Nizamabad

News October 12, 2024

NZB: ప్రారంభమైన దసరా సందడి..

image

ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా శనివారం ఉదయం నుంచే దసరా సందడి నెలకొంది. పూలు, పండ్లు, గుమ్మడికాయలు దుకాణాలు కొనుగోలుదారులతో కిటకిటలాడాయి. పలు దుకాణా దారులు స్పెషల్ ఆఫర్లు, స్పాట్ గిఫ్ట్‌లను సైతం అందిస్తున్నారు. ఆయుధ పూజ సందర్భంగా వాహనాలు, తమకు జీవనాధారమైన వ్యాపార కేంద్రాలకు పూలు అలంకరించుకొనేందుకు ముందస్తు ఏర్పాట్లు చేసుకున్నారు.

News October 12, 2024

NZB: ఫోటోగ్రఫీ, షార్ట్ ఫిలిం పోటీలకు ఆహ్వానం: సీపీ కల్మేశ్వర్

image

నిజామాబాద్ కమిషనరేట్ పరిధిలోని విద్యార్థులకు యువతకు ఔత్సాహిక ఫోటోగ్రాఫర్లకు ఫోటోగ్రఫీ, షార్ట్ ఫిలిం పోటీలకు ఆహ్వానిస్తున్నామని పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్ అన్నారు. పోలీసుల జ్ఞాపకార్థం అక్టోబర్ 21న జరిగే పోలీస్ ఫ్లాగ్ డే సందర్భంగా పోలీస్ రిలేటెడ్ అంశం మీద ఫోటోగ్రఫీ, షార్ట్ ఫిలిం తీయడానికి ఆసక్తిగల వారు ముందుకు రావాలని సీపీ కల్మేశ్వర్ తెలిపారు.

News October 12, 2024

NZB: దసరా సందడి.. మార్కెట్లన్నీ కిటకిట..

image

ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా శుక్రవారం దసరా సందడి నెలకొంది. షాపింగ్‌మాల్‌లు, పూలు, పండ్లు, గుమ్మడికాయలు దుకాణాలు కొనుగోలుదారులతో కిటకిటలాడాయి. పలు దుకాణా దారులు స్పెషల్ ఆఫర్లు, స్పాట్ గిఫ్ట్ లను సైతం అందిస్తున్నారు. ఆయుధ పూజ సందర్భంగా వాహనాలు, తమకు జీవనాధారమైన వ్యాపార కేంద్రాలకు పూలు అలంకరించుకొనేందుకు ముందస్తు ఏర్పాట్లు చేసుకున్నారు.

News October 11, 2024

కామారెడ్డి: సహా చట్టాన్ని ప్రజలు ఉపయోగించుకోవాలి: DSP

image

సహా చట్టాన్ని ప్రజలు ఉపయోగించుకోవాలని కామారెడ్డి DSP నాగేశ్వరరావు తెలిపారు. స్థానిక కర్షక్ B.Ed. కళాశాలలో సహా చట్టం 19వ వార్షిక వారోత్సవాలలో ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ చట్టం ద్వారా ప్రజలు వారికి కావాల్సిన డాక్యుమెంట్స్, FIR, ఛార్జ్ షీట్ సమాచారాన్ని సంబంధిత పోలీస్ స్టేషన్ల నుంచి తీసుకోవచ్చన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర డైరెక్టర్ MA సలీంను అభినందించారు. అనంతరం కేక్ కోసి కార్యక్రమాలకు ముగింపు పలికారు.

News October 11, 2024

నిజామాబాద్ జిల్లా ప్రజలకు విజయదశమి శుభాకాంక్షలు: కలెక్టర్

image

విజయ దశమి వేడుకను పురస్కరించుకుని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు జిల్లా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. చెడుపై మంచి సాధించిన విజయానికి సంకేతంగా చేసుకునే విజయదశమి వేడుకను ఇంటిల్లిపాది ఆనందోత్సాహాలతో చేసుకోవాలని ఆకాంక్షించారు. దసరా పండుగ అందరి జీవితాల్లో విజయాలు సమకూర్చాలని, చేపట్టిన ప్రతీ కార్యం సఫలీకృతం కావాలని మనసారా కోరుకుంటున్నట్లు తెలిపారు. అమ్మవారి అనుగ్రహం ఎల్లవేళలా ఉండాలని ఆకాంక్షించారు.

News October 11, 2024

కామారెడ్డి: లింగ నిర్దారణ టెస్టులు చేస్తున్న ముఠా అరెస్ట్

image

లింగ నిర్దారణ టెస్టులు చేస్తున్న ముఠాను అరెస్ట్ చేసినట్లు కామారెడ్డి SP సింధు శర్మ శుక్రవారం తెలిపారు. రాజంపేట్ వాసి రవీందర్ తన ఇంటి వద్ద అక్రమంగా లింగ నిర్దారణ పరీక్షలు చేస్తున్నాడని సమాచారం అందడంతో పోలీసులు సోదాలు నిర్వహించారన్నారు. 14 మందిని నేరస్థులుగా గుర్తించారు. 5 గురిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించామన్నారు. మరో 9 మందిని త్వరలో పట్టుకొని అరెస్ట్ చేస్తామని SP తెలిపారు.

News October 11, 2024

NZB: సర్పంచ్ ఎన్నికలు.. గ్రామాల్లో సందడి

image

నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో సర్పంచ్ ఎన్నికల సందడి మొదలైంది.ఇప్పటికే అధికారులు ఓటర్ జాబితా పనిలో నిమగ్నమవగా పోటీ చేయాలనుకునేవారు ముందస్తుగా ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. ఇప్పటికే తాము ఎన్నికల్లో గెలవాలంటే ఎలాంటి మేనిఫెస్టో రెడీ చేయాలనే దానిపై వ్యూహాలు రచిస్తున్నారు. ఇందుకు ప్రత్యేక చర్చలు కూడా జరుపుతున్నట్లు సమాచారం. ఇక మరికొందరు తమ గ్రామంలో ఓటర్ల వివరాలు తెలుసుకునే పనిలో నిమగ్నమయ్యారు.

News October 11, 2024

కామారెడ్డి: ఈ ఊళ్లో సద్దుల బతుకమ్మ ప్రత్యేకం

image

కామారెడ్డి పట్టణంలోని లింగాపూర్‌లో సద్దుల బతుకమ్మ రోజు కుటుంబ సభ్యుల్లోని మగవారు సాంప్రదాయ వస్త్రాలు ధరించి పెద్ద బతుకమ్మలను ఎత్తుకుంటారు. ఏటా ఇలాగే ప్రత్యేకంగా బతుకమ్మ సంబరాలు జరుపుకొంటారు. కేవలం మహిళలకే పరిమితం కాకుండా మగవారు కూడా బతుకమ్మ ఉత్సవాలు ముగిసే వరకు సమయం కేటాయిస్తారు.

News October 10, 2024

కామారెడ్డి : లింగాకృతిలో బతుకమ్మ

image

లింగాకృతిలో బతుకమ్మను మహిళలు తయారు చేశారు. ఆ బతుకమ్మ చూపరులను ఆకట్టుకుంటుంది. కామారెడ్డి మున్సిపాలిటీలోని 12 వార్డు విద్యుత్‌నగర్ కాలనీ, దేవుపల్లికి చెందిన అంగన్వాడీ ఉపాధ్యాయురాలు వైద్య ఉమారాణి థర్మాకోల్ ఉపయోగించి శివలింగాకృతిలో పూలతో బతుకమ్మ తయారుచేసి తన కళా నైపుణ్యాన్ని ప్రదర్శించారు. ప్రకృతిపరంగా, ఆధ్యాత్మికపరంగా ఈ బతుకమ్మ ఎంతో శోభను కలిగిస్తుందని ఆమె పేర్కొన్నారు.

News October 10, 2024

కామారెడ్డి: అక్క ఆత్మహత్యాయత్నం.. బాధతో చెల్లి సూసైడ్

image

కామారెడ్డి జిల్లాలో బుధవారం విషాద ఘటన జరిగింది. వివరాలు.. సదాశివనగర్ మండలం అడ్లూర్ ఎల్లారెడ్డికి చెందిన మమతకు మోషంపూర్ వాసితో పెళ్లైంది. వారిమధ్య మనస్పర్థలు రాగా పుట్టింటికి వచ్చింది. ఈ క్రమంలో జీవితంపై విరక్తిచెంది ఈ నెల 7న ఆత్మహత్యాయత్నం చేసింది. బాధతో ఆమె చెల్లి ప్రత్యూష సైతం ఆత్మహత్యాయత్నం చేసుకుంది. ఆసుపత్రికి తరలించగా.. చికిత్సపొందుతూ ప్రత్యూష చనిపోయింది. గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.