News June 17, 2024

జగన్ తాడేపల్లి నివాసం వద్ద బారికేడ్ల తొలగింపు

image

AP: తాడేపల్లిలో మాజీ CM జగన్ నివాసం వెనుక రోడ్డుపై భద్రత దృష్ట్యా ప్రజల రాకపోకలు జరగకుండా ఏర్పాటు చేసిన బారికేడ్లను అధికారులు తాజాగా తొలగించారు. జగన్ సీఎంగా ఉన్న సమయంలో కృష్ణా పశ్చిమ డెల్టా కాలువ కట్ట రోడ్డు, దానికి దిగువనున్న రోడ్డుపై ప్రవేశం లేదు. దీంతో సీతానగరం నుంచి రేవేంద్రపాడుకు వెళ్లాల్సినవారు ఒకటిన్నర కిలోమీటర్ల దూరం తిరిగి వెళ్లేవారు. టీడీపీ సర్కారు ఆ మార్గాన్ని తాజాగా ప్రజలకు తెరిచింది.

News June 17, 2024

రెండు రైళ్లు ఢీ.. ‘కవచ్’ ఎక్కడుందంటూ ఫైర్!

image

పశ్చిమ బెంగాల్‌‌లో రెండు రైళ్లు ఢీ కొనడంతో మరోసారి కవచ్ సిస్టమ్ గురించి నెటిజన్లు చర్చించుకుంటున్నారు. ఒకే ట్రాక్ మీద వస్తోన్న రెండు రైళ్లు ఢీ కొనకుండా ఆపే ఆటోమేటిక్ వ్యవస్థ ఈ ప్రమాదాన్ని ఆపలేకపోయిందంటున్నారు. రూ.వందల కోట్లు ఖర్చు చేసి ఈ సాంకేతికత తీసుకొచ్చినా.. రైల్వే ప్రమాదాలను నివారించలేకపోతోందని మండిపడుతున్నారు. అయితే ఈ రూట్‌లో ఈ టెక్నాలజీ ఉందా? లేదా? అనేది తెలియాల్సి ఉంది. మీ కామెంట్?

News June 17, 2024

అత్యల్ప స్కోర్‌ను డిఫెండ్ చేసుకున్న బంగ్లా!

image

టీ20 WCలో బంగ్లాదేశ్ అరుదైన ఫీట్ సాధించింది. ఈ టోర్నీలో ఇప్పటివరకు అత్యంత తక్కువ స్కోర్‌ను డిఫెండ్ చేసుకున్న జట్టుగా నిలిచింది. ఇవాళ నేపాల్‌తో జరిగిన మ్యాచ్‌లో 107 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించిన బంగ్లా.. ప్రత్యర్థిని 85 పరుగులకే కట్టడి చేసింది. ఇదే టోర్నీలో సౌతాఫ్రికా 114, 116(Vs బంగ్లాదేశ్, నేపాల్), భారత్ 120(Vs పాకిస్థాన్) స్కోర్‌ను కాపాడుకుని విజయం సాధించాయి.

News June 17, 2024

ఏడాదిలోనే నాలుగు ఘోర రైలు ప్రమాదాలు

image

వరుస ప్రమాదాలు భారతీయ రైల్వేకు మాయని మచ్చగా మారుతున్నాయి. 2023 జూన్ 2న ఒడిశాలోని బాలాసోర్‌ రైలు దుర్ఘటనలో 293మంది మరణించారు. అదే ఏడాది OCTలో విజయనగరంలో 2 రైళ్లు ఢీకొనడంతో 14 మంది చనిపోయారు. ఈనెల 2న పంజాబ్‌లోని ఫతేగఢ్ సాహెబ్‌ ప్రమాదంలో ఇద్దరు గాయపడ్డారు. తాజాగా ఇవాళ బెంగాల్‌ న్యూజల్పాయిగుడిలో ప్యాసింజర్, గూడ్స్ ఢీకొనడంతో ఐదుగురు మరణించారు. దీంతో ఇండియన్ రైల్వేపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి.

News June 17, 2024

షూటింగ్ సెట్స్‌లోకి పవన్.. ముందుగా ‘హరిహర వీరమల్లు’

image

ఎన్నికలు ముగియడంతో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ షూటింగ్ సెట్స్‌లోకి అడుగుపెట్టబోతున్నారు. ప్రస్తుతం ఆయన చేతిలో హరిహర వీరమల్లు, ఓజీ, ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలున్నాయి. ఇప్పటికే హరిహర వీరమల్లు సినిమా షూటింగ్ 50 శాతం పూర్తయింది. ఈ క్రమంలో కాల్ షీట్స్ ముందుగా ప్రారంభమైన ఈ చిత్రానికే పవన్ కేటాయించారట. జూన్ చివరిలో లేదా జులై మొదటి వారంలో షూటింగ్‌లో పవర్ స్టార్ పాల్గొననున్నారు.

News June 17, 2024

గత ఐదేళ్లు తిరుమలలో ప్రతి పనికీ కమీషన్లే: భానుప్రకాశ్

image

AP: వైసీపీ హయాంలో తిరుమలలో ప్రతి పనికీ 10శాతం నుంచి 15శాతం వరకు కమీషన్ల వసూళ్లు నడిచాయని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి భానుప్రకాశ్ రెడ్డి ఆరోపించారు. ప్రొటోకాల్ దర్శనం మొదలు ప్రసాదం వరకు అన్నింట్లోనూ అవకతవకలు జరిగాయన్నారు. ఆ అరాచకాలపై న్యాయవిచారణ జరగాలని, తప్పు చేసిన ప్రతి ఒక్కర్నీ చట్టం ముందుకు తీసుకొస్తామని హామీ ఇచ్చారు. మాజీ సీఎం జగన్ ఇక తీర్థయాత్రలు చేసుకోవాలని ఆయన హితవు పలికారు.

News June 17, 2024

యుద్ధప్రాతిపదికన సహాయక చర్యలు: అశ్వినీ

image

పశ్చిమ బెంగాల్‌లోని డార్జిలింగ్(D) న్యూజల్పాయిగుడి <<13455686>>రైలు ప్రమాదంపై<<>> రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ స్పందించారు. ‘NFR జోన్‌లో జరిగిన ఘోర ప్రమాదంలో యుద్ధప్రాతిపదికన సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. రైల్వే, NDRF, SDRF సమన్వయంతో పనిచేస్తున్నాయి. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలిస్తున్నారు. ఉన్నతాధికారులు ఘటనాస్థలికి చేరుకున్నారు’ అని Xలో పోస్ట్ చేశారు. ప్రమాద దృశ్యాలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి.

News June 17, 2024

స్మృతి మంధాన అరుదైన ఫీట్

image

భారత మహిళా క్రికెటర్ స్మృతి మంధాన అరుదైన ఘనత సాధించారు. నిన్న దక్షిణాఫ్రికాతో మ్యాచులో సెంచరీతో అంతర్జాతీయ క్రికెట్‌లో 7వేల పరుగులు పూర్తి చేసుకున్నారు. దీంతో మిథాలీ రాజ్ తర్వాత అత్యధిక పరుగులు చేసిన భారత ప్లేయర్‌గా నిలిచారు. మిథాలీ అన్ని ఫార్మాట్లలో కలిపి 10వేలకు పైగా పరుగులు చేశారు.

News June 17, 2024

J&Kలో ఉగ్ర కలకలం.. భద్రతాబలగాల సెర్చ్ ఆపరేషన్

image

జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదుల కలకలం కొనసాగుతోంది. నిన్న బందిపొర జిల్లాలోని అడవిలో కాల్పుల శబ్దం వినిపించడంతో భద్రతాబలగాలు సెర్చ్ ఆపరేషన్ మొదలుపెట్టాయి. ఉగ్రవాదులు అడవిలో నక్కి ఉండొచ్చని భావిస్తున్నారు. కాగా ఇటీవల ఉగ్రదాడుల్లో రియాసిలో 9 మంది ప్రయాణికులు, కతువాలో ఓ జవాన్ మరణించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే కేంద్ర హోంమంత్రి అమిత్ షా సైతం కశ్మీర్‌లో భద్రతపై నిన్న కీలక సమావేశం నిర్వహించారు.

News June 17, 2024

ఇవాళ్టితో ముగుస్తున్న గడువు

image

TG: ఓయూతో పాటు రాష్ట్రంలోని పలు యూనివర్సిటీల్లో ప్రవేశాలకు నిర్వహించే సీపీజీఈటీ-2024 దరఖాస్తు గడువు ఇవాళ్టితో ముగియనుంది. రూ.500 అపరాధ రుసుముతో ఈ నెల 25, రూ.2000 ఫైన్‌తో ఈ నెల 30 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. జూలై 6 నుంచి 15 వరకు పరీక్షలు కొనసాగుతాయి. రేపు పరీక్షల షెడ్యూల్‌ను అధికారులు విడుదల చేయనున్నారు. దరఖాస్తు చేసేందుకు ఇక్కడ <>క్లిక్<<>> చేయండి.