India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
తమ రెండు దేశాల్లో దేనిపై దాడి చేసినా ఊరుకోమని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, ఉత్తర కొరియా నియంత కిమ్ జోంగ్ ఉన్ ప్రకటించారు. ఉత్తర కొరియా పర్యటనలో ఉన్న పుతిన్ పలు ద్వైపాక్షిక ఒప్పందాలు కుదుర్చుకున్నారు. భద్రత, అంతర్జాతీయ సమస్యలు, ఆరోగ్యం, వైద్య విద్య, సైన్స్ విభాగాల్లో పరస్పరం సహకరించుకునేందుకు ఒప్పందం చేసుకున్నారు. కాగా 24 ఏళ్ల తర్వాత పుతిన్ ఉత్తర కొరియాలో పర్యటించడం విశేషం.
అసిస్టెంట్ లోకో పైలట్ల పోస్టుల సంఖ్యను భారీగా పెంచుతున్నట్లు RRB ప్రకటించింది. తొలుత 5,696 ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇవ్వగా తాజాగా 18,799 పోస్టులు భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. అత్యధికంగా సౌత్ సెంట్రల్ రైల్వే (సికింద్రాబాద్)లో 1,364 పోస్టులు పెరిగాయి. ఈ ఏడాది ఫిబ్రవరిలోనే అప్లికేషన్ ప్రక్రియ పూర్తి కాగా, జులై-ఆగస్టులో CBT-1 పరీక్ష ఉండనుంది. పూర్తి వివరాలకు https://www.rrbcdg.gov.in/ సైట్ చూడండి.
టెస్లా తయారు చేసిన సైబర్ ట్రక్ను దుబాయ్ పోలీసులు వినియోగిస్తున్నారు. ‘టెస్లాకు చెందిన అత్యాధునిక ఎలక్ట్రిక్ కారు సైబర్ ట్రక్ పోలీస్ లగ్జరీ పెట్రోలింగ్ ఫ్లీట్లో యాడ్ అయింది’ అని దుబాయ్ పోలీస్ కమాండ్ ట్వీట్ చేసింది. దుబాయ్ క్రౌన్ ప్రిన్స్ షేక్ హమ్దాన్ బిన్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్కు అందించే సెక్యూరిటీలో ఈ సైబర్ ట్రక్ను ఉంచారు. ఆ దేశ పోలీసులు హై-ఎండ్ కార్లను వినియోగిస్తారు.
పార్లమెంట్ ఎన్నికల్లో తమ పార్టీకి పేలవ ఫలితాలు వచ్చిన రాష్ట్రాల్లో నిజ నిర్ధారణ కమిటీలను కాంగ్రెస్ ప్రకటించింది. మొత్తం 8 రాష్ట్రాల్లో కమిటీలు నియమించింది. ఇందులో కాంగ్రెస్ అధికారంలో ఉన్న మూడు రాష్ట్రాలున్నాయి. మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఒడిశా, ఢిల్లీ, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ ఉన్నాయి. కురియన్, రకిబుల్ హుస్సేన్, పర్గత్ సింగ్ తెలంగాణలో ఓటమికి గల కారణాలు తేల్చనున్నారు.
తమిళనాడులోని కల్లకురిచి జిల్లాలో నాటుసారా తాగి 13 మంది మరణించారు. మరో 30 మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనపై సీఎం స్టాలిన్ విచారణకు ఆదేశించారు. కల్లకురిచి కలెక్టర్ను బదిలీ చేశారు. ఎస్పీపై సస్పెన్షన్ వేటు వేశారు. రోజువారీ కూలీలు కరుణాపురంలో నాటుసారా కొనుగోలు చేసి తాగడంతో శ్వాస తీసుకోవడంలో సమస్యలు, దృష్టి లోపం, విరేచనాలు లాంటి లక్షణాలు బయటపడ్డాయి.
AP: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు తగిన పదవులు, శాఖలు వచ్చాయని జనసేన నేత నాగబాబు అన్నారు. పవన్ సామర్థ్యానికి తగిన పదవి దక్కిందని చెప్పారు. పవన్ అన్ని విషయాల్లో అవగాహన ఉన్న వ్యక్తి అని, డిప్యూటీ సీఎంగా చూడడం ఆనందంగా ఉందన్నారు. ఇవన్నీ చూస్తుంటే రాష్ట్రానికి మంచి రోజులు వచ్చినట్లు కనిపిస్తున్నాయని పేర్కొన్నారు. సమాజంలో చాలా విషయాల్లో రిపేర్లు చేయాల్సిన అవసరం ఉందన్నారు.
వరి ధాన్యం రూ.117 పెరిగి ధర రూ.2,300కి చేరింది. జొన్న (రూ.191 పెరిగి) రూ.3,371, మొక్కజొన్న(రూ.135) రూ.2,225, సజ్జలు(రూ.125) రూ.2,625. రాగి(రూ.444) రూ.4,290, కంది(రూ.550) రూ.7,550, పెసర్లు(రూ.124) రూ.8,682, మినుములు(రూ.450) రూ.7,400, వేరు శనగ(రూ.406) ధర రూ.6,783, సన్ ఫ్లవర్(రూ.520) రూ.7,280, సోయా(రూ.292) రూ.4,892, నువ్వులు(రూ.632) రూ.9,267, ఒడిసలు(రూ.983) రూ.8,717, పత్తి (రూ.501) రూ.7,121.
బాలీవుడ్ నటి దీపికా పదుకొణె బేబీ బంప్తో ఉన్న ఫొటోలు రివీల్ చేశారు. గత ఫిబ్రవరిలోనే బిడ్డకు జన్మనివ్వబోతున్నట్లు ప్రకటించిన ఆమె తాజాగా బేబీ బంప్తో ఫొటో షూట్కు పోజులిచ్చారు. ఆ ఫొటోలను ఇన్స్టాగ్రామ్ వేదికగా పంచుకున్నారు. 2018లో వివాహం చేసుకున్న దీపిక, బాలీవుడ్ హీరో రణ్వీర్ సింగ్ వచ్చే సెప్టెంబర్లో బిడ్డకు స్వాగతం పలకబోతున్నారు.
కేంద్ర శిశు సంక్షేమ శాఖ సహాయ మంత్రి సావిత్రి ఠాకూర్ ‘బేటీ పఢావో, బేటీ బచావో’ నినాదాన్ని హిందీలో రాయలేకపోయారు. మధ్యప్రదేశ్లోని బ్రహ్మకుండిలో గల ప్రభుత్వ పాఠశాలలో జరిగిన ‘స్కూల్ ఛలో అభియాన్’ కార్యక్రమంలో కేంద్ర మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా బోర్డుపై స్లోగన్ను సరిగ్గా రాయలేకపోయారు. అయితే, అఫిడవిట్లో ఆమె 12వ తరగతి వరకు చదువుకున్నట్లు పేర్కొన్నారు. దీనిపై విమర్శలొస్తున్నాయి.
*కార్మిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా గోపాలకృష్ణ ద్వివేది
*పురపాలకశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా అనిల్ కుమార్ సింఘాల్
*సివిల్ సప్లై కమిషనర్గా సిద్ధార్థ్ జైన్
*CRDA కమిషనర్గా కాటమనేని భాస్కర్
*ఉన్నత విద్యాశాఖ కార్యదర్శిగా సౌరభ్ గౌర్
*పాఠశాల విద్యాశాఖ కార్యదర్శిగా కోన శశిధర్
*ఉద్యాన, మత్స్య, సహకార కార్యదర్శిగా అహ్మద్ బాబు
*వ్యవసాయశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా రాజశేఖర్
Sorry, no posts matched your criteria.