India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
తిరుపతిలో టికెట్ల జారీ కేంద్రాల వద్ద తొక్కిసలాట ఘటనపై రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటనలో మరణాలు చోటు చేసుకోవడం బాధించినట్లు ట్వీట్ చేశారు. వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. కాగా ఈ ఘటనలో ఆరుగురు మరణించగా 40 మంది గాయపడ్డారు.
TG: అభయహస్తం పథకంలోని రూ.385 కోట్ల నిధులను మహిళలకు తిరిగివ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది. 2009లో అభయహస్తం పథకంలో భాగంగా మహిళలు రోజుకు రూపాయి చొప్పున ఆరేళ్లపాటు చెల్లించారు. ఈ నిధులను గత ప్రభుత్వం ఇతర అవసరాలకు వినియోగించినట్లు సర్కార్ గుర్తించింది. 2022 నాటికి ఆ డబ్బులు వడ్డీతో కలిపి రూ.545 కోట్లకు చేరాయి. ఇప్పుడు వీటిని తిరిగివ్వాలని రేవంత్ సర్కార్ యోచిస్తున్నట్లు సమాచారం.
AP: తిరుమల తొక్కిసలాట ఘటన నేపథ్యంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కర్నూలు జిల్లా పర్యటన రద్దు అయింది. గ్రీన్ కో రెన్యువబుల్ ఎనర్జీ ప్రాజెక్టును పవన్ పరిశీలించాల్సి ఉంది. అలాగే అనివార్య కారణాల వల్ల మంత్రి నారా లోకేశ్ కర్నూలు పర్యటన కూడా రద్దైనట్లు అధికారులు తెలిపారు. లోకేశ్ ఇవాళ కర్నూలులో పలు కళాశాలల సందర్శనతోపాటు మంత్రి భరత్ కుమార్తె రిసెప్షన్ వేడుకల్లో పాల్గొనాల్సి ఉంది.
వన్డే వరల్డ్ కప్లో తర్వాత గాయంతో క్రికెట్కు దూరమైన మహ్మద్ షమీ తిరిగి జట్టుతో చేరనున్నట్లు తెలుస్తోంది. ఇంగ్లండ్తో స్వదేశంలో జరిగే వన్డే సిరీస్లో ఆయన రీఎంట్రీ ఇస్తారని క్రిక్ బజ్ కథనం పేర్కొంది. ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్లోనే ఆయన ఆడుతారని భావించినా ఫిట్నెస్ లేమితో జట్టులోకి రాలేదు. ఇంగ్లండ్తో సిరీస్కు బుమ్రాకి రెస్ట్ ఇవ్వడంతో షమీ టీమ్లోకి వస్తే భారత బౌలింగ్ పటిష్ఠం కానుంది.
AP: డీఎస్పీ గేటు తీసేటప్పుడు జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్లే తొక్కిసలాట ఘటన జరిగి ఉంటుందని టీటీడీ ఈవో శ్యామలరావు వెల్లడించారు. దీనిపై విచారణ తర్వాత పూర్తి వివరాలు తెలిసే అవకాశం ఉందన్నారు. బాధితులకు మెరుగైన వైద్యం అందుతోందని స్విమ్స్ వైద్యులు చెప్పారు. ఎవరి ప్రాణాలకూ ముప్పు లేదని, 2-3 రోజుల్లో అందరూ డిశ్చార్జ్ అవుతారని తెలిపారు.
AP: తిరుపతి తొక్కిసలాట ఘటనలో ఆరుగురి చావుకు కారణమైన సీఎం చంద్రబాబు వెంటనే రాజీనామా చేయాలని వైసీపీ నేత రోజా డిమాండ్ చేశారు. అధికార యంత్రాంగాన్ని సీఎం పర్యటనకు వినియోగించుకున్నారని మండిపడ్డారు. ప్రభుత్వానికి సామాన్యులంటే ఇంత నిర్లక్ష్యమా అని ప్రశ్నించారు. ఈ ఘటనలో టీటీడీ ఛైర్మన్, ఈవో, ఎస్పీ, ఇతర అధికారులపై కేసు నమోదు చేయాలన్నారు. దీనిపై ఉన్నత స్థాయి విచారణ జరపాలన్నారు.
AP: బకాయిలు చెల్లించకపోతే NTR వైద్య సేవ నెట్వర్క్ ఆస్పత్రుల్లో ఈ నెల 25 తర్వాత వైద్య సేవలన్నీ నిలిపేస్తామని ఏపీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ అసోసియేషన్ (ఆశా) తెలిపింది. ఆరోగ్యశాఖ స్పెషల్ సీఎస్తో జరిగిన భేటీలో ఆశా ప్రతినిధులు మాట్లాడుతూ రూ.500కోట్లు విడుదల చేయడం వల్ల ప్రయోజనం ఉండదని, రూ.1000కోట్లు విడుదల చేస్తేనే ఆందోళన విరమిస్తామన్నారు. 6వ తేదీ నుంచి ఓపీ, EHS సేవలు నిలిపేసిన విషయం తెలిసిందే.
APలోని స్కూళ్లకు రేపటి నుంచి సంక్రాంతి సెలవులు ప్రారంభం కానున్నాయి. జనవరి 19 (ఆదివారం) వరకు సెలవులు ఉంటాయి. 20వ తేదీ పాఠశాలలు తిరిగి తెరుచుకుంటాయి. కాలేజీలకు సెలవులపై ఇంకా క్లారిటీ రాలేదు. మరి మీరు సంక్రాంతికి ఎక్కడికి వెళ్తున్నారు? ఎలా ఎంజాయ్ చేయబోతున్నారు? కామెంట్ చేయండి.
TG: ACB విచారణ నేపథ్యంలో BRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTR ఇంటికి బీఆర్ఎస్ నేతలు క్యూ కడుతున్నారు. కేటీఆర్ సోదరి, MLC కవిత ఆయన నివాసానికి చేరుకున్నారు. ఆమెతోపాటు మరికొందరు కీలక నేతలు కూడా అక్కడికి వెళ్లారు. కాగా ఇవాళ ఏసీబీ కార్యాలయానికి కేటీఆర్ విచారణకు హాజరవుతున్నారు. విచారణ అనంతరం ఆయనను అరెస్ట్ చేస్తారనే ఊహాగానాలు వస్తున్నాయి. మరోవైపు బీఆర్ఎస్ కీలక నేతలను హౌస్ అరెస్ట్ చేస్తారని వార్తలు వస్తున్నాయి.
నందమూరి బాలకృష్ణ హీరోగా నటిస్తున్న ‘డాకు మహారాజ్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ను రద్దు చేస్తున్నట్లు నిర్మాతలు ప్రకటించారు. తిరుమల తొక్కిసలాట ఘటన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. కాగా ఇవాళ అనంతపురంలో ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగాల్సి ఉంది. ఈ వేడుకకు మంత్రి నారా లోకేశ్ హాజరు కావాల్సి ఉంది. బాబీ తెరకెక్కించిన ఈ మూవీ ఈ నెల 12న విడుదల కానుంది.
Sorry, no posts matched your criteria.