India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో BJPని బలోపేతం చేసేందుకు అధిష్ఠానం దృష్టిసారించింది. JANలో తెలంగాణ వ్యాప్తంగా జిల్లాలకు కొత్త సారథులను నియమించనున్నారు. పార్టీ శ్రేణుల్లో నూతనోత్సాహం నింపుతూ BJPని క్షేత్ర స్థాయిలో బలోపేతం చేసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. మరి నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలకు నూతన అధ్యక్షులు ఎవరు అవుతారో వేచి చూడాలి. దీనిపై మీ కామెంట్?
నిజామాబాద్లోని సుభాష్ నగర్ బాల్ రక్ష భవనంలో మంగళవారం 3 నెలల పసికందు మృతి చెందింది. గుర్తు తెలియని ఓ మహిళ సెప్టెంబర్ 15న జిల్లా ఆస్పత్రిలో పసికందుకు జన్మనిచ్చింది. శిశువు బరువు తక్కువగా ఉండటంతో చెత్త బుట్టలో పడేసి వెళ్లిపోయింది. గమనించిన వైద్యులు శిశువును శిశు గృహానికి తరలించి చికిత్స అందించారు. కాగా శిశువు ఆరోగ్య పరిస్థితి విషమించడంతో మంగళవారం మృతి చెందింది. పోలీసులు ఈ ఘటనపై విచారణ చేపట్టారు.
సోమవారం HYDలో జరిగిన రోడ్డు ప్రమాదంలో దోమకొండకు చెందిన శివాని(21) మృతిచెందిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో ఆమెను బైక్పై తీసుకెళ్లిన మహ్మద్నగర్ మండలానికి చెందిన వెంకటరమణారెడ్డి తీవ్రంగా గాయపడ్డాడు. చికిత్స పొందుతూ మంగళవారం మరణించాడు. కాగా వీరిద్దరు నిజాంసాగర్ నవదయలో ఈ నెల 22న పూర్వ విద్యార్థుల సమ్మేళనానికి వెళ్లి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.
శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నుంచి కాకతీయ ప్రధాన కాలువ ద్వారా ఇవాళ ఉదయం 10 గంటలకు నీటిని విడుదల చేయనున్నట్లు పోచంపాడ్ ఇరిగేషన్ సర్కిల్ SE శ్రీనివాస్ రావు గుప్త తెలిపారు. ఇందులో భాగంగా ఆన్ అండ్ ఆఫ్ పద్ధతిలో జోన్-1 (D5 నుంచి D53) ఆయకట్టుకు 7 రోజులు, జోన్-2 (D54 నుంచి D94) ఆయకట్టుకు 8 రోజులు సాగునీటి సరఫరా చేస్తామన్నారు. మొదట జోన్ 2 కు ఏప్రిల్ 8 వరకు సాగునీటి విడుదల ఉంటుందని వివరించారు.
క్రిస్మస్ వేడుకలను పురస్కరించుకుని నిజామాబాద్ జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు పండుగ శుభాకాంక్షలు తెలిపారు. యేసుక్రీస్తు జన్మించిన ఈ శుభ దినాన అందరికీ శాంతి, సౌభాగ్యాలు చేకూరాలని ఆకాంక్షించారు. ఈ క్రిస్మస్ వేడుక ప్రతి ఒక్కరి జీవితంలో సంతోషం నింపాలని, ఇంటింటా ఆనందపు కాంతులు వెల్లివిరియాలని, అన్ని రంగాలలో నిజామాబాద్ జిల్లా మరింత ప్రగతి సాధించాలని అభిలాషించారు.
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు చెందిన ఏబీవీపీ పూర్వ కార్యకర్తలు తెలంగాణ రాష్ట్ర 43వ ఏబీవీపీ మహాసభల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏబీవీపీ పూర్వ రాష్ట్ర అధ్యక్షుడు రంజిత్ మోహన్ నరేష్ మాట్లాడుతూ.. విద్యార్థి పరిషత్ విద్యార్థుల పురోభివృద్ధిలో మమేకమై అనేక సమస్యల సాధనకు కృషి చేయడం దేశభక్తిని పెంపొందించడం నేర్పించిందన్నారు. జాతీయ పున:ర్నిర్మాణంలో నవతరం యువకులను తయారు చేయడమే ధ్యేయమన్నారు.
మహిళలు ప్రభుత్వ సహకారంతో ఆర్థికాభివృద్ధి సాధించాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. మంగళవారం లింగంపేట్ మండలం బాచంపల్లి గ్రామంలో ఐకేపీ ఆర్థిక సహకారంతో చేపల పెంపకం, చేపల దాన తయారు, గొర్రెలు, మేకలు, కోళ్ళ పెంపకం యూనిట్లను కలెక్టర్ పరిశీలించారు. చేపల పెంపకం దాన తయారు చేసేందుకు బ్యాంకు లింకేజి, స్త్రీ నిధి ద్వారా కుంట యశోదకు రూ.3.50 లక్షల రుణం అందజేసినట్లు ఆయన తెలిపారు.
HYD అశోక్ నగర్లోని హాస్టల్లో ఉంటూ గ్రూప్-2, రైల్వే ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్న గుగులోతు సురేఖ(22) ఆత్మహత్య చేసుకుంది. ఆమె బంధువులు తెలిపిన వివరాలు.. కామారెడ్డి(D) గాంధారి(M) సోమారం తండాకు చెందిన సురేఖకు NZBకు చెందిన అబ్బాయితో గత నెలలో ఎంగేజ్మెంట్ అయింది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 7న పెళ్లి కూడా నిశ్చయమైంది. కాగా కుటుంబ సమస్యలతో నిన్న సూసైడ్ చేసుకుంది.
HYD నానక్రాంగూడ వద్ద జరిగిన రోడ్డుప్రమాదంలో కామారెడ్డి జిల్లా దోమకొండకు చెందిన ఐరేని <<14964716>>శివాని<<>>(21) మృతిచెందిన విషయం తెలిసిందే. ఆదివారం నిజాంసాగర్ నవోదయలో జరిగిన పూర్వ విద్యార్థుల సమ్మేళానానికి హాజరయింది. అయితే ఆమె ఇటీవలే క్యాంపస్ ఇంటర్వ్యూలో ఉద్యోగం సాధించారు. 4 నెలల్లో విధుల్లో చేరాల్సి ఉండగా ఇంతలోనే విషాదం చోటుచేసుకుంది. కుటుంబీకులు ఆమె నేత్రాన్ని LV ప్రసాద్ కంటి ఆసుపత్రికి డొనేట్ చేశారు.
రాయదుర్గం PS పరిధిలో శివాని అనే యువతి సోమవారం రోడ్డు ప్రమాదంలో మృతిచెందింది. పోలీసులు తెలిపిన వివరాలు.. CBITలో బీటెక్ 4వ ఏడాది చదువుతున్న శివాని KMR జిల్లా నిజాంసాగర్లో పూర్వ విద్యార్థుల సమ్మేళనానికి వెళ్లి వచ్చింది. హాస్టల్కు వెళ్లేందుకు స్నేహితుడు వెంకట్ రెడ్డి బైక్ పై ఎక్కి నార్సింగి సర్వీస్ రోడ్డులో వెళ్తుండగా కారు ఢీకొట్టింది. దీంతో శివాని మృతిచెందగా వెంకట్ రెడ్డి పరిస్థితి విషమంగా ఉంది.
Sorry, no posts matched your criteria.