India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఇందిరమ్మ ఇళ్ల సర్వే ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా నిర్వహించాలని అదనపు కలెక్టర్ (రెవెన్యూ) వి.విక్టర్ అన్నారు. బుధవారం రామారెడ్డి మండల కేంద్రంలో ఇందిరమ్మ ఇళ్ల సర్వే తీరును ఆయన పరిశీలించారు.లబ్ధిదారుల భూముల వివరాలను పరిశీలించాలని తెలిపారు. అనంతరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకం అమలు తీరును ఆయన పరిశీలించారు.
నిజామాబాద్లోని పలు ప్రాంతాల్లో గుర్తు తెలియని వ్యక్తులు పెట్టిన ఫ్లెక్సీలు చర్చనీయాంశంగా మారాయి. ‘జిల్లాలో పర్యాటక రంగంపై రెడ్ టేపిజం అని, కొంతమంది అధికారుల చేతుల్లో చిక్కిన పర్యాటకరంగం.. త్వరలో అన్ని అధారాలతో మీ ముందుకు’ అని పలు చౌరస్తాల్లో ఫ్లెక్సీలు వెలిశాయి. కాగా ప్రస్తుతం పట్టణంలో ఇవి ఎవరు పెట్టారు? కారణమేంటని పెద్దఎత్తున చర్చ జరుగుతోంది.
జక్రాన్పల్లిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందిన విషయం తెలిసిందే. కాగా మృతి చెందిన వారు నిజామాబాద్కు చెందిన కస్తూరి ప్రమోద్, అంకడి సంజయ్ గా గుర్తించినట్లు ఎస్ఐ తిరుపతి తెలిపారు. ఈ ఇద్దరు జక్రాన్ పల్లి నుంచి నిజామాబాద్ వైపు బైకుపై వెళ్తుండగా సికింద్రాపూర్ 44 జాతీయ రహదారిపై ఆగి ఉన్న లారీని ఢీకొట్టారని వెల్లడించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టినట్లు ఎస్సై పేర్కొన్నారు.
గ్రూప్-2 పరీక్ష పక్కడ్బందీగా నిర్వహించాలని, ఎలాంటి సమస్యలు రాకుండా చూడాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అధికారులను ఆదేశించారు. కామారెడ్డి కలెక్టరేట్ సమావేశ మందిరంలో అధికారులతో మంగళవారం సమావేశం నిర్వహించారు. ఈ నెల 15,16 తేదీల్లో నిర్వహించనున్న గ్రూప్-2 పరీక్ష నిర్వహణపై కలెక్టర్ అధికారులతో సమీక్షించారు. జిల్లాలో 19 కేంద్రాల్లో 8,085 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరుకానున్నట్ల ఆయన తెలిపారు.
ఉపాధ్యాయులకు పెండింగ్ బిల్లులను వెంటనే విడుదల చేయాలని టీపీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు అనిల్ కుమార్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కామారెడ్డిలో టీపీటీఎఫ్ జిల్లా కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉపాధ్యాయులకు దాదాపుగా 9 నెలలుగా పెండింగ్ లో ఉన్న బిల్లులను వెంటనే మంజూరు చేయాలని కోరారు. 2024 మార్చి నుంచి ఉద్యోగ విరమణ చెందిన ఉపాధ్యాయులకు బెనిఫిట్స్ ఇవ్వాలన్నారు.
నిజామాబాద్ జిల్లాలో మొత్తం 545 గ్రామ పంచాయతీలు, 5022 వార్డులు ఉండగా రాష్ట్ర ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలను అనుసరిస్తూ 5053 పోలింగ్ కేంద్రాలను గుర్తిస్తూ ముసాయిదా జాబితాను రూపొందించామని జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ అంకిత్ తెలిపారు. ఇప్పటికే ఈ నెల 7 వ తేదీన జిల్లాలోని అన్ని మండలాలు, గ్రామ పంచాయతీలలో ముసాయిదా జాబితాను ప్రకటించామని వివరించారు
నిజామాబాద్ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి భవనం పైనుంచి దూకి ఓ వ్యక్తి మంగళవారం ఆత్మహత్య చేసుకున్నాడు. నాగరం ప్రాంతానికి చెందిన చాట్ల లక్ష్మణ్ (50) అనారోగ్య సమస్యతో 4 రోజుల క్రితం ఆస్పత్రిలో చేరాడు. ఈ క్రమంలో ఇవాళ ఉదయం ఆసుపత్రి భవనం పైఅంతస్తు నుంచి దూకడంతో తీవ్రగాయాల పాలై అక్కడికక్కడే మృతిచెందినట్లు డాక్టర్లు తెలిపారు. ఈ మేరకు 1 టౌన్ SHO రఘుపతి ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఎల్లారెడ్డి మండలం తిమ్మాపూర్ గ్రామ శివారులో చిరుత దాడిలో దూడమృతి చెందినట్లు బాధితుడు సత్యనారాయణ తెలిపారు. గ్రామానికి చెందిన సత్యనారాయణ గెదేలతో పాటు దూడను వ్యవసాయ బావి వద్ద ఉంచి ఇంటికి వెళ్లాడు. తిరిగి బావి వద్దకు వద్దకు వచ్చి చూడగా దూడ మృతి చెందినట్లు గుర్తించారు. చిరుత దాడిలో గేదె మృతి చెందిందని సత్యనారాయణ ఆయన ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించారు. వారు పంచనామ నిర్వహించారు.
సోనియా గాంధీ జన్మదినం రోజున తెలంగాణ తల్లి ఉత్సవాలు ప్రతి సంవత్సరం జరపాలి అనేది బిజెపి తీవ్రంగా ఖండిస్తుందని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ అన్నారు. తెలంగాణ తల్లి ఉత్సవాలు జరపాలన్న ప్రతిపాదన పై ఇవాళ అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఆయన మాట్లాడారు.. సోనియా జన్మదిననా తెలంగాణ తల్లి ఉత్సవాలు జరిపితే తెలంగాణ రాష్ట్రం కోసం అసువులు బాసిన అమరవీరుల ఆత్మలు గోషిస్తాయని చెప్పుకొచ్చారు.
యువజన కాంగ్రెస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షునిగా ఎన్నికైన విపుల్ గౌడ్ ఆదివారం ఉమ్మడి జిల్లాకు చెందిన కాంగ్రెస్ పెద్దలను మర్యాదపూర్వకంగా కలిశారు. మాజీ మంత్రి, బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీని కలిసి వారిని సన్మానించారు. ఎన్నికల్లో గెలిచిన విపుల్ గౌడ్ను వారు అభినందించారు.
Sorry, no posts matched your criteria.