Nizamabad

News September 17, 2024

NZB: నిమజ్జనానికి వేళాయె.. సర్వం సిద్ధం.!

image

11 రోజుల పాటు విశేష పూజలందుకున్న లంబోదరుడు మరి కొన్ని గంటల్లో గంగమ్మ ఒడికి చేరనున్నాడు. ఈ మేరకు నిజామాబాద్ జిల్లా కేంద్రంతో పాటు నందిపేట మండలంలోని ఉమ్మెడ, బాసర గోదావరి తీరాన ఏర్పాట్లు అధికారులు పూర్తి చేశారు. నిమజ్జనం సందర్భంగా 2 వెల మంది పోలీసు సిబ్బందితో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఏర్పాట్లపై ఆదివారం చంద్ర శేఖర్ రెడ్డి పోలీసు ఉన్నత అధికారులకు సలహా, సూచనలు చేశారు.

News September 17, 2024

వర్ని: కొడవలితో భార్య గొంతుకోసి హత్య చేసిన భర్త

image

భార్య గొంతుకోసి భర్త హత్య చేసిన ఘటన వర్నిలో చోటుచేసుకుంది. ఎస్ఐ కృష్ణ తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని వడ్డేపల్లి గ్రామానికి చెందిన పెంటవ్వ(46), భర్త బాలయ్య మధ్య సోమవారం రాత్రి గొడవ జరిగింది. మద్యం మత్తులో ఉన్న బాలయ్య క్షణికావేశంలో కొడవలితో ఆమె గొంతు కోయడంతో పెంటవ్వ అక్కడికక్కడే మృతి చెందినట్లు ఎస్ఐ వెల్లడించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

News September 17, 2024

ఎల్లారెడ్డి: వినాయక నిమజ్జనంలో అపశ్రుతి

image

కామారెడ్డి జిల్లాలో వినాయక నిమజ్జన వేడుకల్లో అపశ్రుతి చోటు చేసుకొంది. ఎల్లారెడ్డి మండలం లింగారెడ్డిపేటలో ప్రమదవశాత్తు చెరువులో పడి వ్యక్తి మృతి చెందాడు. స్థానికుల వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన బుజ్జిగారి ఏశయ్య(25) స్నేహితులతో కలిసి గ్రామ శివారులోని పటేల్ చెరువులో వినాయక నిమజ్జనానికి వెళ్లాడు. కాగా ప్రమాదవశాత్తు చెరువులో పడి ఈత రాక మృతిచెందాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

News September 17, 2024

కామారెడ్డిలో రికార్డు స్థాయి ధర పలికిన లడ్డూ

image

కామారెడ్డిలో వినాయకునికి లడ్డూ రికార్డు ధర పలికింది. కామారెడ్డి హౌసింగ్ బోర్డులోని సంకష్ఠ గణపతి దేవాలయంలో నిర్వాహకులు లడ్డూ వేలం పాట నిర్వహించారు. కాగా జీఆర్ఎల్ సంస్థ ప్రతినిధి సంతోష్ రూ.2.79 లక్షలకు లడ్డూను వేలం పాటలో దక్కించుకున్నారు.

News September 17, 2024

NZB: వినాయక నిమజ్జనం.. కావొద్దు విషాదం..!

image

వినాయక చవితి సందర్భంగా 11 రోజుల పాటు పూజలు అందుకున్న లంబోదరుడు రేపు గంగమ్మ ఒడిలోకి చేరనున్నాడు. అయితే వినాయకుడికి గంగమ్మ చెంతకు తీసుకెళ్లే క్రమంలో.. చిన్నపాటి నిర్లక్ష్యం భక్తుల ప్రాణాల మీదకు తెస్తోంది. పోలీసులు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ప్రతీ ఏటా ఉమ్మడి NZB జిల్లాలో నిమజ్జనం సమయంలో అపశృతులు జరుగుతూనే ఉన్నాయి. ఈ ఏటా వినాయక నిమజ్జనం విషాదం కాకుండా తగు జాగ్రత్తలు పాటిస్తూ..గణేష్ నిమజ్జనం చేద్దాం.

News September 16, 2024

భీమ్‌గల్: ఆటో బోల్తా.. బాలుడి మృతి

image

భీమ్‌గల్ పట్టణంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో బాలుడు మృతి చెందాడు. ఎస్ఐ మహేశ్ వివరాల ప్రకారం.. భీమ్‌గల్ నుంచి సంతోశ్‌నగర్ తండాకు 5గురు ప్రయాణీకులతో వెళ్తున్న ఆటో బోల్తాపడి పల్టీలు కొట్టింది. ఈ ఘటనలో నలుగురికి స్వల్పగాయాలు కాగా రియాన్ అనే బాలుడి తలకు గాయమైంది. వెంటనే బాలుడిని ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. బాలుడి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై వెల్లడించారు.

News September 16, 2024

NZB: గణేష్ నిమజ్జనం.. వైన్స్, బార్లు బంద్

image

గణేశ్ నిమజ్జనం, శోభాయాత్రకు నిజామాబాద్ జిల్లాలో సర్వం సిద్ధం చేశారు అధికారులు. గణేశ్ నిమజ్జనం దృష్టిలో పెట్టుకుని నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో వైన్ షాపులు, బార్లు, కల్లు దుకాణాలు మూసివేయాలని సీపీ కల్మేశ్వర్ ఆదేశించారు. మంగళవారం ఉదయం 6 గంటల నుంచి బుధవారం ఉదయం 10 గంటల వరకు మద్యం అమ్మరాదని తేల్చి చెప్పారు. అలాగే బార్లు, క్లబ్‌లు మూసేయాలని ఆదేశించారు.

News September 16, 2024

ఫిలిప్పీన్స్‌లో వేల్పూర్ యువకుడి మృతి

image

ఫిలిప్పీన్స్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో వేల్పూర్ మండలానికి చెందిన అక్షయ్ మృతి చెందాడు. అక్షయ్ ఫిలిప్పీన్స్‌లో ఎంబీబీఎస్ చివరి సంవత్సరం చదువుతున్నాడు. మరో ఐదు నెలలో ఎంబీబీఎస్ కావస్తున్న సమయంలో అక్షయ్ ఆకస్మిక మృతి అతని కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది. కాగా గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

News September 16, 2024

NZB: రేపు జిల్లాల్లో జెండా ఎగురవేసే ప్రముఖులు వీరే!

image

రాష్ట్ర ప్రభుత్వం సెప్టెంబర్ 17న తెలంగాణ ప్రజాపాలన దినోత్సవంగా నిర్వహించాలని నిర్ణయించింది. ఈ మేరకు జిల్లాల్లో జెండా ఎగురవేసే ప్రముఖుల జాబితాను విడుదల చేసింది. నిజామాబాద్‌లో మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ ఈరవత్రి అనిల్, కామారెడ్డిలో తెలంగాణ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ పటేల్ రమేశడ్డి, ఆదిలాబాద్‌లో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ జెండాను ఎగురవేయనున్నారు.

News September 16, 2024

మోపాల్: వైద్య సిబ్బందికి మెమోలు జారీ చేసిన DM&HO

image

మోపాల్ మండలంలోని ముదక్పల్లి PHCలో ఆయూష్ వైద్యురాలికి, సిబ్బందికి DM&HO రాజశ్రీ మెమోలు జారీ చేశారు. ఇటీవల PHCని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు తనిఖీ చేసిన సమయంలో వారు విధులకు గైర్హాజరు అయ్యారు. విధులకు పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే కారణంతో వారికి కలెక్టర్ నోటీసులిచ్చారు. కాగా PHC ఇన్‌ఛార్జ్ డ్రాయింగ్ ఆఫీసర్‌గా డిప్యూటీ DM&HO అంజనకు బాధ్యతలు అప్పగించారు.

error: Content is protected !!