Nizamabad

News August 17, 2024

NZB: గుండారం మల్కాపూర్ శివారులో చిరుత కలకలం

image

నిజామాబాద్ రూరల్ మండలంలోని గుండారం-మల్కాపూర్ శివారులో మేకపై చిరుతపులి దాడి కలకలం సృష్టించింది. మల్కాపూర్ గ్రామ శివారులోనీ అటవీ ప్రాంతంలో మేకపై దాడి చేయడంతో మృతి చెందింది. ఘటనా స్థలంలో చిరుత పాదముద్రలు కనిపించాయని గ్రామస్థులు తెలిపారు. చిరుత దాడితో గ్రామస్థులు భయాందోళనకు గురవుతున్నారు. స్థానికులు సమాచారం ఇవ్వడంతో ఎఫ్ఆర్వో సంజీవ్ గౌడ్ ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు.

News August 17, 2024

బేషరతుగా వెంటనే రుణమాఫీ చేయాలి: వేముల

image

రైతు రుణమాఫీ ఆగస్టు 15లోపు పూర్తి చేస్తామని చెప్పి రైతులను ప్రభుత్వం మోసం చేసిందని మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ధ్వజమెత్తారు. రూ.2లక్షల రుణమాఫీ ఎవరికీ జరిగిందో చెప్పాలని వేముల ప్రభుత్వం పై విరుచుకపడ్డారు. ఎలాంటి కండిషన్స్ పెట్టకుండా రెండు లక్షల రుణమాఫీ చెయ్యాలని, వచ్చిన 8నెలలకే ప్రభుత్వం పై వ్యతిరేక పెరిగిందని అని వేముల ప్రశాంత్ రెడ్డి వేల్పూర్ X రోడ్ వద్ద జరిగినా ధర్నాలో విమర్శించారు.

News August 17, 2024

బోధన్ – కాచిగూడ రైలు పున: ప్రారంభం

image

బోధన్, కాచిగూడ ప్యాసింజర్ రైలును శుక్రవారం రాత్రి రైల్వే అధికారులు పున: ప్రారంభించారు. మూడు నెలల క్రితం ఈ రైలును రద్దు చేశారు. ఈ రైలు బోధన్ నుంచి కాచిగూడ, మహబూబ్‌గర్ మీదుగా గుంతకల్ వరకు నడుస్తుంది. బోధన్ రైల్వే స్టేషన్ నుంచి రోజు ఉదయం 5:30 గంటలకు బయలుదేరి కాచిగూడ స్టేషన్ మీదుగా 11 గంటలకు చేరుకుంటుంది. తిరిగి సాయంత్రం 4:30 గంటలకు కాచిగూడ నుంచి బయలుదేరి రాత్రి 11 గంటలకు బోధన్‌కు చేరుకుంటుంది.

News August 17, 2024

కామారెడ్డి: భయపెట్టిస్తున్న జ్వరాలు

image

కామారెడ్డి జిల్లాలో ప్లూ, విషజ్వారాలకు తోడు డెంగ్యూ చాపకింద నీరులా విస్తరిస్తోంది. జులై నుంచి ఇప్పటి వరకు జిల్లాలో 62 డెంగీ కేసులు నమోదయ్యాయి. పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలని ప్రభుత్వ యంత్రాంగం అవగాహన కల్పిస్తున్నా పూర్తిస్థాయిలో అమలు కావటం లేదు. జిల్లా ఆస్పత్రితో పాటు బాన్సువాడ, ఎల్లారెడ్డి ఆసుపత్రులకు రోగుల తాకిడి పెరిగింది. కామారెడ్డి, ఎల్లారెడ్డి, బాన్సువాడలో సైతం డెంగ్యూ పంజా విసురుతోంది.

News August 17, 2024

ఆర్మూర్: నేడు బంద్

image

బంగ్లాదేశ్‌లో హిందువులపై దాడులకు నిరసనగా బోధన్ పట్టణంలో నేడు బంద్ చేపట్టాలని హిందూ ఐక్య వేదిక పిలుపునిచ్చింది. అలాగే ఆర్మూర్ బంద్‌కు సర్వసమాజ్ పిలుపునిచ్చింది బాల్కొండ, ముప్కాల్, ఎడపల్లి, కామారెడ్డి జిల్లాలోని దోమకొండ, బిక్కనూర్ మండలంలో నేడు బంద్ చేపట్టనున్నారు. వ్యాపారులు దుకాణాలు మూసివేసి బంద్ కు సహకరించాలని కోరారు.

News August 17, 2024

KMR: భారీ వర్ష భీభత్సం, జలమయమైన రోడ్లు

image

కామారెడ్డి పట్టణంలో శుక్రవారం సాయంత్రం సుమారు గంటన్నర పాటు కురిసిన భారీ వర్షం బీభత్సం సృష్టించింది. పట్టణంలోని ప్రధాన రోడ్లన్నీ జలమయం అయ్యాయి. ఇళ్లలోకి నీరు వచ్చి చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ముఖ్యంగా నిజాంసాగర్ చౌరస్తా నుంచి జీవదాన్ వెళ్లే దారిలో లయోల స్కూల్ చౌరస్తా వద్ద విద్యానగర్ కాలనీ నుంచి వచ్చిన డ్రైనేజీ నీటితో రోడ్డు మొత్తం నిండిపోయి చెరువును తలపించింది.

News August 16, 2024

రేపు నిజామాబాద్ జిల్లాలో ప్రైవేటు ఆసుపత్రుల్లో సేవలు బంద్

image

నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ప్రైవేటు ఆసుపత్రులలో శనివారం ఉదయం 6 గంటల నుంచి ఆదివారం ఉదయం 6 గంటల వరకు సేవలను నిలిపివేస్తున్నామని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (IMA) నిజామాబాద్ జిల్లా శాఖ అధ్యక్ష, కార్యదర్శులు తెలిపారు. అత్యవసర సేవలు మాత్రమే కొనసాగించడం జరుగుతుందన్నారు. పశ్చిమ బెంగాల్‌లో పీజీ డాక్టర్‌ను హత్యాచారం చేసిన ఘటనకు నిరసనగా ఈ సేవలు నిలిపివేస్తున్నట్లు తెలిపారు.

News August 16, 2024

NZB: 8 మంది సీఐల బదిలీ ఉత్తర్వులు రద్దు

image

NZB కమిషనరేట్ పరిధిలోని ఇటీవల 8 మంది సీఐలను బదిలీ చేస్తూ జారీ చేసిన ఉత్తర్వులు రద్దయ్యాయి. ఐజీ ఆఫీస్ ఆదేశాలతో సీపీ కార్యాలయం అధికారులు విడుదల చేసిన కౌంటర్ డీవోను నిలిపివేశారు. బదిలీ అయిన సీఐలకు ఫోన్ చేసి ప్రస్తుత స్థానాల్లో యథావిధిగా కొనసాగాలని, రిలీవ్ కావొద్దని సూచించారు. కాగా సీఐల పోస్టింగుపై వివాదం ఏర్పడడం, రాజకీయ నేతల జోక్యం కారణంగా ఉత్తర్వులు రద్దయినట్లు డిపార్ట్మెంట్‌లో చర్చ జరుగుతోంది

News August 16, 2024

నిజాంసాగర్: కుంటలో జారిపడి యువకుడు మృతి

image

నిజాంసాగర్ మండలంలో విషాదం చోటుచేసుకుంది. ప్రమాదవశాత్తు నీటికుంటలో పడి యువకుడు మృతి చెందాడు. ఎస్ఐ సుధాకర్ తెలిపిన వివరాల ప్రకారం..అచ్చంపేట్ గ్రామానికి చెందిన బాబు (21) గ్రామ శివారులో గెదేలను మేపడానికి వెళ్లాడు. కాగా అక్కడే ఉన్న గంగసాని కుంటలో ప్రమాదవశాత్తు బాబు జారిపడి ఈతరాక మృతి చెందాడు. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై వివరించారు.

News August 16, 2024

బోధన్ – కాచిగూడ రైలు పునః ప్రారంభం

image

బోధన్- కాచిగూడ రైలు పునఃప్రారంభం కానుంది. శుక్రవారం రాత్రి నుంచి కాచిగూడ- బోధన్ ప్యాసింజర్ రైలు నడవనుంది. అదేవిధంగా శనివారం ఉదయం నుంచి బోధన్ కాచిగూడ రైలు పునః ప్రారంభంకానుంది. ఇకపై ఈ రైలు ఎలక్ట్రిక్ ఇంజన్‌తో నడవనుందని రైల్వే అధికారులు తెలిపారు. రైల్వే ప్రయాణికులు దీనిని సద్వినియోగం చేసుకోవాలని వారు సూచించారు.