India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
* ఏపీ సీఎంగా చంద్రబాబు ప్రమాణస్వీకారం
* మంత్రులుగా పవన్, లోకేశ్ ప్రమాణం
* తెలంగాణ టెట్ ఫలితాలు విడుదల
* ‘దోస్త్’ కౌన్సెలింగ్ గడువు పెంపు
* ఒడిశా సీఎంగా చరణ్ మోహన్ మాఝీ ప్రమాణ స్వీకారం
* కువైట్లో భారీ అగ్నిప్రమాదం 50 మందికి పైగా మృతి
AP: ఈ ఎన్నికల్లో YCP గెలుస్తుందని భారీగా బెట్టింగులు వేసిన ద్వితీయ శ్రేణి నేతలు, అభిమానులు అప్పుల్లో కూరుకుపోయి విలవిల్లాడుతున్నారట. ఇటీవల ఓ వ్యక్తి YCPపై రూ.30 కోట్ల బెట్టింగ్ వేసి ఆత్మహత్యకు పాల్పడిన సంగతి తెలిసిందే. చాలామంది ఎగ్జిట్ పోల్స్ని నమ్ముకునే బెట్టింగులు వేసి నష్టపోయినట్లు వాపోతున్నారు. ఇటు కొందరు YCP అభ్యర్థులు సైతం ఎన్నికలతో ఆర్థికంగా దెబ్బతిన్నట్లు బాహాటంగానే ఆవేదన వెలిబుచ్చారు.
T20WCలో అమెరికాపై భారత్ 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. దీంతో గ్రూప్-Aలో హ్యాట్రిక్ గెలుపులతో రోహిత్ సేన సూపర్-8కు చేరింది. ఇవాళ్టి మ్యాచ్లో తొలుత US 110/8 స్కోరు చేయగా, టీమ్ ఇండియా 18.2 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించింది. భారత బౌలర్లలో అర్ష్దీప్ 4, హార్దిక్ 2, అక్షర్ ఒక వికెట్ తీశారు. రోహిత్ 3, కోహ్లి 0, పంత్ 18, సూర్య 50*, శివమ్ దూబే 31* పరుగులు చేశారు.
AP: రాష్ట్రంలో రేపు పలు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. ఉమ్మడి విజయనగరం, శ్రీకాకుళం, గుంటూరు, వైజాగ్, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, నెల్లూరు, ప్రకాశంతో పాటు రాయలసీమలోని జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురుస్తాయని పేర్కొంది.
సార్వత్రిక ఎన్నికల సమయంలో తమ హెలికాప్టర్లతో దేశవ్యాప్తంగా 1750 ప్రదేశాల్లో 1000 గంటలకు పైగా సేవలందించామని వాయుసేన వెల్లడించింది. ఈ సేవలకు తేలికపాటి చేతక్, ALH ధ్రువ్, ఎంఐ-17 మీడియం లిఫ్ట్ హెలికాప్టర్లను విస్తృతంగా ఉపయోగించినట్లు పేర్కొంది. పోలింగ్కు ముందు మారుమూల ప్రాంతాలకు ఎన్నికల సిబ్బంది, సామగ్రిని తరలించడం, తిరిగి తీసుకురావడం సవాలుతో కూడుకున్నదని తెలిపింది.
బెంగళూరు రేవ్ పార్టీ కేసులో అరెస్టైన నటి హేమకు బెయిల్ మంజూరైంది. బెంగళూరు రూరల్ ఎన్డీపీఎస్ ప్రత్యేక కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ప్రస్తుతం జుడీషియల్ కస్టడీలో భాగంగా హేమ పరప్పన అగ్రహార జైల్లో ఉన్నారు. బెయిల్ రావడంతో రేపు జైలు నుంచి బయటకి రానున్నారు.
TG: గ్రూప్-1 ప్రిలిమ్స్ కీని TGPSC విడుదల చేసింది. కీతో పాటు మాస్టర్ ప్రశ్నాపత్రాన్ని కూడా వెబ్సైటులో అందుబాటులో ఉంచింది. జూన్ 13 నుంచి 17వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు ఈ లింక్ అందుబాటులో ఉంటుంది. లాగిన్ అయ్యాక కీ పై అభ్యంతరాలుంటే అభ్యర్థులు టెక్స్ట్ బాక్సులో తెలియజేయవచ్చు. కీ కోసం ఇక్కడ <
AP: ఎన్టీఆర్ జిల్లా తిరువూరు టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఎమ్మెల్యేగా తనకు వచ్చే జీతాన్ని సంవత్సరం పాటు ముఖ్యమంత్రి సహాయనిధికి అందిస్తానని ప్రకటించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. కాగా అమరావతి రైతుల ఉద్యమంలో కొలికపూడి కీలకంగా వ్యవహరించారు.
రన్ మెషీన్ విరాట్ కోహ్లీ క్రికెట్ ప్రేమికులను నిరాశపరుస్తున్నారు. ఐపీఎల్లో పరుగుల వరద పారించిన అతడు పొట్టి ప్రపంచకప్లో ఆకట్టుకోలేకపోతున్నారు. అమెరికా గడ్డపై పరుగులు చేయడానికి నానా తంటాలు పడుతున్నారు. ఓపెనర్గా బరిలోకి దిగుతున్న కోహ్లీ గత రెండు మ్యాచుల్లో పేలవ ప్రదర్శనతో 1, 4 స్కోర్లతో వెనుదిరిగారు. తాజాగా USAతో మ్యాచ్లోనూ డకౌట్ అయ్యారు. కోహ్లీ ఫామ్పై ఫ్యాన్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ప్రభుత్వ రంగ సంస్థ సెక్యూరిటీ& ఎక్స్చేంజీ బోర్డ్ ఆఫ్ ఇండియా(సెబీ) 97 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. అసిస్టెంట్ మేనేజర్, ఇంజినీరింగ్ ఎలక్ట్రికల్ వంటి విభాగాల్లో ఖాళీలను భర్తీ చేయనుంది. అర్హులు ఈ నెల 30లోపు ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. పోస్టును బట్టి రూ.44,500- రూ.89,150 వరకు జీతం అందుకోవచ్చు. నోటిఫికేషన్ కోసం ఈ <
Sorry, no posts matched your criteria.