Warangal

News September 3, 2024

ఉమ్మడి వరంగల్ జిల్లాలో క్రైమ్ న్యూస్..

image

> JN: పాలకుర్తి మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం
> WGL: నెక్కొండ మండలంలో వాగులో పడి వ్యక్తి గల్లంతు
> HNK: యువత మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలి: పరకాల ఆర్డిఓ
> WGL: చైన్స్ స్నాచింగ్ లకు పాల్పడుతున్న నలుగు అరెస్ట్
> JN: గోడ కూలడంతో విరిగిపోయిన విద్యుత్ నియంత్రిక
> MHBD: 15 లక్షల రూపాయల విలువ చేసే కోళ్లు మృతి
> WGL: బయటపడ్డ నకిలీ సర్టిఫికెట్ల బాగోతం
> JN: రోడ్డు ప్రమాదంలో 3కి చేరిన మృతుల సంఖ్య

News September 3, 2024

వరంగల్: మక్కలు క్వింటా రూ.2,858

image

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో మొక్కజొన్న రికార్డుల పరంపరకు బ్రేక్ పడింది. మార్కెట్ చరిత్రలోనే గతంలో ఎన్నడూ లేని గతవారం శుక్రవారం క్వింటా మక్కలకు రూ.2,960 ధర రాగా నేడు భారీగా పడిపోయింది. ఈరోజు మక్కలు (బిల్టి) క్వింటాకు రూ. 2858 పలికినట్లు అధికారులు తెలిపారు. ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని వ్యాపారులు తెలుపుతున్నారు.

News September 3, 2024

MHBD: CM షెడ్యూల్లో స్వల్ప మార్పులు

image

మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం తిరుమలాయపాలెం బ్రిడ్జి, కుదురు మండలం రావిరాలలో సీఎం పర్యటించాల్సి ఉండగా.. షెడ్యూల్లో స్వల్ప మార్పులు జరిగాయి. ఆయన ఖమ్మం నుంచి నేరుగా సీతారాంనాయక్ తండాకు చేరుకోనున్నారు. గ్రామాన్ని వరద నీరు ముంచెత్తడంతో సుమారు 100 మందిని పోలీసులు కాపాడారు. విషయం తెలుసుకున్న సీఎం ముందుగా అక్కడికి వెళ్లాలని నిర్ణయించుకున్నారు.

News September 3, 2024

కాజీపేట: రైళ్ల రద్దు కొనసాగింపు

image

మహబూబాబాద్ జిల్లా ఇంటికన్నె-కేసముద్రం సెక్షన్ ట్రాక్ ఘటనతో సోమవారం రెండో రోజు కూడా దక్షిణ మధ్య రైల్వే అధికారులు పలు రూట్లలో నడిచే రైళ్లను రద్దు చేశారు. రద్దయిన రైళ్ల వివరాలు.. 5న డోర్నకల్-విజయవాడ(07755), ప్యాసింజర్, డోర్నకల్- కాజీపేట(07754) ప్యాసింజర్‌ను రద్దు చేసినట్లు అధికారులు తెలిపారు. కాజీపేట జంక్షన్, నాగపూర్, నడికుడ మీదుగా వివిధ ప్రాంతాలకు వెళ్లే పలు రైళ్లను అధికారులు దారి మళ్లించారు.

News September 3, 2024

WGL: ‘ఉపకార వేతనాల కోసం దరఖాస్తులు ఆహ్వానం’

image

2024-25 ఏడాదికి వరంగల్ జిల్లాలోని షెడ్యూల్డు కులాలు, తెగలు, వెనుకబడిన, అల్ప సంఖ్యాక, దివ్యాంగ విద్యార్థుల నుంచి ఉపకార వేతనాల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు సంబంధిత అధికారి భాగ్యలక్ష్మి తెలిపారు. ఇంటర్, డిగ్రీ, పీజీ, డిప్లొమా చదువుతున్న విద్యార్థులు డిసెంబర్ 31 లోగా ‘ఈపాస్ వెబ్ సైట్’ ద్వారా దరఖాస్తు చేసుకోవాలన్నారు.

News September 3, 2024

వరంగల్ నగరం.. ‘భద్రకాళి చెరువు’తో భయం భయం?

image

వరదలొస్తేనే కాని అధికారులకు చెరువులు, నాలాలు గుర్తుకురావని WGL నగర ప్రజలు మండిపడుతున్నారు. ఏడాది నుంచి భద్రకాళి చెరువు కట్టను ఎవరూ పట్టించుకోలేదని, ప్రస్తుతం చెరువు నిండుకుండలా మారిందన్నారు. పోతననగర్ వైపు చెరువు కట్ట బలహీనంగా మారడంతో దిగువన ఉన్న కాలనీ ప్రజలు భయాందోళన చెందుతున్నారు. ఆదివారం కలెక్టర్ ప్రావీణ్య చెరువు కట్టను పరిశీలించి అధికారులపై మండిపడటంతో ఇసుక బస్తాలను నింపుతున్నట్లు సమాచారం.

News September 3, 2024

WGL: వర్షాలకు దెబ్బతిన్న పంటలు.. శాస్త్రవేత్తల సూచనలు

image

ఉమ్మడి వరంగల్ జిల్లాలో మూడు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. చాలా ప్రాంతాల్లో పంటలు నీటి మునిగాయి. దీంతో పంటకు తెగులు సోకే ప్రమాదం ఉంది. రైతులు అప్రమత్తంగా ఉండాలని వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా కేంద్రం ఏడీఆర్ డా.ఉమారెడ్డి సూచించారు. పత్తిలో నీటిని తీసివేసి, ఎకరాకు 30కిలోల యూరియా, 15 కిలోల పోటాష్ వేయాలని.. మిరపకు కాపర్ ఆక్సీ క్లోరైడ్ 3గ్రా. తెగులు సోకిన మొక్కల మొదళ్లకు పోయాలని సూచించారు.

News September 3, 2024

వరంగల్: మనకూ వస్తోంది ‘వాడ్రా ‘

image

వరంగల్ నగర పరిధిలోని చెరువుల పరిరక్షణకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ప్రతి చెరువులో లైట్ డిటెక్షన్ అండ్ రేజింగ్(లైడర్) సర్వే చేయాలని అధికారులను ఆదేశించింది. నగరంలోని 75 చెరువుల్లో రూ.25 లక్షల వ్యయంతో డ్రోన్ సర్వే కోసం టెండర్లు పిలిచారు. ఈ సర్వే ద్వారా చెరువు విస్తీర్ణం, పూర్తి నీటి నిల్వ ఎత్తు(FTL)లో ఆక్రమణలు గుర్తిస్తారు. సర్వేను 100 రోజుల్లో పూర్తి చేస్తామని DEE హర్షవర్ధన్ తెలిపారు.

News September 3, 2024

రేపు మహబూబాబాద్ జిల్లాలో సీఎం పర్యటన వివరాలివే!

image

మహబూబాబాద్ జిల్లాలో మంగళవారం సీఎం రేవంత్ రెడ్డి రేపు పర్యటించనున్నారు. నెల్లికుదురు మండలం రావిలాల, మర్రిపెడ మండలం పురుషోత్తమగుడం గ్రామాల్లో వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించరున్నారు. సీఎం పర్యటనకు సంబంధించి పోలీస్ శాఖతోపాటు వివిధ శాఖ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

News September 2, 2024

శాసనసభ స్పీకర్‌ను కలిసిన వరంగల్ ఎంపీ

image

హనుమకొండ జిల్లాకు విచ్చేసిన శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌ను వరంగల్ ఎంపీ కడియం కావ్య దంపతులు కలిసి సన్మానించారు. అనంతరం వరంగల్ పార్లమెంటుకు సంబంధించిన పలు అంశాలపై స్పీకర్‌తో ఎంపీ చర్చించారు. నిత్యం ప్రజలకు సేవలు అందిస్తూ మంచి పేరు సంపాదించుకోవాలని ఎంపీకి స్పీకర్ సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.