India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
పొతంగల్ మండలం హెగ్డోలి గ్రామానికి చెందిన సొన్ కాంబ్లె రమేశ్(35) గురువారం ఉదయం పొలంలో మందు చల్లడానికి వెళ్లి పడి మృతి చెందినట్లు ఎస్ఐ సందీప్ తెలిపారు. మందు సంచిని తలపై పెట్టుకుని గట్టు పైన నడుస్తూ ఉండగా కాలుజారి ప్రమాదవశాత్తు బురదలో పడి ఊపిరి ఆడక మృతి చెందినట్లు పేర్కొన్నారు. భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు వివరించారు.
పరీక్ష కేంద్రాలలో కెమెరాలు ఆగిపోకుండా ఎప్పటికప్పుడు తనిఖీ చేస్తూ పని చేసేలా చర్యలు తీసుకోవాలని ఆయా కళాశాలల ప్రిన్సిపల్లను DIEO రవికుమార్ ఆదేశించారు. గురువారం నిజామాబాద్ జిల్లా కేంద్రంలో మూడో దశ ప్రయోగ పరీక్షలు ప్రారంభమయ్యాయి. కాగా పలు ప్రయోగ పరీక్షా కేంద్రాలను ఆయన గురువారం తనిఖీ చేశారు. నిబంధనల మేరకు ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహించాలని సూచించారు.
ఆలూర్ వెంకటేశ్వర గుట్ట వద్ద తవ్విన కుంటలో ముత్తేన్న అనే వ్యక్తి మతిస్థిమితం సరిగా లేక మద్యానికి అలవాటు పడి కుంటలో దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. బుధవారం ఉదయం ఆయన ఇంటి నుంచి వెళ్లిపోయినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. గురువారం ఉదయం ఏడు గంటలకు కుంటలో ఆయన మృతదేహం బయటపడింది.
ఆల్ ఇండియా సివిల్ సర్వీసెస్ హాకీ టోర్నమెంట్ ఈ నెల 15 నుంచి 28 వరకు కాకినాడలో జరుగునుంది. ఈ టోర్నమెంట్కు జిల్లాకు చెందిన వ్యాయామ ఉపాధ్యాయులు జాకోర ZPHSకు చెందిన PET స్వామి కుమార్, డిచ్పల్లి ZPHSకు చెందిన PET స్వప్న రాష్ట్ర జట్టుకు సారథులుగా ఎంపికైయ్యారు. జిల్లా విద్యాశాఖ అధికారి అశోక్ , SGF కార్యదర్శి నాగమణి వారిని అభినందించారు.
జాతీయస్థాయి కబడ్డీ ఛాంపియన్షిప్ పోటీల్లో పాల్గొనేందుకు నిజామాబాద్ జిల్లా క్రీడాకారులు రాష్ట్ర జట్టు ప్రాబబుల్స్ జాబితాకు ఎంపికయ్యారు. పురుషుల జట్టులో సుశాంక్, శ్రీనాథ్, మహిళల జట్టులో గోదావరి జాతీయ సన్నద్ధ శిబిరంలో శిక్షణ పొందుతున్నారు. అనంతరం వారి ప్రతిభ నైపుణ్యత ఆధారంగా ఒడిశాలో జరిగే పురుషుల, హర్యాణాలో జరిగే మహిళల సీనియర్ నేషనల్ కబడ్డీ ఛాంపియన్షిప్ పోటీల్లో పాల్గొనే అవకాశాలు ఉన్నాయి.
నిజామాబాద్ జిల్లా ముప్కాల్ మండలంలోని వేంపల్లి గ్రామ శివారులో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నేషనల్ హైవేపై గుర్తు తెలియని వాహనం ఢీకొని ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. అతని వయసు సుమారు 50-60 మధ్యలో ఉంటుంది. అతను తెల్ల చొక్కా లుంగీ ధరించి ఉన్నాడు. వివరాలు తెలిస్తే ముప్కాల్ పోలీస్ స్టేషన్లో సమాచారం అందించలన్నారు.
NZBలో దొంగతనాలకు పాల్పడుతున్న వ్యక్తిని అరెస్టు చేసినట్లు సౌత్ CI సురేశ్ తెలిపారు. అర్సపల్లిలో వాహనాలు తనిఖీలు నిర్వహిస్తుండగా షేక్ ఆఫ్తాబ్ అనుమానాస్పదంగా తిరుగుతుండగా అదుపులోకి తీసుకున్నారు. ఆటోనగర్లో తాళం వేసిన ఇంట్లో దొంగతనం చేసి నగలను అమ్మేందుకు వెళ్తుండగా పట్టుకున్నట్లు CI తెలిపారు. నిందితుడు నుంచి తొమ్మిదిన్నర తులాల బంగారం, రూ.15 వేల నగదు, 2 వాచ్లు స్వాధీనం చేసుకున్నట్లు సీఐ వివరించారు.
మోర్తాడ్ మండలం పాలెం గ్రామానికి చెందిన కుంట సుశాంక్ జాతీయ స్థాయి సీనియర్ కబడ్డి ప్రాబబుల్స్ జట్టుకు ఎంపికైనట్లు జిల్లా కబడ్డి కోచ్ మీసాల ప్రశాంత్ తెలిపారు. జాతీయ స్థాయి పోటీలకు జిల్లా క్రీడాకారుడు ఎంపికవడంపై జిల్లా కబడ్డి అసోసియేషన్ అధ్యక్షుడు లింగయ్య, కార్యదర్శి గంగాధర్, కార్యవర్గ సభ్యులు పలువురు అభినందించారు. తుది జట్టు ఎంపిక తర్వాత ఒడిషా రాష్టంలో జరిగే జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొంటారు.
భద్రత కోసం మహిళలు పోరాటం చేయాల్సిరావడం బాధాకరమని జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు. బుధవారం నిర్వహించిన మహిళా జాగృతి సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. ఆడపిల్ల కాలేజీకి వెళ్తే ఇంటికొచ్చే వరకు ఎదురుచూసే పరిస్థితి ఏర్పడిందన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయని, ప్రభుత్వం ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు 70 శాతం పనిచేయడం లేదని ఆరోపించారు.
నిజామాబాద్ జిల్లాలో త్వరలో నిర్వహించే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించి అధికారులు ప్రకటించిన పోలింగ్ కేంద్రాలు, ఓటర్ల వివరాలు ఇలా ఉన్నాయి. జిల్లాలోని 33 మండలాల్లో 1564 పోలింగ్ కేంద్రాలు, 8,51,770 ఓటర్లు ఉన్నారు. ఇందులో పురుషులు ఓటర్లు 3,97,140 ఉండగా మహిళా ఓటర్లు 4,54,613 మంది, ఇతరులు 17 మంది ఉన్నారు.
Sorry, no posts matched your criteria.