News June 18, 2024

ఈ నెల 30 నుంచి ‘మన్ కీ బాత్’

image

ఈ నెల 30 నుంచి ప్రధాని నరేంద్ర మోదీ ‘మన్ కీ బాత్’ నిర్వహించనున్నారు. ఎన్నికల కారణంగా కొన్ని నెలలుగా ఈ కార్యక్రమం వాయిదా పడింది. ఇప్పుడు దీనిని పున:ప్రారంభించాలని ప్రధాని నిర్ణయించారు. కాగా మన్ కీ బాత్ ద్వారా మోదీ ప్రజలతో ఏదో ఒక రూపంలో నిరంతరం సంప్రదింపులు జరుపుతారు. ఈ కార్యక్రమం 2014 అక్టోబర్ 3న ప్రారంభించారు. ప్రతి నెలా చివరి ఆదివారం ఆకాశవాణి ద్వారా ఈ కార్యక్రమం కొనసాగుతోంది.

News June 18, 2024

జగన్ త్వరగా పోతే ప్రజలకు మంచి జరుగుతుంది: అయ్యన్న, అచ్చెన్న

image

AP: బ్యాలెట్ పేపర్‌తో పోలింగ్ నిర్వహించాలన్న జగన్‌పై టీడీపీ ఎమ్మెల్యే అయ్యన్నపాత్రుడు, అచ్చెన్నాయుడు Xలో మండిపడ్డారు. ‘ప్రజల గాలి తన వైపు లేదని ఇంత దారుణంగా ప్రజాస్వామ్యాన్ని అవహేళన చేస్తున్న ఈ మనిషి నిజంగా మనిషేనా? తాను గెలిస్తే అన్నీ బాగున్నట్టు, ఓడిపోతే ఈవీఎంల మీద నెపాన్ని నెడతారా? ఇలాంటి దుర్మార్గుడు, రాక్షసుడు ఎంత త్వరగా పోతే ప్రజలకు అంత మంచి జరుగుతుంది’ అని <<13442979>>అనుచిత<<>> వ్యాఖ్యలు చేశారు.

News June 18, 2024

కోహ్లీకి ‘ఫ్లయింగ్ కిస్‌’ ఇవ్వను: రాణా

image

దూకుడుకు మారు పేరైన కోహ్లీ ముందు ఫ్లయింగ్ కిస్‌ సెలబ్రేషన్స్ చేయబోనని KKR బౌలర్ హర్షిత్ రాణా చెప్పుకొచ్చారు. ఓ ఇంటర్వ్యూలో ‘కోహ్లీకి ఫ్లయింగ్ కిస్ ఇవ్వగలరా?’ అనే ప్రశ్న రాణాకు ఎదురైంది. రాణా పైవిధంగా బదులిచ్చారు. SRH బ్యాటర్ అగర్వాల్‌కు ఫ్లయింగ్ కిస్ ఇవ్వడం ప్లాన్ ప్రకారం చేసింది కాదని వివరించారు. ఆ ఫ్లయింగ్ కిస్‌ వల్ల రాణా విమర్శలతో పాటు పెనాల్టీ, ఒక మ్యాచ్ సస్పెన్షన్ కూడా ఎదుర్కొన్నారు.

News June 18, 2024

జియో నెట్‌వర్క్ డౌన్!

image

దేశంలోని పలుచోట్ల జియో నెట్‌వర్క్ స్తంభించిపోయినట్లు తెలుస్తోంది. మొబైల్ నెట్‌వర్క్, ఇంటర్నెట్, ఫైబర్ వంటి సర్వీసులు నిలిచిపోయినట్లు యూజర్లు సోషల్ మీడియాలో ఫిర్యాదులు చేస్తున్నారు. డౌన్‌డిటెక్టర్ ప్రకారం మొబైల్ ఇంటర్నెట్ యూజర్లలో 54% మంది, ఫైబర్ యూజర్లలో 38%, సాధారణ నెట్‌వర్క్ యూజర్లలో 7% మంది ఈ సమస్యలు ఎదుర్కొంటున్నట్లు తెలుస్తోంది. అయితే దీనిపై కంపెనీ నుంచి ఇప్పటి వరకు ఎలాంటి స్పందన రాలేదు.

News June 18, 2024

BREAKING: ఎయిర్‌పోర్టులను పేల్చేస్తామంటూ మెయిల్స్

image

దేశవ్యాప్తంగా 40 ఎయిర్‌పోర్టుల్లో బాంబులు పెట్టామంటూ దుండగులు మెయిల్స్ చేశారు. ఢిల్లీ, పట్నా, జైపూర్, వడోదరా, కోయంబత్తూర్ తదితర విమానాశ్రయాలను పేల్చేస్తామని బెదిరించారు. దీంతో అప్రమత్తమైన సిబ్బంది బాంబ్ స్వ్కాడ్‌తో విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News June 18, 2024

చనిపోతూ ఆరుగురి ప్రాణాలు కాపాడాడు

image

తమ కొడుకు చనిపోయినప్పటికీ మరో ఆరుగురిలో జీవించి ఉంటారనే ఉద్దేశంతో ముష్టిపల్లి శ్రీనివాస్ కుటుంబం అవయవదానం చేసేందుకు ముందుకొచ్చింది. అతని రెండు కిడ్నీలు, లివర్, గుండె, 2 కళ్లు దానం చేయడం ద్వారా ఆరుగురికి పునర్జన్మనిచ్చారని తెలంగాణ జీవన్‌దాన్ Xలో పోస్ట్ చేసింది. శ్రీనివాస్ ఈనెల 14న మరణించినట్లు వెల్లడించింది.

News June 18, 2024

‘గేమ్ ఛేంజర్‌’ కోసం రెండు తేదీలు లాక్?

image

గ్లోబల్ స్టార్ రామ్‌ చరణ్ హీరోగా నటిస్తున్న ‘గేమ్ ఛేంజర్‌’ మూవీపై ఓ క్రేజీ న్యూస్ వైరల్ అవుతోంది. ఈ సినిమాను అక్టోబర్ 31 లేదా డిసెంబర్ 20న రిలీజ్ చేయాలని మేకర్స్ ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే దీనిపై అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రానున్నట్లు టాక్. శంకర్ తెరకెక్కిస్తున్న ఈ మూవీలో కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తున్నారు. తమన్ మ్యూజిక్ అందిస్తున్నారు. దిల్ రాజు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.

News June 18, 2024

TG PGECET ఫలితాలు విడుదల.. WAY2NEWSలో వేగంగా తెలుసుకోండి

image

TG: రాష్ట్రంలో ఎంటెక్, ఎంఫార్మసీ, ఎంఆర్క్ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించిన PGECET ఫలితాలు విడుదలయ్యాయి. Way2News యాప్‌లో సులభంగా రిజల్ట్స్ తెలుసుకోవచ్చు. మిగతా ప్లాట్‌ఫాంల తరహాలో విసిగించే యాడ్స్, లోడింగ్ సమస్యలు మన యాప్‌లో ఉండవు. ప్రత్యేక స్క్రీన్‌లో హాల్‌టికెట్ నంబర్ ఎంటర్ చేసి క్లిక్ చేస్తే ఫలితాలు వస్తాయి. ఒక్క క్లిక్‌తో వాట్సాప్ సహా ఏ ప్లాట్‌ఫాంకైనా రిజల్ట్‌ను షేర్ చేసుకోవచ్చు.

News June 18, 2024

T20 వరల్డ్ కప్‌లో ఫిక్సింగ్ కలకలం!

image

T20 WCలో ఫిక్సింగ్ కలకలం రేగింది. తనను కొంతమంది బుకీలు సంప్రదించారని ఓ ఉగాండా ప్లేయర్ ICCకి ఫిర్యాదు చేశారు. కెన్యాకు చెందిన ఓ మాజీ క్రికెటర్ పదే పదే ఫోన్లు చేసినట్లు ఆయన ఐసీసీకి సమాచారమిచ్చారు. దీనిపై ICC యాంటీ కరప్షన్ యూనిట్ అధికారులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. కాగా T20 WCకు ఉగాండా అర్హత సాధించడం ఇదే తొలిసారి. నాలుగు మ్యాచ్‌లు ఆడి ఒకే ఒక్క దాంట్లో గెలిచింది.

News June 18, 2024

మీరు గెలిస్తే EVMలు మంచివి.. లేదంటే చెడ్డవా?: లోకేశ్

image

AP: మీరు 2019లో గెలిచినప్పుడు ఈవీఎంలు మంచివి, కానీ 2024లో ఓడిపోతే అవి చెడ్డవా అని మాజీ సీఎం జగన్‌ను మంత్రి నారా లోకేశ్ నిలదీశారు. ఈవీఎంల పనితీరుపై ప్రశ్నించే హక్కు జగన్‌కు లేదని మండిపడ్డారు. ‘ప్రజాధనంతో కొన్న ఫర్నిచర్ ఎప్పుడు తిరిగిస్తున్నారు. రూ.560 కోట్లు పెట్టి రుషికొండ ప్యాలెస్ ఎందుకు నిర్మించారు? వీటిపై రాష్ట్ర ప్రజలకు సమాధానం కావాలి’ అని ఆయన ఎక్స్‌లో ట్వీట్ చేశారు.