India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
AP: తనతో పాటు విజయమ్మ, సునీతపై సోషల్ మీడియాలో అసభ్యకరంగా పోస్టులు పెట్టించింది YCP MP అవినాశ్ రెడ్డేనని పోలీసులు నిర్ధారణకు వచ్చారని APCC చీఫ్ షర్మిల అన్నారు. అలాంటప్పుడు ఆయనను ఎందుకు విచారించడం లేదని ప్రశ్నించారు. వర్రా రవీందర్ రెడ్డి కేసులో అవినాశ్ను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. అసభ్యకర పోస్టులకు సజ్జల భార్గవ్ రెడ్డే ప్రధాన కారకుడని ఆరోపించారు. ఆయననూ ఎందుకు అరెస్ట్ చేయడం లేదని ప్రశ్నించారు.
టికెట్ లేకుండా రాత్రిపూట రైలెక్కిన మహిళను దింపేసే అధికారం TTEకి లేదు. 1989 రైల్వే చట్టంలో ఒంటరిగా, పిల్లలతో ప్రయాణించే మహిళలకు రక్షణ కల్పించింది. రైళ్లలో ఉచితంగా 70 కేజీల వరకే కంపార్ట్మెంట్లోకి అనుమతిస్తారు. ఒకవేళ ట్రైన్ మిస్ అయినా తదుపరి రెండు స్టేషన్ల వరకు మీకు కేటాయించిన సీటు అలాగే ఉంటుంది. రిజర్వేషన్ బోగీలోని మిడిల్ బెర్త్ ప్యాసింజర్ రాత్రి 10 నుంచి ఉదయం 6 గంటల మధ్య మాత్రమే నిద్రపోవాలి.
TG: CM రేవంత్కు KCR భయం పట్టుకుందని BRS MLA హరీశ్రావు ఎద్దేవా చేశారు. KCRకు, రేవంత్కు చాలా తేడా ఉందని అన్నారు. మహబూబ్నగర్లో కురుమూర్తిని దర్శించుకున్న అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఆగస్టు 15లోపు సంపూర్ణ రుణమాఫీ చేసి ఉంటే తాను రాజీనామా చేసేవాడినని అన్నారు. 42లక్షల మందికి అని చెప్పి కేవలం 22లక్షల మంది రైతులకే మాఫీ చేసి, పైగా తనను రాజీనామా చేయమంటున్నారని చెప్పుకొచ్చారు.
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు తెరకెక్కించనున్న RC16 సినిమా షూటింగ్ త్వరలో ప్రారంభం కానుంది. ఈనెల 22న మైసూర్లో ఈ చిత్ర షూటింగ్ ప్రారంభం కానుందని సినీవర్గాలు పేర్కొన్నాయి. ఈ మూవీకి ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అందిస్తున్నారు. కాగా, ఇటీవల జాన్వీకపూర్ నటించిన ‘దేవర’ రిలీజై భారీ విజయాన్ని అందుకుంది. మరోవైపు రామ్ చరణ్ ‘గేమ్ ఛేంజర్’ కూడా వచ్చే ఏడాది జనవరి 10న విడుదల కానున్న విషయం తెలిసిందే.
తెలుగు క్రికెటర్ తిలక్ వర్మ ICC T20I ర్యాంకింగ్స్లో రయ్యుమని దూసుకెళ్లారు. ఒకేసారి ఏకంగా 69 స్థానాలు ఎగబాకి టాప్3కి చేరుకున్నారు. టాప్1లో ట్రావిస్ హెడ్(ఆస్ట్రేలియా) ఉండగా 2వ స్థానంలో సాల్ట్(ఇంగ్లండ్) ఉండగా ఆ తర్వాతి స్థానాన్ని తిలక్ కైవసం చేసుకున్నారు. అరంగేట్రం తర్వాత కేవలం 20 మ్యాచుల్లో తిలక్ ఈ ఫీట్ అందుకోవడం విశేషం. ఇటీవల SAపై వరుస సెంచరీలు చేసిన వర్మ మొత్తం 51.33 సగటుతో 616 రన్స్ చేశారు.
2025లో కేరళతో డిఫెండింగ్ ఛాంపియన్ అర్జెంటీనా ఫుట్బాల్ టీమ్ 2 మ్యాచ్లు ఆడుతుందని ఆ రాష్ట్ర క్రీడలశాఖ మంత్రి అబ్దురహిమాన్ తెలిపారు. ఇందులో ఫుట్బాల్ దిగ్గజం లియోనల్ మెస్సీ కూడా ఆడతారని చెప్పారు. ఇప్పటికే ఇందుకు సంబంధించిన చర్చలు జరుపుతున్నామని పేర్కొన్నారు. కాగా కేరళలో ఫుట్బాల్కు క్రేజ్ ఎక్కువ. భారత్లో ఫుట్బాల్ ఎక్కువగా ఆడే కొన్ని రాష్ట్రాల్లో ఇదీ ఒకటి. మెస్సీ చివరిగా 2011లో ఇండియాలో ఆడారు.
యూట్యూబ్ రివ్యూయర్లు, ఫిల్మ్ క్రిటిక్లపై తమిళ చిత్ర నిర్మాతల మండలి కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై థియేటర్లలోకి వారిని అనుమతించకూడదని యాజమాన్యాలను కోరింది. రివ్యూల పేరుతో నటీనటులపై వ్యక్తిగత విమర్శలకు పాల్పడుతుండటంతో TFPC ఈ నిర్ణయం తీసుకుంది. వీరి రివ్యూలు వేట్టయన్, ఇండియన్ 2, కంగువా చిత్రాలపై తీవ్ర ప్రభావం చూపాయని తెలిపింది.
AP: సీఎం చంద్రబాబు పాలనపై తనకు సంపూర్ణ విశ్వాసం ఉందని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అసెంబ్లీలో అన్నారు. సమర్థులైన నాయకుడు ఉంటే ఎలా ఉంటుందనేది చంద్రబాబును చూసి తెలుసుకోవచ్చన్నారు. విజయవాడ వరదల సమయంలో అధికార యంత్రాంగాన్ని దగ్గరుండి నడిపిన తీరు అభినందనీయమని పవన్ కొనియాడారు. తెలుగువారు ప్రపంచవ్యాప్తంగా ఉండటానికి చంద్రబాబు ముఖ్య కారణమన్నారు.
AP: కరడుగట్టిన నేరస్థులకు రాష్ట్రంలో చోటు లేదని సీఎం చంద్రబాబు అన్నారు. ఎవరైనా నేరాలకు పాల్పడితే తాట తీస్తామని ఆయన హెచ్చరించారు. ‘గత ప్రభుత్వ హయాంలో నేరాలు, ఘోరాలు ఎక్కువయ్యాయి. పోలీస్ వ్యవస్థ నిర్వీర్యమైంది. ఎక్కువగా గంజాయి, డ్రగ్స్ కారణంగానే నేరాలు జరుగుతున్నాయి. అందుకే వాటిపై మా ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. ఇకపై ఆడబిడ్డల జోలికొస్తే ఏం చేయాలో అదే చేస్తాం’ అని ఆయన వార్నింగ్ ఇచ్చారు.
సైబర్ దాడికి గురైన బాధితుడికి పరిహారం ఇవ్వాలంటూ SBIని ఢిల్లీ హైకోర్టు ఆదేశించింది. హరే రామ్ సింగ్ సైబర్ మోసానికి గురై, వెంటనే దగ్గర్లోని SBIకి వెళ్లి ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు స్వీకరించిన సిబ్బంది 2 నెలల తర్వాత అతడి అభ్యర్థనను తిరస్కరించారు. అతడు ఫ్రాడ్ లింక్ ఓపెన్ చేయడం, OTP చెప్పడాన్ని సాకుగా చూపారు. అయితే SBIది నిర్లక్ష్యమైన స్పందనగా పేర్కొన్న HC ₹2.6లక్షలు బాధితుడికి చెల్లించాలని ఆదేశించింది.
Sorry, no posts matched your criteria.