India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
సంక్రాంతికి సొంతూళ్లకు వెళ్లే వారికి ఆర్టీసీ గుడ్ న్యూస్ చెప్పింది. ఇందుకోసం ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపింది. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 400 ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేస్తున్నారు. ఈ ఏడాది సంక్రాంతికి ఎక్కువ సంఖ్యలో సొంత ఊళ్లకు చేరుకునేందుకు అవకాశముందని భావించిన ఆర్టీసీ అధికారులు ప్రత్యేక సర్వీసులను ఏర్పాటు చేస్తున్నారు.
ఉమ్మడి నల్గొండ జిల్లాలో మళ్లీ చలి తీవ్రత పెరిగింది. అల్పపీడన ప్రభావంతో గడిచిన పది రోజులుగా సాధారణ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. గురు, శుక్రవారాల్లో ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పడిపోవడంతో కనిష్ట ఉష్ణోగ్రతల నమోదయ్యాయి. చలి తీవ్రత పెరగడంతో పల్లెలతో పాటు పట్టణాల్లో చిన్నారులు, వృద్ధులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. మరో మూడు రోజుల్లో చలి తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
నల్లగొండ శివారులోని SBI గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థలో గ్రామీణ ప్రాంత నిరుద్యోగ మహిళలకు మగ్గం వర్క్ ఎంబ్రాయిడరీలో 30 రోజుల ఉచిత శిక్షణ అందజేస్తున్నామని సంస్థ డైరెక్టర్ ఈ. రఘుపతి తెలిపారు. శిక్షణ కాలంలో ఉచిత వసతి, భోజనం కల్పిస్తామని, 18 సం. నుంచి 45 లోపు ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన వారు అర్హులని, ఆసక్తి గల వారు జనవరి 6 లోపు సంస్థ ఆఫీసులో, పూర్తి వివరాలకు 7032415062 నంబర్ సంప్రదించాలన్నారు.
పెద్దదేవులపల్లి రిజర్వాయర్ అవుట్ పాల్ వద్ద గుర్తుతెలియని మహిళ మృతదేహం కొట్టుకొచ్చినట్లు మాడుగులపల్లి ఎస్ఐ కృష్ణయ్య తెలిపారు. వర్క్ ఇన్స్పెక్టర్ ప్రవీణ్ మాడుగులపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకొని దర్యాప్తు కొనసాగిస్తున్నామని ఎస్సై చెప్పారు. నీటిలో పడి రెండు, మూడు రోజులు అయ్యుండొచ్చని ఎస్సై అనుమానం వ్యక్తం చేశారు. మృతదేహాన్ని మిర్యాలగూడ ప్రభుత్వ ఆసుపత్రి మార్చరీకి తరలించారు.
త్వరలో పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో నామినేషన్ పత్రాలు భువనగిరి కలెక్టరేట్కు చేరుకున్నాయి. కాగా ఎన్నికలకు సంబంధించి ఏర్పాట్లు చేస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే ఓటర్ల తుది జాబితా ప్రకటించామని ఏ క్షణంలోనైనా ఎన్నికలకు వెళ్లే పరిస్థితి ఉండడంతో దానికి తగ్గట్టుగా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. కాగా ఎన్నికలకు 12 మంది నోడల్ అధికారులను నియమిస్తూ జిల్లా కలెక్టర్ హనుమంతరావు ఉత్తర్వులు జారీ చేశారు.
జిల్లాలో సమర్థవంతులైన బాధ్యత కలిగిన అధికారులు, సిబ్బంది ఉన్నారని కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. కలెక్టర్ కార్యాలయంలో నూతన సంవత్సర సందర్భంగా జిల్లా అధికారులు, సిబ్బంది కలెక్టర్ను గురువారం కలిసి శుభాకాంక్షలు తెలిపారు. గత సంవత్సరం ధాన్యం సేకరణ, ఇందిరమ్మ ఇళ్లు, సమగ్ర కుటుంబ సర్వే వంటి అంశాలలో జిల్లా మొదటి స్థానంలో నిలిచిందని ఇందుకు కృషి చేసిన మండల ప్రత్యేక అధికారులు,అధికారులను అభినందించారు.
పేరెంట్స్ మందలించడంతో ఇంటర్ విద్యార్థి సూసైడ్ చేసుకున్న ఘటన మర్రిగూడ మండలంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలిలా.. శివన్నగూడెంకు చెందిన గణేశ్ ఇంటర్ చదువుతున్నాడు. టైం అవుతోందని కాలేజీకి వెళ్లమని గణేశ్ తండ్రి ఇంద్రయ్య మందలించాడు. మనస్తాపంతో పొలం దగ్గర పురుగు మందు తాగి సూసైడ్ చేసుకున్నాడు. విద్యార్థి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై కృష్ణారెడ్డి తెలిపారు.
రూ.1,500 కోసం కానిస్టేబుల్, హోంగార్డు ఘర్షణ పడిన ఘటన పెన్పహాడ్లో జరిగింది. SI గోపికృష్ణ తెలిపిన వివరాలు.. పెన్పహాడ్లో ఓ టీ స్టాల్ దుకాణదారుడు కానిస్టేబుల్ రవికుమార్కు, హోంగార్డు శ్రీనుకు రూ.1500 క్రిస్మస్ ఇనాం ఇచ్చాడు. వీటిని పంచుకునే విషయంలో DEC 28న ఇద్దరి మధ్య ఘర్షణ జరిగింది. ఈ విషయం SP సన్ప్రీత్ సింగ్ దృష్టికి వెళ్లగా కానిస్టేబుల్ను సస్పెండ్ చేశారు. హోంగార్డును SPఆఫీస్కు అటాచ్ చేశారు.
నల్గొండ జిల్లా వ్యాప్తంగా నూతన సంవత్సర వేడుకలు అంబరాన్ని అంటాయి. ఉమ్మడి జిల్లాలో డిసెంబర్ 30,31వ తేదీల్లో 69.64 కోట్ల మద్యం అమ్మకాలు జరిగాయి. జిల్లాలోని 7 సర్కిల్లో 2 రోజుల్లో 29.59 కోట్ల అమ్మకాలు జరగగా, సూర్యాపేట జిల్లాలోని 4 సర్కిల్లలో 20.9 కోట్లు, యాదాద్రి భువనగిరిలోని 4 సర్కిల్లలో 19.15 కోట్ల మద్యం అమ్మకాలు జరిగాయి. ఉమ్మడి నల్గొండ జిల్లాకు డిసెంబర్ నెలలో రూ.366.92 కోట్ల ఆదాయం సమకూరింది.
<<15041941 >>ఈతకు వెళ్లి ఇద్దరు యువకులు <<>>మిర్యాలగూడ మండలంలో గల్లంతయిన విషయం తెలిసిందే. పోలీసుల వివరాలు..UPకి చెందిన కార్తీక్ మిశ్రా, విజయ్ గోస్వామి యాదాద్రి థర్మల్ ప్లాంట్లో బిల్డింగ్ ఇంజినీర్లుగా పనిచేస్తున్నారు. మిత్రులతో కలిసి వజీరాబాదు మేజర్ వద్ద సాగర్ ఎడమకాల్వలో నిన్న ఈతకు వెళ్లగా.. కాలు జారి కార్తీక్ నీటిలో పడిపోయాడు. కాపాడటానికి ప్రయత్నించిన విజయ్కు సైతం ఈత రాకపోవడంతో ఇద్దరు గల్లంతయ్యారు.
Sorry, no posts matched your criteria.