India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
మద్యం మత్తులో ఓ యువకుడు గొంతుకున్నాడు. ఈ ఘటనలో కామారెడ్డిలో చోటుచేసుకుంది. బీర్కూర్ చెందిన కేశవ్ (25) ఆదివారం గొంతుకోసుకుని కామారెడ్డి పోలీస్స్టేషన్కు వెళ్లాడు. దీంతో అతడికి తీవ్ర రక్తస్రావమైంది. ఇది గమనించిన పోలీసులు యువకుడిని ఆసుపత్రికి తరలించారు. కుటుంబ గొడవల నేపథ్యంలో గొంతు కోసుకున్నట్లు తెలుస్తోంది. అయితే కేశవ్ ఇది వరకు 3 రోజుల క్రితమే గొంతు కోసుకున్నాడు. ఇవాళ మరోసారి దాన్ని రిపీట్ చేశాడు.
నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఆదివారం మధ్యాహ్నం హృదయ విదారకమైన ఘటన వెలుగు చూసింది. కళ్ళు తెరిచి లోకాన్ని చూడని పసికందును కసాయి తల్లిదండ్రులు డ్రైనేజీలో పడవేశారు. రైల్వే స్టేషన్ పక్కనగల ప్రధాన డ్రైనేజీలో ఓ పసికందు విగతజీవిగా పడి ఉండడాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వన్ టౌన్ పోలీసులు అక్కడికి చేరుకొని పసికందు మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీకి తరలించారు.
నిజామాబాద్కు చెందిన మిట్టపల్లి రిత్విక స్విమ్మింగ్ పోటీల్లో ప్రతిభ కనబర్చింది. ఆదివారం సికింద్రాబాద్లో తెలంగాణ రాష్ట్ర స్విమ్మింగ్ అసోసియేషన్ సీనియర్ మహిళల పోటీల్లో ఆమె పాల్గొంది. వివిధ రకాల పోటీల్లో ఆమె స్వర్ణపతకాలు సాధించింది. సెప్టెంబర్ 10 నుంచి 13 వరకు మంగళూరులో జరిగే ఇంటర్నేషనల్ స్విమ్మింగ్ పోటీల్లో ఆమె పాల్గొననుంది.
కారు అదుపుతప్పి డివైడర్ను ఢీకొట్టింది. ఈ ఘటన నవీపేట మండలంలో చోటుచేసుకుంది. హైదరాబాద్ నుంచి ఓ కుటుంబం కారులో బాసర వెళ్తుండగా నవీపేట మండలం అబ్బాపూర్ వద్ద అదుపుతప్పి డివైడర్ ను ఢీకొట్టింది. ఈ ఘటనలో కారులో ఉన్న నలుగురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం నిజామాబాద్ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సిఉంది.
నవీపేట్లోని ఆటోనగర్కు చెందిన బాలాజీ తన చెల్లెలితో కలిసి ప్యాసింజర్ రైల్లో ప్రయాణిస్తుండగా ఆదివారం తెల్లవారుజామున ఫకీరాబాద్ రైల్వే స్టేషన్ సమీపంలో ప్రమాదవశాత్తు జారిపడ్డాడు. లోకో పైలట్ గమనించి ట్రైన్ను ఆపి క్షతగాత్రుడిని బాసరకు తీసుకురాగా 108 అంబులెన్స్ సిబ్బంది పరిశీలించి మృతి చెందాడని నిర్ధారించారు. ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని నిజామాబాద్ రైల్వే ఎస్సై సాయారెడ్డి తెలిపారు.
రాష్ట్ర పద్మశాలి సంఘం అధ్యక్ష ఎన్నికలకు సంబంధించి ఆదివారం
బాన్సువాడ మార్కండేయ మందిరంలో పోలింగ్ కొనసాగుతోంది. ఇందులో బాన్సువాడ మున్సిపల్ చైర్మన్ బాన్సువాడ పద్మశాలి సంఘం అభివృద్ధి కమిటీ చైర్మన్ డాక్టర్ జంగం గంగాధర్, బాన్సువాడ పద్మశాలి సంఘం అధ్యక్షులు జిల్లా కాశీనాథ్, గొంట్యాల బాలకృష్ణ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఓటు హక్కు కలిగిన ప్రతి ఒక్కరు తమ ఓటు హక్కు వినియోగించుకోవాలన్నారు.
అంతర్జాతీయ ఫుట్ బాల్ క్రీడాకారిణి గుగులోత్ సౌమ్య తన స్థాయిని మరిచి సిబ్బందితో కలిసి పనిచేశారు. పోలీస్ పరేడ్ గ్రౌండ్లో నిర్వహిస్తున్న ఉమెన్ ఫుట్బాల్ టోర్నీకి వర్షం అడ్డంకిగా మారింది. దీంతో మైదానంలో నీరు నిలిచిపోయి మ్యాచ్కు అనుకూలించలేదు. సౌమ్య స్వయంగా తన చేతితో ఆ నీటిని బాకెట్లలో నింపి బయట పారవేసి అందరికీ ఆదర్శంగా నిలిచారు.
కామారెడ్డి GR కాలనీలో భారీ చోరీ జరిగింది. తాళం వేసి బయటకు వెళ్లిన యజమాని పది నిమిషాల్లో తిరిగి వచ్చేసరికి దొంగలు చొరబడి నగలు, నగదు ఎత్తుకెళ్లారు. విశ్రాంత ఆర్టీసీ ఉద్యోగి రాములు కూరగాయల కోసం నిన్న 2.29కు ఇంటికి తాళం వేసి మార్కెట్ వెళ్లాడు. 2.39కి ఇంటికి వచ్చే సరికి తాళాలు పగలగొట్టి ఉన్నాయి. ఏడున్నర తులాల బంగారం, ముప్పై తులాల వెండి, రూ. 50వేల నగదు ఎత్తుకెళ్లారు. పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.
కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండలంలోని అచ్చంపేట్ గ్రామ శివారులో శనివారం చిరుత పులి సంచారం కలకలం రేపింది. అచ్చంపేట క్లబ్ వద్ద పులి కనిపించడంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. సమీపంలోనే నవోదయ, మోడల్ పాఠశాలలు ఉండడంతో విద్యార్థుల తల్లిదండ్రులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. అటవీ శాఖ అధికారులు వెంటనే పులి జాడ కనిపెట్టాలని గ్రామస్థులు కోరుకుంటున్నారు.
* జిల్లా వ్యాప్తంగా డాక్టర్ల నిరసన.. నిందితులను శిక్షించాలని డిమాండ్
* రోడ్డెక్కిన రైతులు.. షరతులు లేని రుణమాఫీ అమలు చేయాలని డిమాండ్
* సైబర్ నేరస్థుడిని అరెస్ట్.. రిమాండ్కు తరలింపు
* వేల్పూర్: పోలీసులకు MLA వేముల అల్టిమేట్ వార్నింగ్
* NZB: నగరంలో మున్సిపల్ కమిషనర్ ఆకస్మిక తనిఖీలు
* NZB: భవనంపై నుంచి కింద పడి మహిళ మృతి
* నిజామాబాద్: చిరుత కలకలం
* కామారెడ్డి: భయపెట్టిస్తున్న జ్వరాలు
Sorry, no posts matched your criteria.