India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

దళిత కుటుంబంలో జన్మించినా తన తలరాతను తానే రాసుకోవాలనే దృఢ సంకల్పమే పి.చంద్రయ్యను ఉన్నత స్థానానికి చేర్చింది. చదువును ఆయుధంగా మలుచుకొని, అనేక అవరోధాలను అధిగమిస్తూ ఆయన మంచిర్యాల జిల్లా అదనపు కలెక్టర్గా నియమితులయ్యారు. శాలిగౌరారం (M) ఇటుకల పహాడ్ అనే చిన్న గ్రామం నుంచి ఉస్మానియా యూనివర్సిటీ వరకు ఆయన ప్రయాణం సాగింది. 31 ఏళ్ల నిరంతర కృషి, పట్టుదల, ఆత్మవిశ్వాసమే చివరకు ఆయనను ఐఏఎస్ చేసింది.

మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో బీఆర్ఎస్ కీలక నిర్ణయం తీసుకుంది. నల్గొండ కార్పొరేషన్కు MLC కోటిరెడ్డిని ఇన్ ఛార్జిగా నియమించింది. అలాగే నందికొండకు యుగేంధర్ రావు, హాలియాకు విజయసింహారెడ్డి, దేవరకొండకు పాల్వాయి స్రవంతి, మిర్యాలగూడకు లింగయ్య యాదవ్, చండూరుకు వెంకటనారాయణ గౌడ్, చిట్యాలకు చాడ కిషన్ రెడ్డిలను ఇన్ఛార్జిలుగా ప్రకటించింది. ఎన్నికల్లో పార్టీని విజయపథంలో నడిపించే బాధ్యతను వీరికి అప్పగించింది.

రైతుల ఇబ్బందులను తీర్చేందుకు వ్యవసాయ శాఖ నియోజకవర్గ స్థాయిలోనే ప్రత్యేక యాప్లో యూరియా బుకింగ్ చేసుకునేలా అవకాశం కల్పించింది. ఇందుకోసం ఆ యాప్లో స్వల్ప మార్పులు చేర్పులు చేసింది. దీంతో నియోజకవర్గ పరిధి యాప్లోనే యూరియా బుక్ చేసుకునేలా శనివారం నుంచి కొత్త విధానాన్ని అమలులోకి తెచ్చినట్లు జిల్లా వ్యవసాయ అధికారి పాల్వాయి శ్రవణ్ కుమార్ తెలిపారు. ఇప్పటివరకు 4,38,529 యూరియా బస్తాలను కొనుగోలు చేశారు.

నల్గొండ జిల్లాకు రాష్ట్రస్థాయిలో ‘బెస్ట్ ఎలక్టోరల్ ప్రాక్టీసెస్’ అవార్డు లభించింది. ఎన్నికల నిర్వహణలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచినందుకు గాను మొన్నటి వరకు కలెక్టర్గా పనిచేసిన ఇలా త్రిపాఠి ఈ అవార్డుకు ఎంపికయ్యారు. ప్రస్తుతం ఆమె NZB కలెక్టర్గా బదిలీ కాగా, జిల్లా అధికారులు జనవరి 25న HYD రవీంద్రభారతిలో ఈ పురస్కారాన్ని అందుకోనున్నారు. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వెల్లడించారు.

లారీ నడుపుతుండగానే గుండెపోటు రావడంతో ఓ డ్రైవర్ ప్రాణాలు కోల్పోయాడు. కర్ణాటకకు చెందిన ఎండీ నాసిర్ (61) ముంబై నుంచి విశాఖపట్నంకు లారీలో వెళ్తుండగా.. చిట్యాల మండలం గుండ్రంపల్లి వద్ద ఛాతీనొప్పి రావడంతో లారీని పక్కకు ఆపారు. స్థానికులు 108కి సమాచారం అందించగా, సిబ్బంది వచ్చేలోపే ఆయన మృతి చెందారు. మృతుడి కుమార్తె ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

మున్సిపాలిటీలు, కార్పొరేషన్కు ఎన్నికలు నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం సర్వంసిద్ధమవుతోంది. నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చినా ఎన్నికల నిర్వహణకు సిద్ధంగా ఉండాలని ఎన్నికల కమిషన్ ఆదేశించడంతో ఆ దిశగా అధికారుల సమాయత్తం అవుతున్నారు. జిల్లాలోని NLG కార్పొరేషన్, MLG, HLY, నందికొండ, DVK, CDR, CTL మున్సిపాలిటీల ఎన్నికలకు సంబంధించి మార్గదర్శకాల పుస్తకాలను మున్సిపల్ సిబ్బంది హైదరాబాద్ నుంచి తీసుకువచ్చారు.

జిల్లాలో కూరగాయ పంటలు, ఆకు కూరల సాగు విస్తీర్ణం ఏటేటా తగ్గిపోతుంది. NLG నగరం మూడువైపులా శరవేగంగా విస్తరిస్తుండడం, వ్యవసాయ భూములు రియల్ ఎస్టేట్ వెంచర్లుగా మారిపోతుండడం, మరోవైపు ప్రభుత్వపరంగా ఉద్యాన రైతులకు సహాయ సహకారాలు కొరవడటంతో ఈ పరిస్థితి ఏర్పడుతున్నది. దశాబ్ద కాలం క్రితం జిల్లాలో వందల ఎకరాలకుపైబడి విస్తీర్ణంలో వివిధ రకాల కూరగాయ పంటలు సాగయ్యేవి. ఇప్పుడు 30 శాతం కూడా సాగు చేయడం లేదు.

నల్గొండ జిల్లాలో సామాన్యులకు సన్నబియ్యం ధరలు దడ పుట్టిస్తున్నాయి. ఏటేటా బియ్యం రెట్టింపు అవుతున్నా అధికారులు కట్టడి చేయడం లేదు. గడిచిన నాలుగైదేండ్లుగా ఏటా వానకాలం సీజన్లో మిల్లుల వద్ద క్వింటా బియ్యం రూ.3వేల నుంచి రూ.3500 వరకు దొరికేది. ఈ ఏడాది గత పరిస్థితులకు భిన్నంగా వాటి ధరలు మార్కెట్లో దర్శనమిస్తున్నాయి. ప్రస్తుతం బీపీటీ బియ్యం క్వింటా ధర కొత్తవి రూ.5,500, పాతవి రూ.6,000 పలుకుతున్నాయి.

‘అహల్య’ అనగానే పవన్ కళ్యాణ్ అత్తారింటికి దారేది మూవీలోని కామెడీ గుర్తోస్తుంది. కానీ నల్గొండ జిల్లాలో ‘అహల్య’ నది ఫేమస్. కానీ ఇది నేటి తరానికి తెలియదు. ఆ నది పేరు మీదుగానే ఆ గ్రామానికి పేరొచ్చింది.. అదే హాలియా. చరిత్ర క్రమంలో నది పూడిపోయి, ఆక్రమణకు గురికావడం వల్ల ప్రస్తుతం అహల్య వాగుగా మారింది. ఈ వాగు ఒడ్డునే హాలియా పట్టణం విస్తరించి ఉంది. చుట్టుపక్కల వ్యవసాయానికి ఈ వాగు ప్రధాన నీటి వనరు.

ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ సమస్యలతో మనస్తాపం చెందిన ఓ యువకుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. కట్టంగూరుకు చెందిన ఎరుకల సంతోష్ కుమార్ హోటల్ నిర్వహిస్తూ జీవనం సాగిస్తున్నాడు. హోటల్ వ్యాపారం ఆశించినంతగా సాగకపోవడం, మరోవైపు భార్య అనారోగ్యం బారిన పడటంతో ఆర్థికంగా చితికిపోయి ఒత్తిడికి లోనయ్యాడు. మనస్థాపంతో శుక్రవారం ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్సై రవీందర్ తెలిపారు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు.
Sorry, no posts matched your criteria.