News March 23, 2024

BREAKING: సీఎంకు మరో షాక్

image

లిక్కర్ స్కాం కేసులో అరెస్టైన ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌కు మరో షాక్ తగిలింది. సీఎం అరెస్టు, కస్టడీపై అత్యవసరంగా విచారణ చేపట్టేందుకు ఢిల్లీ హైకోర్టు నిరాకరించింది. దీనిపై బుధవారం విచారణ చేపడతామని తెలిపింది. కాగా, ఈడీ మార్చి 28 వరకు కస్టడీకి అప్పగించడం చట్టవిరుద్ధమని కేజ్రీవాల్ తరఫు న్యాయవాదులు ఈ పిటిషన్ వేశారు. అత్యవసర పిటిషన్ కింద విచారణ చేపట్టి, వెంటనే ఆయనను విడుదల చేయాలని కోర్టుకు విజ్ఞప్తి చేశారు.

News March 23, 2024

కానిస్టేబుల్ అభ్యర్థులకు GOOD NEWS

image

TS: కానిస్టేబుల్ ఉద్యోగాలకు ఎంపికైన వారికి రెండో విడత ట్రైనింగ్ ఏప్రిల్ 1 నుంచి ప్రారంభం అవుతుందని TSSP ప్రకటించింది. తొలి దశలో ఫిబ్రవరి 21 నుంచి శిక్షణ ప్రారంభం కాగా, సరిపడా వసతులు లేకపోవడంతో మిగతా వారి ట్రైనింగ్ తాత్కాలికంగా వాయిదా వేశారు. ఇప్పుడు వసతులు కల్పించామని, 4250 మంది కానిస్టేబుళ్లకు ఏప్రిల్ 1 నుంచి శిక్షణ ప్రారంభిస్తామని TSSP తెలిపింది.

News March 23, 2024

త్వరలో భారత్‌లోకి వెయిట్‌లాస్ ఇంజెక్షన్స్!

image

బేరియాట్రిక్ సర్జరీతో పనిలేకుండా ఊబకాయులు బరువు తగ్గేందుకు భారత్‌లో త్వరలో ఇంజెక్షన్స్ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే యూఎస్‌లో ఆమోదం పొందిన సెమాగ్లుటైడ్, వెగోవీ ఇంజెక్షన్స్ సహా 7 రకాల కొత్త ఔషధాలు క్లినికల్ ట్రయల్స్‌కు రిజిస్టర్ చేసుకున్నాయి. సెమాగ్లుటైడ్, మౌంజారో డయాబెటిక్ కోసం.. వెగోవీ, జెప్‌బౌండ్ వెయిట్‌లాస్ కోసం అందుబాటులోకి రానున్నాయి. వీటితో దాదాపు 20% వరకు బరువు తగ్గొచ్చట.

News March 23, 2024

కేంద్రంపై సుప్రీంకోర్టుకు వెళతాం: కర్ణాటక CM

image

కేంద్ర ప్రభుత్వంపై సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయబోతున్నామని కర్ణాటక సీఎం సిద్ద రామయ్య వెల్లడించారు. రాష్ట్రానికి రావాల్సిన ఎన్‌డీఆర్‌ఎఫ్, ఎస్‌డీఆర్‌ఎఫ్ నిధుల కోసం ఇప్పటికే చాలాకాలం ఎదురుచూశామని ఆయన అన్నారు. చట్టం ప్రకారం రాష్ట్ర ప్రభుత్వ అవసరాలకు కేంద్రం నిధులు విడుదల చేయాలని, కానీ కేంద్రం చట్టాన్ని అతిక్రమిస్తోందని అన్నారు. ఇది ఎన్నికల అంశం కాబోదని ఆయన పేర్కొన్నారు.

News March 23, 2024

ఢిల్లీపై పంజాబ్ విజయం

image

కొత్త హోం గ్రౌండ్‌లో పంజాబ్ తొలి మ్యాచ్‌లోనే విజయం నమోదు చేసింది. చండీగఢ్‌లోని మహారాజా యదవీంద్ర సింగ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ను ఓడించింది. 175 రన్స్ టార్గెట్‌తో ఛేదనకు దిగిన పంజాబ్‌ 6 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది.. సామ్ కరన్ (63) హాఫ్ సెంచరీతో రాణించారు. పంజాబ్ తన హోం గ్రౌండ్‌ను మహారాజా యదవీంద్ర సింగ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియానికి ఇటీవల మార్చుకుంది.

News March 23, 2024

రామ్ చరణ్ బర్త్ డే కామన్ మోషన్ పోస్టర్

image

హీరో రామ్ చరణ్ మార్చి 27న తన బర్త్ డే జరుపుకోనున్నారు. ఈ నేపథ్యంలో ప్రతి ఏడాది లాగే ఈసారి కూడా పెద్ద ఎత్తున సెలబ్రేషన్స్ చేయడానికి ఆయన ఫ్యాన్స్ ప్రణాళికలు సిద్ధం చేశారు. చరణ్ కోసం సిద్ధం చేసిన కామన్ డిస్ప్లే పిక్చర్ (CDP)ని టాలీవుడ్‌లోని పలువురు సెలబ్రిటీలతో విడుదల చేయించారు. ‘నా ప్రియమైన వ్యక్తి CDPని విడుదల చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. ఇక వేడుకలు ప్రారంభిద్దాం’ అని నటుడు రానా ట్వీట్ చేశారు.

News March 23, 2024

కేజ్రీవాల్ CMగా కొనసాగడం చెత్త రాజకీయం: ఠాకూర్

image

లిక్కర్ స్కాం కేసులో ఈడీ రిమాండ్‌లో ఉన్న ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఆ పదవిలో కొనసాగడం సరికాదని కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ అన్నారు. వీటిని చెత్త రాజకీయాలు అని ఆయన అభివర్ణించారు. ఇదిలా ఉంటే ఆయన స్థానంలో సీఎం బాధ్యతలు చేపట్టేందుకు ఆప్ లీడర్లు పోటీ పడుతున్నారని, కానీ.. ఈ రేసులోకి కేజ్రీవాల్ భార్య కూడా చేరారని బీజేపీ మంత్రి అన్నారు.

News March 23, 2024

ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో మలుపు

image

TG: రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో మలుపు చోటుచేసుకుంది. భూపాలపల్లి అడిషనల్ ఎస్పీ భుజంగరావు, SIBలో పనిచేసిన అడిషనల్ ఎస్పీ తిరుపతన్నను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిద్దరిని 8 గంటలపాటు విచారించారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో వీరిద్దరి పాత్రపై ఆరా తీస్తున్నారు. ప్రణీత్ రావుతో కలిసి వీరిద్దరూ ఫోన్ ట్యాపింగ్ చేసినట్లు పోలీసులు గుర్తించినట్లు తెలుస్తోంది.

News March 23, 2024

ఆ అమైనో యాసిడ్ తగ్గిస్తే దీర్ఘాయువు!

image

మన శరీరంలోని 20 రకాల అమైనో యాసిడ్స్‌లో ఒకటైన ఐసోలియూసిన్ వినియోగం తగ్గిస్తే వృద్ధాప్యం త్వరగా దరిచేరదని పరిశోధకులు కనుగొన్నారు. తమ పరిశోధనలో ఎలుకల ఆయుష్షు 33% పెరిగిందని తెలిపారు. ఆరోగ్యానికి సంబంధించిన 26 అంశాల్లో ఇవి వృద్ధి సాధించాయట. మనుషులకు ఇది వర్తించొచ్చని దీనిపై సమగ్ర పరిశోధన చేయనున్నట్లు వెల్లడించారు. కాగా ఐసోలియూసిన్ గుడ్లు, మాంసం, డైరీ ఉత్పత్తులు మొదలైన పదార్థాల్లో ఎక్కువగా ఉంటుంది.

News March 23, 2024

మెగాస్టార్ ఆఫర్లు తిరస్కరించా: పృథ్వీరాజ్

image

‘సలార్’లో వరదరాజ మన్నార్‌గా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితులైన పృథ్వీరాజ్ సుకుమారన్ పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. HYD వచ్చిన ఆయన ఓ ప్రెస్‌మీట్‌లో పాల్గొన్నారు. సైరా నరసింహారెడ్డిలో నటించాలని, గాడ్ ఫాదర్‌కి దర్శకత్వం వహించాలని మెగాస్టార్ తనను కోరారని చెప్పారు. ఆ రెండుసార్లు తాను ‘ఆడుజీవితం’లో బిజీగా ఉండటంతో చిరంజీవికి క్షమాపణ చెప్పినట్లు వెల్లడించారు.