India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
దేశానికి తిండి పెట్టడం కోసం ఆరుగాలం శ్రమించే అన్నదాతలు యూరియా బస్తాల కోసం పడరాని పాట్లు పడుతున్నారు. పంటల సాగులో కీలకమైన యూరియా కోసం రైతన్నలు చెప్పరాని తిప్పలు ఎదుర్కొంటున్నారు. రాయపర్తిలోని PACSకు యూరియా బస్తాలు వచ్చాయనే సమాచారంతో మండలంలోని రైతులంతా పెద్ద ఎత్తున శుక్రవారం వేకువజాము నుంచే బారులు తీరారు. ఎండలో లైన్లో నిలబడలేక సాయంత్రం వేళ చెప్పులను క్యూగా పెట్టి యూరియా బస్తాలు తీసుకున్నారు.
గ్రీన్ ఫీల్డ్ నేషనల్ హైవే 163 నిర్మాణంలో భూమి కోల్పోయిన సంగెం మండలం తిమ్మాపూర్ గ్రామ భూ నిర్వాసిత రైతులకు అవార్డ్ పాస్ చేసేందుకు శుక్రవారం ఆర్బిట్రేషన్ మీటింగ్ నిర్వహించారు. కలెక్టరేట్లో కలెక్టర్ సత్య శారద ఆధ్వర్యంలో ఆర్బిట్రేషన్ నిర్వహించారు. ఈ ఆర్బిట్రేషన్ ఆర్డీవో సత్యపాల్ రెడ్డి, తహశీల్దార్లు రాజ్ కుమార్, నేషన్ హైవే సైట్ ఇంజినీర్ ఈశ్వర్ రైతులు పాల్గొన్నారు.
డా.ప్రత్యూష ఆత్మహత్య కేసులో కీలక నిందితుడిగా భావిస్తున్న మృతురాలి భర్త డా.సృజన్కు తాజాగా మరో బిగ్ షాక్ తగిలింది. ప్రస్తుతం అసిస్టెంట్ ప్రొఫెసర్గా విధులు నిర్వర్తిస్తున్న అతడిపై మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ సస్పెన్షన్ వేటు వేస్తూ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. నిందితులపై BNS యాక్ట్ 108, 115(2), 292, 351(2), 85 r/w 3(5) సెక్షన్ల కింద కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు.
వరంగల్ జిల్లా వ్యాప్తంగా గురువారం రాత్రంతా వాన దంచికొట్టింది. జిల్లాలో 621.4 మి.మీ సగటు వర్షపాతం నమోదైంది. వరంగల్, ఖిలావరంగల్, గీసుగొండ మండలాల్లో భారీ వర్షం కురవగా మిగతా మండలాల్లో సాధారణ వర్షపాతం నమోదైంది. వరంగల్లో 70.9 మి.మీ, ఖిలావరంగల్ లో 65.3 మి.మీ, గీసుగొండలో 92.9 మి.మీల వాన కురిసింది. కాగా వరంగల్, హనుమకొండ నగరాల్లో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి.
వర్షాల దృష్ట్యా ప్రజలు, అధికారులు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ డాక్టర్ సత్య శారద సూచించారు. జిల్లాలో వచ్చే మూడు రోజులు భారీ వర్షాలు కురుస్తాయని కేంద్ర వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉంటూ ప్రజలకు ఇబ్బందులు కలగకుండా పటిష్ఠ చర్యలు చేపట్టాలని కలెక్టర్ ఆదేశించారు. టెలి కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా, మండల స్థాయి అధికారులను కలెక్టర్ అప్రమత్తం చేశారు.
వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో గురువారం చిరుధాన్యాలు ధరలు ఇలా ఉన్నాయి. మక్కలు(బిల్టీ) క్వింటాకు రూ.2,405, పసుపు రూ.12,003 ధర పలికింది. సూక పల్లికాయకి రూ.5,670, పచ్చి పల్లికాయకు రూ.4,500 ధర వచ్చిందని వ్యాపారులు చెప్పారు. అలాగే టమాటా మిర్చికి రూ.23,500 ధర రాగా..సింగల్ పట్టి మిర్చికి రూ.22,500 ధర వచ్చిందన్నారు.
గురుకుల పాఠశాలలు, వసతి గృహాలను తరచూ ప్రత్యేక అధికారులు తనిఖీ చేయాలని కలెక్టర్ డాక్టర్ సత్య శారద ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లో రెసిడెన్షియల్ పాఠశాలల నిర్వహణపై సమీక్ష నిర్వహించారు. విద్యార్థుల సంక్షేమం, భద్రత, పోషకాహారం, పరిశుభ్రత, మౌలిక వసతులపై దృష్టి పెట్టాలని సూచించారు. తనిఖీలలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.
జిల్లాలోని అన్ని కళాశాలల్లో ఆధార్, అపార్ నవీకరణ చేపట్టాలని జిల్లా ఇంటర్మీడియేట్ విద్యాధికారి డా.శ్రీధర్ సుమన్ అన్నారు. విద్యార్థులకు అందుబాటులోనే అన్ని సేవలు కల్పిస్తున్నట్లు తెలిపారు. వరంగల్ జిల్లా కేంద్రంలోని ఎల్బీ కళాశాలలో నిర్వహిస్తున్న ఆధార్ నవీకరణను శ్రీధర్ సుమన్ పరిశీలించి విద్యార్థులకు సకాలంలో సేవలందించాలని సూచించారు.
ఖానాపురంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థులకు కంప్యూటర్ ల్యాబ్ అందుబాటులోకి తీసుకురావాలని కలెక్టర్ సత్య శారద ఆదేశించారు. ఖానాపురం మండలం ఐనపల్లిలోని మహాత్మా జ్యోతిబా ఫూలే గురుకుల విద్యాలయం, జడ్పీ ఉన్నత పాఠశాలలను కలెక్టర్ మంగళవారం సందర్శించారు. మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించిన అనంతరం విద్యార్థులతో కలిసి కలెక్టర్ భోజనాన్ని చేశారు.
వరంగల్ జిల్లాలో వర్షపాతం తక్కువగా నమోదైనట్లుగా వాతావరణ శాఖ వెల్లడించింది. జిల్లాలోని 13 మండలాల్లో వర్షపాతం 3.3 మి.మీ. నమోదైనట్లు తెలిపింది. జిల్లా మొత్తంలో వర్ధన్నపేట 35.2 మి.మీ. అధిక వర్షపాతం ఉన్నట్లు పేర్కొంది. రాయపర్తి మండలంలో స్వల్పంగా వర్షం కురువగా మిగతా మండలాల్లో వర్షం లేదని ప్రకటించారు.
Sorry, no posts matched your criteria.