India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో తెరకెక్కే మూవీలో యానిమల్ ఫేమ్ బాబీ డియోల్ నటించనున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలోని శక్తిమంతమైన విలన్ పాత్ర కోసం ఆయనను ప్రశాంత్ నీల్ కలిసినట్లు టాక్ నడుస్తోంది. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ప్రస్తుతం NTR దేవర, వార్ సినిమాలతో బిజీగా ఉన్నారు. ప్రశాంత్ నీల్ ‘సలార్’ పార్ట్-2 తెరకెక్కించే పనిలో ఉన్నారు. ఇవి పూర్తయ్యాక ఈ ప్రాజెక్టు పట్టాలెక్కనుందని సమాచారం.
నమీబియా క్రికెటర్ డేవిడ్ వైస్ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించారు. ఇంగ్లండ్తో జరిగిన మ్యాచులో ఓటమి అనంతరం అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకుంటున్నట్లు అనౌన్స్ చేశారు. 39 ఏళ్ల డేవిడ్ తన అంతర్జాతీయ కెరీర్లో 15 వన్డేలు, 53 టీ20ల్లో 927 పరుగులు, 73 వికెట్లు తీశారు. తన చివరి మ్యాచులో పొదుపుగా బౌలింగ్ చేసి వికెట్ తీయడమే కాకుండా 12 బంతుల్లో 27 పరుగులు చేశారు.
సార్వత్రిక ఎన్నికల్లో NDAకు గట్టి పోటీ ఇచ్చిన INDIA కూటమి గత ఐదేళ్లుగా ఖాళీగా ఉన్న డిప్యూటీ స్పీకర్ పదవి ఆశిస్తున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ కేంద్రం ఆ పదవి ఇవ్వకపోతే స్పీకర్ పదవికి పోటీ చేస్తుందని రాజకీయ వర్గాలు పేర్కొన్నాయి. ఈ నెల 24న పార్లమెంటు సమావేశాలు ప్రారంభం కానుండగా కొత్తగా ఎన్నికైన సభ్యులు లోక్సభ స్పీకర్ను ఎన్నుకోనున్నారు. మరోవైపు స్పీకర్ పదవిపై NDA <<13417512>>మిత్రపక్షాలు<<>> కన్నేసిన సంగతి తెలిసిందే.
T20WCలో తప్పక గెలవాల్సిన మ్యాచులో ఇంగ్లండ్ విజయం సాధించింది. నమీబియాతో జరిగిన మ్యాచులో వర్షం కారణంగా ఓవర్లు కుదించారు. ముందుగా బ్యాటింగ్ చేసిన ENG 10 ఓవర్లలో 122 పరుగులు చేసింది. ఛేదనలో నమీబియా తడబడింది. DLS ప్రకారం 10 ఓవర్లలో 127 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించగా 84 పరుగులకే పరిమితమైంది. దీంతో ENG సూపర్-8 ఆశలు సజీవంగా ఉన్నాయి. ఒకవేళ AUSపై స్కాట్లాండ్ గెలిస్తే ENG టోర్నీ నుంచి నిష్క్రమించనుంది.
దేశీయ దిగ్గజ ఐటీ కంపెనీ టీసీఎస్లో 80వేల ఖాళీలు ఉన్నట్లు ఆ సంస్థ వెల్లడించింది. స్కిల్స్ ఉన్న అభ్యర్థుల కొరతతోనే వాటి భర్తీ ప్రక్రియ నిలిచిపోయినట్లు పేర్కొంది. నైపుణ్యాలు లేదా ఉద్యోగి ఆకాంక్షలు ప్రాజెక్టు అవసరాలకు సరిపోవడంలేదని ఆ సంస్థ ఉద్యోగి TOIకి వెల్లడించారు. కాగా గత రెండేళ్లుగా TCSలో ఉద్యోగ నియామక జాప్యం వల్ల 10వేల మంది ఫ్రెషర్లు ప్రభావితమైనట్లు NITES పేర్కొంది.
ఓ మహిళ(40) ఆన్లైన్ మోసగాడి చేతిలో రూ.11 లక్షలు నష్టపోయింది. తాను ఓ ముఠా చేతిలో చిక్కుకున్నానని, ఫలానా మొత్తం వారికిస్తే కానీ విడిచిపెట్టరని కేటుగాడు ఆమెను నమ్మించాడు. ఈక్రమంలో అతడితో ప్రేమలో పడిన ఆమె, మరిన్ని మోసాలు చేసేందుకు సహకరించింది. దీంతో అరెస్టైంది. ఈ ఆసక్తికర ఘటన చైనాలో చోటుచేసుకుంది. దీన్ని స్టాక్హోమ్ సిండ్రోమ్(హాని తలపెట్టేవారిని ప్రేమించడం)గా వర్ణిస్తున్నారు మానసిక వైద్యులు.
జర్మనీలో యూరో చాంపియన్ షిప్-2024 టోర్నీ తొలి రోజు జరిగిన మ్యాచుల్లో జర్మనీ, స్విట్జర్లాండ్, స్పెయిన్ విజయం సాధించాయి. తొలి మ్యాచులో స్కాట్లాండ్పై ఆతిథ్య జర్మనీ 5-1 తేడాతో బోణి కొట్టింది. మరో మ్యాచులో హంగేరీపై స్విట్జర్లాండ్ 3-1 పాయింట్ల తేడాతో గెలిచింది. ఇక క్రొయేషియాపై స్పెయిన్ 3-0తేడాతో విజయం సాధించింది. ఈ సారి 24 జట్లు టైటిల్ పోరుకు సిద్ధమవ్వగా, ఆరు గ్రూపులుగా విభజించారు.
నీట్-యూజీ పరీక్షలో అక్రమాలపై సీబీఐతో దర్యాప్తు జరిపించాలని ఏబీవీపీ డిమాండ్ చేసింది. ఈ ఏడాది 67మంది విద్యార్థులు ఫస్ట్ ర్యాంక్ పొందడం, వారిలో ఆరుగురు హరియాణాలో ఒకే పరీక్షాకేంద్రానికి చెందినవారే కావడం కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో.. ఏబీవీపీ ప్రతినిధుల బృందం కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ను కలిసి నీట్ పరీక్ష నిర్వహణలో అవకతవకలపై దర్యాప్తు చేయించాలని విజ్ఞప్తి చేసింది.
అనవసరమైన గందరగోళాన్ని సృష్టించేందుకే తనపై పోక్సో <<13434208>>కేసు<<>> నమోదు చేశారని కర్ణాటక మాజీ సీఎం యడియూరప్ప అన్నారు. త్వరలోనే ఈ కేసులో వాస్తవాలు బయటపడతాయని ధీమా వ్యక్తం చేశారు. ఈ నెల 17న CID విచారణకు హాజరవుతానని చెప్పారు. ఈ కేసులో తాను ఎవరిని తప్పుపట్టడం లేదని, కాలమే అన్నింటిని నిర్ణయిస్తుందని తెలిపారు. తనపై కుట్రలు చేసిన వారికి ప్రజలే బుద్ధి చెప్తారని పేర్కొన్నారు.
*1963: అంతరిక్షంలో ప్రయాణించిన తొలి మహిళగా వాలంటీనా తెరిస్కోవా(సోవియట్ యూనియన్) రికార్డు.
*1917: తెలుగు కవి నముడూరు అప్పలనరసింహం జననం.
*1949: సంస్కృత పండితుడు విశ్వనాథ గోపాలకృష్ణ శాస్త్రి జననం.
*1950: బాలీవుడ్ నటుడు మిథున్ చక్రవర్తి జననం.
*1905: రచయిత మల్లాది రామకృష్ణశాస్త్రి జననం.
Sorry, no posts matched your criteria.