India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేశ్ కుమార్ గౌడ్కు కరాటే బ్లాక్ బెల్ట్ డాన్ 7 ప్రధానం చేశారు. ఒకినావా మార్షల్ ఆర్ట్స్ అకాడమి నుంచి సర్టిఫికేట్ అందుకున్నారు. హైదరాబాదులోని YWCAలో 3 గంటల పాటు జరిగిన పరీక్షలో మహేశ్ కుమార్ గౌడ్ నెగ్గారు. ఈ సందర్భంగా ఒకినావా మార్షల్ ఆర్ట్స్ అకాడమి నుంచి బ్లాక్ బెల్ట్ 7వ డాన్ గ్రాండ్ మాస్టర్ ఎస్.శ్రీనివాసన్ అందజేశారు.
నిజామాబాద్ జిల్లాలో రాజీవ్ యువ వికాసం పథకంపై యువతకు అవగాహన కల్పిస్తున్నామని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు పేర్కొన్నారు. ఈ పథకంపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడారు. పథకానికి వీలైనంత ఎక్కువ మంది నిరుద్యోగ యువత దరఖాస్తులు చేసుకునేలా చర్యలు తీసుకున్నామని వివరించారు. ఇప్పటికే ఆయా శాఖల ద్వారా పత్రికా ప్రకటనలు విడుదల చేసి విస్తృత ప్రచారం కల్పించామన్నారు.
స్థానిక సంస్థల ఎన్నికల ఆశావహులకు శ్రీ విశ్వావసు నామ సంవత్సరం రాజకీయ భవిష్యత్ను తేల్చనుంది. నిజామాబాద్ జిల్లాలో త్వరలో సర్పంచ్, వార్డ్ మెంబర్, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు ఈ నూతన సంవత్సరంలో జరగనున్నాయి. వీటితో పాటు ఈ ఏడాది నిజామాబాద్, ఆర్మూర్, బోధన్, భీమ్గల్ మున్సిపాలిటీ ఎన్నికలు కూడా ఉన్నాయి. దీంతో ఈ ఎన్నికల్లో పోటీకి సిద్ధమైన రాజకీయ ఆశావహులకు ఈ ఏడాది ‘కీ రోల్’ కాబోతోంది.
ప్రస్తుతం నిత్యావసర సరుకుల ధరలు రోజురోజుకి పైపైకి పోతుంటే..ఏం కొనేటట్టు లేదు.. ఏం తినేటట్టు లేదు రాజిగో రాజన్న అన్న పాట గుర్తోస్తోంది. సామాన్యులు వాటిని కొనుగోలు చేయాలంటే ఆలోచించాల్సిన పరిస్థితి నెలకొంది. గతంలోనే పరిస్థితులు బాగున్నాయని అంటున్నారు జనాలు.1981లో kg మంచినూనె ₹13:80, 1/2kg శనగపిండి ₹2:50, జిందాతిలిస్మాత్ ₹1:10, బట్టల సబ్బు ₹1:60, కొబ్బరికాయ ₹1:75గా ఉన్న ఓ బిల్లు వైరల్ అవుతోంది.
సనాతన ధర్మాన్ని, సనాతన సంప్రదాయాలను కాపాడటంలో ప్రతి ఒక్కరూ ముందుండాలని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ కోరారు. ఆదివారం ఆయన నగరంలో ఆర్య వైశ్య సంఘం ఆధ్వర్యంలో, పలు ఉగాది వేడుకల్లో పాల్గొన్నారు. బస్వా గార్డెన్ లో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ ఇందూరు నగర శాఖ నిర్వహించిన కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ జీవితం అంటేనే సుఖ దుఃఖాల కలయిక అని పేర్కొన్నారు.
నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం సాటాపూర్ గేట్ వద్ద ఆదివారం రాత్రి వడ్ల లారీ బోల్తా పడింది. ఎడపల్లి వైపు వెళ్తున్న ధాన్యం లారీ పెట్రోల్ బంక్ వద్ద డివైడర్ను ఢీకొట్టి బోల్తా పడింది. దీంతో లారీలో ఉన్న వరి ధాన్యం బస్తాలు రోడ్డుపై చెల్లాచెదురుగా పడిపోవడంతో వాహన రాకపోకలకు అంతరాయం కలిగింది. సమాచారం అందుకున్న ఎడపల్లి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ట్రాఫిక్ను డైవర్ట్ చేశారు.
రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకుని నిజామాబాద్ కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు జిల్లా ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా వేసవి తీవ్రతలోనూ నియమ నిష్ఠలతో దాదాపు నెల రోజుల పాటు ఉపవాస దీక్షలు నిర్వర్తించడం ఎంతో గొప్ప విషయమన్నారు. అన్ని వర్గాల ప్రజలు సుఖః సంతోషాలతో కాలం వెళ్లదీయాలని, సౌభ్రాతృత్వం వెల్లివిరియాలని ఆకాంక్షించారు.
నిజామాబాద్ జిల్లాలో ఎండలు దంచికొడుతున్నాయి. ఆదివారం కోటగిరిలో 41℃, కమ్మరపల్లి, బోధన్, మెండోరా 40.9, పొతంగల్ 40.8, వేల్పూర్ 40.7, సాలూర, ఇందల్వాయి, డిచ్పల్లి 40.6, మక్లూర్, ఎడపల్లి, ఆర్మూర్ 40.5, ధర్పల్లి, నిజామాబాద్ 40.4, ముగ్పాల్ 40.4, నందిపేట్ 40.3, రెంజల్, మోస్రా 40.2, బోధన్లో 40.1℃ గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది.కాగా ఈ ప్రాంతాలన్నీ ఆరెంజ్ జోన్లో ఉన్నాయి.
బీఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా కార్యాలయంలో ఆదివారం పంచాంగ శ్రవణం నిర్వహించారు. జోషి మధుసూదన్ శర్మ విశ్వవసునామ సంవత్సరం ఎలా ఉండబోతుందోనని వివరించారు. కార్యక్రమంలో మాజీ మేయర్ దండు నీతూ కిరణ్, మాజీ నుడా చైర్మన్ ప్రభాకర్, జాగృతి అధ్యక్షుడు అవంతి శ్రీనివాస్, శంకర్, రామ్ కిషన్ రావు తదితరులతో పాటు మహిళా నాయకురాల్లు పాల్గొన్నారు.
గతంలో NZB జిల్లా అదనపు కలెక్టర్గా పని చేసి ప్రస్తుతం సంగారెడ్డిలో పని చేస్తున్న చంద్రశేఖర్తో పాటు సస్పెన్షన్లో ఉన్న DSO చంద్రప్రకాశ్, పౌరసరఫరాల శాఖ DT నిఖిల్పై కేసు నమోదు చేశామని వర్ని SI మహేశ్ తెలిపారు. కస్టమ్ మిల్లింగ్ రైస్ కేటాయింపుల్లో పోర్జరీ సంతకాలు చేసిన పత్రాలతో వేధిస్తున్నట్లు ఓ మిల్లర్ ఇచ్చిన ఫిర్యాదుపై కోర్టు ఉత్తర్వుల మేరకు కేసు నమోదు చేశామన్నారు.
Sorry, no posts matched your criteria.