Nizamabad

News July 6, 2024

పారిస్ ఒలంపిక్స్‌కి అర్హత సాధించిన నిఖత్ జరీన్

image

నిజామాబాద్ జిల్లాకు చెందిన బాక్సర్ నిఖత్ జరీన్ ఈ నెల 26న ప్రారంభమయ్యే పారిస్ ఒలింపిక్స్ క్రీడల్లో ప్రాతినిధ్యం వహించనుంది. బాక్సింగ్‌లో 50 కేజీల విభాగంలో ఆమె చోటు దక్కించుకొంది. కాగా జిల్లా నుంచి ఒలింపిక్స్‌లో చోటుసాధించిన మొదటి క్రీడాకారిణిగా నిఖత్ చరిత్ర సృష్టించారు. నిఖత్ 2023 ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో స్వర్ణం సాధించింది.

News July 6, 2024

NZB:7న జిల్లా స్థాయి రెజ్లింగ్ క్రీడాకారుల ఎంపికలు

image

నిజామాబాద్ జిల్లా మ్యాట్ రెజ్లింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈనెల 7న జిల్లా స్థాయి ఎంపికలు నిర్వహించనున్నట్లు అసోసియేషన్ సెక్రెటరీ దేవేందర్ తెలిపారు. ఈ ఎంపికలు జిల్లా కేంద్రంలోని డీఎస్ఏ స్విమ్మింగ్ పూల్ ప్రాంగణంలో గల రెజ్లింగ్ హాల్లో ఉదయం 10 గంటలకు ప్రారంభమవుతాయన్నారు. పురుషులకు ఫ్రీ స్టైల్ విభాగంలో, గ్రీకో రోమన్ విభాగంలో, అదేవిధంగా మహిళలకు ఫ్రీ స్టైల్ లో కేటాయించిన కేటగిరీలలో ఎంపికలు ఉంటాయన్నారు.

News July 5, 2024

పిట్లం: UPDATE.. చిన్న గొడవ.. చెరువులో దూకి ఆత్మహత్య

image

పిట్లంలోని మారేడ్ చెరువులో పడి మహిళ మృతి చెందిన విషయం తెలిసిందే. SI నీరేష్ వివరాలిలా.. పిట్లం వాసి చిలుక అంజవ్వకు (41) ఇవాళ తన అత్త మానేవ్వతో గొడవ జరిగింది. ఈ క్రమంలో మనస్తాపానికి గురైనా అంజవ్వ క్షణికావేశంలో చెరువులో దూకి ఆత్మహత్యకు పాల్పడింది. మృతురాలి తల్లి బాలవ్వ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.

News July 5, 2024

నిజామాబాద్ జిల్లాలో వానల్లేవ్

image

వర్షకాలం ప్రారంభమై నెల రోజులవుతున్నా ఉమ్మడి జిల్లాలో వర్షాలు సరిగ్గా లేవని రైతులు ఆందోళన చెందుతున్నారు. బోర్లలో నీళ్లు పెద్దగా రావట్లేదని ఈసీజన్లో 5.20లక్షల ఎకరాల్లో పంటలు సాగు కానున్నట్లు వ్యవసాయశాఖ అంచనా వేసింది. వరి 3,13,965 ఎకరాలు, సోయా 85,444ఎకరాలు, మక్క 57,315ఎకరాలు, పత్తి 28,730ఎకరాలు, కంది 13,961ఎకరాలు, పెసర 4,997ఎకరాలు, మినుము 5,263ఎకరాల్లో పండిస్తున్నారు. ఇప్పటికి 40శాతం పంటలు సాగయ్యాయి.

News July 5, 2024

పిట్లం: చెరువులో మృతదేహం.. అసలేం జరిగింది..?

image

చెరువులో పడి ఓ మహిళ మృతి చెందింది. ఈ ఘటన పిట్లంలో శుక్రవారం జరిగింది. పిట్లం గ్రామానికి చెందిన చిలుక అంజవ్వ(38) గ్రామంలోని మారేడ్ చెరువు వైపు వెళ్తుండగా.. ఆమెను చూసిన కొందరు.. కుటుంబీకులకు సమాచారం ఇచ్చారు. ఈ లోగా వారు వచ్చి చూసేసరికి ఆమె చెరువులో పడి ఉంది. ఆమెను ఒడ్డుకు చేర్చగా అప్పటికే మృతి చెందింది. ప్రమాదవశాత్తు ఆమె కాలు జారి పడిందా.. ఆత్మహత్య చేసుకుందా తెలియాల్సి వుంది.

News July 5, 2024

యూకే ఎన్నికల్లో నిజామాబాదీ ఓటమి

image

UKలో జరిగిన ఎన్నికల్లో నిజామాబాద్ జిల్లాకు చెందిన చంద్ర కన్నెగంటి ఓటమిపాలయ్యారు. ఈయన కన్జర్వేటివ్ పార్టీ తరఫున స్టోక్ ఆన్ ట్రెంట్ సెంట్రల్ స్థానం నుంచి పోటీ చేశారు. ఫలితాల్లో చంద్రకు 6221 ఓట్లు మాత్రమే రావటంతో మూడో స్థానానికి పరిమితమయ్యారు. కోటగిరికి చెందిన చంద్ర చదువు పూర్తి చేసిన తర్వాత లండన్ వెళ్లి స్థిరపడ్డారు. జనరల్ ప్రాక్టిషనర్‌గా సేవలందిస్తూనే రాజకీయాల్లోకి అడుగుపెట్టారు.

News July 5, 2024

NZB: ఉరేసుకుని కండక్టర్ ఆత్మహత్య

image

అనారోగ్యం కారణంగా ఆర్టీసీ కండక్టర్ ఆత్మహత్య చేసుకున్న ఘటన నిజామాబాద్‌లో జరిగింది. జిల్లాలోని మాక్లూర్ మండలం కల్లెడ గ్రామానికి చెందిన ఈరవత్రి శ్రీనివాస్ (36) కండక్టర్‌గా పని చేస్తూ నిజామాబాద్ నాందేవ్ వాడాలో అద్దెకు ఉంటున్నాడు. కిడ్నీ నొప్పి భరించలేక గురువారం రాత్రి రూంలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికులు కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News July 5, 2024

కల్వరాల్ శివారులో ఎలుగుబంటి సంచారం

image

సదాశివనగర్ మండలంలోని కల్వరాల్ శివారులో ఎలుగుబంటి సంచరిస్తున్నట్లు స్థానిక రైతులు గురువారం తెలిపారు. దీంతో ప్రధానంగా రైతులు భయబ్రాంతులకు గురయ్యారు. ప్రస్తుతం వ్యవసాయ పంటలు వేసే సమయంలో ఎలుగుబంటి రావడంతో రైతులు భయాందోళన చెందుతున్నారు. అటవీ శాఖ అధికారులు ఎలుగుబంటిని పట్టుకుని ఇతర ప్రాంతానికి తరలించాలని రైతులు కోరుతున్నారు.

News July 5, 2024

NZB: విద్యుత్ షాక్‌తో వ్యక్తి మృతి

image

విద్యుత్ షాక్‌తో ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన ఇందల్‌వాయి మండలం గౌరారంలో గురువారం జరిగింది. పోలీసుల వివరాలు.. ట్రాన్స్‌ఫార్మర్లు, విద్యుత్ లైన్లు మరమ్మతులు చేస్తూ జీవించే పరమేశ్వర్ వ్యవసాయ పొలంలో పని చేస్తుండగా 11 కేవీ వైరు తగిలి మృతి చెందాడు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నట్లు వెల్లడించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై మనోజ్ తెలిపారు.

News July 5, 2024

KMR: ఆరు నెలల్లో 4106 కేసులు నమోదు

image

పోలీసులు నిత్యం వాహనాలు తనిఖీ చేస్తూ.. డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు చేస్తున్నా వాహన చోదకుల్లో మాత్రం మార్పు రావడం లేదు. కామారెడ్డి జిల్లాలో ఆరు నెలల వ్యవధిలో 4106 కేసులు నమోదయ్యాయి. వీరిలో 58 మందికి జైలు శిక్షలు విధించారు. కేసులు నమోదైన వారందరికీ జరిమానాలు విధించారు. ఇందుకు ప్రధాన కారణం ఎక్కడ పడితే అక్కడ ఇష్టారీతిన అక్రమంగా మద్యం అమ్మకాలు జరగడమే. వీటిని కట్టడి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.