Nalgonda

News December 29, 2024

NLG: న్యూ ఇయర్ వేడుకలకు ప్లాన్స్

image

న్యూ ఇయర్ వేడుకలకు నల్గొండ జిల్లాలో యువత సిద్ధమవుతున్నారు. ఫ్యామిలీ, ఫ్రెండ్స్‌తో ఎంజాయ్ చేసేందుకు ప్లాన్స్ వేస్తున్నారు. జిల్లా HYDకు సరిహద్దు కలిగిఉండడం, శివార్లలో ఎక్కువగా ఫాంహౌస్‌లు, రిసార్ట్స్ ఉండడంతో అక్కడే న్యూ ఇయర్ వేడుకలు జరుపుకునేందుకు ప్రణాళికలు వేస్తున్నారు. కాగా ఉమ్మడి జిల్లాలో బొమ్మలరామారం, బీబీనగర్ మండలాల్లో ఫాంహౌసులు ఉన్నాయి.

News December 28, 2024

NLG: డిగ్రీ విద్యార్థులకు ఇదే చివరి అవకాశం!

image

MG యూనివర్సిటీ పరిధిలోని వార్షిక, సెమిస్టర్ విధానంలో డిగ్రీ అభ్యసించి ఉత్తీర్ణత సాధించని విద్యార్థుల కొరకు చివరి అవకాశం కల్పిస్తూ పరీక్షలను నిర్వహించనున్నట్లు సీఓఈ డా. ఉపేందర్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. 2011-2016 వరకు విద్య వార్షిక సంవత్సరాలలో డిగ్రీ ఉత్తీర్ణత సాధించని విద్యార్థుల కొరకు పరీక్ష ఫీజును 12 ఫిబ్రవరి 2025 వరకు లోపు చెల్లించి పరీక్షకు హాజరు కావాలని తెలిపారు.

News December 28, 2024

NLG: నిఘా నీడలో ఇంటర్ ప్రాక్టికల్స్ 

image

ఇంటర్ ప్రాక్టికల్స్ పరీక్షలను నిఘానీడలో నిర్వహించేందుకు విద్యాశాఖ ఏర్పాట్లు చేస్తోంది. ఇందుకోసం ప్రయోగశాలల్లో సీసీ కెమెరాలను యుద్ధ ప్రాతిపదికన ఏర్పాటు చేయాలని, దానికి కావాల్సిన ప్రతిపాదనలను వెంటనే బోర్డుకు పంపాలని ఈ నెల 23న ఇంటర్ బోర్డు కార్యదర్శి ఆదేశాలు జారీ చేశారు. ఉమ్మడి జిల్లాలో సుమారు 290 ప్రభుత్వ, ప్రైవేటు ఇంటర్ కళాశాలలో ఫిబ్రవరి మొదటివారం నుంచి ప్రాక్టికల్స్ ప్రారంభం కానున్నాయి.

News December 28, 2024

NLG: ఫోన్ మాట్లాడుతూ విద్యుత్ తీగలను పట్టుకుని మృతి

image

ఫోన్ మాట్లాడుతూ విద్యుత్ తీగలను పట్టుకుని యువకుడు మృతి చెందిన ఘటన గుర్రంపోడు మండలంలో జరిగింది.  గ్రామస్థులు తెలిపిన వివరాలిలా.. మక్కపల్లికి చెందిన నేతాళ్ల కిరణ్ (15) బ్రష్ చేసుకుంటూ డాబా ఎక్కాడు. ఫోన్ రావడంతో మాట్లాడుతూ విద్యుత్ తీగలను పట్టుకున్నాడు. దీంతో అక్కడికక్కడే మృతిచెందాడు. కిరణ్  కొండమల్లేపల్లిలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతున్నాడు. 

News December 28, 2024

నల్గొండ పొలిటికల్ రౌండప్ @2024

image

కాంగ్రెస్‌కి నల్గొండ 2024లో కలిసొచ్చిందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో 12 స్థానాలకు 11 గెలవడంతో పాటు రెండు ఉత్తమ్, కోమటిరెడ్డికి మంత్రి పదవులు దక్కడంతో ఆ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం వచ్చిందన్నారు. మరో వైపు BRS SRPT స్థానాన్ని గెలుచుకుని ప్రస్తుతం పట్టుకోసం ప్రయత్నిస్తోందంటున్నారు. రాజకీయంగా ఎదగడానికి బీజేపీ, కమ్యూనిస్టులు తమ వంతు ప్రయత్నం చేస్తున్నారని అభిప్రాయపడ్డారు. COMMENT

News December 28, 2024

యాక్సిడెంట్‌కు ముందు ఫొటో.. కంటతడి పెట్టిస్తోంది

image

భువనగిరి సమీపంలో శుక్రవారం రాత్రి <<14998405>>రోడ్డు ప్రమాదం<<>> జరిగిన విషయం తెలిసిందే. హైదరాబాద్ శామీర్‌పేటకు చెందిన దంపతులు జగన్, పావని వారి పిల్లలు సాత్విక, కన్నయ్య యాదాద్రి దర్శనం చేసుకున్నారు. తిరుగుప్రయాణంలో జరిగిన ప్రమాదంలో పావని, కుమారుడు కన్నయ్య మృతి చెందారు. తండ్రీకుమార్తెకు గాయాలయ్యాయి. దర్శనం అనంతరం రాయగిరి మినీ ట్యాంక్ బండ్ వద్ద ఫ్యామిలీతో దిగిన ఫొటో ప్రతి ఒక్కరిని కంటతడి పెట్టిస్తోంది. 

News December 28, 2024

భువనగిరి: ఉద్యోగం రాలేదని యువకుడి ఆత్మహత్య

image

ప్రభుత్వ ఉద్యోగం రావడం లేదని యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన రేవంత్ రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. వివరాల్లోకెళితే భువనగిరికి చెందిన రేవంత్ అమీర్ పేట్ లో టెక్నికల్ లో కోచింగ్ తీసుకుంటున్నాడు. ఉద్యోగాలకు దరఖాస్తు చేసినా రాలేదు. దీంతో జీవితంపై విరక్తి చెంది శుక్రవారం ఔషాపూర్ సమీపంలో శిరిడి ఎక్స్ ప్రెస్ కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. రైల్వే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు.

News December 27, 2024

భువనగిరితో మన్మోహన్ సింగ్‌కు అనుబంధం 

image

మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే ఆయనకు భువనగిరితో ప్రత్యేక అనుబంధం ఉంది. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో ఏప్రిల్ 26న ఏర్పాటుచేసిన ప్రచార వేదిక సభకు హాజరయ్యారు. కోమటిరెడ్డి బ్రదర్స్ మన్మోహన్ సింగ్‌కు స్వాగతం పలికారు. అప్పటి కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి పోతంశెట్టి వెంకటేశ్వర్లును పరిచయం చేశారు. 

News December 27, 2024

రాజాపేట: వారం పాటు పోరాడిన దక్కని చిన్నారి ప్రాణం

image

ఇంట్లో ఆడుకుంటుండగా కట్టెలపొయ్యి మంటలు అంటుకుని చిన్నారికి ఈ నెల 20న గాయాలవగా HYD గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ పాప గురువారం మృతిచెందింది. పోలీసుల వివరాలిలా.. రాజాపేట మండలం రేణిగుంటకి చెందిన ఎర్ర పరమేశ్, స్వప్న దంపతుల కుమార్తె సాక్షి (3) ఇంట్లో ఆడుకుంటుండగా మంట అంటుకుంది. చికిత్స పొందుతూ గురువారం చనిపోయింది. మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు రాజాపేట పోలీసులు తెలిపారు. 

News December 26, 2024

NLG: అటు ముసురు.. ఇటు చలి తీవ్రత

image

బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం కారణంగా బుధవారం నల్గొండ జిల్లా వ్యాప్తంగా ముసురు పట్టింది. మంగళవారం రాత్రి నుంచే చిరుజల్లులతో ముసురుకుంది. ఒకవైపు ముసురు.. మరో వైపు చలి తీవ్రతతో జిల్లాలోని వివిధ ప్రాంతాలలో ప్రజలు బయటకు రాలేని పరిస్థితి నెలకొంది. క్రిస్మస్ కావడంతో పట్టణ ప్రాంతాల్లో రోడ్లపై జన సందడిగా మోస్తరుగా కనిపించింది. చలి తీవ్రత కారణంగా చిన్నారులు, వృద్ధులు ఇబ్బందులు పడుతున్నారు.