India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
వ్యక్తిపై గుర్తు తెలియని దుండగులు దాడి చేసి గొంతు కోసిన ఘటన నాగిరెడ్డిపేటలో చోటుచేసుకుంది. మండలంలోని రాఘవపల్లికి చెందిన నాగయ్య(55) సోమవారం రాత్రి కాలకృత్యాలు తీర్చుకొని వస్తుండగా పోచమ్మ గుడి వద్ద గుర్తు తెలియని దుండగులు అతడిపై కత్తితో దాడి చేసి గొంతు కోసి పరారయ్యారు. అతడిని చికిత్స నిమిత్తం స్థానికులు ఎల్లారెడ్డి ఆసుపత్రికి తరలించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
నిజామాబాద్ CP కల్మేశ్వర్ బదిలీపై ఊహాగానాలకు తెరపడింది. నిన్న జరిగిన IPSల బదిలీల్లో ఆయన పేరు లేకపోవడంతో ఇప్పట్లో ఆయన బదిలీ లేనట్లేనని స్పష్టత వచ్చింది. కల్మేశ్వర్ సతీమణి అయిన IPS అధికారిణి రోహిణీ ప్రియదర్శిని డిచ్పల్లి 7వ బెటాలియన్ కమాండెంట్గా బదిలీపై వస్తుండటంతో CP ట్రాన్స్ఫర్ వార్తలకు చెక్ పడింది. సీపీ కల్మేశ్వర్ బదిలీ అవుతారంటూ కొద్ది రోజులుగా ఊహాగానాలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే.
నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి 7వ బెటాలియన్ పోలీస్ కమాండెంట్గా 2012 బ్యాచ్కు చెందిన IPS అధికారిణి రోహిణీ ప్రియదర్శిని నియమితులయ్యారు. ఇక్కడ పని చేస్తున్న కమాండెంట్ బి.రాం ప్రకాశ్ను డీజీపీ కార్యాలయంలో రిపోర్ట్ చేయాలని ఆదేశించారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి శాంతి కుమారి సోమవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు.
ఆర్మూర్ పట్టణంలోని తిరుమల కాలనీలో 2 దేవాలయాల్లో చోరీ జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం హనుమాన్ దేవాలయం, అలాగే శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయంలో దుండగులు చోరీకి పాల్పడ్డారని చెప్పారు. హనుమాన్ ఆలయంలో హుండీని పగలగొట్టి నగదును అపహరించగా, శ్రీ వెంకటేశ్వర దేవాలయంలో చోరీకి విఫలయత్నం చేశారని పేర్కొన్నారు.
నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి 7వ బెటాలియన్ పోలీస్ కమాండెంట్గా 2012 బ్యాచ్కు చెందిన IPS అధికారిణి రోహిణీ ప్రియదర్శిని నియమితులయ్యారు. ఇక్కడ పని చేస్తున్న కమాండెంట్ బి.రాం ప్రకాశ్ను డీజీపీ కార్యాలయంలో రిపోర్ట్ చేయాలని ఆదేశించారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి శాంతి కుమారి సోమవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు.
కామారెడ్డి జిల్లాలో ప్రాజెక్టులో పడి మృతి చెందిన ఘటన నిజాంసాగర్ మండలంలో చోటుచేసుకుంది. హాసన్ పల్లి గ్రామ శివారులోని ప్రాజెక్టులో సోమవారం తిమ్మారెడ్డి తాండకు చెందిన కేతావత్ జైపాల్ (35) చేపలు పట్టడానికి వెళ్లి నీట మునిగి మృతి చెందినట్లు ఎస్సై సుధాకర్ తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ పేర్కొన్నారు.
కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన కిషన్ రెడ్డిని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా సోమవారం ఢిల్లీలో మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ధన్పాల్ మాట్లాడుతూ.. నిబద్దతతో పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి పని చేసిన నాయకులను పార్టీ గుర్తిస్తుందన్నారు. దానికి కిషన్ రెడ్డి నిదర్శనమని కొనియాడారు.
అటవీ శాఖ అధికారులపై దాడి చేసిన ఘటనలో 8 మందిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు ఎస్హెచ్వో గంగాధర్ తెలిపారు. మోపాల్ మండలంలోని కాల్పోల్ ప్రాంతంలో శుక్రవారం ప్లాంటేషన్ భూములు దున్నడాన్ని అడ్డుకున్న ఎఫ్ఆర్వో రాధిక, సిబ్బందిపై దాడి చేసిన ఘటనలో 30 మందిపై కేసు నమోదైనట్లు ఆయన పేర్కొన్నారు. కాగా వారిలో 8 మందిని అరెస్ట్ చేసి జైలుకు పంపినట్లు వెల్లడించారు.
బక్రీద్ వేడుకను పురస్కరించుకుని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు నిజామాబాద్ జిల్లా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. త్యాగానికి ప్రతీకగా నిలిచే బక్రీద్ వేడుకను ఆధ్యాత్మిక వాతావరణంలో ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని ఆకాంక్షించారు. అన్ని వర్గాల ప్రజలు సుఖః సంతోషాలతో ఉండాలని, సౌభ్రాతృత్వం, సుహృద్భావ వాతావరణం వెల్లివిరియాలని కోరారు. సోమవారం నాటి వేడుకను భక్తి శ్రద్ధలతో జరుపుకోవాలని సూచించారు.
బక్రీద్ పండుగ సందర్భంగా నిజామాబాద్లో ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయని NZB సీపీ కల్మేశ్వర్ ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఖిల్లా ఈద్గా, బోధన్ బస్టాండ్ ఈద్గా, పులాంగ్ ఈద్గాల్లో ముస్లిం సోదరులు ప్రార్థన చేయనున్నారు. ఈ మేరకు సోమవారం ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పై మార్గాల్లో ట్రాఫిక్ మళ్లింపు ఉంటుందని పేర్కొన్నారు. ప్రజలందరూ సహకరించాలని కోరారు.
Sorry, no posts matched your criteria.