India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
కామారెడ్డి జిల్లాలో మరో హత్య జరిగింది. సదాశివనగర్ మండలం లింగంపల్లి గ్రామ శివారులో నిజామాబాద్ జిల్లా ధర్మారం(బి) గ్రామానికి చెందిన పిట్ల కృష్ణని తలపై కొట్టి గుర్తుతెలియని దుండగులు హత్యచేశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు.
కామారెడ్డి జిల్లాలో దారుణ ఘటన జరిగింది. నస్రుల్లాబాద్ మండలంలో కొడుకు హన్మాండ్లు తండ్రి సాయిబోయి(55) ని కర్రతో కొట్టి హత్య చేశాడు. మద్యం మత్తులో చంపినట్లు సమాచారం. స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఈఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
ఎల్లారెడ్డి మండలం రత్నపూర్ గ్రామ శివారులో పేకాట ఆడుతున్నట్లు కచ్చితమైన సమాచారం రావడంతో గురువారం రాత్రి దాడి చేసి పేకాట ఆడుతున్న ఏడుగురిని పట్టుకొని అరెస్టు చేసినట్లు ఎస్ఐ మహేశ్ తెలిపారు. ఏడుగురు వద్ద నుంచి రూ.5,000 నగదు స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. కేసు, దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ మహేశ్ వివరించారు.
కామారెడ్డి జిల్లా పోలీస్ కార్యాలయములో జాతీయ ఐక్యతా దినోత్సవాన్ని గురువారం ఘనంగా నిర్వహించారు. ఎస్పీ సింధూ శర్మ సర్ధార్ వల్లబాయ్ పటేల్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. పోలీస్ అధికారులు, సిబ్బందితో దేశంలో ఐక్యమత్యాన్ని, దేశ సమగ్రత కాపాడతామని అడిషనల్ ఎస్పీ కె.నరసింహారెడ్డి ప్రతిజ్ఞ చేయించారు.
బోధన్ నుంచి శంషాబాద్ ఎయిర్ పోర్టుకు నవంబర్ 4వ తేదీ నుంచి ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సు నడపనున్నట్లు డీఎం శ్రీనివాస్ తెలిపారు. ప్రతి రోజూ సాయంత్రం 5:30 గంటలకు బస్సు బోధన్ నుంచి బయల్దేరుతుందని, వర్ని, బాన్సువాడ, మెదక్, నర్సాపూర్, జేబీఎస్ మీదుగా శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకుంటుందన్నారు. బోధన్ నుంచి ఎయిర్ పోర్టుకు ఒక్కొక్కరికి రూ.590 చార్జీ ఉంటుందని తెలిపారు.
కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలం లింగంపల్లి గ్రామ శివారులో పండగ నాడు ఘోరం జరిగింది. పోలీసుల వివరాల ప్రకారం.. బుధవారం రాత్రి గుర్తుతెలియని వ్యక్తిని హత్య చేశారని ఎస్ఐ చెప్పారు. ఈ వ్యక్తికి ఎడమ చేయి లేదని పేర్కొన్నారు. వివరాలకు సదాశివ నగర్ పోలీసులను సంప్రదించాలని తెలిపారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
బాలికపై అత్యాచారం చేసిన నిందితుడికి జీవితఖైదు విధించారు. బోయిన్పల్లి CI, SI వివరాల ప్రకారం.. నిజామాబాద్ జిల్లా డిచ్పల్లికి చెందిన సాయిలు సికింద్రాబాద్లోని ఓ ఫంక్షన్హల్లో ఎలక్ట్రీషియన్గా పనిచేస్తున్నాడు. అక్కడ హౌస్కింపింగ్ చేసే వ్యక్తి కూతురిపై 2019లో సాయిలు పలుసార్లు అత్యాచారం చేశాడు. 2020లో బాలిక గర్భందాల్చడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో నాంపల్లి కోర్టు జీవిత ఖైదు విధించింది.
నిజామాబాద్ జిల్లా పొతంగల్ మండలంలోని జల్లాపల్లి ఫారం గ్రామంలో పేకాట స్థావరంపై దాడి చేసినట్లు ఎస్ఐ సందీప్ తెలిపారు. పేకాట కేంద్రంలో ఐదుగురు పేకాట రాయుళ్లను అరెస్ట్ చేశామన్నారు. వారి వద్ద నుంచి రూ.7,350 నగదును స్వాధీనం చేసుకున్నామన్నారు. పేకాట ఆడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. గ్రామాల్లో పేకాట ఆడితే సమాచారం అందించాలని ఎస్ఐ కోరారు.
ఎల్లారెడ్డి నియోజకవర్గానికి నాలుగువేల డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు మంజూరు చేయాలని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్మోహన్రావు కోరారు. ఆయన ఈ విషయంలో రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగిలేటి శ్రీనివాసరెడ్డికి అధికారికంగా లేఖ రాశారు. రాష్ట్రంలో అత్యధిక వెనుకబడిన నియోజకవర్గం ఎల్లారెడ్డి అని ఆయన తెలిపారు. ఇల్లు లేని నిరుపేదలు ఎంతోమంది ఉన్నారని ఆయన లేఖలో పేర్కొన్నారు.
బదిలీ అయ్యి పాఠశాలలో విద్యార్థులకు పరిచయం కాకముందే ఉపాధ్యాయుడిని విధి కాటేసింది. ఈఘటన నాగిరెడ్డిపేట మండలం మాసానిపల్లిలో జరిగింది. గ్రామానికి చెందిన వరిగే నర్సింలు కుమారుడు యాదగిరికి రెండు ఉద్యోగాలు రాగా, లింగంపేట్ బాలుర ఉన్నత పాఠశాలలో గణిత ఉపాధ్యాయునిగా విధుల్లో చేరాడు. రోడ్డు ప్రమాదంలో తలకు తీవ్ర గాయాలయ్యాయి. మంగళవారం హైదరాబాద్ అపోలో ఆసుపత్రిలో చికిత్సపొందుతూ మృతి చెందాడు.
Sorry, no posts matched your criteria.