Nizamabad

News July 2, 2024

NZB: ప్రజావాణి కార్యక్రమంలో 130 ఫిర్యాదులు

image

నిజామాబాద్ కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో 130 ఫిర్యాదులు అందాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు తమ సమస్యలను ఫిర్యాదుల రూపంలో అందజేశారు. కాగా అర్జీలను పెండింగ్‌లో పెట్టకుండా ఎప్పటికప్పుడు పరిశీలించి వెంటనే పరిష్కరించాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

News July 1, 2024

బిక్కనూర్‌లో బాలిక ఆత్మహత్య

image

బాలిక ఆత్మహత్య చేసుకున్న ఘటన బిక్కనూర్‌లో చోటుచేసుకుంది. పెద్దమల్లారెడ్డి గ్రామంలో శ్రీధర్ రెడ్డి అనే వ్యక్తి వద్ద పని చేస్తున్న పశ్చిమగోదావరి జిల్లా చింతలపూడికి చెందిన హరిబాబు కుమార్తె సాయి(15) సోమవారం ఆత్మహత్య చేసుకున్నట్లు SI సాయికుమార్ తెలిపారు. మతిస్తిమితం బాగా లేక గ్రామ శివారులోని మామిడి తోటలో ఉరేసుకున్నట్లు వెల్లడించారు. బాలిక తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు.

News July 1, 2024

NZB: బస్సు ఢీ కొని యువకుడి మృతి

image

బస్సు ఢీకొని వ్యక్తి మృతి చెందిన ఘటన మోస్తా మండలంలో చోటుచేసుకుంది. సోమవారం బైక్‌పై నిజామాబాద్ వెళ్తున్న సాయికిరణ్‌ను గోపూర్ శివారు వద్ద ఎదురుగా వస్తున్న బస్సు ఢీకొంది. దీంతో తీవ్రంగా గాయపడిన అతడిని స్థానికులు అంబులెన్సు‌లో ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందినట్లు వర్ని పోలీసులు తెలిపారు.

News July 1, 2024

నిజామాబాద్ నుంచి ఒకరికి మంత్రి పదవి: దామోదర రాజనర్సింహ

image

నిజామాబాద్ జిల్లా నుంచి ఒకరికి మంత్రి వర్గంలో చోటు దక్కే అవకాశం ఉందని మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. త్వరలోనే తెలంగాణ మంత్రివర్గ విస్తరణ ఉంటుందని మీడియాతో నిర్వహించిన చిట్‌చాట్‌లో ఆయన పేర్కొన్నారు. పలువురి మంత్రుల శాఖలు మార్చే అవకాశం ఉందని, మంత్రి సీతక్కకు హోం శాఖ మంత్రి ఇచ్చే అవకాశం ఉందన్నారు.

News July 1, 2024

NZB: ముసురుతో రైతుల్లో మురిపెం..

image

నిజామాబాద్ జిల్లాలో ఈ వానాకాలం మొదటిసారి ముసురు ముంచెత్తింది. ఆదివారం సాయంత్రం మొదలైన వర్షం కొనసాగుతూనే ఉంది. జిల్లా అంతటా రుతు పవనాలు విస్తరించడంతో పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. సోమవారం కూడా వర్ష ప్రభావం ఉంటుందని వాతావరణ శాఖ సూచిస్తోంది. నెల రోజులుగా వానలు ఇలా వచ్చి అలా వెళ్లాయి. కానీ, ఇప్పుడు ముసురుకోవడంతో రైతులు మురిసిపోతున్నారు.

News July 1, 2024

NZB: మురుగు కాలువలలో పడి యువకుడి మృతి

image

నిజామాబాద్ నగరంలోని రెండో టౌన్ పరిధిలో గుర్తు తెలియని యువకుడు మురుగు కాలువలో పడి మృతి చెందాడు. సోమవారం తెల్లవారుజామున కాలువలో మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు డయల్ 100కు ఫోన్ చేసి సమాచారం అందించారు. రెండో పోలీస్ స్టేషన్ ఎస్సై రామ్ అక్కడికి చేరుకొని విచారణ చేపట్టారు. మృతుడి వివరాలు తెలియాల్సి ఉంది.

News July 1, 2024

NZB: కుటుంబ కలహాలతో వ్యక్తి సూసైడ్

image

భార్యాభర్తల మధ్య గొడవలు రావడంతో కలత చెంది ఓ వ్యక్తి ఉరివేసుకుని మృతి చెందారు. ఎస్సై యాదగిరి గౌడ్ తెలిపిన వివరాలు.. సిద్ధాపూర్ గ్రామానికి చెందిన సుద్ధపల్లి చంద్రన్న(47) వ్యక్తి కొంతకాలంగా నవీపేట మండలం జన్నేపల్లిలో కుటుంబ సభ్యులతో కలిసి నివాసం ఉంటున్నారు. కుటుంబ కలహాల కారణంగా జీవితంపై విరక్తి చెంది ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు చెప్పారు. కేసు, దర్యాప్తు చేస్తున్నామని వెల్లడించారు.

News July 1, 2024

కామారెడ్డి: టమాట రైతు ‘పంట’ పండింది

image

కామారెడ్డి జిల్లా సదాశివనగర్ ​మండలం కుప్రియాల్​లో టమాట రైతు పంట పడింది. గ్రామానికి చెందిన స్వరూప భూంరెడ్డి దంపతులు ఎకరం భూమిలో రెండు నెలల మల్చింగ్​పద్ధతిలో టమాట సాగు చేశారు. ప్రతి రోజు టమాటలను తెంపి 30కి పైగా బాక్సుల్లో కామారెడ్డి, HYDకు తరలిస్తున్నామని, ప్రస్తుతం కిలో టమాటా రూ.70 నుంచి రూ. 100 వరకు పలకడంతో.. రూ. 10 లక్షల లాభం ఉందని సదరు రైతు తెలిపారు.

News July 1, 2024

NZB: నేటి నుంచే కొత్త నేర చట్టాల అమలు

image

నేరాల సంఖ్య తగ్గించి బాధితులకు సత్వర న్యాయం జరిగేందుకు కొత్త నేర చట్టాలను జిల్లాలో నేటి నుంచి పోలీస్‌శాఖ అమలు చేయనుంది. అందుకోసం పోలీసు శాఖలో విధులు నిర్వహిస్తున్న 1040 మందికి కొత్త చట్టాలపై శిక్షణ ఇచ్చారు. మారిన కొత్త చట్టాల గురించి బాధితులకు వివరించడానికి జిల్లా లీగల్ అథారిటీ ఆధ్వర్యంలో అవగాహన సదస్సులను ఏర్పాటు చేయనుంది.

News July 1, 2024

కామారెడ్డి: చట్టాలపై అవగాహన కలిగి ఉండాలి: సివిల్ జడ్జ్

image

రైతులు న్యాయ చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని కామారెడ్డి సివిల్ జడ్జ్ సుధాకర్ చెప్పారు. మండల కేంద్రంలో న్యాయ సేవా సమితి ఆధ్వర్యంలో రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రైతులు నకిలీ విత్తనాలు కొనుగోలు చేసి మోసపోయినప్పుడు న్యాయపరంగా పొందే హక్కుల గురించి ఆయన వివరించారు. ప్రతి ఒక్కరూ నాణ్యమైన విత్తనాలు కొనుగోలు చేయాలని సూచించారు.