India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

APలో 5, TGలో 5 MLC స్థానాలకు(MLA కోటా) నేడు నోటిఫికేషన్ వెలువడనుంది. ఈ నెల 10 వరకు నామినేషన్ దాఖలు చేయొచ్చు. 11న పరిశీలన, 13న ఉపసంహరణకు గడువు ఉంటుంది. మార్చి 20న ఉ.9 నుంచి సా.4 వరకు అసెంబ్లీలో పోలింగ్, అదే రోజు సా.5 గంటల నుంచి ఓట్ల లెక్కింపు జరుగుతుంది. కాగా APలో ఖాళీలకు TDP నుంచి జవహర్, వంగవీటి రాధా, SVSN వర్మ, JSP నుంచి నాగబాబు, BJP నుంచి మాధవ్ రేసులో ఉన్నట్లు సమాచారం.

AP: సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఈ నెల 7న సచివాలయంలో మంత్రివర్గం సమావేశం కానుంది. అన్ని శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు తమ ప్రతిపాదనలను ఈ నెల 5లోగా పంపాలని సీఎస్ విజయానంద్ ఆదేశించారు. ప్రస్తుతం బడ్జెట్ సమావేశాలు కొనసాగుతున్నందున కీలక పథకాలు, ప్రాజెక్టుల అమలుకు క్యాబినెట్ ఆమోదం తెలిపే అవకాశం ఉంది.

TG: MLC ఎన్నికలు జరిగిన ఉమ్మడి మెదక్, కరీంనగర్, ADB, నిజామాబాద్, NLG, WGL, ఖమ్మం జిల్లాల్లో ఇవాళ కౌంటింగ్ జరగనుంది. దీంతో ఆయా జిల్లాల్లోని స్కూళ్లు, కాలేజీలకు సెలవు ఇవ్వాలని ప్రభుత్వం ఇటీవల ఆదేశించింది. పలుచోట్ల సెలవు ఇవ్వలేదని విద్యార్థులు, పేరెంట్స్ ఆరోపిస్తున్నారు. అటు ఏపీలో అవసరమైతేనే సెలవు ఇవ్వాలని EC ఆదేశించింది. దీంతో కౌంటింగ్ జరిగే చోటే సెలవు ఉండే ఛాన్సుంది.

AP: శ్రీవారి భక్తులపై చిరుతల దాడులను అరికట్టేందుకు TTD కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఫారెస్ట్లోని చిరుతలు, ఎలుగుబంట్లు, ఏనుగులకు యానిమల్ రేడియో కాలర్ సిస్టమ్ను ఏర్పాటు చేయాలని యోచిస్తున్నట్లు సమాచారం. వీటి ద్వారా ఆ జంతువుల కదలికలను గుర్తించవచ్చు. అవి జన సమీపానికి వస్తే వెంటనే అప్రమత్తమై దూరంగా తరమవచ్చు. వాటిని ట్రాప్ చేసి పట్టుకుని సిమ్తో కూడిన రేడియో కాలర్ సిస్టమ్ను అమర్చుతారు.

AP: రాజధాని అమరావతిలోని ఐదు ఐకానిక్ టవర్ల పనులపై ప్రభుత్వం దృష్టిసారించింది. వీటి పునాదుల్లో నిలిచిన నీటిని గత నెలలో తోడించగా ర్యాఫ్ట్ ఫౌండేషన్ పరిశీలనకు ఈ వారంలో మద్రాస్ ఐఐటీ నిపుణులు రానున్నారు. కాంక్రీట్, రాడ్ల నమూనాలను పరీక్షించనున్నారు. కాగా గతంలో వీటి నిర్మాణానికి రూ.2,703 కోట్లతో టెండర్లు పిలవగా ఇప్పుడు వ్యయం 70 శాతం పెరిగినట్లు అంచనా. ఈ మేరకు CRDA మళ్లీ టెండర్లు ఆహ్వానించనుంది.

హైదరాబాద్-శ్రీశైలం రహదారికి మహర్దశ పట్టనుంది. ఈ రహదారిలో ఎలివేటెడ్ కారిడార్కు కేంద్రం అనుమతిచ్చింది. 62 కి.మీ మేర 30 అడుగుల ఎత్తులో ఫ్లైఓవర్ నిర్మించనున్నారు. ఇందుకు రూ.7,700 కోట్లు ఖర్చవుతుందని అంచనా. బ్రాహ్మణపల్లి నుంచి మన్ననూర్ మీదుగా దోమలపెంట వరకు ఈ కారిడార్ నిర్మిస్తారు. ఈ దూరాన్ని గంటలోపే చేరుకోవచ్చు. అలాగే శ్రీశైలం ప్రాజెక్టు సమీపంలో ఐకానిక్ వంతెన కూడా నిర్మించనున్నారు.

అసర్-2024 నివేదిక ఆధారంగా దేశంలోనే అత్యధిక టీవీలు ఉన్న రాష్ట్రంగా AP నిలిచింది. ఈ రాష్ట్రంలో 95.1% ఇళ్లలో టీవీలు ఉన్నాయి. ఆ తర్వాత TNలో 94.5%, పంజాబ్లో 93.7% ఇళ్లలో ఉన్నాయి. యూపీ, బిహార్, పశ్చిమబెంగాల్ వంటి పెద్ద రాష్ట్రాల్లో 50%లోపు ఇళ్లలోనే టీవీలు ఉన్నాయి. కర్ణాటక (89.9), కేరళ (89.3), తెలంగాణ (87), మహారాష్ట్ర (79.6), గుజరాత్ (69.5), పశ్చిమ బెంగాల్ (48.4), ఉత్తరప్రదేశ్(43%)లో ఉన్నట్లు తేలింది.

TG: సీఎం రేవంత్ ఇవాళ ఢిల్లీ పర్యటనకు వెళ్తున్నారు. కేంద్ర మంత్రులు సీఆర్ పాటిల్, మనోహర్ లాల్ ఖట్టర్తో ఆయన సమావేశం కానున్నారు. సాగునీటి ప్రాజెక్టులు, నిధులపై వారితో చర్చించనున్నట్లు తెలుస్తోంది. సీఎం వెంట మంత్రి ఉత్తమ్ కూడా హస్తినకు వెళ్లనున్నారు. మరోవైపు డిప్యూటీ సీఎం భట్టి రాజస్థాన్ పర్యటనకు వెళ్తున్నారు. ఆ రాష్ట్ర సీఎం భజన్లాల్ శర్మతో సింగరేణికి సంబంధించిన ఓ ఒప్పందాన్ని కుదుర్చుకోనున్నారు.

ప్రస్తుతం కిడ్నీలో రాళ్ల సమస్యతో చాలామంది బాధపడుతున్నారు. మూత్రంలోని కొన్ని కెమికల్స్ బయటకు వెళ్లకుండా లోపలే పేరుకుపోవడం వల్ల కొన్ని స్ఫటికాలు ఏర్పడి రాళ్లుగా మారతాయి. నాన్వెజ్ ఎక్కువగా తిన్నా, నీళ్లు తక్కువగా తాగినా కిడ్నీలో రాళ్లు వస్తాయి. నిద్రలేమి, ఆలస్యంగా భోజనం చేయడం, విటమిన్ బీ6, సీ, డీ లోపం వల్ల కూడా ఈ సమస్య వస్తుంది. షుగర్, ఒబేసిటీతో బాధపడుతున్నవారిలో ఈ సమస్య అధికం.

AP: రాష్ట్రంలో ఇవాళ్టి నుంచి ఇంటర్మీడియట్ రెండో సంవత్సరం పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు కొనసాగుతాయి. దాదాపు 4.71 లక్షల మంది విద్యార్థులు ఎగ్జామ్స్ రాస్తున్నారు. ఈ పరీక్షలకు ఒక నిమిషం నిబంధన ఉంది. కాగా ఈ నెల 1న ఇంటర్ ఫస్టియర్ పరీక్షలు ప్రారంభమైన విషయం తెలిసిందే. ఆ పరీక్షలకు దాదాపు 5 లక్షల మంది హాజరైనట్లు సమాచారం.
Sorry, no posts matched your criteria.