Nizamabad

News September 10, 2024

కామారెడ్డి: అష్టావధాని ఆయాచితం నటేశ్వరశర్మ కన్నుమూత

image

ప్రఖ్యాత కవి,అష్టావధాని డాక్టర్ ఆయాచితం నటేశ్వరశర్మ మంగళవారం అనారోగ్యంతో బాధపడుతూ కన్నుమూశారు. రామారెడ్డి మండలానికి చెందిన నటేశ్వర శర్మ సంస్కృతంలో 50కి పైగా రచనలు రాశారు. డాక్టర్ నటేశ్వర శర్మ రచనలకు గాను రాష్ట్ర ప్రభుత్వం 2023లో దాశరథి పురస్కారంతో ఘనంగా సత్కరించారు. డాక్టర్ నటేశ్వర శర్మ కన్నుమూయడంతో కవులు, కళాకారులు శోక సముద్రంలో మునిగారు.

News September 10, 2024

జక్రాన్‌పల్లి: చోరీకి గురైన శివలింగం

image

నూతనంగా నిర్మించనున్న శివాలయం స్థలంలో తాత్కాలికంగా ప్రతిష్ఠించిన శివలింగాన్ని గుర్తు తెలియని దుండగులు ఎత్తుకెళ్లిన ఘటన వారం రోజుల తర్వాత వెలుగులోకి వచ్చింది. మండలంలోని మునిపల్లి గ్రామంలోని వడ్డెర కాలనీలో నిర్మించనున్న గుడి స్థలంలో ప్రతిష్ఠించిన శివలింగం చోరీకి గురైనట్లు స్థానికులు కాలనీవాసులు తెలిపారు. వారి ఫిర్యాదు మేరకు ఎస్ఐ తిరుపతి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

News September 10, 2024

NZB: ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం

image

డిచ్పల్లి మండలం రాంపూర్ రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో నిర్వహించబోయే వృద్ధాశ్రమంలో పనిచేసేందుకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా రెడ్ క్రాస్ ఛైర్మన్ ఆంజనేయులు తెలిపారు. హోమ్ కోఆర్డినేటర్, అసిస్టెంట్ కోఆర్డి నేటర్, ఏఎన్ఎం, వంట మనిషి, వంట సహాయకుడు, మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పోస్టులు ఖాళీగా ఉన్నాయన్నారు. ఈ నెల 18లోపు రెడ్ క్రాస్ జిల్లా కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

News September 10, 2024

NZB: నూతన రేషన్ కార్డులకు దరఖాస్తులు

image

నిజామాబాద్ జిల్లా ప్రజలకు నూతన రేషన్ కార్డులు మంజూరు చేసేందుకు ప్రభుత్వం కసరత్తులు చేస్తోంది. ఈ నెల 17 నుంచి నిర్వహించే ప్రజాపాలనలో దరఖాస్తులు స్వీకరించనున్నారు. ప్రజాపాలనలో కార్డులు లేనివారికి ఇస్తారా? కుటుంబీకుల పేర్లు జత చేర్చుతారా? ప్రస్తుతం ఉన్నవారికి కొత్తకార్డులు ఇస్తారా తెలియాల్సి ఉంది. అయితే కొత్త కార్డుల జారీకి ప్రభుత్వం నుంచి మార్గదర్శకాలు రాలేదని అధికారులు వెల్లడించారు.

News September 10, 2024

బోధన్: ‘రూ.20వేలు పంట నష్టపరిహారం ఇవ్వాలి’

image

గత నెల రోజులకు కురిసిన భారీ వర్షాలకు పంట నష్టపోయిన రైతులకు ఎకరానికి రూ. 20వేలు నష్టపరిహారం చెల్లించాలని తెలంగాణ రైతు సంఘం జిల్లా కార్యదర్శి వెంకటేష్ డిమాండ్ చేశారు. బోధన్‌లో సోమవారం మీడియాతో మాట్లాడారు. ఎలాంటి షరతులు లేకుండా రుణమాఫీ చేయాలని, కొత్త రుణాలు ఇవ్వాలని, రైతు బందు పెట్టుబడి సాయం అందజేయాలని అన్నారు. కార్యక్రమంలో మేకల మల్లేష్, సాయిబాబా, రాజయ్య, గోపి, తదితరులు పాల్గొన్నారు.

News September 10, 2024

నందిపేటలో రక్షణ కోసం రాళ్లు పట్టిన మహిళలు

image

నందిపేటలో ఒకే రోజు వరుసగా పది మందిని పిచ్చి కుక్క విచక్షణారహితంగా కరిచి తీవ్ర గాయాలపాలు చేసిన విషయం తెలిసిందే. దీంతో మండల కేంద్రంలోని మహిళలు, చిన్నపిల్లలు, వృద్ధులు, తమ పనుల నిమిత్తం ఎక్కడికైనా వెళ్లాల్సి వస్తే తమ రక్షణ కోసం రాళ్లు పట్టుకొని వెళ్లే దుస్థితి ఎదురయ్యింది. కుక్క వచ్చి దాడి చేస్తుందో తెలియని పరిస్థితి ఉందని ఏదైనా పనుల నిమిత్తం బయటకు వెళ్ళడానికి భయంగా ఉందని అంటున్నారు.

News September 9, 2024

KMR: జిల్లాలో 5.43 లక్షల ఎకరాల్లో పంటలు

image

కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా వానాకాలం సీజన్లో 5.43 లక్షల ఎకరాల్లో రైతులు పంటలు సాగుచేస్తున్నట్లు వ్యవసాయ అధికారుల లెక్కల్లో తేలింది. ప్రస్తుత వానకాల సీజన్ ఆరంభమైన తర్వాత తొలకరి జల్లులే.. ఆలస్యమైనా ఇటీవల సమృద్ధిగా వర్షాలు కురిశాయి. దీంతో వరి, పత్తి, కంది, సోయాబీన్ పంటలు పెద్ద ఎత్తున సాగుతున్నాయి. కాగా ఎప్పటిలాగే ఈ సారి కూడా వరి స్థానంలో ఇతర పంటల సాగుకు ప్రత్యామ్నాయం కరువైంది.

News September 9, 2024

లింగంపేట్: మటన్ ముక్క కోసం గొడవ

image

మటన్ ముక్కల కోసం కామారెడ్డి జిల్లాలో ఆదివారం గొడవ జరిగింది. పోలీసుల వివరాల ప్రకారం.. లింగంపేటలోని ఓ ఫంక్షన్ హాల్‌లో భోజనాల సమయంలో బంధువులకు మటన్ ముక్కలు తక్కువగా వేశారని వడ్డించే వారిపై దాడి చేశారు. దీంతో ఇరు వర్గాల వారు దాడులు చేసుకోవడంతో పలువురికి గాయాలయ్యాయి. ఇరువురు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసుకున్నారు. వారు రాజీ పడ్డారని ఎస్సై అరుణ్ కుమార్ తెలిపారు.

News September 9, 2024

సిరికొండ: వినాయక మండపం వద్ద కరెంట్ షాక్‌తో బాలుడి మృతి

image

నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. సిరికొండ మండలం కొండాపూర్ గ్రామ సమీపంలో తాళ్లతండాలో కరెంట్ షాక్‌తో బాలుడు మృతి చెందాడు. తండాలోని వినాయక మండపం వద్ద సంజీవ్(16) మైక్ సరిచేస్తుండగా కరెంట్ షాక్ తగలడంతో తీవ్రగాయాలయ్యాయి. హుటాహుటిన బాలుడిని కామారెడ్డి ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. 

News September 9, 2024

అలీ సాగర్ గేట్లను ఏ క్షణమైనా ఎత్తవచ్చు: ఏఈ రాజ్యలక్ష్మి

image

ఎడపల్లి మండలంలోని అలీ సాగర్ ప్రాజెక్టు వరద గేట్లను ఏ క్షణమైన ఎత్తే అవకాశాలు ఉన్నాయని ఇరిగేషన్ ఏఈ రాజ్యలక్ష్మి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రాజెక్టు ఎగువ పరివాహక ప్రాంతంలో భారీ వర్షాలు ఉన్నందున ప్రాజెక్టు గేట్లు ఎత్తే అవకాశం ఉందన్నారు. దిగువ ప్రాంత ప్రజలు రైతులు అప్రమత్తంగా ఉండాలని ఈ సందర్భంగా ఆమె సూచించారు. ఈ విషయమై గ్రామాల్లో దండోరా వేయించాలని ఏఈ రాజ్యలక్ష్మి తెలిపారు.