Nizamabad

News January 24, 2025

NZB: లారీ ఢీకొని ద్విచక్ర వాహనదారుడు మృతి

image

నిజామాబాద్ ఆర్సపల్లి బైపాస్ రోడ్డులో లారీ ఢీకొని ఓ రైతు మృతి చెందినట్లు ఆరో టౌన్ ఎస్సై వెంకట్రావు గురువారం తెలిపారు. ఆర్సపల్లికి చెందిన తరికంటి యాదయ్య(78) అర్సపల్లి శివారులోని తన వ్యవసాయ భూమిలో పని ముగించుకుని బైక్‌పై ఇంటికి వెళ్తుండగా రైల్వే గేటు మూల మలుపు వద్ద లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో యాదయ్య అక్కడికక్కడే మృతి చెందాడు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

News January 24, 2025

NZB: గంజాయితో ఒకరి అరెస్ట్

image

నిజామాబాద్ ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ పోలీసులు గురువారం ఒకరిని గంజాయితో అరెస్ట్ చేసినట్లు ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ పి.స్వప్న తెలిపారు. నగరంలో తనిఖీలు నిర్వహిస్తుండగా జునైద్ అనే ఓ యువకుడు 0.7 కిలోల గంజాయితో పట్టుబడ్డాడన్నారు. ఈ మేరకు నిందితుడిని అరెస్ట్ చేసినట్లు స్వప్న వివరించారు. ఈ తనిఖీల్లో ఎస్సై బి.రాం కుమార్, హెడ్ కానిస్టేబుళ్లు రాజన్న, భూమన్న, కానిస్టేబుళ్లు భోజన్న, సుకన్య పాల్గొన్నారన్నారు.

News January 24, 2025

ఆర్మూర్: ఆదిలాబాద్ నుంచి గంజాయి తెచ్చి విక్రయాలు

image

అదిలాబాద్ జిల్లా ఇచ్చోడ నుంచి గంజాయిని కొనుగోలు చేసి ఆర్మూర్ చుట్టుపక్కల చిన్న చిన్న ప్యాకెట్లలో విక్రయిస్తున్న ఇద్దరిని గురువారం సాయంత్రం అరెస్ట్ చేసినట్లు ఆర్మూర్ ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ సిఐ K. స్టీవెన్సన్ తెలిపారు. తొర్లికొండకు చెందిన నూనె కిరణ్, అంకాపూర్ లో ఉంటున్న నూనె శ్రీకాంత్ లు అక్రమంగా గంజాయిని విక్రయాల కోసం బైక్ పై రవాణా చేస్తూ అంకాపూర్ వద్ద పట్టుబడ్డారని CIవివరించారు.

News January 24, 2025

ఆర్మూర్: ఆదిలాబాద్ నుంచి గంజాయి తెచ్చి విక్రయాలు

image

అదిలాబాద్ జిల్లా ఇచ్చోడ నుంచి గంజాయిని కొనుగోలు చేసి ఆర్మూర్ చుట్టుపక్కల చిన్న చిన్న ప్యాకెట్లలో విక్రయిస్తున్న ఇద్దరిని గురువారం సాయంత్రం అరెస్ట్ చేసినట్లు ఆర్మూర్ ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ సిఐ K. స్టీవెన్సన్ తెలిపారు. తొర్లికొండకు చెందిన నూనె కిరణ్, అంకాపూర్ లో ఉంటున్న నూనె శ్రీకాంత్ లు అక్రమంగా గంజాయిని విక్రయాల కోసం బైక్ పై రవాణా చేస్తూ అంకాపూర్ వద్ద పట్టుబడ్డారని CIవివరించారు.

News January 24, 2025

NZB: గంజాయితో ఒకరిని అరెస్ట్

image

నిజామాబాద్ ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ పోలీసులు గురువారం ఒకరిని గంజాయితో అరెస్ట్ చేసినట్లు ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ పి.స్వప్న తెలిపారు. నగరంలో తనిఖీలు నిర్వహిస్తుండగా జునైద్ అనే ఓ యువకుడు 0.7 కిలోల గంజాయితో పట్టుబడ్డాడన్నారు. ఈ మేరకు నిందితుడిని అరెస్ట్ చేసినట్లు స్వప్న వివరించారు. ఈ తనిఖీల్లో ఎస్సై బి.రాం కుమార్, హెడ్ కానిస్టేబుళ్లు రాజన్న, భూమన్న, కానిస్టేబుళ్లు భోజన్న, సుకన్య పాల్గొన్నారన్నారు.

News January 24, 2025

NZB: పీయూష్ గోయల్‌ను కలిసిన ఎంపీ అర్వింద్

image

కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్‌ను ఢిల్లీలోని ఆయన కార్యాలయంలో నిజామాబాద్ ఎంపీ అర్వింద్ ధర్మపురి, జాతీయ పసుపు బోర్డు ఛైర్మన్ పల్లె గంగారెడ్డి గురువారం మర్యాద పూర్వకంగా కలిశారు. పసుపు ఎగుమతులు, మార్కెటింగ్ తదితర అంశాలపై వారు చర్చించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ త్వరగా పసుపు బోర్డు కార్యక్రమాలను మొదలుపెడతామని స్పష్టం చేశారు.

News January 24, 2025

NZB: రైలులో పోగొట్టుకున్న బ్యాగు అప్పగింత

image

రైలులో ఓ వ్యక్తి పోగొట్టుకున్న బ్యాగును నిజామాబాద్ రైల్వే ఎస్ఐ సాయి రెడ్డి బాధితుడికి అప్పగించారు. గురువారం తిరుపతి నుంచి వచ్చిన రాయలసీమ రైలులో ఓ వ్యక్తి వ్యక్తికి బ్యాగు పోగొట్టుకున్నాడు. దానిలో రూ.16 వేల నగదు, మూడు గ్రాముల బంగారం, ఒక జత బట్టలు ఉన్నాయి. ఇది చూసిన పోలీసులు విచారణ చేపట్టి బ్యాగును గురువారం యజమానికి అప్పగించారు. నిజాయితీని చాటుకున్న పోలీసులకు సదరు వ్యక్తి కృతజ్ఞతలు తెలిపారు.

News January 24, 2025

NZB: లారీ ఢీకొని ద్విచక్ర వాహనదారుడు మృతి

image

నిజామాబాద్ ఆర్సపల్లి బైపాస్ రోడ్డులో లారీ ఢీకొని ఓ రైతు మృతి చెందినట్లు ఆరో టౌన్ ఎస్సై వెంకట్రావు గురువారం తెలిపారు. ఆర్సపల్లికి చెందిన తరికంటి యాదయ్య(78) అర్సపల్లి శివారులోని తన వ్యవసాయ భూమిలో పని ముగించుకుని బైక్‌పై ఇంటికి వెళ్తుండగా రైల్వే గేటు ముల మలుపు వద్ద లారీ ఢీకోట్టంది. ఈ ప్రమాదంలో యాదయ్య అక్కడికక్కడే మృతి చెందాడు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

News January 24, 2025

NZB: నాణ్యత ప్రమాణాలు విస్మరిస్తే చర్యలు: విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ

image

సంక్షేమ వసతి గృహాల్లో విద్యార్థులకు అందించే భోజనంలో నాణ్యత ప్రమాణాలు విస్మరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ యోగితా రాణా హెచ్చరించారు. గురువారం ధర్మారంలోని సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాల, పాఠశాలను ఆమె ఆకస్మికంగా తనిఖీ చేసి మాట్లాడారు. డీఐఈవో రవికుమార్, ప్రభుత్వ జూనియర్ కళాశాలల ప్రిన్సిపల్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు చిన్నయ్య తదితరులు పాల్గొన్నారు.

News January 23, 2025

నిజామాబాద్: బడారాంమందిర్ గోశాలలో అగ్నిప్రమాదం

image

నిజామాబాద్ గాజుల్పేట్ బడా రాంమందిర్ గోశాలలో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. గురువారం మధ్యాహ్నం ఆలయం పక్కనే ఆవుల కోసం నిల్వ ఉంచిన గడ్డికి అకస్మాత్తుగా మంటలు అంటుకున్నాయి. క్షణాల్లోనే గడ్డివాము పూర్తిగా దగ్ధమైంది. కాలనీవాసులు వెంటనే స్పందించి మంటలు ఆర్పే ప్రయత్నం చేశారు. అనంతరం అగ్నిమాపక కేంద్రానికి సమాచారం అందించగా వారు స్పందించి మంటలను ఆర్పివేశారు.