India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
మూడు రోజుల సంక్రాంతి పండగకు ఉమ్మడి జిల్లాలోని పల్లెలు, పట్టణాలు ముస్తాబయ్యాయి. తొలి రోజు భోగి వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. పట్టణాలు, పల్లెల్లో మహిళలు వాకిట్లో రంగురంగుల ముగ్గులు వేస్తున్నారు. తీపి వంటకాల తయారీలో మహిళలు నిమగ్నమయ్యారు. పల్లెల్లో ఉదయమే భోగిమంటలతో ప్రజలు పండుగకు ఆహ్వానం పలికారు. మరోవైపు చిన్నారులు పతంగులు ఎగరేస్తూ సంబరాలు చేసుకుంటున్నారు.
సూర్యాపేట జిల్లాలో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. స్థానికులు తెలిపిన వివరాలిలా.. చివ్వెంల మండలం గుర్రంతండాకు చెందిన సైదులు కారు డ్రైవర్. అతనికి రమ్య, సుమలత అనే ఇద్దరు భార్యలున్నారు. సైదులు తాగి వచ్చి వారిని వేధిస్తున్నాడు. ఈక్రమంలో ఇద్దరు భార్యలు కలిసి సైదులును ఆదివారం అర్ధరాత్రి హత్య చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం సూర్యాపేట ఏరియా ఆస్పత్రికి తరలించారు. మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
నాగర్ కర్నూల్ మాజీ ఎంపీ మందా జగన్నాథం ఆదివారం అనారోగ్యంతో మృతిచెందారు. ఆయన స్వస్థలం MBNR జిల్లా ఇటిక్యాల మండలం కొండేరు. జగన్నాథం తండ్రి పెద్దపుల్లయ్య నాగార్జునసాగర్ ప్రాజెక్టు నిర్మాణ సమయంలో ఇక్కడకు వచ్చి మెకానిక్ విభాగంలో వాచ్మెన్గా పనిచేశారు. ఆయన తల్లి సవరమ్మ హిల్ కాలనీలోని ప్రాజెక్టు హెల్త్ ఆఫీస్లో ఆయాగా పనిచేశారు. జగన్నాథం హిల్ కాలనీలోని ప్రభుత్వ పాఠశాలలో ఎనిమిదో తరగతి వరకు చదువుకున్నారు.
‘అయ్యగారికి దండం పెట్టు.. అమ్మవారి ముందు డాన్స్ చెయ్.. చిన్న దొరను సంబరపెట్టు’.. అంటూ సంక్రాంతి వేళ గంగిరెద్దుల వాళ్లు చేసే సందడి మామూలుగా ఉండదు. సన్నాయి, మృదంగం వాయిస్తూ తిరిగే వ్యక్తులు, బసవన్నకు చాలా ప్రాధాన్యం ఉంటుంది. పండుగకు నెల ముందే అన్ని ప్రాంతాల్లోనూ ఈ బసవన్నలు బయలుదేరుతారు. కాగా ఉమ్మడి NLG జిల్లాలో మాత్రం ఈ కళ అంతరించిపోయే దశలో ఉంది. మీ ఏరియాలో బసవన్నలు కనిపించారా.. కామెంట్ చేయండి.
నల్గొండ: ఉదయాధిత్య భవనంలో ఉమ్మడి జిల్లాల అధికారులతో రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, కొత్త రేషన్ కార్డులు& ఇందిరమ్మ ఇండ్ల పథకాల అమలుపై ముందస్తు సమన్వయ సమావేశం నిర్వహించారు. అర్హులైన పేదలకు సంక్షేమ పథకాలను అందించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, ఎమ్మెల్యేలు, జిల్లా కలెక్టర్ తదితరులు పాల్గొన్నారు.
యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహా స్వామి ఆలయంలో మూడో రోజు అధ్యయనోత్సవాలు కొనసాగుతున్నాయి. ఉదయం శ్రీరామవతార అలంకారంలో భక్తులకు నరసింహుడి దర్శనమిచ్చారు. సాయంత్రం వెంకటేశ్వర స్వామి అలంకారంలో భక్తులకు యాదగిరీషుడు దర్శనం ఇవ్వనున్నారు. ఆదివారం సెలవు దినం కావడంతో భక్తుల రద్దీ పెరుగుతోంది.
MLGలో 2018లో రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ప్రణయ్ పరువు హత్య కేసులో ట్విస్ట్ చోటుచేసుకుంది. ప్రణయ్ హత్య కేసులో ప్రధాన నిందితుడు సుభాశ్ శర్మ, మరో ఇద్దరు బెయిల్ కోసం సమర్పించిన ష్యూరిటీలు నకిలీవి అని పోలీసులు గుర్తించారు. వారిని MLG పోలీసులు అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరచగా 14 రోజుల జుడీషియల్ రిమాండ్ విధించింది. కాగా, ఈ కేసులో బెయిల్పై బయటికొచ్చిన అమృత తండ్రి మారుతిరావు సూసైడ్ చేసుకున్నారు.
MLGలో 2018లో రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ప్రణయ్ పరువు హత్య కేసులో ట్విస్ట్ చోటుచేసుకుంది. ప్రణయ్ హత్య కేసులో ప్రధాన నిందితుడు సుభాష్ శర్మ, మరో ఇద్దరు బెయిల్ కోసం సమర్పించిన ష్యూరిటీలు నకిలీవని పోలీసులు గుర్తించారు. వారిని MLG పోలీసులు అరెస్టు చేసి కోర్టులో హాజరు పరచగా కోర్టు 14 రోజుల జ్యూడీషియల్ రిమాండ్ విధించింది. కాగా ఈ కేసులో బెయిల్పై బయటికొచ్చిన అమృత తండ్రి మారుతిరావు సూసైడ్ చేసుకున్నారు.
BRS రైతు మహాధర్నా మరోసారి వాయిదా పడింది. నల్గొండ టౌన్లో ఆదివారం ఈ కార్యక్రమం నిర్వహించాల్సి ఉంది. సంక్రాంతి పండుగ ప్రయాణాలు, విజయవాడ-హైదరాబాద్ హైవేపై ట్రాఫిక్ రద్దీతో పాటు తదితర కారణాలతో పండుగ తర్వాత మహాధర్నా నిర్వహించాలని పార్టీ నిర్ణయించింది. ఫార్ములా ఈ రేసు కేసులో KTR విచారణ నేపథ్యంలో ఈ కార్యక్రమాన్ని BRS ముందుకు జరుపుతూ వస్తోంది. తాజాగా ఆయన విచారణ ముగిసిన సంగతి తెలిసిందే.
జర్మనీ దేశంలో బస్ డ్రైవర్లుగా పనిచేయడానికి తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్ పవర్ కంపెనీ లిమిటెడ్ కింద రిక్రూట్మెంట్ ఏజెన్సీ దరఖాస్తులు ఆహ్వానిస్తుందని జిల్లా ఉపాధి కల్పన అధికారి ఎన్. పద్మ ఒక ప్రకటనలో తెలిపారు. బస్ డ్రైవర్ కోసం దరఖాస్తు చేసే అభ్యర్థులు పదో తరగతి ఉత్తీర్ణతతో పాటు రెండు సంవత్సరాల డ్రైవింగ్ అనుభవంతో లైసెన్స్ కలిగి ఉండాలని, 24 నుంచి 40 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలని అన్నారు.
Sorry, no posts matched your criteria.