Nizamabad

News March 30, 2024

నిజామాబాద్: ఉచిత శిక్షణకు దరఖాస్తుల ఆహ్వనం

image

నిజామాబాద్ జిల్లా డిచ్‌పల్లిలోని గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ ఆధ్వర్యంలో నిజామాబాద్, కామారెడ్డి జిల్లాకు చెందిన మహిళలు, నిరుద్యోగ యువతులకు వివిధ రకాల ఉచిత శిక్షణల కోసం నేటి నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు సంస్థ డైరక్టర్ సుంకం శ్రీనివాస్ తెలిపారు. తెల్ల రేషన్ కార్డు, 19 నుంచి 45 ఏళ్ల వారు అర్హులని ఆయన పేర్కొన్నారు. శిక్షణ సమయంలో నెలపాటు వసతి, భోజనం, టూల్‌కిట్స్ ఉచితంగా అందిస్తామన్నారు.

News March 30, 2024

కామారెడ్డి జిల్లాలో భానుడి భగభగలు

image

ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఎండలు ఠారేత్తిస్తున్నాయి. మార్చి మెుదటి వారం నుంచి భానుడి భగభగలు మెుదలయ్యాయి. మార్చి ముగియకముందే కామారెడ్డి జిల్లాలో ఉష్ణోగ్రత 42 డిగ్రీలకు చేరువైంది. దీంతో కూలర్లు, ఫ్యాన్లు, ఏసీలకు గిరాకీ పెరిగింది. బిచ్కుంద మండలంలో 41.9, దోమకొండ 40.5, రామారెడ్డి 40.4, పుల్కల్‌లో 40.1 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. అత్యవసర పరిస్థితుల్లోనే ప్రజలు బయటకు రావాలని అధికారులు సూచిస్తున్నారు.

News March 30, 2024

కామారెడ్డి: ఎన్నికల వేళా ‘గులాబీ’లో గుబులు

image

పార్లమెంటు ఎన్నికల వేళా బీఆర్‌ఎస్‌ పార్టీకి షాక్‌ మీద షాక్‌లు తగులుతున్నాయి. ఒక్కొక్కరుగా కారు దిగుతున్నారు. ZHB పార్లమెంటు పరిధిలోని కామారెడ్డి, ఎల్లారెడ్డి, జుక్కల్, బాన్సువాడ నియోజకవర్గ ఓటర్లు అన్ని పార్టీలకు ప్రధానమే. ఈ నేపథ్యంలో అధికారం కోల్పోయిన మూడు నెలల లోపే BRS ప్రజాప్రతినిధులు, నాయకులు ఒక్కొక్కరుగా పార్టీని వీడి కాంగ్రెస్‌, BJP గూటికి చేరుతున్నారు,

News March 30, 2024

KMR: డాన్స్ చేయెుద్దన్న భార్య.. సూసైడ్ చేసుకున్న భర్త

image

కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండలంలో విషాదం చోటుచేసుకుంది. భార్య డాన్స్ చేయెుద్దన్నందుకు భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. ఎస్సై వివరాల ప్రకారం.. చిన్నఆరెపల్లికి చెందిన చెన్నబోయిన అనిల్ బంధువుల పెళ్లికి హాజరయ్యాడు. పెళ్లి అనంతరం బారాత్ కార్యక్రమం ఉండగా డాన్స్ చేయెుద్దని భార్య..భర్త అనిల్‌కు చెప్పింది. దీంతో క్షణికావేశంలో ఇంట్లో నుంచి వెళ్లిన అనిల్ చెట్టుకు ఉరేసుకున్నాడు. పోలీసులు కేసు నమోదు చేశారు.

News March 30, 2024

నేడే కామారెడ్డిలో అవిశ్వాస తీర్మానం.. తీవ్ర ఉత్కంఠ..!

image

కామారెడ్డి మున్సిపల్ ఛైర్ పర్సన్ జాహ్నవి పై నేడే అవిశ్వాస పరీక్ష నిర్వహించనున్నారు. FEBలో 27మంది కాంగ్రెస్ కౌన్సిలర్లు జిల్లా కలెక్టర్‌కి అధ్యక్ష పదవిపై అవిశ్వాసం వ్యక్తం చేస్తూ ఫిర్యాదుచేయగా ఈనెల 30న బలపరీక్ష నిర్వహించాలని నిర్ణయించారు. అవిశ్వాసం నెగ్గాలంటే 34 మంది సభ్యుల మద్దతు అవసరం. ప్రస్తుతం కాంగ్రెస్‌ క్యాంపులో 36 మంది కౌన్సిలర్లు ఉన్నారు. ఏదేమైనా ఏం జరుగుతుందో అన్న దానిపై ఉత్కంఠ నెలకొంది.

News March 30, 2024

కామారెడ్డి జిల్లాలో 42 డిగ్రీలకు చేరుకున్న ఉష్ణోగ్రతలు

image

కామారెడ్డి జిల్లాలో భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. శుక్రవారం జిల్లాలోని బిచ్కుందలో అత్యధికంగా 41.9 ఉష్ణోగ్రత నమోదు కాగా, దోమకొండలో 40.5, రామారెడ్డి, గాంధారిలో 40.4, నస్రుల్లాబాద్‌లో 40.2, పాల్వంచలో 40.1 ఉష్ణోగ్రతలు నమోదు కాగా, అత్యల్పంగా బీర్కూర్ మండలంలో 36.4 ఉష్ణోగ్రత నమోదైనట్లు అధికారులు వెల్లడించారు.

News March 29, 2024

NZB: మహిళ మెడలోంచి చైన్ లాక్కెల్లిన దుండగులు

image

నిజామాబాద్ నగరంలో చైన్ స్నాచింగ్ జరిగింది. యెండల టవర్స్ రోడ్డులో ఓ మహిళ మెడలో నుంచి బంగారు గొలుసును లాక్కెళ్లారు. మోపాల్ మండలానికి చెందిన దంపతులు శుక్రవారం ఓ పని నిమిత్తం నిజామాబాద్‌కు వచ్చారు. బైక్‌పై వచ్చిన ఇద్దరు యువకులు ఆ మహిళ మెడలోని బంగారు గొలుసును లాక్కెళ్లారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సీసీ టీవీ దృశ్యాల ఆధారంగా నిందితుల కోసం గాలిస్తున్నారు.

News March 29, 2024

NZB: కుక్క కాటుతో వ్యక్తి మృతి

image

నిజామాబాద్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. కుక్కకాటుతో ఓ యువకుడు మృతి చెందాడు. నందిపేట లక్కంపల్లి సెజ్లో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్న మహేశ్(36)ను ఈ నెల 10న విధుల్లో ఉన్న సమయంలో కుక్క కరిచింది. నందిపేట PHCలో టీకాలు ఇప్పించుకున్నాడు. అనంతరం తీవ్ర గాయాలు కావడంతో జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా చికిత్స నిమిత్తం ఇవాళ మృతి చెందాడు.

News March 29, 2024

GOOD NEWS: నిజామాబాద్‌లో IPL బిగ్ స్క్రీన్

image

క్రికెట్ ప్రేమికుల కోసం నిజామాబాద్ నగరంలో ఐపీఎల్ ఫ్యాన్ పార్క్ ఏర్పాటు చేస్తున్నట్లు నిర్వాహకులు వెంకట్రాంరెడ్డి, సత్యపాల్ తెలిపారు. నిజామాబాద్ ప్రెస్ క్లబ్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడారు. నగరంలోని ఉమెన్స్ కళాశాల మైదానంలో ఈ నెల 30, 31న బిగ్ స్క్రీన్ ద్వారా ఉచితంగా క్రికెట్ మ్యాచ్ చూడవచ్చన్నారు. క్రికెట్ ప్రేమికులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు.

News March 29, 2024

నిజాంసాగర్: చెట్టుకు ఉరేసుకొని వ్యక్తి మృతి

image

కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండలంలోని ఆరేపల్లి గ్రామంలో చెట్టుకు ఉరి వేసుకుని వ్యక్తి మృతి చెందాడు. ఎస్ఐ సుధాకర్ తెలిపిన వివరాల ప్రకారం.. చిన్నబోయిన అనిల్ (27) అనే వ్యక్తి గురువారం రాత్రి చెట్టుకు ఉరేసుకున్నట్లు పేర్కొన్నారు. ఇంట్లో గొడవ కారణంతోనే చనిపోయినట్లు స్పష్టం చేశారు. కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేస్తున్నట్లు వెల్లడించారు.