Nizamabad

News June 19, 2024

జక్రాన్ పల్లి: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

image

నిజామాబాద్ జిల్లాలోని బ్రాహ్మణపల్లిలో రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతిచెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జక్రాన్ పల్లి మండలం బ్రాహ్మణపల్లి బ్రిడ్జి NH 44 రోడ్డుపై ఆదిలాబాద్ పట్టణానికి చెందిన బాలాజీని గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో అతను అక్కడికక్కడే మరణించాడని పేర్కొన్నారు. మృతుని భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామన్నారు.

News June 19, 2024

నిజామాబాద్: చెప్పేదొకటి.. చేసేదొకటి!

image

జిల్లాలో చాలా ఆసుపత్రులు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నాయి. ఖలీల్‌వాడిలో ఓ ప్రైవేట్ ఆసుపత్రి ఆర్థో పేరిట రిజిస్ట్రేషన్ అయింది. అక్కడ జనరల్ ఫిజిషియన్, జనరల్ సర్జన్, స్త్రీ వైద్య నిపుణులు సేవలందిస్తున్నారు. ద్వారకానగర్‌లో ఒక జనరల్ ఫిజిషియన్‌గా అనుమతి తీసుకుని సర్జన్లు సైతం నిర్వహిస్తున్నట్లు వెలుగులోకి వచ్చింది. ఇప్పటివరకూ 394 ఆసుపత్రులు అనుమతులు పొందగా.. 122 అనుమతులు లేకుండా కొనసాగుతున్నాయి.

News June 19, 2024

నిజామాబాద్: సెంచరీ కొట్టిన టమాట

image

టమాట ధర ఆకాశాన్నంటుతోంది. నిజామాబాద్ జిల్లాలో పదిరోజుల క్రితం రూ.40 ఉన్న ధర ఒక్కసారిగా ఎగబాకింది. నిన్న మొన్నటి వరకు రూ.80 ఉండగా నేడు రూ.100కు చేరింది. కిలో కొనుగోలు చేసే వినియోగదారులు పావుకిలోతో తృప్తి పడుతున్నారు. టమాట కొందామన్నా మార్కెట్‌లో దొరకడం లేదు. 20 కిలోల పెట్టెధర రూ.వేయి పలుకుతోంది. అంతంత మాత్రం సాగు.. అకాలవర్షాలు రేటు పెరుగుదలకు కారణంగా తెలుస్తోంది.

News June 19, 2024

NZB: పేకాట స్థావరంపై పోలీసుల దాడి

image

నిజామాబాద్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు పేకాట స్థావరంపై దాడి జరిపారు. హైమద్ పురా కాలనీలో ఓ ఇంట్లో పేకాట ఆడుతున్నారనే సమాచారంతో టాస్క్‌ఫోర్స్ సీఐ అంజయ్య, సిబ్బంది లక్ష్మన్న, రాములు, గజేందర్, అనిల్ కుమార్, సుధాకర్ ఆధ్వర్యంలో మంగళవారం తనిఖీలు జరిపారు. ఆరుగురు జూదరులను అదుపులోకి తీసుకుని రూ.7,460 నగదు సీజ్ చేశారు. ఒకటో టౌన్ పోలీసులకు అప్పగించగా కేసు నమోదు చేశారు.

News June 18, 2024

కామారెడ్డి: ఇంట్లో గొడవ.. అడ్డొచ్చిన పక్కింటి మహిళ హత్య

image

కామారెడ్డి మండలం తిమ్మక్‌‌పల్లి గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. కుటుంబ కలహాలతో శేఖర్ అనే వ్యక్తి తన తల్లిదండ్రులతో గొడవపడ్డాడు. గొడవను అడ్డుకోవడానికి ఇంటి పక్కన గల నారాయణ, లక్ష్మి, రాజు అనే వ్యక్తులు వెళ్లారు. గొడవని అడ్డుకునేందుంకు‌ ప్రయత్నించిన లక్ష్మి అనే మహిళ తలపై శేఖర్ కోపంతో ఇటుకతో దాడి చేశారు. తలకి తీవ్రంగా తలగడంతో లక్ష్మి మృతి చెందింది. ఈ మేరకు పోలీసులు కేసును నమోదు చేసుకున్నారు.

News June 18, 2024

నిజామాబాద్ జిల్లాకు ఎల్లో అలర్ట్

image

నిజామాబాద్ జిల్లాకు వాతావరణ శాఖ ఎల్లో అలెర్ట్‌ను జారీ చేసింది. రాగల ఐదు రోజుల పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఉరుములు, మెరుపులు, గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశాలుంటాయని వాతావరణ విభాగం తెలిపింది. ఈ నెల 22 వరకు పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వివరించింది.

News June 18, 2024

పోచారం శ్రీనివాస్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీలో చేర్చుకొవద్దు: వహీద్ హుస్సేన్

image

బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవద్దని జిల్లా మైనార్టీ సెల్ కార్యదర్శి వహీద్ హుస్సేన్ కోరారు. మండల కేంద్రంలో ఆయన మాట్లాడుతూ.. రాజకీయ లబ్ధి కోసం పార్టీలు మారే వ్యక్తుల పట్ల పార్టీ అధిష్టానం సీరియస్‌గా ఉండాలని చెప్పారు. ఉన్నత పదవులు అనుభవించే ప్రస్తుతం లేకపోవడంతో కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు పోచారం శ్రీనివాస్ రెడ్డి ప్రయత్నాలు చేస్తున్నారని తెలిపారు.

News June 18, 2024

NZB: సివిల్స్ ఉచిత కోచింగ్.. దరఖాస్తుల ఆహ్వానం

image

HYD SC స్టడీ సర్కిల్ అధ్వర్యంలో నిర్వహించే సివిల్స్ ఉచిత కోచింగ్ కోసం SC, ST, BC విద్యార్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు NZB జిల్లా SC అభివృద్ధి అధికారి శశికళ తెలిపారు. అభ్యర్థులను రాత పరీక్ష ద్వారా ఎంపిక చేయనున్నట్లు పేర్కొన్నారు. డిగ్రీ పాసై వార్షిక ఆదాయం రూ.3లక్షలకు కంటే తక్కువ ఉన్నవారు అర్హులన్నారు. జులై 10 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని జులై 21న రాత పరీక్ష ఉంటుందని పేర్కొన్నారు.

News June 18, 2024

KMR: గతంలో కుతూరిపై అత్యాచారం.. ఇప్పుడు ఆమె తండ్రిపై దాడి

image

కామారెడ్డి జిల్లాలో సోమవారం రాత్రి గుర్తు తెలియని దుండగులు నాగయ్య అనే వ్యక్తి <<13460682>>గొంతు కొసి<<>>న విషయం తెలిసిందే. గతంలో దివ్యాంగురాలైన నాగయ్య కుమార్తెపై ఇద్దరు యువకులు అత్యాచారం చేసినట్లు స్థానికులు తెలిపారు. కాగా జైలులో శిక్ష అనుభవించిన యువకులు ఇటీవల బెయిల్‌పై బయటకు వచ్చారు. నిన్న రాత్రి నాగయ్యపై కత్తితో దాడి చేసి గొంతు కోసి పరారైనట్లు వెల్లడించారు. ప్రస్తుతం అతడి పరిస్థితి విషమంగా ఉంది.

News June 18, 2024

నిజామాబాద్ ప్రజలకు CP సూచనలు

image

NZB జిల్లా ప్రజలకు CP కల్మేశ్వర్ పలు సూచనలు చేశారు. A సర్టిఫికెట్ సినిమాలకు థియేటర్‌లోకి బాలలను అనుమతించకూడదన్నారు.. జిల్లాలో ఊరేగింపులు, బహిరంగ ప్రదేశాల్లో, కళ్యాణ మండపాల్లో డీజేలు నిషేధమని పేర్కొన్నారు. బహిరంగ సభలకు ACP వద్ద లేదా CP వద్ద, విగ్రహాలు ఏర్పాటు చేసేందుకు స్టాచ్యూ కమిటీ సిఫార్సు తప్పనిసరన్నారు. గల్ఫ్ ఏజెంట్లకు ఇళ్లు అద్దెకు ఇచ్చే ముందు పోలీస్ స్టేషన్‌లో ఎంక్వయిరీ చేయాలని సూచించారు.