Nizamabad

News March 11, 2025

నిజామాబాద్: TGSP 17వ బెటాలియన్ కమాండెంట్ మృతి

image

రాజన్న సిరిసిల్ల జిల్లా TGSP 17వ బెటాలియన్ కమాండెంట్ టి.గంగారం(55) ప్రమాదవశాత్తు మృతి చెందారు. ఆయన స్వస్థలం కోటగిరి మండలం సిద్దులం. సోమవారం రాత్రి 11 గంటల ప్రాంతంలో సిరిసిల్లలోని ఓ భవనంలో ఆయన లిఫ్ట్ యాక్సిడెంట్‌కు గురై మృతి చెందారని బెటాలియన్ వర్గాలు తెలిపాయి. ఆయన మృతి పట్ల బెటాలియన్ అధికారులు, సిబ్బంది ప్రగాఢ సంతాపం తెలిపారు. కాగా మృతిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News March 11, 2025

నిజామాబాద్: ఉరేసుకొని వ్యక్తి ఆత్మహత్య

image

మెండోరా మండలం వెల్గటూర్‌కు చంద్రగిరి వెంకటేశ్(39) ఆర్థిక నష్టాలతో జీవితంపై విరక్తి చెంది ఇంట్లోనే ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడని ఎస్ఐ నారాయణ తెలిపారు. వెంకటేష్ ఉపాధి కోసం మూడు సార్లు దుబాయ్ వెళ్లొచ్చాడని చెప్పారు. వెల్గటూర్ కల్లు గీత కార్మికుడిగా పనిచేస్తున్నాడన్నారు. భార్య శ్రావణి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.

News March 11, 2025

NZB: కాంట్రాక్టర్లకు పంచుతున్న రేవంత్ సర్కార్: కవిత

image

కాంగ్రెస్ ప్రభుత్వం ఇబ్బడి ముబ్బడిగా అప్పులు చేసి బడా కాంట్రాక్టర్లకు దోచిపెడుతున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ధ్వజమెత్తారు. 15 నెలల పాలనలో రేవంత్ సర్కారు మనిషికి 2.5లక్షల అప్పులు చేసిందని ఆరోపించారు. కానీ పేద ప్రజలకు ఒక్క మంచి పని చేయలేదని, ఒక్క హామీని కూడా అమలు చేయలేదని, మరి ఈ డబ్బులన్నీ ఏమయ్యాయని ప్రశ్నించారు. అప్పులు, ఖర్చులపై రాష్ట్ర ప్రభుత్వం శ్వేత పత్రం విడుదల చేయాలన్నారు.

News March 11, 2025

NZB: 14 మంది సీఐల బదిలీ

image

మల్టీజోన్-1 పరిధిలో 14 మంది CIలను బదిలీ చేస్తూ ఐజీ చంద్రశేఖర్ రెడ్డి సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో CCS నిజామాబాద్‌కు ఐజీ కార్యాలయంలో వెయిటింగ్‌లో ఉన్న రవి కుమార్, NIB నిజామాబాద్‌కు PCR కామారెడ్డి నుంచి జి.వెంకటయ్యను బదిలీ చేశారు. కాగా బదిలీ అయిన 14 మంది సీఐల్లో అధిక శాతం మంది వెయిటింగ్‌లో ఉన్నవారే ఉన్నారు.

News March 11, 2025

NZB: నూతన సీపీ సాయి చైతన్య నేపథ్యమిదే

image

2016 బ్యాచ్‌కు చెందిన సాయి చైతన్య ఐఐటీ బెనారస్‌లో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్‌ను పూర్తి చేశారు. తెలంగాణ యాంటీ నార్కోటిక్ బ్యూరో ఎస్పీగా విధులు నిర్వహిస్తూ నిజామాబాద్ సీపీగా బదిలీ అయ్యారు. గతంలో కాటారం, ములుగు ఏఎస్పీగా, వరంగల్ కమిషనరేట్ లా అండ్ ఆర్డర్, ట్రాఫిక్ అదనపు డీసీపీగా, హైదరాబాద్ కమిషనరేట్ సౌత్ జోన్ డీసీపీగా పని చేశారు.

News March 10, 2025

NZB: కలెక్టర్‌ను కలిసిన నూతన సీపీ

image

నిజామాబాద్ నూతన పోలీస్ కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టిన పి.సాయి చైతన్య సోమవారం సాయంత్రం కలెక్టరేట్‌లో కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతును మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛాన్ని అందజేశారు. నూతన సీపీని కలెక్టర్ స్వాగతిస్తూ, అభినందనలు తెలిపారు. అనంతరం రాష్ట్ర సచివాలయం నుంచి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారితో కలిసి మంత్రులు నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్, సీపీ పాల్గొన్నారు.

News March 10, 2025

NZB: అక్రమార్కులపై ఉక్కుపాదం మోపుతాం: సీపీ

image

నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో అక్రమార్కులపై ఉక్కుపాదం మోపుతామని నూతన సీపీ సాయి చైతన్య స్పష్టం చేశారు. సోమవారం బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో ఇసుక అక్రమ రవాణా, గంజాయి, మట్కా నియంత్రణకు కఠినంగా వ్యవహరిస్తామన్నారు. శాంతి భద్రతల పరిరక్షణకు మొదటి ప్రాధాన్యత ఇస్తామని పేర్కొన్నారు.

News March 10, 2025

NZB: జిల్లా పంచాయతీ అధికారిగా శ్రీనివాస్ రావు బాధ్యతల స్వీకరణ

image

నిజామాబాద్ జిల్లా పంచాయతీ అధికారిగా డి.శ్రీనివాస్ రావు సోమవారం బాధ్యతలు స్వీకరించారు. కామారెడ్డి జిల్లా డీపీఓగా ఉన్న ఈయనను ప్రభుత్వం ఇటీవల నిజామాబాద్‌కు బదిలీ చేశారు. ఈ సందర్భంగా డీపీఓ కార్యాలయం సిబ్బంది కొత్త డీపీఓకు స్వాగతం పలికారు. అనంతరం శ్రీనివాస్ రావు జిల్లా కలెక్టర్‌ను మర్యాద పూర్వకంగా కలిశారు.

News March 10, 2025

NZB: సీపీగా బాధ్యతలు స్వీకరించిన సాయి చైతన్య

image

నిజామాబాద్ పోలీస్ కమిషనర్‌గా సాయి చైతన్య సోమవారం బాధ్యతలు స్వీకరించారు. యాంటీ నార్కోటిక్ బ్యూరో ఎస్పీగా విధులు నిర్వహిస్తున్న ఆయన్ను ఇటీవల నిజామాబాద్‌కు బదిలీ చేశారు. సోమవారం కమిషనర్ కార్యాలయంలో సీపీగా బాధ్యతలు స్వీకరించారు. గతంలో పని చేసిన కల్మేశ్వర్ హైదరాబాద్‌కు బదిలీ కాగా, కామారెడ్డి ఎస్పీ సింధుశర్మ ఇన్‌ఛార్జిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఐదు నెలల అనంతరం జిల్లాకు నూతన పోలీస్ బాస్ వచ్చారు.

News March 10, 2025

సిరికొండ: వడ్డీ వ్యాపారుల వేధింపులకు యువకుడి బలి

image

సిరికొండ మండలం ముషిరునగర్‌కు చెందిన మనోహర్ నిజామాబాద్‌లోని నాందేవ్‌వాడకు చెందిన జ్యోతి వద్ద ఆరు నెలల క్రితం రూ.40వేలు అప్పు తీసుకున్నారు. వడ్డీతో కలిపి రూ.80వేలు చెల్లించాలని మనోహర్‌పై కొద్దికాలంగా జ్యోతి మనుషులు బెదిరింపులకు పాల్పడ్డారు. రెండు రోజుల క్రితం అతని వద్ద ఉన్న మొబైల్ ఫోన్ తీసుకెళ్ళారు. తీవ్ర మనస్తాపానికి గురైన మనోహర్ పురుగుమందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులు కేసు నమోదు చేశారు.