India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ విద్యా సంస్థలకు ఇంకో రెండు రోజుల పాటు సెలవులు పొడగించాలని ఆల్ ఇండియా స్టూడెంట్స్ బ్లాక్ (AISB) ఉమ్మడి NZB జిల్లా అధ్యక్షులు బైరాపూర్ రవీందర్ గౌడ్ రాష్ట్ర ప్రభుత్వన్ని కోరారు. వాతావరణ శాఖ సూచనల మేరకు రానున్న మూడు రోజుల పాటు భారీ నుంచి అతిభారీ వర్షాలు పడే అవకాశాలు ఉన్నందున విద్యార్థుల భవిష్యత్తు దృష్టిలో ఉంచుకొని సెలవులు ఇవ్వాలని కోరారు.
వర్షాలు తగ్గుముఖం పట్టిన వెంటనే అధికారులు ఆస్తి, పంట నష్టంపై నివేదిక అందజేసి, నష్టపరిహారంపై ప్రభుత్వానికి నివేదికలు అందజేయాలని నిజామాబాద్ MPఅరవింద్ ధర్మపురి జిల్లా కలెక్టర్ ను కోరారు. నష్టపరిహారంపై తాను కూడా ముఖ్యమంత్రి కి లేఖ రాస్తానని, విపత్తు నిర్వహణపై హోం శాఖకి సైతం నివేదిస్తానన్నారు. కాగా వరద బాధితులను సమీపంలోని పునరావాస కేంద్రాలకు తరలించి, కనీస సౌకర్యాలు అందించాలన్నారు.
రానున్న 48 గంటల వరకు భారీ వర్షాలు పడనున్న నేపథ్యంలో జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండవలెను, అనవసరంగా ఎవరు బయటకు రాకూడదని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య గురువారం హెచ్చరించారు. విద్యుత్ తీగల వద్దకు ఎవరు వెళ్ళకూడదని, ఎలాంటి అపోహలను నమ్మవద్దని ఆయన సూచించారు. ప్రజల భద్రతా దృష్ట్యా 24 X 7 పోలీస్ అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు.
కురుస్తున్న వర్షాలతో శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి గురువారం ఉదయం 11 గంటలకు ఎగువ నుండి ఇన్ ఫ్లోగా 2 లక్షల క్యూసెక్కుల నీరు వస్తుండగా 2,76,567 క్యూసెక్కులు దిగువకు వదులుతున్నారు. ఇందులో 39 గేట్ల ద్వారా 2.50 లక్షల క్యూసెక్కులు,
ఇందిరమ్మ కాల్వకు 17300, మిషన్ భగీరథకు 231, సరస్వతీ కెనాల్ కు 400 క్యూసెక్కుల నీటిని వదులుతున్నామని ప్రాజెక్టు అధికారులు తెలిపారు.
భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, కళాశాలలు, రెసిడెన్షియల్ విద్యా సంస్థలకు గురువారం సెలవు ప్రకటిస్తున్నట్లు కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి తెలిపారు. జిల్లాలోని అన్ని విద్యా సంస్థలు విధిగా సెలవు పాటించాలని సూచించారు. వర్షాల వల్ల విద్యార్థులకు ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు ఈ చర్యలు చేపట్టమన్నారు.
కురుస్తున్న వర్షాలతో SRSPకి వరద నీరు పోటెత్తడంతో బుధవారం రాత్రి 8 గంటలకు మొత్తం 39 వరద గేట్లను అధికారులు ఓపెన్ చేశారు. ఉదయం 10 గంటలకు 8 గేట్లు, మధ్యాహ్నం 12 గంటలకు మరో 9 గేట్లు ఓపెన్ చేసిన సంగతి తెలిసిందే. కాగా 39 గేట్లు, ఇతర కాలువల ద్వారా మొత్తం 1,71,048 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు.
వర్షాల వల్ల జిల్లాలో నెలకొని ఉన్న పరిస్థితులను నిజామాబాద్ కలెక్టర్ వినయ్ కృష్ణా రెడ్డి బుధవారం సాయంత్రం కంట్రోల్ రూమ్ ద్వారా సమీక్షించారు. కలెక్టరేట్లో ఉన్న కంట్రోల్ రూమ్ను కలెక్టర్ సందర్శించారు. వరద ప్రభావిత ప్రాంతాల నుంచి ఏమైనా ఇబ్బందులు ఏర్పడినట్లు సమాచరం అందిన వెంటనే అధికారులను అప్రమత్తం చేయాలని కంట్రోల్ రూమ్ సిబ్బందికి సూచించారు. జిల్లాలో పరిస్థితి పూర్తిగా అదుపులోనే ఉందన్నారు.
భారీ వర్షాలు కురుస్తున్నందున శ్రీరాంసాగర్ పరీవాహక ప్రాంతం, నదులు, వాగులు, జలాశయాల పరిసర ప్రాంతాల్లోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి సూచించారు. భారీ వర్షాలతో రాకపోకలకు ఇబ్బందులు తలెత్తి, ప్రమాదాల బారిన పడే అవకాశం ఉందని, అవసరం అయితే తప్ప ప్రయాణాలు చేయవద్దన్నారు. చేపలవేట, ఈత సరదా కోసం చెరువులు, కాలువలు, కుంటలు, ఇతర జలాశయాల వద్దకు వెళ్లవద్దన్నారు.
SRSPకి వరద నీరు పోటెత్తడంతో మొత్తం 25 వరద గేట్లను అధికారులు ఓపెన్ చేశారు. బుధవారం ఉదయం 10 గంటలకు 8 గేట్లు ఓపెన్ చేసిన అధికారులు మధ్యాహ్నం 12 గంటలకు మరో 9 గేట్లు ఓపెన్ చేసిన సంగతి తెలిసిందే. 25 గేట్ల ద్వారా లక్ష క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. ప్రాజెక్టుకు ఎగువ నుంచి ఇన్ ఫ్లోగా 50 వేల క్యూసెక్కుల నీరు వస్తుండగా వివిధ మార్గాల ద్వారా 1,30,392 క్యూసెక్కుల నీరు వదులుతున్నారు.
SRSPకి వరద నీరు పోటెత్తుడడంతో మొత్తం 17 వరద గేట్లను అధికారులు ఓపెన్ చేశారు. బుధవారం ఉదయం 10 గంటలకు 8 గేట్లు ఎత్తగా ఇన్ ఫ్లో పెరగడంతో మధ్యాహ్నం 12 గంటలకు మరో 9 గేట్లు ఓపెన్ చేసి మొత్తం 17 గేట్ల ద్వారా 51,578 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. ప్రాజెక్టుకు ఎగువ నుంచి ఇన్ ఫ్లోగా 50 వేల క్యూసెక్కుల నీరు వస్తుండగా వివిధ మార్గాల ద్వారా 82,105 క్యూసెక్కుల నీరు వదులుతున్నారు.
Sorry, no posts matched your criteria.