Nalgonda

News June 17, 2024

NLG: యువతీ, యువకులకు గుడ్ న్యూస్

image

పోచంపల్లి స్వామి రామానంద తీర్థ గ్రామీణ సంస్థలో ఉపాధి సాంకేతిక శిక్షణ కార్యక్రమాలకు గ్రామీణ నిరుద్యోగ యువతీ యువకుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు సంస్థ డైరెక్టర్ PSSR లక్ష్మి తెలిపారు. సంస్థలో 6 నెలల కాల పరిమితితో కూడిన ఎలక్ట్రిషియన్ (డొమెస్టిక్), సోలార్ సిస్టం ఇన్స్టాలేషన్ సర్వీస్, కంప్యూటర్ హార్డ్వేర్ , సెల్ ఫోన్ తదితర కోర్సులు ఆరు నెలలపాటు శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు.

News June 16, 2024

నేరేడుచర్ల: విద్యుత్ ప్రమాదంలో ఆపరేటర్ మృతి

image

నేరేడుచర్ల మండలం కల్లూరు గ్రామం పరిధిలోని వ్యవసాయ పొలం దగ్గర విద్యుత్ పనులు చేస్తుండగా ప్రమాదవశాత్తు షాక్ తగిలి మండవ నాగేశ్వరరావు( 40) అక్కడికక్కడే మృతి చెందారు. గరిడేపల్లి మండలం తాల్ల మల్కాపురం గ్రామానికి చెందిన నాగేశ్వరరావు నేరేడుచర్ల మండలం ముకుందపురం సబ్ స్టేషన్‌లో విద్యుత్ ఆపరేటర్‌గా విధులు నిర్వహిస్తూ నేరేడుచర్ల పట్టణంలో నివసిస్తున్నారు.

News June 16, 2024

మిర్యాలగూడ: ఉరి వేసుకుని ఓ వ్యక్తి ఆత్మహత్య

image

ఉరి వేసుకుని వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మిర్యాలగూడ పట్టణంలో చోటుచేసుకుంది. ఎస్సై రాంబాబు వివరాల ప్రకారం.. పట్టణంలోని బంగారు గడ్డకు చెందిన మారేండ్ల సైదులు ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. కొద్ది రోజులుగా భార్య, భర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతునికి భార్య, ఇద్దరు సంతానం ఉన్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.

News June 16, 2024

దేవరకొండ: బియ్యం పంపిణీకి గడువు పెంపు

image

ఉమ్మడి నల్గొండ జిల్లాలో రెవెన్యూ డివిజన్ పరిధిలోని రేషన్ డీలర్లు ఈనెల 17 వరకు కార్డు దారులకు బియ్యాన్ని పంపిణీ చేయాలని దేవరకొండ పౌరసరఫరాల శాఖ అధికారి హనుమంతు శ్రీనివాస్ గౌడ్ ఓ ప్రకటనలో సూచించారు. ప్రతినెల 15 వరకు బియ్యం పంపిణీ చేస్తున్నారని జిల్లా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు మరో రెండు రోజులు పొడిగించినట్లు తెలిపారు. రేషన్ షాపులను సకాలంలో తెరిచి కార్డుదారులకు బియ్యం పంపిణీ చేయాలని ఆదేశించారు.

News June 16, 2024

పోచంపల్లి అర్బన్ బ్యాంక్ ఎన్నికల బరిలో 27 మంది

image

పోచంపల్లి కో-ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ ఎన్నికల బరిలో 27 మంది అభ్యర్థులు పోటీలో నిలిచారు. జనరల్ స్థానoలో 11 మంది, మహిళ కేటగిరిలో ముగ్గురు , ఎస్సీ కేటగిరిలో ముగ్గురు నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. కాగా రెండు మహిళల స్థానానికి ముగ్గురు అభ్యర్థులు , ఒక ఎస్సీ స్థానానికి ఇద్దరు , ఆరు జనరల్ స్థానానికి 22 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. పోటీలో ఉన్న అభ్యర్థులకు గుర్తులను కేటాయించారు.

News June 15, 2024

NLG: జీతాలు అందక అంగన్వాడీల అవస్థలు..!

image

ఉమ్మడి జిల్లాలో అంగన్‌వాడీ కేంద్రాల్లో విధులు నిర్వహిస్తున్న కార్యకర్తలు, ఆయాలకు రెగ్యులర్గా వేతనాలు అందకపోవడంతో అవస్థలు పడుతున్నారు. వీరికి ప్రతినెలా 14వ తేదీన జీతాలు ప్రభుత్వం చెల్లిస్తుంది. గత కొన్ని నెలలుగా టైంకు జీతాలు చెల్లించకపోవడంతో అంగన్వాడీలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి ప్రతినెల 1వ తేదీనే జీతాలు చెల్లించాలని అంగన్వాడీ టీచర్లు, ఆయాలు కోరుతున్నారు.

News June 15, 2024

కనగల్‌ హత్యకేసు చేధించిన పోలీసులు

image

<<13277667>>కనగల్‌లో<<>> గత నెల 19న గుర్తుతెలియని మృతదేహం లభ్యమైన విషయం తెలిసిందే. కాగా ఆ వ్యక్తి‌ని హత్యచేసిన 7గురు నిందితులని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి 2కార్లు, 5 ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. మృతుడుయాదగిరిగుట్టకు చెందిన సముద్రాల కృష్ణగా గుర్తించారు. రైస్ పుల్లింగ్ యంత్రం ఇప్పిస్తానని ఓ ముఠా‌తో కృష్ణ ఒప్పందం కుదుర్చుకున్నాడు. 6 నెలలు గడిచినా పుల్లింగ్ యంత్రం ఇప్పించలేదని ముఠా కృష్ణని చంపింది.

News June 15, 2024

నల్గొండ జిల్లా కలెక్టర్‌గా నారాయణ రెడ్డి

image

నల్గొండ జిల్లా కలెక్టర్ దాసరి హరిచందన బదిలీ అయ్యారు. ఈ మేరకు రాష్ట్ర సీఎస్ శాంతి కుమారి ఉత్తర్వులు జారీ చేశారు. అమె స్థానంలో వికారాబాద్ జిల్లా కలెక్టర్ గా పని చేస్తున్న నారాయణ రెడ్డి బదిలీపై వచ్చారు. కాగా దాసరి హరిచందనకు ఎక్కడా పోస్టింగ్ ఇవ్వలేదు. అటు సూర్యాపేట కలెక్టర్‌గా తేజస్ నంద్‌లాల్ పవార్ బదిలీపై వచ్చారు.

News June 15, 2024

కోదాడ: పిడుగుపాటుకు పాడి రైతు మృతి

image

పిడుగు పాటుకు రైతు మృతి చెందిన ఘటన కోదాడ పట్టణంలో శుక్రవారం చోటు చేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. మండలంలోని నల్లబండ గూడెంకి చెందిన పొందూరు రామారావు గేదెలు పెంచుకుంటూ పాల వ్యాపారం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. రోజు మాదిరిగానే గేదెలను గుడిబండ రోడ్డులోని వ్యవసాయ భూమిలోకి మేతకు తీసుకెళ్లగా సాయంత్రం ఉరుములతో కూడిన వర్షానికి పిడుగు పడి మృతి చెందినట్లు తెలిపారు. కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

News June 15, 2024

NLG: రేషన్ ఈ-కేవైసీ గడువు పొడిగింపు

image

ఆధార్, రేషన్‌ కార్డుల అనుసంధానం గడువును మరోసారి పెంచుతూ కేంద్ర ప్రభుత్వం తాజాగా నిర్ణయం తీసుకుంది. ఈ నెల 30 ఆఖరు తేదీ కాగా Sept 30 వరకు పొడిగిస్తూ ఆహార, పౌరసరఫరాల విభాగం ప్రకటన చేసింది. ఉమ్మడి నల్గొండ జిల్లాలో 10,07,251 కార్డులుండగా, 29,86,875 మంది లబ్ధిదారులున్నారు. ఇందులో 21,89,466 మంది లబ్ధిదారులు ఈకేవైసీ చేసుకున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. ఇంకా 7,97,409 మంది ఈకేవైసీ పూర్తి చేయాల్సి ఉంది.