Nizamabad

News August 15, 2024

కామారెడ్డి: ఇండియన్ పోలీస్ మెడల్ అందుకున్న నీలం రెడ్డి

image

కామారెడ్డి ఏఆర్ ఎస్ఐ జె.నీలంరెడ్డి ఇండియన్ పోలీస్ మెడల్ అవార్డును అందుకున్నారు. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా గురువారం గోల్కొండ కోటలో జరిగిన కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఇండియన్ పోలీస్ మెడల్ అవార్డును అందుకున్నారు. ఈ మేరకు కామారెడ్డి జిల్లా ఎస్పీ సింధు శర్మ, పోలీసు సిబ్బంది ఆయన్ను అభినందించారు.

News August 15, 2024

NZB: ట్రాఫిక్ ACP నారాయణకు పోలీస్ సేవా పతకం

image

నిజామాబాద్ ట్రాఫిక్ ACP నారాయణకు పోలీస్ సేవా పతకం లభించింది. 78వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా గురువారం పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లో నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్య అతిధి రాష్ట్ర ఖనిజాభివృద్ది సంస్థ ఛైర్మన్ ఈరవత్రి అనిల్ ACP నారాయణకు పోలీస్ సేవా పతకాన్ని బహూకరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.

News August 15, 2024

బాన్సువాడ: సబార్డినేట్‌తో బూట్లు మోయించిన అధికారి

image

78వ స్వాతంత్య్ర దినోత్సవం రోజు ఓ అధికారి తన సబార్డినేట్‌తో బూట్ల మోయించిన ఘటన గురువారం బాన్సువాడలో జరిగింది. తహశీల్దార్ కార్యాలయం ఆవరణలో నిర్వహించిన స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొన్న ఆర్డీఓ రమేశ్ రాథోడ్ బూట్లు వేసుకొని జెండా గద్దె వద్దకు వెళ్లాడు. ఆ తరువాత పొరపాటు తెలుసుకొని బూట్లు విడిచి అటెండర్‌తో పంపించారు. జెండా సాక్షిగా‌పై అధికారి బూట్లను అటెండర్ మోయించడంతో చర్చనీయాంశంగా మారింది.

News August 15, 2024

NZB: నేటి నుంచి హెల్మెట్ లేకపోతే బారి జరిమానాలు

image

ఉమ్మడి నిజమాబాద్ జిల్లాలో రోడ్డు ప్రమాదాలు నివారించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా నేటి నుండి ద్విచక్ర వాహనాదారులకు హెల్మెట్ ధరించి నడపడం తప్పనిసరి చేశారు. ఈ మేరకు సీపీ కాలేశ్వర్ రావు ఆదేశాలు జారీ చేశారు. నేటి నుండి హెల్మెట్ ధరించకపోతే అధికారులు భారీ జరిమానాలు వేయనున్నారు.

News August 15, 2024

కామారెడ్డి: స్వాతంత్ర్యం వచ్చి 78ఏళ్లు.. ఆ ఊరికి బస్సు లేదు

image

స్వాతంత్ర్యం వచ్చి 78ఏళ్లు అవుతున్నా ప్రజలకు సౌకర్యాలు అందించడంలో ప్రభుత్వాలు విఫలమవుతూనే ఉన్నాయి. పెద్దకొడపగల్ మండలం కాటేపల్లి తండాకి ఇప్పటికీ బస్సు సౌకర్యం లేదు. ఏళ్లు గడుస్తున్నా, ఎంత మందికి విన్నవించుకున్నా తమ గోడు వినట్లేదని తండా వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బాన్సువాడ డీఎం స్పందించి బస్సు సౌకర్యం కల్పించాలంటున్నారు. 

News August 15, 2024

నిజామాబాద్ జిల్లావ్యాప్తంగా బంద్ ప్రశాంతం

image

బంగ్లాదేశ్ హిందువులపై జరుగుతున్న దాడులను నిరసిస్తూ ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా బుధవారం బంద్ విజయవంతమైంది. నిజామాబాద్‌లో బైక్‌ర్యాలీని గాంధీచౌక్ నుంచి బస్టాండ్, ఎల్లమ్మగుట్ట చౌరస్తా, హైదరాబాద్ రోడ్డు మీదుగా కొనసాగింది. ఆర్మూర్ పట్టణంలో ఎంపీ అర్వింద్, ఎమ్మెల్యే రాకేశ్ రెడ్డి శివాజీ చౌక్ నుంచి కొవ్వొత్తుల ర్యాలీలో పాల్గొన్నారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.

News August 14, 2024

ఉమ్మడి NZB జిల్లాలో నేటి ముఖ్యాంశాలు

image

* పిట్లం: జేబులో పేలిన మొబైల్ ఫోన్ * KMR: వడ్డీ వ్యాపారి వేధింపులు భరించలేక మహిళ ఆత్మహత్యాయత్నం * బాన్సువాడ: రేషన్ డీలర్ల నియామక ప్రక్రియలో అవకతవకలు * నిజామాబాద్ తో పాటు పలు మండలాల్లో బంద్ సక్సెస్ * ఉమ్మడి నిజామాబాద్ జిల్లా రేపటి పంద్రాగస్టు వేడుకలకు సిద్ధం *KMR జిల్లాల్లోని కౌలాస్ ఖిల్లాపై రెండోసారి రెపరెపలాడనున్న జాతీయ జెండా * నిజామాబాద్ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో జూడాల సమ్మె

News August 14, 2024

నిజామాబాద్ కమిషనరేట్ పరిధిలో 8 మంది సీఐల బదిలీ

image

నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో 8 మంది సీఐలను బదిలీ చేస్తూ ఐజీ చంద్రశేఖర్ రెడ్డి బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు నిజామాబాద్ వన్ టౌన్ SHO విజయ్ బాబు బోధన్ రూరల్ సీఐగా బదిలీ కాగా ఆయన స్థానంలోకి వెయిటింగ్‌లో ఉన్న బి.రఘుపతిని బదిలీ చేశారు. నిజామాబాద్ టౌన్ సీఐ నరహరిని ఐజీ కార్యాలయంలో రిపోర్ట్ చేయాలని ఆదేశించారు. ఇక నిజామాబాద్ ట్రాఫిక్ సీఐ వెంకట్ నారాయణను బోధన్ SHOగా బదిలీ చేశారు.

News August 14, 2024

కామారెడ్డి: స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు కౌలాస్ ఖిల్లా సిద్ధం

image

కామారెడ్డి జిల్లాలోని శతాబ్దాల చరిత్ర కలిగిన కౌలాస్ ఖిల్లా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు ముస్తాబైంది. జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మి కాంతారావు ఈ కోటకు పునర్వైభవం తీసుకురావాలనే సంకల్పంతో చరిత్రలోనే మునుపెన్నడూ లేని విధంగా గణతంత్ర దినోత్సవం నాడు తొలిసారిగా కోటపై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఇక రేపు గురువారం పంద్రాగస్టు వేడుకలు కోటలో ఘనంగా జరగనున్నాయి. మరోసారి కోటపై మువ్వన్నెల జెండా రెపరెపలాడనుంది.

News August 14, 2024

జగిత్యాల జిల్లా కలెక్టర్‌ను కలిసిన ఎంపి అరవింద్

image

జగిత్యాల జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్‌ను బుధవారం నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా జగిత్యాల జిల్లాలోని పెద్దాపూర్ గురుకుల ఘటనలను, పలు పెండింగ్ సమస్యలపై కలెక్టర్‌తో చర్చించారు. అదేవిధంగా జర్నలిస్టుల ధర్నాను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి అర్హులైన జర్నలిస్టులకు ఇండ్ల పట్టాలు మంజూరయ్యేలా చొరవ చూపాలని కోరారు.