Nizamabad

News April 24, 2025

బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ అరెస్ట్

image

బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్‌ను పంజాగుట్ట పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. ప్రగతి భవన్ ఎదుట గతంలో ఆయన కుమరుడు యాక్సిడెంట్ చేయగా.. పోలీసులు అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరిచారు. అనారోగ్య కారణాలతో షకీల్‌కు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఈ కేసులో కుమారుడుని తప్పించి, మరొకరిని లొంగిపోయేలా చేశాడు. షకీల్‌కు సహకరించిన పోలీసులపై వేటుపడగా, కొడుకుతో కలిసి దుబాయ్‌కి వెళ్ళాడు. ఇటీవల తిరిగి వచ్చాడు.

News April 24, 2025

NZB: భూ సమస్యల పరిష్కారానికి నూతన చట్టం: కలెక్టర్

image

భూభారతి చట్టం ద్వారా రైతుల, ప్రజల సమస్యలు తీరుతాయని కలెక్టర్ తెలిపారు. రైతులకు, ప్రజలకు చేకూరే ప్రయోజనాలు, చట్టంలో పొందుపర్చిన కీలక అంశాల గురించి భీంగల్‌లో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అవగాహన కల్పించారు. ధరణి రికార్డులను భూభారతిలో నమోదు చేస్తామని వెల్లడించారు. ఎవరికైనా భూముల రికార్డుల విషయంలో తప్పులు ఉంటే, ఈ చట్టం అమలులోకి వచ్చిన ఏడాది కాలంలోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

News April 24, 2025

నిజామాబాద్: ఈతకెళ్తున్నారా.. జర భద్రం !

image

స్కూళ్లకు ప్రభుత్వం సెలవులు ప్రకటించింది. ఎండకాలంలో సేద తీరేందుకు పిల్లలు, పెద్దలు కలిసి ఈతకు వెళ్తుంటారు. బావులు, చెరువులు, నీటి ట్యాంకులు, కుంటల వద్ద ఈత కొడుతూ ఎంజాయ్‌ చేస్తారు. అయితే ఈత సరదా మాటున ప్రమాదం జరిగే అవకాశం ఉందని, తల్లిదండ్రులు తమ పిల్లలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని NZB అధికారులు సూచించారు. సోషల్ మీడియాకు దూరంగా ఉంటూ ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకునేలా తల్లిందడ్రులు చూడాలన్నారు.

News April 24, 2025

భగ్గుమంటున్న నిజామాబాద్.. జర జాగ్రత్త

image

ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఎండలు దంచికొడుతున్నాయి. రాష్ట్రంలోనే నిన్న అత్యధికంగా నిజామాబాద్ జిల్లాలో 44.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. కామారెడ్డి జిల్లాలో ఉష్ణోగ్రత 44 డిగ్రీలు దాటింది. జుక్కల్, డోంగ్లి మండలాల్లో 43.6 డిగ్రీలు, బిచ్కుంద మండలంలో 44.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. మరో రెండు రోజుల పాటు వడగాల్పులు ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది.

News April 24, 2025

బోధన్: భూ సమస్యల పరిష్కారానికే భూభారతి చట్టం: కలెక్టర్

image

బోధన్ పట్టణంలోని లయన్స్ క్లబ్ మీటింగ్ హల్‌లో బుధవారం భూ భారతిపై అవగాహన సదస్సును ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు మాట్లాడుతూ.. భూ సమస్యల పరిష్కారానికే ప్రభుత్వం భూ భారతి చట్టం తీసుకువచ్చిందని పేర్కొన్నారు. భూ భారతి చట్టం ద్వారా రైతులకు, ప్రజలకు మెరుగైన సేవలు అందుతాయన్నారు. భూ భారతి సేవల గురించి ప్రొజెక్టర్ ద్వారా వివరించారు.

News April 23, 2025

కామారెడ్డి: ఇంటర్ ఫెయిల్.. విద్యార్థిని ఆత్మహత్య

image

ఇంటర్ పరీక్షల్లో ఫెయిల్ కావడంతో భిక్కనూర్‌కి చెందిన పూజ (18) సూసైడ్ చేసుకుంది. ఇవాళ తెల్లవారుజామున ఒంటిపై పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకుంది. పూజకు తల్లిదండ్రులు లేకపోవడంతో నానమ్మ వద్దే ఉంటూ చదువుకుంటోంది. పూజ మృతితో భిక్కనూర్‌లో విషాదఛాయలు అలుముకున్నాయి.

News April 23, 2025

NZB: ఇంటర్ రిజల్ట్స్.. విద్యార్థి అదృశ్యం

image

సాలూర మండలం హున్సా గ్రామానికి చెందిన కలసాయి కృష్ణ మంగళవారం మధ్యాహ్నం నుంచికనబడడం లేదని కుటుంబీకులు ఆందోళనకు గురవుతున్నారు. ఇటీవలే ఇంటర్ ద్వితీయ సంవత్సరం పరీక్ష రాసిన సాయికృష్ణ నిన్న ఫలితాలు వెలుబడినప్పటి నుంచి కనబడకపోవడంతో గ్రామంలో, బంధువుల వద్ద వెతికారు. ఆచూకీ లభించకపోవడంతో భయాందోళన గురవుతున్నారు. నేడు పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్లు సమాచారం.

News April 23, 2025

NZB: ప్రభుత్వ కళాశాలల్లో ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థినులు

image

ప్రభుత్వ జూనియర్ కళాశాలలలో విద్యార్థినులు అత్యధిక మార్కులు సాధించారని నిజామాబాద్ జిల్లా ఇంటర్ విద్యా అధికారి రవికుమార్ తెలిపారు. నిజామాబాద్ ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో ఎంపీసీలో బి.జ్యోతిర్మయి 956, బైపీసీలో మలిహ ఆర్ఫీన్ 974, బైపీసీ ఉర్దూ మీడియంలో 963 మార్కులు, ఒకేషనల్ ఎస్. పూజ 974 మార్కులు సాధించారని చెప్పారు.

News April 23, 2025

NZB: బీసీ గురుకుల జూనియర్ కాలేజీల్లో ప్రవేశాలు

image

బీసీ గురుకుల జూనియర్ కాలేజీల్లో మొదటి సంవత్సరం ప్రవేశాలకు నోటిఫికేషన్ వెలువడింది. వచ్చే నెల 12వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరిస్తామన్నారు. పదో తరగతిలో వచ్చిన మార్కుల ఆధారంగా సీట్ల కేటాయింపు ఉంటుంది. రాష్ట్రవ్యాప్తంగా 130 కాలేజీలు బాలురకు 127 కాలేజీలు బాలికలకు ఉన్నాయి. మరిన్ని వివరాలకు https://mjpabcwreis.cgg.gov.in/ TSMJBCWEB/లేదా 040-23328266 నంబర్‌ను సంప్రదించగలరు.

News April 23, 2025

NZB: తల్లికి క్యాన్సర్.. కొడుకు ఆత్మహత్య

image

తల్లి క్యాన్సర్‌తో బాధపడుతూ ఉండటంతో మనస్తాపం చెందిన కొడుకు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన డిచ్‌పల్లిలో మంగళవారం వెలుగు చూసింది. ఎస్ఐ షరీఫ్ తెలిపిన వివరాల ప్రకారం.. కమలాపూర్ గ్రామానికి చెందిన కర్రినోల్ల భూలక్ష్మి కొన్ని సంవత్సరాలుగా కాన్సర్‌తో పడపడుతుంది. ఇది జీర్ణించుకోలేక కొడుకు రంజిత్(28) ఈ నెల 21న పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందినట్లు పోలీసులు వివరించారు.