India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
తేది: సెప్టెంబర్ 08, ఆదివారం
ఫజర్: తెల్లవారుజామున 4:50 గంటలకు
సూర్యోదయం: ఉదయం 6:03 గంటలకు
జొహర్: మధ్యాహ్నం 12:14 గంటలకు
అసర్: సాయంత్రం 4:38 గంటలకు
మఘ్రిబ్: సాయంత్రం 6:24 గంటలకు
ఇష: రాత్రి 7.37 గంటలకు
నోట్: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.
AP: అన్నమయ్య డ్యామ్ కొట్టుకుపోయి 50 మంది చనిపోతే మాజీ CM జగన్ హైదరాబాద్లో విందులు, వినోదాల్లో మునిగితేలారని టీడీపీ ఆరోపించింది. ప్రజలను నువ్వు ఆదుకోవు, ఇతరులను ఆదుకోనివ్వవు అని ట్విటర్లో విమర్శించింది. ‘నీ అడ్రస్ గల్లంతు చేసిన ప్రజలపై కక్ష తీర్చుకుంటున్నావు. ఎప్పటికైనా లండన్లో స్థిరపడే నీకు మా రాష్ట్రం గురించి ఆలోచించే గుణం నీకెక్కడిది? నీదంతా కుళ్లు, కుతంత్రాలు, శవ రాజకీయాలు’ అని మండిపడింది.
ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.
తేది: సెప్టెంబర్ 08, ఆదివారం
శు.పంచమి: రా.7.58 గంటలకు
స్వాతి: మ.3.30 గంటలకు
వర్జ్యం: రా.9.42-రా.11.28 గంటల వరకు
దుర్ముహూర్తం: సా.5.24 గంటల వరకు
AP: విజయవాడలో వరద సహాయక చర్యల్లో ఎన్డీఆర్ఎఫ్, ఆర్మీ సిబ్బంది వెళ్లలేని ప్రతికూల పరిస్థితులు ఏర్పడ్డాయని, అలాంటప్పుడు వాలంటీర్లు ఎలా వెళ్తారని వైసీపీని టీడీపీ ప్రశ్నించింది. ప్రభుత్వంపై బురద జల్లడం ఆపి, వాస్తవిక ప్రపంచంలో బతకాలని ట్వీట్ చేసింది. ‘వేల మంది ఉద్యోగులు సహాయక చర్యల్లో పాల్గొంటే జగన్కు కనిపించదు. ఒక మాజీ సీఎంలా ప్రవర్తించు. హుందాగా ఉంటుంది’ అని మండిపడింది.
*AP: వరద బాధితులను చూస్తే గుండె తరుక్కుపోతోంది: చంద్రబాబు
* బుడమేరు గండ్ల పూడ్చివేత పూర్తి: మంత్రి నిమ్మల
* వరద వచ్చి 8 రోజులైనా ఇంకా ఆకలి కేకలు వినిపిస్తున్నాయి: జగన్
* TG: పారాలింపిక్స్ పతక విజేత దీప్తికి ప్రభుత్వం నజరానా
* ఖమ్మంలో భారీ వర్షాలు.. ప్రజలను అప్రమత్తం చేసిన అధికారులు
* కాంగ్రెస్ ఘనతను వర్ణించడానికి మాటలు రావట్లేదు: KTR సెటైర్
మాలీవుడ్లో సంచలనం సృష్టించిన జస్టిస్ హేమా కమిటీ నివేదిక గురించి తనకు తెలియదని రజనీకాంత్ వ్యాఖ్యానించడంపై నటి రాధిక స్పందించారు. కమిటీ నివేదికపై ఆయనకు ఎవరూ చెప్పి ఉండకపోవచ్చని, ఒకవేళ ఆయనకు తెలిసివుంటే స్పందించేవారని రాధిక పేర్కొన్నారు. మహిళా ఆర్టిస్టులపై వేధింపుల విషయంలో సహచర నటులు మౌనంగా ఉండడంపై ఆందోళన వ్యక్తం చేశారు. బాధితులకు సంఘీభావం ప్రకటించాలని సూచించారు.
విజయవాడలో కురుస్తున్న భారీ వర్షం వల్ల లోతట్టు ప్రాంతాల్లోకి వరదనీరు చేరే అవకాశం ఉందని, అధికారులు యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సృజన ఆదేశించారు. లోతట్టు ప్రాంత ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించాలన్నారు. బుడమేరు గండ్లను పూడ్చివేయడం వల్ల కొత్తగా అక్కడికి వరద నీరు చేరడం లేదని, అయినా వర్షాల వల్ల అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. అటు ఖమ్మం పరిస్థితిపై తెలంగాణ ప్రభుత్వం అలర్ట్ అయింది.
US ఓపెన్ టెన్నిస్ పురుషుల ఫైనల్స్ ఆదివారం జరగనుంది. అమెరికాకు చెందిన 26 ఏళ్ల టేలర్ ఫ్రిట్జ్ టైటిల్ గెలిచిన రెండో అమెరికన్గా నిలుస్తాడా? లేదా 23 ఏళ్ల ప్రపంచ నంబర్ వన్ ఇటలీ స్టార్ జన్నిక్ సిన్నర్ టైటిల్ గెలిచి చరిత్ర సృష్టిస్తాడా? అన్నది రేపు తేలనుంది. మణికట్టు గాయాన్ని సైతం లెక్క చేయకుండా సిన్నర్ కసరత్తు చేస్తున్నాడు. ఈ ఇద్దరిలో ఎవరు గెలిచినా అది చరిత్రే.
CM చంద్రబాబు ప్రచార ఆర్భాటాల వల్ల సహాయక చర్యల్లో సమన్వయ లోపం నెలకొందని YS జగన్ ట్వీట్ చేశారు. ‘మీకూ, మంత్రి నాదెండ్లకు మధ్య జరిగిన సంభాషణపై వైరల్ అయిన వీడియోనే దీనికి సాక్ష్యం. వర్షాలు ఆగి 5 రోజులు అయిన తర్వాత కూడా మీరు ఎలాంటి పాలన చేస్తున్నారు? సచివాలయాలు, వాలంటీర్ వ్యవస్థపై కక్ష పెంచుకుని వాటిని నిర్వీర్యం చేయడం వల్ల ఈ పర్యవసానాలను ఎదుర్కోవాల్సి వస్తోందన్నది వాస్తవం కాదా?’ అని ప్రశ్నించారు.
Sorry, no posts matched your criteria.