India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఒక్క ఉద్యోగం సాధించడమే కష్టమనుకుంటున్న ఈ రోజుల్లో ఓ యువకుడు రెండు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించి ఔరా అనిపించాడు. తిరుమలగిరి (సాగర్) మండలంలోని పిల్లిగుండ్ల తండాకు చెందిన జటావత్ శ్రీధర్ ఆర్ఆర్బీలో పీఓ, క్లర్క్ ఉద్యోగాలు సాధించారు. తొలి ప్రయత్నంలోనే రెండు ఉద్యోగాలు సాధించిన శ్రీధర్ను గ్రామస్థులు అభినందించారు.
డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ సివిల్ సప్లై హమాలీ కార్మికులు ఈరోజు నుంచి నిరవధిక సమ్మెకు దిగారు. దీంతో గోదాముల నుంచి రేషన్ షాపులకు బియ్యం సరఫరా నిలిచిపోయింది. కార్మికుల సమ్మెతో జిల్లా వ్యాప్తంగా అన్ని గోదాములలో ఎగుమతి, దిగుమతి నిలిచిపోయింది. సమస్యలను పరిష్కరించాలని ఏఐటీయూసీ ఆధ్వర్యంలో గతంలో అధికారులకు వినతిపత్రాలు ఇచ్చామని, స్పందించకపోవడంతో సమ్మెకు దిగామని హమాలీ నాయకులు అంటున్నారు.
యాదగిరిగుట్ట క్షేత్రానికి వచ్చే దివ్యాంగులు, వృద్ధులు, చంటిపిల్లల తల్లులకు నేటి నుంచి ప్రత్యేక దర్శనాలు కల్పిస్తున్నట్లు ఈవో భాస్కరరావు తెలిపారు. ఉదయం 11 గంటల నుంచి 11.30, సాయంత్రం 5 నుంచి 5.30 గంటల మధ్య దివ్యాంగులు, చంటిపిల్లలు, వృద్ధులకు ప్రత్యేక దర్శనానికి అవకాశం ఇస్తామన్నారు.
కొత్త సంవత్సరం పూట సూర్యాపేట జిల్లాలో దారుణం జరిగింది. చివ్వెంల మండలం లక్ష్మీతండాలో వ్యక్తి హత్యకు గురయ్యాడు. తండాకు చెందిన ధరావత్ శేషు(39)ను న్యూ ఇయర్ వేడుకలకు పిలిచి ప్రత్యర్థులు గొంతు కోసి హత్య చేశారు. కాగా భూ తగాదాలే హత్యకు కారణంగా తెలుస్తోంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
పదవ తరగతిలో ఉత్తమ ఫలితాల సాధనకు విద్యార్థినులు కష్టపడి చదవాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. మంగళవారం మిర్యాలగూడలోని జడ్పీ బాలికల ఉన్నత పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థినీలతో ముఖాముఖి మాట్లాడి వారి విద్యా సామర్ధ్యాలను పరిశీలించారు. 10వ తరగతి గణితంపై ముఖ్యంగా సంభావ్యతపై విద్యార్థినులను ప్రశ్న, జవాబులు అడగడమే కాకుండా, బోర్డుపై లెక్కలను వేసి సమాధానాలు రాబట్టారు.
గ్రామపంచాయతీ ఎన్నికల్లోనూ ఎన్నికల సంఘం నోటాకు చోటు కల్పించింది. పోటీలోని అభ్యర్థులెవరూ నచ్చకపోతే నోటాకు ఓటు వేయవచ్చు. శాసనసభ, పార్లమెంట్ ఎన్నికల్లో బ్యాలెట్ యూనిట్లో చివరలో నోటా బటన్ ఉన్నట్లే.. సర్పంచ్, వార్డు సభ్యుల బ్యాలెట్ పత్రాల్లో చివరన నోటా ముద్రించనున్నారు. సర్పంచికి 30, వార్డు సభ్యులకు 20 గుర్తులతో పాటు అదనంగా నోటా ఉంటుందని అధికారులు తెలిపారు.
శాంతియుత వాతావరణంలో న్యూ ఇయర్ వేడుకలు జరుపుకోవాలని నల్గొండ డీఎస్పీ పి.శివరాం రెడ్డి సూచించారు. రాత్రి 10 గంటల తర్వాత రోడ్లపైకి వస్తే చర్యలు తప్పవని, మద్యం సేవించి వాహనాలు నడిపితే సహించేది లేదని హెచ్చరించారు. సైలెన్సర్లు తీసేసి రోడ్లపై న్యూస్ చేస్తే కఠినంగా వ్యవహరిస్తామన్నారు. మిషన్ చెబుత్రపై పోలీసు పోకస్ ఉంటుందని స్పష్టం చేశారు. ప్రతి ఒక్కరు శాంతియుతంగా న్యూ ఇయర్ వేడుకలు జరుపుకోవాలని కోరారు.
NLG జిల్లా న్యాయసేవాధికార సంస్థలో టైపిస్ట్ /అసిస్టెంట్, రికార్డు అసిస్టెంట్ ఉద్యోగాలకై నిర్వహించాల్సిన రాత పరీక్ష జనవరి 4 నుంచి జనవరి 18కి వాయిదా వేసినట్లు జిల్లా న్యాయసేవాధికార సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది. OMR పద్ధతిలో రాతపరీక్ష షెడ్యూల్ (రికార్డు అసిస్టెంట్: జనవరి 18 ఉదయం గం. 11.00 నుంచి 12.30 వరకు, టైపిస్ట్ /అసిస్టెంట్ జనవరి 18 మధ్యాహ్నం గం. 3.00 నుంచి 3.40 వరకు నిర్వహించనున్నట్లు తెలిపారు.
WGL-KMM-NLG ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఓటరు తుది జాబితా విడుదలైంది. జిల్లా వ్యాప్తంగా 24,905 అర్హులైన ఓటర్లు నమోదయ్యారు. మొత్తం ఓటర్లలో మహిళా ఓటర్లు 9,965, పురుష ఓటర్లు 14,940 మంది ఉన్నారు. ముసాయిదా ఓటరు జాబితా కంటే తుది జాబితాలో 2,351 మంది పెరిగారు. వారంతా ఓటు హక్కును వినియోగించుకోవడానికి అర్హులని టీచర్ ఎమ్మెల్సీ రిటర్నింగ్ అధికారి, NLG జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు.
2024లో ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన పలువురు పద్మశ్రీ పురస్కారాలకు ఎంపికయ్యారు. మిర్యాలగూడ రోడ్డు ప్రమాదంలో ఆరుగురు మృతి చెందారు. ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్ 2 చోట్ల గెలిచింది. ఉద్యమకారుడు జిట్టా బాలకృష్ణ మృతి చెందాడు. ఎంజీయూ వీసీగా అల్తాఫ్ హుస్సేన్ నియమితులయ్యారు. పలు ప్రాంతాల్లో భూ ప్రకంపనలు సంభవించాయి. జలాల్పురం చెరువులోకి కారు దూసుకెళ్లిన ఘటనలో ఐదుగురు జల సమాధయ్యారు.
Sorry, no posts matched your criteria.