India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
TG: సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ దగ్గరి ఆల్ఫా హోటల్లో పరిస్థితి అధ్వానంగా ఉన్నట్లు ఫుడ్ టాస్క్ఫోర్స్ తనిఖీల్లో తేలింది. పాడైపోయిన మటన్తో బిర్యానీ వండి ఫ్రిజ్లో పెడుతున్నారని, కస్టమర్లు రాగానే వేడి చేసి ఇస్తున్నారని అధికారులు తెలిపారు. కిచెన్లో దారుణమైన వాసన వస్తోందని, నాణ్యతాప్రమాణాలు ఏమాత్రం లేవని వెల్లడించారు. కేసు నమోదు చేసి రూ.లక్ష ఫైన్ విధించినట్లు పేర్కొన్నారు.
నీట్ పేపర్ లీక్ అయిందని ఆరోపణలు వస్తున్న వేళ సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో అరెస్టైన బిహార్లోని సమస్తిపూర్కు చెందిన అనురాగ్ యాదవ్ (22) అనే విద్యార్థి లీకైన పేపర్ను బయటపెట్టాడు. అది ఒరిజినల్ ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్తో సరిపోలిందని అంగీకరించాడు. జూనియర్ ఇంజినీర్ అయిన తన అంకుల్ మే 4న పేపర్ ఇవ్వడంతో ఆ రాత్రికి రాత్రే పూర్తిగా ప్రిపేర్ అయ్యానని నేరాంగీకార పత్రంలో పేర్కొన్నాడు.
AP: రాష్ట్రంలోనే పేరొందిన ఉలవపాడు బంగినపల్లి మామిడి రికార్డు ధర పలుకుతోంది. ఎన్నడూ లేనంతగా తొలిసారి టన్ను రూ.90 వేలు పలకడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గత పదేళ్లలో గరిష్ఠ ధర రూ.50 వేలు. ఇటు కవర్ కట్టిన కాయలైతే టన్ను రూ.లక్షపైనే పలుకుతుండగా స్టాక్ ఉండటం లేదు. కాపు తక్కువగా ఉండటం, నాణ్యమైన కాయ దిగుబడి రావడమే ఇందుకు కారణం. దీంతో ఇతర రాష్ట్రాల నుంచి వ్యాపారులు కొనేందుకు ఎగబడుతున్నారు.
AP: జులై ఒకటో తేదీ నాటికి రూ.10 వేల కోట్లను సమీకరించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఎన్నికల హామీలో భాగంగా వృద్ధులు, దివ్యాంగులకు పెంచిన పింఛను ఇవ్వాల్సి ఉంది. అలాగే ఏప్రిల్, మే, జూన్ నెలలకు సంబంధించి వృద్ధులకు పెంచిన పింఛను బకాయిలు రూ.1000 చొప్పున ఇవ్వాలి. వీటికి రూ.4408.31 కోట్లు అవసరమవుతాయి. ఒకటో తేదీన ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు, విశ్రాంత ఉద్యోగులకు పింఛన్లు ఇచ్చేందుకు రూ.5500 కోట్లు కావాలి.
ఏపీ సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేశ్ మెగాస్టార్ చిరంజీవిని ‘విశ్వంభర’ సెట్లో మర్యాద పూర్వకంగా కలిశారు. దీనిపై చిరు స్పందిస్తూ.. ‘నా మిత్రుడు దుర్గేశ్ ఏపీ పర్యాటక & సినిమాటోగ్రఫీ మంత్రిగా తన బాధ్యతలు నిర్వర్తించడంలో సంపూర్ణ విజయం సాధించాలి. తెలుగు చలనచిత్ర పరిశ్రమ అభివృద్ధికి, ఎదుర్కొంటున్న సవాళ్లను సత్వరం పరిష్కరించేందుకు చొరవ తీసుకుంటానని చెప్పారు. ధన్యవాదాలు’ అని ట్వీట్ చేశారు.
AP: సీఎం చంద్రబాబు సతీమణి భువనేశ్వరి నేడు పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఆమెకు బర్త్ డే విషెస్ తెలుపుతూ చంద్రబాబు ట్వీట్ చేశారు. ‘ప్రజా సేవకు అంకితమైన నాకు ఎల్లవేళలా అండగా నిలిచావు. కష్ట సమయాల్లోనూ చిరునవ్వు చెదరకుండా ధైర్యంగా నాకు తోడుగా ఉన్నావు. హ్యాపీ బర్త్ డే భువనేశ్వరి. నా సర్వస్వం’ అని పోస్ట్ చేశారు.
AP: వైఎస్ జగన్ అధ్యక్షతన నేడు వైసీపీ విస్తృత స్థాయి సమావేశం జరగనుంది. ఇప్పటికే పలు దఫాలుగా తమ పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలతో సమావేశమైన జగన్.. నేడు మరోసారి అందరితో భేటీ కానున్నారు. ఎన్నికల ఫలితాలు, రాజకీయ దాడులు, ఈవీఎంలపై చర్చించే అవకాశం ఉంది.
వేసవి సెలవులు ముగిసి వర్షాకాలం వచ్చేసినా తిరుమలలో రద్దీ మాత్రం సెలవుల స్థాయిలోనే కొనసాగుతోంది. ప్రస్తుతం సర్వదర్శనానికి 18 గంటల సమయం పడుతోంది. కంపార్ట్మెంట్లన్నీ నిండిపోవడంతో నారాయణగిరి షెడ్ల వరకు భక్తులు వేచి ఉన్నారు. నిన్న శ్రీవారిని 79,584మంది దర్శించుకున్నారు. వారిలో 31,848మంది తలనీలాలు సమర్పించుకున్నారు. రూ.4.18 కోట్లు సమకూరింది.
TG: పటాన్చెరు బీఆర్ఎస్ ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి, ఆయన కుటుంబ సభ్యుల ఇళ్లలో ఈడీ తనిఖీలు చేపట్టింది. హైదరాబాద్లోని మూడు చోట్ల ఈడీ అధికారులు సోదాలు చేస్తున్నారు.
AP: మాజీ మంత్రి, కాపు నాయకుడు ముద్రగడ పద్మనాభం పేరు మారింది. తాజాగా ఆయన పేరును ముద్రగడ పద్మనాభ రెడ్డిగా మారుస్తూ ఏపీ ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలిస్తే తన పేరు మార్చుకుంటానని ఎన్నికలకు ముందు ముద్రగడ సవాల్ విసిరారు. మాట ప్రకారం తాజాగా పేరు మార్చుకున్నారు.
Sorry, no posts matched your criteria.