India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
నిజామాబాద్ జిల్లా మహిళా జట్టు బేస్బాల్ ఛాంపియన్ షిప్ను కైవసం చేసుకుంది. సీఎం కప్ 2024 క్రీడా పోటీల్లో భాగంగా హైదరాబాదులోని గచ్చిబౌలి స్టేడియంలో తెలంగాణ రాష్ట్ర స్థాయి సీఎం కప్ బేస్బాల్ టోర్నమెంట్ నిర్వహించారు. తెలంగాణ రాష్ట్రంలోని 23 జిల్లాలు పాల్గొనగా ఫైనల్ మ్యాచ్ లో హైదరాబాద్ జట్టుతో నిజామాబాద్ జిల్లా జట్టు తలపడింది. ఇందులో 3-6 పరుగుల తేడాతో నిజామాబాద్ జట్టు విజయకేతనం ఎగురవేసింది.
నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిని శనివారం సాయంత్రం బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సందర్శించారు. రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ ఆదివారం ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిని సందర్శించనున్నారు. ఈ నేపథ్యంలో అక్కడ ఏర్పాట్లపై ఎమ్మెల్యే, కలెక్టర్ ఆసుపత్రిలో వివిధ విభాగాల అధికారులతో మాట్లాడారు.
NZBలోని కాకతీయ విద్యాసంస్థలో ఓ విద్యార్థి సూసైడ్ చేసుకొని మృతి చెందిన ఘటన మరవకముందే మరో వివాదం చోటుచేసుకుంది. సుభాష్ నగర్ బ్రాంచ్లో 8th క్లాస్ విద్యార్థి టాయిలెట్కు వెళ్లి హడావిడిలో ప్యాంట్ జిప్ పెట్టుకోవడం మర్చిపోయాడు. దీంతో అతడిని తరగతి గదిలో టీచర్ స్టేజిపైకి ఎక్కించి అవమానించడంతో విద్యార్థి ఆత్మహత్యాయత్నం చేశాడు. ఆ ఉపాధ్యాయుడిపై చర్యలు తీసుకోవాలని విద్యార్థి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
HYDలో షాపు ఇప్పిస్తానని రూ.25 లక్షలు వసూలు చేసి మోసగించిన నిందితుడిని 4 వ టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాలిలా..వినాయక్నగర్కు చెందిన ఓ మహిళకు HYDలోని జూబ్లీహిల్స్లో షాపు ఇప్పిస్తానని నమ్మించి మహబూబ్నగర్ (D) వాసి అహ్మద్ఖాన్ అనే వ్యక్తి రూ.25 లక్షలు వసూలు చేసి మోసం చేశాడు. దీంతో భాదితురాలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు అతడిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు.
ప్రభుత్వం తప్పులను ఎత్తి చూపుతున్నందుకు కేటీఆర్పై అక్రమ కేసు పెడుతున్నారని నిజామాబాద్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మండిపడ్డారు. శుక్రవారం మండలి వద్ద నిరసన చేపట్టిన అనంతరం ఆమె మాట్లాడారు. కేసీఆర్ బిడ్డలకు పోరాటాలు కొత్తకాదన్నారు. ఎలాంటి కేసులైనా ధైర్యంగా ఎదుర్కొంటామని స్పష్టం చేశారు. రాష్ట్రంలో భయానక వాతావరణం కొనసాగుతుందన్నారు. రాష్ట్రంలో అప్రకటిత ఎమర్జెన్సీ కొనసాగుతుందని ఆమె ఆరోపించారు.
మద్నూర్ మండలంలో యాసంగి పంటలకు జింకల బెడద ఏర్పడుతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా జొన్న, శనగ, మినుము, మొక్కజొన్న సాగు పంట భూములలో పెద్ద సంఖ్యలో జింకలు వచ్చి పంటను నష్ట పరుస్తున్నాయని రైతులు వాపోతున్నారు. గతంలోను జింకల కారణంగా పంటలను నష్టపోయిన సందర్భాలు ఉన్నాయని రైతులు తెలిపారు. అటవీ శాఖ అధికారులు జింకలు బెడద లేకుండా తగు చర్యలు తీసుకోవాలని రైతన్నలు వేడుకుంటున్నారు.
ఫోక్ సింగర్ <<14919989>>శ్రుతి<<>>(26) బుధవారం సూసైడ్ చేసుకున్న విషయం తెలిసిందే. తల్లిదండ్రుల వివరాల ప్రకారం.. NZB జిల్లా తిమ్మాపూర్కు చెందిన ఆమెకు గత నెల 24న వివాహం జరిగింది. కాగా, పెళ్లైనా రోజు నుంచే భర్తతో పాటు అతడి కుటుంబ సభ్యులు కట్నం కోసం వేధించేవారని శ్రుతి తమకు చెప్పినట్లు తెలిపారు. భర్త, అత్తమామలు హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించారని శ్రుతి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
రాష్ట్రం సాధించి, పదేళ్ల ప్రగతిఫలాలు ప్రజలకు అందించిన కేసీఆర్ను లక్ష్యంగా చేసుకుని కుట్రకేసులకు రేవంత్ రెడ్డి తెరతీస్తున్నారని నిజామాబాద్ జిల్లా భారాస లీగల్ సెల్ అధ్యక్షుడు దాదన్నగారి మధుసుదన్ రావు అన్నారు. తెలంగాణ రాష్ట్రం కోసం ఎన్నో పోరాటాలు,ఉద్యమాలు చేసి రాష్ట్రాన్ని సాధించుకున్న బీఆర్ఎస్, కేటీఆర్కు కేసులు కొత్తేమి కాదని పేర్కొన్నారు. కేసులలో భయపెట్టాలని చూస్తే సహించేది లేదన్నారు.
ఉమ్మడి NZB జిల్లాలో ఉష్ణోగ్రతలు నిలకడగా ఉండి చలితీవ్రత తగ్గిందని HYD వాతావరణ కేంద్రం తెలిపింది. కామారెడ్డి జిల్లాలో అత్యల్పంగా మేనూర్ 8.5, జుక్కల్ 9.6, గాంధారి 9.9, నసురుల్లాబాద్ 10, బిచ్కుంద, రామలక్ష్మణపల్లిలో 10.3 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. నిజామాబాద్ జిల్లాలో గోపన్ పల్లి 10.2, కోటగిరి 10.3, సాలురా 10.4, మెండోరా 10.5, చందూర్ 10.6 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని వాతావరణ కేంద్రం తెలిపింది.
ఫోక్ సింగర్ శ్రుతి(26) నిన్న <<14917574>>సూసైడ్<<>> చేసుకుంది. NZB జిల్లా తిమ్మాపూర్కు చెందిన ఆమెను సిద్దిపేట జిల్లా పీర్లపల్లికి చెందిన దయాకర్ 21 రోజుల క్రితం ప్రేమపెళ్లి చేసుకున్నారు. ఆమె బుధవారం అత్తగారి ఇంట్లో సూసైడ్ చేసుకుంది. కాగా ఆమె అప్పటికే 4 నెలల గర్భిణి. అయితే కుటుంబ కలహాలతోనే ఆత్మహత్య చేసుకుందని దయాకర్ చెప్పగా.. తమ కుమార్తెను హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని ఆమె తల్లిదండ్రులు ఆరోపించారు.
Sorry, no posts matched your criteria.