India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
NDA ప్రభుత్వం అనుకోకుండా ఏర్పడిందని, అది ఎప్పుడైనా కూలిపోవచ్చని AICC చీఫ్ మల్లికార్జున ఖర్గే అన్నారు. ‘దేశ ప్రజల బాగు కోసం మేం ఎలాంటి నిర్ణయాలైనా తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నాం. ఇండియా కూటమికి పరస్పరం సహకరించుకుంటూ దేశాన్ని పటిష్ఠం చేయాలని ఉంది. కానీ మేము NDA సర్కార్ కూలిపోవాలని కోరుకోవటం లేదు. ప్రజలకు సుస్థిర పాలన అందాలని ఆశిస్తున్నాం’ అంటూ ఆయన వ్యాఖ్యానించారు.
TG: జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్కు మాజీ సీఎం కేసీఆర్ 12 పేజీలతో కూడిన లేఖ రాశారు. ‘బీఆర్ఎస్ హయాంలో 24 గంటల నాణ్యమైన విద్యుత్ అందించాం. కరెంట్ విషయంలో గణనీయమైన మార్పు చూపించాం. కానీ రాజకీయ కక్షతోనే విచారణ కమిషన్ ఏర్పాటు చేశారు. నేను ఎలాంటి అవినీతి, అక్రమాలకు పాల్పడలేదు. కమిషన్ ఛైర్మన్ ఇష్టం వచ్చినట్లు మాట్లాడారు. ఆయన వ్యాఖ్యలు నన్ను బాధించాయి.’ అని ఆయన లేఖలో పేర్కొన్నారు.
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ‘కిషన్ రెడ్డి నిబద్ధత, అనుభవం కలిగిన నాయకుడు. అలాంటి నాయకుడితో కలిసి పనిచేయడం గర్వంగా ఉంది’ అని పెమ్మసాని పేర్కొన్నారు. కాగా కేంద్ర కేబినెట్లో తెలంగాణ నుంచి కిషన్ రెడ్డి, ఏపీ నుంచి పెమ్మసానికి కేంద్ర కేబినెట్లో చోటు దక్కిన సంగతి తెలిసిందే.
AP: అనంతపురం జిల్లా కనేకల్ మం. తుంబిగనూరులో దుండగులు దుశ్చర్యకు పాల్పడ్డారు. తాగునీటి శుద్ధజల ట్యాంకులో నిన్న రాత్రి పురుగు మందు కలిపి విషప్రయోగానికి కుట్ర చేశారు. ఉదయాన్నే ట్యాంకులో డబ్బా గుర్తించి, ఎవరూ ఆ నీళ్లు తాగకపోవడంతో ముప్పు తప్పింది. టీడీపీ గెలిచిందన్న అక్కసుతోనే ఈ దుశ్చర్యకు పాల్పడ్డారని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. ఎస్సై ఆ గ్రామానికి చేరుకుని పరిశీలిస్తున్నారు.
బిహార్ CM నితీశ్ కుమార్ PM మోదీ కాళ్లను తాకి ఆ రాష్ట్ర ప్రజల్ని అవమానించారని ప్రశాంత్ కిశోర్ అన్నారు. అధికారంలో కొనసాగడం కోసమే ఆయన అలా చేశారని ఆరోపించారు. ‘నేను గతంలో నితీశ్తో పనిచేసినప్పుడు ఆయన వ్యక్తిత్వం వేరు. అప్పుడు ఆయన తన మనస్సాక్షిని అమ్మకానికి పెట్టలేదు. ఇప్పుడు NDAలో కీలకంగా వ్యవహరిస్తున్నప్పటికీ ఈ అవకాశాన్ని ఆయన రాష్ట్ర ప్రయోజనాల కోసం వాడుకోవట్లేదు’ అని విమర్శించారు.
TG: రాష్ట్రంలోని 1,497 గ్రామాలకు RTC బస్సులు లేకపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. రద్దు చేసిన బస్సుల్ని పునరుద్ధరించాలని కోరుతున్నారు. 2014-15 నాటికి RTCలో 10,479 బస్సులు ఉండగా, 2024 నాటికి 8,574 మాత్రమే ఉన్నాయి. బస్సులు తక్కువగా ఉండడం, అనూహ్యంగా ప్రయాణికులు పెరగడంతో సమస్యలు ఏర్పడుతున్నాయి. దీంతో పెద్ద సంఖ్యలో కొత్త బస్సుల్ని తీసుకొస్తేనే సమస్యలు పరిష్కారమవుతాయని పలువురు సూచిస్తున్నారు.
T20 WCలో నేడు కెనడాతో జరిగే మ్యాచులో టీమ్ఇండియా పలు మార్పులతో బరిలోకి దిగే అవకాశం ఉంది. ఇప్పటివరకు బెంచ్కే పరిమితమైన జైస్వాల్, శాంసన్, కుల్దీప్, చాహల్లో ఎవరైనా ముగ్గురిని ఆడించొచ్చని క్రికెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఓపెనర్గా జైస్వాల్ను, మూడో స్థానంలో కోహ్లీని, జడేజా స్థానంలో కుల్దీప్, దూబే స్థానంలో శాంసన్, సిరాజ్ స్థానంలో చాహల్ను ఆడించే అవకాశం ఉందని అంటున్నారు.
AP: అధికారుల బదిలీలపై సీఎం చంద్రబాబు కసరత్తు చేస్తున్నారు. వైసీపీకి అంటకాగి కళంకితులుగా పేరు తెచ్చుకున్న అధికారులను దూరంగా పెట్టాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. సమర్థ అధికారులు, నిబంధనల ప్రకారం పనిచేసే వారికే కీలక పోస్టింగ్స్ ఇచ్చే యోచనలో ఉన్నారు. అన్ని విభాగాల్లో పూర్తిస్థాయి ప్రక్షాళన చేయాలని CBN భావిస్తున్నారు.
న్యూజిలాండ్ స్టార్ పేసర్ టిమ్ సౌతీ అరుదైన ఘనత సాధించారు. టీ20 వరల్డ్ కప్లో అత్యంత పొదుపుగా బౌలింగ్ చేసిన తొలి బౌలర్గా ఆయన రికార్డులకెక్కారు. ఉగాండాతో జరిగిన మ్యాచ్లో సౌతీ 3/4 రాణించారు. అతడి తర్వాత ఉగాండా స్పిన్నర్ ఫ్రాంక్ సుబుగా (2/4) ఉన్నారు. పపువా న్యూగినియాపై ఆయన ఈ ఘనత సాధించారు. కాగా టీ20 ప్రపంచ కప్లో అత్యధిక మెయిడెన్ ఓవర్లు వేసిన బౌలర్గానూ సౌతీ (3) నిలిచారు.
సౌతాఫ్రికాతో జరిగిన టీ20 వరల్డ్ కప్ మ్యాచ్లో నేపాల్ ఓడిపోయింది. ఈక్రమంలో స్టేడియంలో ప్లకార్డుతో ఉన్న ఓ నేపాల్ అభిమాని ఫొటో వైరలవుతోంది. ‘ప్యాషన్ ఎంతటి దూరాన్నైనా దగ్గర చేస్తుంది. నేపాల్కు సపోర్ట్ చేసేందుకు 16,287 కిలో మీటర్లు ప్రయాణించా. ఎందుకంటే కొన్ని కలలకు ప్రతి మైలు విలువైనదే’ అని ప్లకార్డులో ఉంది. ‘నేపాల్ టీమ్ పోరాటం చూసి ప్రపంచం గర్విస్తోంది’ అని రాజస్థాన్ రాయల్స్ టీమ్ ట్వీట్ చేసింది.
Sorry, no posts matched your criteria.