Nizamabad

News August 9, 2025

‘ఆ కళాశాలలను టీయూ పరిధిలోకి తీసుకురావాలి’

image

నిర్మల్, ఆదిలాబాద్ జిల్లాలలోని డిగ్రీ, పీజీ కళాశాలలను తెలంగాణ యూనివర్సిటీ పరిధిలోకి తీసుకురావాలని PDSU రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జన్నారపు రాజేశ్వర్ డిమాండ్ చేశారు. ఈ మేరకు డిచ్‌పల్లి తెలంగాణ యూనివర్సిటీ రిజిస్ట్రార్ యాదగిరికి వినతి పత్రం సమర్పించి మాట్లాడారు. విద్యార్థులు సర్టిఫికెట్లు, ఇతర అవసరాల కోసం కాకతీయ యూనివర్సిటీకి 200 కిలోమీటర్లకు పైగా ప్రయాణించాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.

News August 9, 2025

NZB: ‘రేవంత్ వైఖరి డెమోక్రసీ కాదు హిపోక్రసి’

image

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనుసరిస్తున్న తీరు డెమోక్రసీ కాదని, హిపోక్రసీ అని BRS నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు, ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి ధ్వజమెత్తారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ.. ఏమాత్రం ప్రజాస్వామ్య స్పూర్తి లేకుండా కపటత్వ ఎత్తుగడలతో పొంతనలేని కామెంట్లు చేస్తున్న రేవంత్ తెలంగాణ పరువుతీస్తున్నారని మండిపడ్డారు. ఎన్నికల్లో ఓడిపోవడం ఎలా పెద్ద శిక్ష అవుతుందో రేవంత్‌కే తెలియాలన్నారు.

News August 9, 2025

NZB: కార్పొరేషన్‌లో పన్ను వసూళ్లపై ప్రత్యేక దృష్టి

image

పన్ను వసూళ్లపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలని, వంద శాతం పన్ను వసూళ్లు జరగాలని కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి సూచించారు. నగర పాలక సంస్థ పనితీరుపై శుక్రవారం సాయంత్రం కార్పొరేషన్ కార్యాలయంలో కమిషనర్‌తో కలిసి కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. రెవెన్యూ, టౌన్ ప్లానింగ్, శానిటేషన్ తదితర ఒక్కో విభాగం వారీగా అమలవుతున్న కార్యక్రమాలను, సాధించిన ప్రగతిని పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరంగా సమీక్ష జరిపారు.

News August 9, 2025

NZB: రాఖీ పౌర్ణమి.. ఊపందుకున్న కొనుగోళ్లు

image

రాఖీ పౌర్ణమి సందర్భంగా నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా రాఖీల కొనుగోళ్లు ఊపందుకున్నాయి. పల్లెలు, పట్టణాల్లో ఎక్కడ చూసినా దుకాణాలు వెలిశాయి. మహిళలు, యువతులు రాఖీలు కొనేందుకు తరలివస్తుండటంతో రాఖీ విక్రయ కేంద్రాలు, స్వీట్ హౌజ్ లు కిక్కిరిశాయి. NZB కుమార్ గల్లీతో పాటు వాడవాడలా రాఖీ దుకాణాలు వెలిశాయి. కాగా ఆన్లైన్ షాపింగ్ కారణంగా ఈ యేడు నేరుగా రాఖీలు కొనేవారు తగ్గారని వ్యాపారులు Way2Newsకు తెలిపారు.

News August 9, 2025

స్వాతంత్ర్య వేడుకలకు ఏర్పాట్లు చేయండి: కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి

image

స్వాతంత్ర్య వేడుకలను పండగ వాతావరణంలో నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి అధికారులను ఆదేశించారు. శుక్రవారం జిల్లా కార్యాలయాల సముదాయంలోని కాన్ఫరెన్స్ హాల్‌లో జరిగిన సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆగస్టు 15న చేపట్టాల్సిన కార్యక్రమాల గురించి శాఖల వారీగా అధికారులకు దిశానిర్దేశం చేశారు. వేదిక, సీటింగ్ ఏర్పాట్లను పక్కాగా చేసుకోవాలని సూచించారు.

News August 8, 2025

నిజామాబాద్: గుర్తు తెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి

image

ఇందల్వాయి మండలం దేవి తాండ శివారులో జరిగిన రోడ్డు ప్రమాదంలో బాలాజీ (50) అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. శుక్రవారం రూప్లా నాయక్ తండా నుంచి దేవి తాండ గ్రామానికి నడుచుకుంటూ వెళ్తున్న క్రమంలో ఎన్‌హెచ్ 44 జాతీయ రహదారిపై హైదరాబాద్ వైపు నుంచి వేగంగా వచ్చిన గుర్తు తెలియని వాహనం అతడిని ఢీకొంది. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై సందీప్ తెలిపారు.

News August 8, 2025

NZB: స్థానిక సమరానికి సిద్ధం..!

image

సెప్టెంబర్ 30లోగా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలన్న హైకోర్టు ఆదేశాల మేరకు NZB జిల్లాలో స్థానిక సమరానికి అధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు. ఇందులో భాగంగా గుజరాత్ నుంచి బ్యాలెట్ బాక్సులు జిల్లాకు రప్పించి మండల కేంద్రాలకు తరలిస్తున్నారు. కాగా జిల్లాలో 545 గ్రామపంచాయతీలు ఉండగా తుది ఓటరు జాబితా ప్రకారం 8, 51,770 మంది ఓటర్లు ఉన్నట్లు అధికారులు తెలిపారు.

News August 8, 2025

149 అదనపు బస్సులు: నిజామాబాద్ RM

image

రాఖీ పౌర్ణమి, వరలక్ష్మివ్రతం సందర్భంగా నిజామాబాద్ రీజియన్‌లో ప్రయాణికుల సౌకర్యార్థం షెడ్యుల్ బస్సులతో పాటు 149 అదనపు బస్సులు నడుపుతున్నట్లు RTC RM జ్యోత్స్న తెలిపారు. ఆర్మూర్‌కు 20, బోధన్‌కు 31, నిజామాబాద్‌కు 35, బాన్సువాడకు 19, కామారెడ్డికి 44 ప్రత్యేక బస్సులతో పాటు సికింద్రాబాద్‌కు కూడా బస్సులు నడుపుతున్నట్లు ఆమె వివరించారు.

News August 7, 2025

NZB: భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: కలెక్టర్

image

జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో శ్రీరాంసాగర్ పరీవాహక ప్రాంతంతో పాటు నదులు, వాగుల పరిసర ప్రాంతాల్లో నివసించే ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి ప్రజలకు సూచించారు. అవసరం అయితే తప్ప ఇళ్ల బయటకు ఎవరూ రాకూడదని హితవు పలికారు. చేపల వేట, ఈత సరదా కోసం చెరువులు, కాల్వలు, కుంటలు, ఇతర జలాశయాల వద్దకు వెళ్లకూడదని సూచించారు.

News August 7, 2025

NZB: 2,637 మంది లబ్దిదారులకు రూ.30.07 కోట్ల రుణాలు: కలెక్టర్

image

నిజామాబాద్ జిల్లాలో ఇప్పటి వరకు 2,637 మంది ఇందిరమ్మ ఇండ్ల లబ్దిదారులకు రూ.30.07 కోట్ల రుణాలు ఇప్పించామని కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి తెలిపారు. ఇంటి నిర్మాణం ప్రారంభించేందుకు ఆర్ధిక స్థోమత లేని లబ్దిదారులకు స్వయం సహాయక సంఘాల ద్వారా రూ.లక్ష వరకు రుణం అందిస్తూ, నిర్మాణ పనులు చేపట్టేలా అన్ని విధాలుగా ప్రోత్సహిస్తున్నామని తెలిపారు.