India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

పరస్పర రాజీతోనే కోర్టు కేసులకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని మొదటి అదనపు జిల్లా జడ్జి హర్ష అన్నారు. జిల్లా కోర్టు ఆవరణలో జాతీయ లోక్ అదాలత్ను ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ.. లోక్ అదాలత్ ద్వారా సమయం, ధనం ఆదా అవుతాయని పేర్కొన్నారు. కార్యక్రమంలో అదనపు జిల్లా జడ్జి దుర్గా ప్రసాద్, బార్ ప్రెసిడెంట్ సాయిరెడ్డి, అదనపు సీపీ బస్వారెడ్డి, అదనపు కలెక్టర్ నారాయణ రెడ్డి, న్యాయవాదులు పాల్గొన్నారు.

కల్వకుంట్ల కవిత కొత్త పార్టీ ఏర్పాటు వార్తలు సంచలనం రేపుతున్నాయి. సుదీర్ఘ కాలం జిల్లా రాజకీయాలను శాసించిన ఆమె, ఇప్పుడు సొంత కుంపటి పెట్టడం స్థానిక సమీకరణాలను పూర్తిగా మార్చివేసేలా కనిపిస్తోంది. ఉమ్మడి జిల్లాలోని బలమైన నేతలు, ద్వితీయ శ్రేణి కార్యకర్తలు ఏ వైపు నిలుస్తారనేది ఆసక్తికరంగా మారింది. ప్రధాన పార్టీల ఓటు బ్యాంకుకు గండి కొట్టడమే కాకుండా, అసంతృప్త నేతలకు ఈ పార్టీ వేదికయ్యే అవకాశముంది.

మార్కాపురం ఘోర ప్రమాదం నేపథ్యంలో ఉమ్మడి జిల్లాలోని ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల భద్రతపై ఆందోళన వ్యక్తమవుతోంది. నిజామాబాద్, కామారెడ్డిల నుంచి హైదరాబాద్, ముంబై, బెంగళూరుకు నిత్యం ప్రైవేట్ బస్సులు నడుస్తున్నాయి. వీటిలో అధిక శాతం ఫిట్నెస్ లేకపోవడం, అతివేగం, నిబంధనలకు విరుద్ధంగా సరుకు రవాణా చేయడం ప్రమాదాలకు దారితీస్తోంది. గతంలో ఇందల్వాయి, భిక్నూర్ వద్ద జరిగిన ప్రమాదాలు నిర్లక్ష్యాన్ని చాటిచెప్పాయి.

ప్రస్తుతం సోషల్ మీడియా మాధ్యమాలలో పెట్రోల్, డీజిల్ పై జరుగుతున్న అసత్య ప్రచారాలను ప్రజలు నమ్మరాదని రాష్ట్ర పెట్రోల్ పంప్ డీలర్ అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు నల్ల దినేష్ రెడ్డి కోరారు. గురువారం ఆయన ప్రెస్ క్లబ్ లో మాట్లాడుతూ.. ఇది పెట్రోల్ పంప్ యజమానులు చేస్తున్న పనిగా కొందరు మాట్లాడడం బాధాకరంగా ఉందన్నారు. ప్రజలు అవసరానికి మించి పెట్రోల్ పోయించుకుంటున్నందున అత్యవసర సేవలకు ఆటకం కలుగుతున్నదన్నారు.

నిర్దేశిత లక్ష్యానికి అనుగుణంగా NZB జిల్లాలో ఆయిల్ పామ్ సాగు జరిగేలా ప్రణాళికబద్ధంగా కృషి చేయాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి సూచించారు. గురువారం వ్యవసాయ, ఉద్యానవన, సహకార శాఖల అధికారులు, నర్సరీ ప్రతినిధులతో నిర్వహించిన సమీక్షలో కలెక్టర్ మాట్లాడారు. క్షేత్రస్థాయిలో రైతులను ప్రోత్సహిస్తూ జిల్లాలో ఈ ఏడాది 7 వేల ఎకరాల విస్తీర్ణంలో ఆయిల్ పామ్ సాగు జరిగేలా అంకిత భావంతో పని చేయాలని లక్ష్యంగా నిర్దేశించారు.

శ్రీరామ నవమి, హనుమాన్ జయంతి శోభాయాత్రల నిర్వహణపై పోలీస్ కమిషనరేట్లో సీపీ పి.సాయిచైతన్య సమీక్షా సమావేశం నిర్వహించారు. ఉత్సవ కమిటీ సభ్యులు, వివిధ సంఘాల ప్రతినిధులతో మాట్లాడిన ఆయన.. ర్యాలీలు గతంలో అనుమతించిన మార్గాల్లోనే సాగాలని, కొత్త రూట్లకు అనుమతి లేదని స్పష్టం చేశారు. శాంతి భద్రతల దృష్ట్యా డీజేలు, డ్రోన్ల వినియోగాన్ని పూర్తిగా నిషేధించినట్లు తెలిపారు.

శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో మద్యం విక్రయాలపై నిషేధం విధిస్తూ సీపీ పి.సాయిచైతన్య ఆదేశాలు జారీ చేశారు. శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా ఈ నెల 27న ఉదయం 6 నుంచి 28వ తేదీ ఉదయం 6 వరకు వైన్స్, బార్లు, క్లబ్బులు మూసివేసి ఉంచాలని స్పష్టం చేశారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. భక్తులు ప్రశాంత వాతావరణంలో పండుగ జరుపుకోవాలన్నారు.

నిజామాబాద్ జిల్లాలో పెట్రోల్, డీజిల్ కొరత లేదని ఎలాంటి వదంతులను నమ్మవద్దని పోలీస్ కమీషనర్ సాయి చైతన్య స్పష్టం చేశారు. సోషల్ మీడియాలో ప్రచారంలో ఉన్న వదంతుల కారణంగా ప్రజలు ఆందోళనకు గురవుతూ , ఒకేసారి పెద్ద సంఖ్యలో పెట్రోల్ బంకులకు వెళ్లి వాహనాల్లో ఫుల్ ట్యాంక్ నింపుకోవడం వల్ల అనవసర రద్దీ, అంతరాయం ఏర్పడుతుందని అన్నారు. వదంతులు వ్యాప్తి చేసే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

నిజామాబాద్ జిల్లాలో పెట్రోల్, డీజిల్ కొరత లేదని ఎలాంటి వదంతులను నమ్మవద్దని పోలీస్ కమీషనర్ సాయి చైతన్య స్పష్టం చేశారు. సోషల్ మీడియాలో ప్రచారంలో ఉన్న వదంతుల కారణంగా ప్రజలు ఆందోళనకు గురవుతూ , ఒకేసారి పెద్ద సంఖ్యలో పెట్రోల్ బంకులకు వెళ్లి వాహనాల్లో ఫుల్ ట్యాంక్ నింపుకోవడం వల్ల అనవసర రద్దీ, అంతరాయం ఏర్పడుతుందని అన్నారు. వదంతులు వ్యాప్తి చేసే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా నిజామాబాద్, ఆర్మూర్, బోధన్ డివిజన్ పరిధిలోని అన్నీ పోలీస్ స్టేషన్లలో చాలా రోజుల నుంచి పెండింగ్లో ఉన్న నాన్-బెయిలబుల్ వారెంట్ల (NBWs) సంఖ్యను తగ్గించడానికి పోలీస్ కమిషనర్ సాయి చైతన్య యాక్షన్ ప్లాన్ చేపట్టారు. దీనితో ఈ నెల 20 నుంచి 24 వరకు 105 NBWలను పరిష్కరించారు. వేరే రాష్ట్రాలలో పరారీలో ఉన్న 9 మంది నిందితుల కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.
Sorry, no posts matched your criteria.