల నివారణలో మొక్కల యొక్క పాత్రను విద్యార్థులకు వివరించారు.

News January 4, 2025

NLG: సమ్మెలో హమాలీలు.. సంక్రాంతికి పస్తులేనా?

image

ఉమ్మడి NLG జిల్లాలో పండుగపూట కార్డుదారుల ప’రేషన్’ మొదలైంది. ఈ నెల 1నుంచి హమాలీలు సమ్మెలో ఉండగా ఎగుమతులు, దిగుమతులు నిలిచిపోయాయి. రేషన్ షాపుల్లో ప్రతినెలా 1వ తేదీ నుంచి 15వరకు బియ్యం పంపిణీ చేసేవారు. హమాలీలు సమ్మె చేస్తుండడంతో బియ్యం ఇంకా రేషన్ దుకాణాలకు చేరలేదు. సంక్రాంతి పండుగకు పిండి వంటలు చేసేందుకు బియ్యమే కీలకం కాగా ఇంకా రేషన్ దుకాణాల్లో పంపిణీ లేకపోవడంతో పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 

News January 4, 2025

BREAKING: నల్గొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరి మృతి

image

నల్గొండ జిల్లా తిప్పర్తి మండల శివారులో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. నల్గొండ నుంచి మిర్యాలగూడ వైపు వెళ్తున్న బైక్‌ను వెనుక నుంచి వేగంగా వస్తున్న కారు ఢీకొట్టడంతో బైక్‌ చెట్టుని ఢీకొంది. ప్రమాదంలో కారులో ఉన్న మహిళ ఎగిరి పొలంలో పడింది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందగా.. గాయాలైన మరో ఇద్దరిని ఆసుపత్రికి తరలించారు. ఈఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

News January 4, 2025

NLG: యాసంగి పంట సాగు వివరాలు

image

సంక్రాంతి నుంచి ప్రభుత్వం రైతు భరోసా ఇస్తుందని వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. సాగు చేసిన రైతులకే పంట పెట్టుబడి ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది. యాసంగి సీజన్‌లో నల్గొండ జిల్లాలో 5,83,406 ఎకరాల్లో వరి, ఇతర పంటలు సాగు కానున్నట్లు వ్యవసాయ అధికారులు అంచనా వేస్తున్నారు. సూర్యాపేట జిల్లాలో 4,78,147 ఎకరాల్లో, యాదాద్రి జిల్లాలో ఇప్పటివరకు 3,20,000 ఎకరాలు సాగవుతోందని అధికారుల లెక్కలు చెబుతున్నాయి.

News January 3, 2025

ఈనెల 10న శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఉత్తర ద్వార దర్శనం

image

యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో ఈనెల 10న వైకుంఠ ఏకాదశి పర్వదినం పురస్కరించుకుని శుక్రవారం ఉదయం 5:15 లకు స్వామివారి ఉత్తర ద్వార దర్శనం కల్పించుటకు ఏర్పాటు కొనసాగిస్తున్నారు. అలాగే ఐదు రోజులపాటు అధ్యాయనోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నట్లు ఆలయ కార్యనిర్వాహణాధికారి భాస్కరరావు తెలిపారు.

News January 3, 2025

సిబ్బంది సమయపాలన పాటించాలి: జిల్లా వైద్యాధికారి డాక్టర్ కోటాచలం

image

సిబ్బంది విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని, సమయపాలన పాటించాలని జిల్లా వైద్యాధికారి డాక్టర్ కోటాచలం అన్నారు. శుక్రవారం నాగారం మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సిబ్బందితో నిర్వహించిన సమావేశంలో పాల్గొని వారు మాట్లాడుతూ ప్రతిరోజు ఉదయం 9 నుంచి 3:30 వరకు వ్యాక్సినేషన్ నిర్వహించాలని, నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ వైద్య సేవలు అందించాలన్నారు.