News February 19, 2025

నేడు బీఆర్ఎస్ భవన్‌కు కేసీఆర్

image

TG: గులాబీ బాస్ కేసీఆర్ నెలల విరామం తరువాత బీఆర్ఎస్ భవన్‌కు రానున్నారు. ఇవాళ మ.2 గంటలకు జరిగే పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో ఆయన పాల్గొంటారు. పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయడంపై ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ నేతలు, ఇతర నాయకులకు దిశానిర్దేశం చేయనున్నట్లు సమాచారం. బీఆర్ఎస్ పార్టీ ఏర్పడి 25 ఏళ్లు కావొస్తున్న నేపథ్యంలో సిల్వర్ జూబ్లీ వేడుకలు నిర్వహించే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.

News February 19, 2025

టీమ్ ఇండియా ఆ పాక్ ఆటగాడితో జాగ్రత్తగా ఉండాలి: హర్భజన్

image

పాక్ ఆటగాడు ఫకర్ జమాన్‌తో టీమ్ ఇండియా జాగ్రత్తగా ఉండాలని మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ హెచ్చరించారు. ‘భారత్‌పై జమాన్ రికార్డు చాలా బాగుంది. గతంలో మన విజయావకాశాల్ని అతడు దెబ్బకొట్టాడు’ అని గుర్తుచేశారు. భారత్‌పై 6 మ్యాచులాడిన జమాన్ 46.80 సగటుతో 234 రన్స్ చేయడం గమనార్హం. ఛాంపియన్స్ ట్రోఫీలో దాయాదుల సమరం ఈ నెల 23న జరగనుంది.

News February 19, 2025

కులంలోనే కాదు.. మతంలోనూ పేదరికం ఉంది: షబ్బీర్ అలీ

image

TG: మైనారిటీలను BCల్లో కలిపారంటూ BJP చేస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదని కాంగ్రెస్ ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ స్పష్టం చేశారు. ‘వెనుకబడిన మైనార్టీలు ఇప్పటికీ BC జాబితాలో ఉన్నారు. కులంలోనే కాదు మతంలోనూ పేదరికం ఉంది. పిలిస్తే బీజేపీ ఆఫీస్‌కు వచ్చి ప్రజెంటేషన్ ఇస్తా. వెనుకబడిన తరగతులు ఎక్కడ ఉన్నా వెనుకబడిన తరగతులే. బీసీలపై BJPకి అంత ప్రేమ ఉంటే బీసీ కులగణన చేయించాలి’ అని డిమాండ్ చేశారు.

News February 19, 2025

నేడు ఢిల్లీకి చంద్రబాబు

image

AP: సీఎం చంద్రబాబు ఈరోజు రాత్రి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి వెళ్లనున్నారు. రేపు ఉదయం 11.30కి జరిగే ఢిల్లీ సీఎం ప్రమాణ స్వీకారానికి హాజరు కానున్నారు. ఈ మేరకు ఎన్డీయే పెద్దలు ఆయన్ను ఆహ్వానించినట్లు తెలుస్తోంది. ఇక ఈరోజు మధ్యాహ్నం 3.30 గంటలకు ఢిల్లీ బీజేఎల్పీ సమావేశం జరగనుంది. కాబోయే ముఖ్యమంత్రిని ఈ సమావేశంలో ఎంచుకోనున్నారు. ఎవరి పేరును ప్రకటిస్తారన్న ఆసక్తి బీజేపీ వర్గాల్లో నెలకొంది.

News February 19, 2025

పోలీసులపై హైకోర్టు ఆగ్రహం

image

AP: తమ ఆదేశాలను లెక్కచేయట్లేదంటూ పోలీసులపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కేసులు నమోదు చేయడం, కస్టడీలో కొట్టడం తప్ప దర్యాప్తు చేయడంలేదని క్లాస్ తీసుకుంది. ఇలాంటి వైఖరిని సహించేది లేదని తేల్చిచెప్పింది. బొసా రమణ అనే వ్యక్తిపై 27 కేసులుండగా అతడి భార్య దాఖలు చేసిన పిటిషన్‌ విచారణ సందర్భంగా పోలీసులపై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కేసులో పూర్తి వివరాలెందుకు సమర్పించలేదంటూ నిలదీసింది.

News February 19, 2025

భారీ బడ్జెట్‌గా చిరు-రావిపూడి మూవీ?

image

మెగాస్టార్ చిరంజీవి-అనిల్ రావిపూడి కాంబోలో తెరకెక్కే మూవీకి బడ్జెట్ భారీగా ఉండనున్నట్లు తెలుస్తోంది. రెమ్యునరేషన్లకే రూ.100 కోట్ల పైచిలుకు అవుతోందని, చిత్రీకరణ ఖర్చును కలుపుకొని బడ్జెట్ రూ.200 కోట్లు దాటేయొచ్చని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. మంచి టాక్ వస్తే ఆ మొత్తాన్ని రికవర్ చేయడం పెద్ద కష్టం కాకపోవచ్చని పేర్కొన్నాయి. కాగా ‘విశ్వంభర’ సైతం ఇంచుమించు ఇదే బడ్జెట్‌తో తెరకెక్కినట్లు సమాచారం.

News February 19, 2025

కుంభమేళాలో కిషన్ రెడ్డి కుటుంబం

image

TG: కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కుటుంబ సమేతంగా కుంభమేళాలో పాల్గొన్నారు. ప్రయాగ్‌రాజ్‌లో పవిత్రస్నానం ఆచరించారు. మంగళవారం సాయంత్రం భార్య, కుమారుడు, కుమార్తెతో కలిసి ఆయన త్రివేణీ సంగమానికి చేరుకున్నారు. సనాతన ధర్మంపై రోజురోజుకీ పెరుగుతున్న ఆదరణకు కుంభమేళాకు తరలివస్తున్న భక్తజనమే నిదర్శనమని ఆయన ఈ సందర్భంగా అన్నారు. త్రివేణీ సంగమంలో స్నానం చేయడం ఆధ్యాత్మిక అనుభూతిని కలిగించిందని పేర్కొన్నారు.

News February 19, 2025

నేటి నుంచి ఛాంపియన్స్ ట్రోఫీ

image

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఛాంపియన్స్ నేటి నుంచే మొదలుకానుంది. పాకిస్థాన్-న్యూజిలాండ్ మధ్య తొలి మ్యాచ్ జరగనుంది. టోర్నీలో మొత్తం 15 మ్యాచులు జరగనున్నాయి. గ్రూప్-ఏలో భారత్, బంగ్లా, న్యూజిలాండ్, పాక్ ఉండగా గ్రూప్-బిలో అఫ్గాన్, ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, ఇంగ్లండ్ ఉన్నాయి. ఇరు గ్రూపుల్లోని తొలి రెండు జట్లు సెమీస్‌కు చేరతాయి. భారత్ తొలిమ్యాచ్ రేపు బంగ్లాతో ఆడనుంది.

News February 19, 2025

రూ.3 లక్షల కోట్లు దాటనున్న ఏపీ బడ్జెట్?

image

AP: త్వరలో అసెంబ్లీలో పూర్తిస్థాయి బడ్జెట్‌ను ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. దానికి సంబంధించిన కసరత్తును సీఎం చంద్రబాబు దాదాపు పూర్తి చేసినట్లు తెలుస్తోంది. గత ఏడాదితో పోలిస్తే ఈసారి కేటాయింపులు మరింత పెరుగుతాయని అంచనా. వ్యవసాయం, సాగునీరు, సంక్షేమ శాఖలపై సర్కారు ప్రధానంగా ద‌ృష్టి పెట్టనుందని ప్రభుత్వ వర్గాలంటున్నాయి. మొత్తంగా రూ.3లక్షల కోట్ల మార్కును బడ్జెట్ దాటనుందని సమాచారం.

News February 19, 2025

అయోధ్య రామాలయంపై డ్రోన్.. కూల్చివేత

image

అయోధ్యలోని రామమందిరంపై అనుమానాస్పద డ్రోన్ ఎగరడం కలకలం రేపింది. యాంటీ డ్రోన్ వ్యవస్థను పరీక్షిస్తుండగా డ్రోన్‌ను గుర్తించి నేలకూల్చామని అధికారులు తెలిపారు. కేసు నమోదు చేసి గురుగ్రామ్‌కు చెందిన ఓ నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు. ‘ఆలయానికి రెండున్నర కి.మీ దూరంలో ఎక్కడ డ్రోన్ ఎగురుతున్నా యాంటీ డ్రోన్ వ్యవస్థ కనిపెట్టేస్తుంది. మందిరం పరిసరాల్లో డ్రోన్లపై నిషేధం ఉంది’ అని పేర్కొన్నారు.