Warangal

News September 21, 2024

జనగామ: పీఆర్ పెండింగ్ పనులను పూర్తిచేయాలి: కలెక్టర్

image

పంచాయతీరాజ్ శాఖలో చేపట్టిన వివిధ అభివృద్ధి పనులను అక్టోబర్ 15 కల్లా పూర్తి చేయాలని జనగామ జిల్లా కలెక్టర్ షేక్ రిజ్వాన్ బాష ఆదేశించారు. జనగామ కలెక్టరేట్లో స్పెషల్ ఆఫీసర్లు, ఎంపీడీవోలు ఇంజనీరింగ్ అధికారులతో శనివారం సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. గత రెండు ఆర్థిక సంవత్సరాలకు సంబంధించిన పెండింగ్ పనులు పూర్తి చేయాలని అన్నారు. క్షేత్రస్థాయిలో అధికారులు పర్యటించాలన్నారు.

News September 21, 2024

WGL: అండర్-19 జిల్లా జట్టు ఎంపిక

image

ఉమ్మడి వరంగల్ అండర్-19 జిల్లా జట్టు ఎంపిక పోటీలను ఈనెల 22, 23వ తేదీల్లో సికేఎం కళాశాల క్రీడా మైదానంలో నిర్వహించనున్నారు. 2005 సెప్టెంబర్-1 తరువాత జన్మించిన ఔత్సాహిక క్రికెట్ క్రీడాకారులు క్రికెట్ యూనిఫాం, స్వంత కిట్, ఇతర పత్రాలతో హాజరుకావాలని వరంగల్ జిల్లా క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి చాగంటి శ్రీనివాస్ కోరారు.

News September 21, 2024

గీసుగొండ: కష్టపడి పని చేసే ప్రతి ఒక్కరికి ప్రాధాన్యత: టీపీసీసీ అధ్యక్షుడు

image

కాంగ్రెస్ బలోపేతానికి కష్టపడి పనిచేసే ప్రతి ఒక్కరికి పార్టీలో ప్రాధాన్యత కల్పిస్తామని నూతన టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు. కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు గోపాల నవీన్ రాజ్, ఇతర నేతలు నూతన అధ్యక్షుడిని కలిసి శుభాకాంక్షలు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు విస్తృతంగా తీసుకెళ్లాలని నేతలకు మహేశ్ కుమార్ గౌడ్ సూచించారు.

News September 21, 2024

BREAKING.. జనగామ: తల్లిని చంపిన కుమారుడు

image

జనగామ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. స్టేషన్‌ఘన్‌పూర్ మండలం నమిలిగొండలో కుమారుడు తల్లిని చంపాడు. స్థానికుల ప్రకారం.. కుమారుడు సత్తయ్య తల్లి సముద్రాల లక్ష్మమ్మ(65)ను రోకలిబండతో కొట్టి చంపాడు. అయితే సత్తయ్యకు కొంతకాలంగా మతిస్థిమితం లేనట్లు సమాచారం. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

News September 21, 2024

జనగామ: కుటుంబ కలహాలతో తల్లీ, కూతురు ఆత్మహత్య

image

కుటుంబ కలహాలతో కూతురితో సహా బావిలో దూకి తల్లి ఆత్మహత్య చేసుకున్న ఘటన సిద్దిపేట జిల్లాలో శుక్రవారం చోటుచేసుకుంది. సిద్దిపేట రూరల్ CI శ్రీను, SI కృష్ణారెడ్డి వివరాలు.. జనగామ జిల్లా తరిగొప్పులకు చెందిన రాజేశ్వర్, శారద ఉపాధికోసం బెజ్జంకి వచ్చి కూలీ పనులు చేస్తూ జీవిస్తున్నారు. మద్యానికి బానిసైన భర్త.. తరచూ భార్యతో గొడవపడేవాడు. దీంతో మనస్తాపానికి గురైన శారద కూతురితో సహా బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంది.

News September 21, 2024

క్యాబినెట్‌కి ధన్యవాదాలు తెలిపిన మంత్రి సీతక్క

image

ఏటూరునాగారం కేంద్రంలో ఫైర్ స్టేషన్ ఏర్పాటు, ములుగు మెడికల్ కాలేజీకి పోస్టులు మంజూరుకు క్యాబినెట్ సంపూర్ణ ఆమోదం తెలిపింది. ఈ మేరకు క్యాబినెట్‌కు పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క ధన్యవాదాలు తెలిపారు. ఏటూరునాగారంలో ఫైర్ స్టేషన్ ఏర్పాటు అవడం వల్ల ఎన్నో అగ్ని ప్రమాదాలను నివారించగలుగుతామని మంత్రి సీతక్క పేర్కొన్నారు.

News September 21, 2024

ఉద్యమాల ఉక్కు పిడికిలి కొండా లక్ష్మణ్ బాపూజీ: మంత్రి కొండా

image

అణచివేతపై ధిక్కార స్వరం, ఉద్యమాల ఉక్కు పిడికిలి కొండా లక్ష్మణ్ బాపూజీ అని మంత్రి కొండా సురేఖ అన్నారు. సెప్టెంబర్ 21న కొండా లక్ష్మణ్ బాపూజీ వర్థంతి సందర్భంగా దేశం కోసం, ఈ రాష్ట్రం కోసం తన జీవితాన్ని ధారపోసిన ఆయన త్యాగ నిరతిని మంత్రి కొండా సురేఖ స్మరించుకున్నారు. కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాల సాధనకు తెలంగాణ ప్రభుత్వం నిబద్ధతతో కృషి చేస్తుందని మంత్రి అన్నారు.

News September 21, 2024

అక్టోబర్ 3 నుంచి 13 వరకు భద్రకాళి దేవి శరన్నవరాత్రి మహోత్సవాలు

image

శ్రీ భద్రకాళి దేవస్థానంలో భద్రకాళి దేవి శరన్నవరాత్రి(దసరా) మహోత్సవాలు అక్టోబర్ 3 నుంచి 13 వరకు నిర్వహిస్తున్నట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి కె.శేషు భారతి తెలిపారు. అక్టోబర్ 12 విజయదశమి దసరా సందర్భంగా భద్రకాళి తటాకంలో హంస వాహన తెప్పోత్సవం, అక్టోబర్ 13 శ్రీ భద్రకాళి భద్రేశ్వరుల కల్యాణ మహోత్సవం నిర్వహిస్తామని తెలిపారు.

News September 20, 2024

వరంగల్ మార్కెట్లో పసుపు, పల్లికాయ ధరలు ఇలా

image

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో శుక్రవారం సూక పల్లికాయ(పాతది) ధర రూ.6వేలు పలకగా, సూక పల్లికాయ(పచ్చిది) రూ.5,780, పచ్చి పల్లికాయ రూ.4, 600 పలికింది. అలాగే 5531 రకం మిర్చికి రూ.14,000 ధర, పసుపుకి రూ.11,859 వచ్చినట్లు వ్యాపారులు తెలిపారు. కాగా, నేడు మార్కెట్లో క్రయవిక్రయాలు జోరుగా కొనసాగాయి.

News September 20, 2024

BREAKING.. వరంగల్ రైల్వే స్టేషన్లో NO STOP

image

వరంగల్ రైల్వే స్టేషన్ వద్ద 39 రైళ్లకు SEP 25 నుంచి 28 వరకు నో స్టాప్ వర్తిస్తుందని HYD సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులు తెలిపారు. హసన్‌పర్తి, కాజీపేట, వరంగల్, విజయవాడ-వరంగల్ మార్గంలో నాన్ ఇంటర్ లాకింగ్ పనులు జరుగుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. పలు ట్రైన్లకు కాజీపేట ఆల్టర్నేటివ్ స్టాప్‌గా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. మరికొన్ని ట్రైన్లను డైవర్ట్ చేశారు.