News February 19, 2025

CT: విధ్వంస వీరుడి ఖాతాలో అత్యధిక రన్స్

image

మెగా టోర్నీ ఛాంపియన్స్ ట్రోఫీలో అత్యధిక పరుగులు చేసిన రికార్డు WI మాజీ ప్లేయర్ గేల్ పేరిట ఉంది. 17 మ్యాచుల్లో 3 సెంచరీలు, ఒక అర్ధసెంచరీతో 791 పరుగులు చేశారు. తర్వాతి స్థానాల్లో జయవర్ధనే(742), ధవన్(701), సంగక్కర(683), గంగూలీ(665) ఉన్నారు. ప్రస్తుతం భారత జట్టులో ఉన్న ప్లేయర్లలో కోహ్లీ(529), రోహిత్(481) పరుగులు చేశారు. మరి ఈ టోర్నీలో వీరు అత్యధిక పరుగుల రికార్డును బద్దలు కొడతారా? కామెంట్ చేయండి.

News February 19, 2025

GOOD NEWS.. ఆ రోజున అకౌంట్లోకి డబ్బులు

image

AP: BC, EWS కార్పొరేషన్లు మంజూరు చేసే స్వయం ఉపాధి రాయితీ రుణాలు ఎన్నికల కోడ్ లేని ఉమ్మడి ప్రకాశం, నెల్లూరు, రాయలసీమ జిల్లాల్లో అమలు కానుంది. ఈ జిల్లాల్లో 1.25 లక్షల BC, 45వేల EWS దరఖాస్తులు రాగా నిన్నటి నుంచి ఎంపిక ప్రారంభించారు. FEB 25లోగా లబ్ధిదారులను గుర్తించి కలెక్టర్ ఆమోదిస్తారు. MAR 8-12 వరకు ఆయా కార్పొరేషన్ల బ్యాంకు ఖాతాల్లో నగదు జమ అవుతుంది. MAR 17 నుంచి 20 మధ్య లబ్ధిదారులకు చేరుతుంది.

News February 19, 2025

బాలీవుడ్ డైరెక్టర్‌తో విజయ్ దేవరకొండ మూవీ?

image

యాక్షన్ ఫిల్మ్ ‘కిల్’తో దర్శకుడు నిఖిల్ నగేశ్ భట్ టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారారు. ఈ డైరెక్టర్ రౌడీ బాయ్ విజయ్ దేవరకొండతో సినిమా చేయనున్నట్లు తెలుస్తోంది. లవ్ అండ్ యాక్షన్ బ్యాక్ డ్రాప్‌లో కథను రెడీ చేశారని సమాచారం. విజయ్ నిర్ణయంపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. ప్రస్తుతం ‘కింగ్‌డమ్’లో నటిస్తున్న విజయ్ ‘ట్యాక్సీవాలా’ ఫేమ్ రాహుల్ సంకృత్యాన్‌తోనూ సినిమాకు ఒకే చెప్పారు.

News February 19, 2025

నిన్న నియామకం.. నేడు కోర్టు విచారణ

image

కేంద్ర ఎన్నికల కమిషనర్ల నియామక నిబంధనల మార్పుపై దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టు నేడు విచారించనుంది. గతంలో CJI, ప్రధాని, ప్రతిపక్ష నేత సభ్యులుగా ఉండే ప్యానెల్ CEC, ECలను నియమించేది. ఇందులో నుంచి CJIని తొలగిస్తూ, ఒక కేంద్రమంత్రిని చేరుస్తూ NDA ప్రభుత్వం చట్టం తీసుకొచ్చింది. దీని ప్రకారమే జ్ఞానేశ్ కుమార్‌ను CECగా కేంద్రం సోమవారం అర్ధరాత్రి నియమించింది. కేంద్రం తీరును ప్రతిపక్షాలు తప్పుబట్టాయి.

News February 19, 2025

గ్రూప్-2పై హైకోర్టులో విచారణ

image

AP: 2023లో జారీ చేసిన గ్రూప్-2 నోటిఫికేషన్‌పై దాఖలైన పిటిషన్‌ను హైకోర్టు విచారించింది. మహిళలు, దివ్యాంగులు, మాజీ సైనికులు, క్రీడాకారులకు రిజర్వేషన్ పాయింట్లు ఇచ్చారని, ఈ నెల 23న జరిగే మెయిన్స్ పరీక్షను వాయిదా వేయాలని పిటిషనర్ కోరారు. దీనిపై మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు నిరాకరించిన కోర్టు తీర్పును వాయిదా వేసింది.

News February 19, 2025

కొత్త రేషన్ కార్డులపై UPDATE!

image

TG ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులు ఇచ్చేందుకు సన్నాహాలు చేస్తున్న సంగతి తెలిసిందే. కొత్తవి, పాతవి కలిపి కోటి రేషన్ కార్డులు ఇవ్వనున్నట్లు సమాచారం. ఈ కార్డులు బార్ కోడ్ లేదా క్యూఆర్ కోడ్‌తో పోస్ట్ కార్డు సైజులో ఉండనున్నట్లు తెలుస్తోంది. ఒకవైపు సీఎం, పౌరసరఫరాల శాఖ మంత్రి ఫొటోలతో పాటు ప్రభుత్వ లోగో ఉండనున్నాయి. తొలుత ఎన్నికల కోడ్ లేని మహబూబ్ నగర్, రంగారెడ్డి, HYDలో ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తోంది.

News February 19, 2025

నీటి ఎద్దడి.. ట్యాంకర్ల పరుగులు

image

ఎండాకాలం వచ్చేసింది. ఎప్పటిలాగే హైదరాబాద్‌లో నీటి ఎద్దడి మొదలైంది. దీంతో వాటర్ ట్యాంకర్లు రంగంలోకి దిగాయి. నగర రోడ్లపై హడావిడి మొదలుపెట్టాయి. ముఖ్యంగా అపార్ట్‌మెంట్లు, హాస్టల్లోని బోర్లు అడుగంటి నీటి కొరత ఏర్పడుతోంది. దీంతో నీటిని కొనుగోలు చేస్తున్నారు. నిర్వాహకులు ఒక్కో ట్యాంకర్‌కు రూ.800 నుంచి రూ.1500 వరకు వసూలు చేస్తున్నట్లు సమాచారం. రాబోయే 3 నెలలు నీటి ఎద్దడి మరింత తీవ్రం కానుంది.

News February 19, 2025

రేఖ or వర్మ.. కౌన్ బనేగా సీఎం?

image

దేశ రాజధాని ఢిల్లీ సీఎం ఎవరనేది ఇవాళ తేలిపోనుంది. మ.3.30 గంటలకు ఢిల్లీ బీజేపీఎల్పీ సమావేశంలో ముఖ్యమంత్రిని ప్రకటించనున్నారు. రేసులో మాజీ CM కేజ్రీవాల్‌ను ఓడించిన పర్వేశ్ వర్మ పేరు ప్రధానంగా వినిపిస్తోంది. మరోవైపు ఈసారి హస్తిన పీఠాన్ని మహిళే అధిష్ఠిస్తారని, షాలిమార్ బాగ్ MLA రేఖా గుప్తానే పదవి వరించనుందని జోరుగా ప్రచారం జరుగుతోంది. మరి అధిష్ఠానం ఎవరివైపు మొగ్గు చూపుతుందో చూడాలి.

News February 19, 2025

6నెలల్లో క్యాన్సర్ టీకా అందుబాటులోకి: కేంద్రమంత్రి

image

మహిళల్లో క్యాన్సర్‌ను నివారించేందుకు ఉపయోగపడే టీకాను మరో 6 నెలల్లో అందుబాటులోకి తీసుకొస్తామని కేంద్ర వైద్యారోగ్య శాఖ సహాయమంత్రి ప్రతాప్ రావ్ జాదవ్ తెలిపారు. 9 ఏళ్ల నుంచి 16 ఏళ్లలోపు బాలికలకు ఈ టీకాలను అందిస్తామని వివరించారు. రొమ్ము, నోరు, గర్భాశయ క్యాన్సర్లను ఈ టీకా నియంత్రిస్తుందని, ప్రస్తుతం ప్రయోగాలు జరుగుతున్నాయని చెప్పారు.

News February 19, 2025

ఎయిరిండియా విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్.. ప్రయాణికులు ఆందోళన

image

ముంబై-దుబాయ్ ఎయిరిండియా విమానాన్ని అధికారులు ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. నిన్న రాత్రి 8 గంటలకు బయలుదేరాల్సిన విమానం 50 నిమిషాల తర్వాత ముంబైలో ల్యాండ్ చేశారు. ఏం జరుగుతుందో తెలియక ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు. అధికారులు వెంటనే స్పందించాలని డిమాండ్ చేశారు. సమస్యను పరిష్కరించాక తెల్లవారుజామున 4 గంటలకు విమానం బయలుదేరింది. విమానంలో ఎక్కువ మంది తెలుగు రాష్ట్రాల ప్రయాణికులే ఉన్నారు.