News November 20, 2024

శుభ ముహూర్తం

image

తేది: నవంబర్ 20, బుధవారం
పంచమి: సా.4.49 గంటలకు
పునర్వసు: మ.2.50 గంటలకు
వర్జ్యం: రా.11.05-రా.12.24 గంటల వరకు
దుర్ముహూర్తం: ఉ.11.30-మ.12.15 గంటల వరకు
రాహుకాలం: మ.12.00-మ.1.30 గంటల వరకు

News November 20, 2024

TODAY HEADLINES

image

✒ రష్యాపై తొలిసారి US మిస్సైల్స్‌తో ఉక్రెయిన్ దాడి
✒ ‘మణిపుర్’పై జోక్యం చేసుకోండి.. రాష్ట్రపతికి INC వినతి
✒ AP: రాష్ట్ర రోడ్లపైనా టోల్ యోచన: CBN
✒ AP: రూ.85,000cr పెట్టుబడులకు గ్రీన్ సిగ్నల్
✒ AP: ఆరోగ్యశ్రీని అనారోగ్యశ్రీగా మార్చారు: రజిని
✒ TG: కాంట్రాక్ట్ ఉద్యోగుల రెగ్యులరైజేషన్ GOను కొట్టేసిన హైకోర్టు
✒ TG: KCR తాగుబోతుల సంఘం అధ్యక్షుడు: రేవంత్
✒ TG: చేవలేనోనికి బూతులెక్కువ.. CMపై హరీశ్ ఫైర్

News November 20, 2024

చిన్న దేశమే.. కానీ భారత్‌కు కీలకం!

image

దక్షిణ అమెరికాలోని ఉత్తర తీరంలో ఉన్న ఓ చిన్న దేశం గయానా. అవడానికి చిన్న దేశమే కానీ ద్వైపాక్షికంగా భారత్‌కు చాలా కీలకంగా మారింది. ఆ దేశంలో చమురు, సహజవాయువుల నిక్షేపాలు బయటపడటమే దీనిక్కారణం. ఈ నేపథ్యంలో ఆ దేశాధ్యక్షుడు ఇర్ఫాన్ అలీతో ప్రధాని మోదీ సన్నిహిత సంబంధాలను మెయింటెయిన్ చేస్తున్నారు. దేశ ఆర్థిక వ్యవస్థ చమురు లభ్యతపై ఆధారపడిన నేపథ్యంలో గయానాతో స్నేహంపై భారత్ ప్రత్యేకంగా దృష్టి సారించింది.

News November 20, 2024

దర్శకుడిగా షారుఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్

image

బాలీవుడ్ స్టార్ షారుఖ్‌ ఖాన్ కుమారుడు ఆర్య‌న్ ఖాన్ మెగా ఫోన్ ప‌ట్టుకోనున్నారు. ఆర్య‌న్ త్వ‌ర‌లో ఓ వెబ్ సిరీస్‌కు ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌నున్నారు. నెట్‌ఫ్లిక్స్, రెడ్ చిల్లీస్ ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థ‌ల సంయుక్త ఆధ్వ‌ర్యంలో ఈ సిరీస్ తెర‌కెక్క‌నుంది. కొత్త సిరీస్‌తో ఆర్యన్‌ను దర్శకుడిగా పరిచయం చేస్తున్నట్టు షారుఖ్ తెలిపారు. నెట్‌ఫ్లిక్స్‌లో ముందెన్నడూ లేని విధంగా బాలీవుడ్‌ని ఆస్వాదిస్తారని పేర్కొన్నారు.

News November 20, 2024

దేవుడిలా వచ్చి.. వేల మందిని కాపాడి!

image

తేలు కాటుకు ఒకప్పుడు విరుగుడు లేకపోవడంతో ఎంతో మంది చనిపోయేవారు. ముఖ్యంగా MHలోని గ్రామీణ ప్రాంతాల్లో 1980లలో మరణాలు పెరగడంతో డా.హిమ్మత్రావ్ బావస్కర్ బాధితులను కాపాడేందుకు ముందుకొచ్చారు. ఆయన కొత్త మిషన్ ప్రారంభించి తేలు చికిత్సపై ప్రయోగాలు చేసి ఫలితం సాధించారు. దీనిని వైద్యులకూ నేర్పించడంతో ప్రజల జీవితాలు మారిపోయాయి. తేలు కాటు మరణాలు 40% నుంచి 1శాతానికి తగ్గాయి. ఆయనను 2022లో పద్మశ్రీ వరించింది.

News November 20, 2024

గెరాల్డ్ కోయెట్జీకి ఐసీసీ హెచ్చరిక

image

భారత్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో దక్షిణాఫ్రికా పేసర్ గెరాల్డ్ కోయెట్జీ క్రమశిక్షణారాహిత్యానికి పాల్పడినట్లు ఐసీసీ తేల్చింది. ఆఖరి టీ20లో తన బౌలింగ్‌లో అంపైర్ వైడ్ ఇచ్చినప్పుడు కోయెట్జీ అసహనం వ్యక్తం చేశారు. అభ్యంతరకర భాషలో అంపైర్‌ను దూషించారంటూ ఫిర్యాదు నమోదైంది. దీంతో అధికారిక హెచ్చరికతో పాటు అతడికి ఒక డీమెరిట్ పాయింట్ ఇచ్చినట్లు ఐసీసీ వర్గాలు పేర్కొన్నాయి. తప్పును కోయెట్జీ అంగీకరించారని తెలిపాయి.

News November 20, 2024

రేపే లాస్ట్ డేట్

image

తెలంగాణలో టెట్ దరఖాస్తుల స్వీకరణ గడువు నవంబర్ 20వ తేదీతో ముగియనుంది. ఇప్పటివరకు 1.50లక్షల మందికి పైగా దరఖాస్తు చేశారు. అయితే దరఖాస్తు గడువును పొడిగించాలని బీఎడ్, డీఎడ్ అభ్యర్థులు కోరుతున్నారు. డీఎస్సీలో టెట్ మార్కులకు వెయిటేజీ ఉంటుంది. టెట్ మార్కులు కలిపి జనరల్ ర్యాంకింగ్ జాబితా రిలీజ్ చేస్తారు.. టెట్‌కు దరఖాస్తు చేసేందుకు ఇక్కడ <>క్లిక్ <<>>చేయండి.

News November 19, 2024

ఉద్యోగులకు RSSతో అనుబంధం వద్దు.. తిరిగి నిషేధించాలని రాష్ట్రపతికి వినతి

image

ప్ర‌భుత్వ ఉద్యోగులు, సివిల్ స‌ర్వెంట్లు RSS కార్య‌క‌లాపాల్లో పాల్గొన‌కుండా తిరిగి నిషేధం విధించాల‌ని రాష్ట్ర‌ప‌తిని మాజీ బ్యూరోక్రాట్లు కోరారు. ప్ర‌జాస్వామ్య విలువ‌ల‌కు అనుగుణంగా వివ‌క్ష లేని, నిష్పాక్షిక పాల‌నా వ్య‌వ‌స్థను నిర్వ‌హించేందుకు సివిల్ స‌ర్వీసెస్‌లో రాజ‌కీయ త‌ట‌స్థ వైఖ‌రిని కాపాడాల‌ని పేర్కొన్నారు. రాజకీయ సంస్థలతో వీరి అనుబంధం పౌర సేవల్లో నిష్పక్షపాతానికి ప్రమాదమంటూ లేఖ రాశారు.

News November 19, 2024

అస్సాం సీఎం కీలక నిర్ణయం

image

అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆ రాష్ట్రం దక్షిణ ప్రాంతంలోని కరీంగంజ్ జిల్లా పేరును ‘శ్రీభూమి’గా మారుస్తున్నట్లు క్యాబినెట్ భేటీలో ప్రకటించారు. 100ఏళ్ల క్రితం కవిగురు రవీంద్రనాథ్ ఠాగూర్ కరీంగంజ్ ప్రాంతాన్ని శ్రీభూమిగా అభివర్ణించారని, ఆయన గౌరవార్థం ఈ పేరు పెడుతున్నట్లు పేర్కొన్నారు. ఈ నిర్ణయం జిల్లా ప్రజల చిరకాల ఆకాంక్ష, ఆశయాలను ప్రతిబింబిస్తోందని ఆయన ట్వీట్ చేశారు.

News November 19, 2024

Breaking: ఏఆర్ రెహమాన్ దంపతుల విడాకులు

image

ఆస్కార్ విజేత AR రెహమాన్ నుంచి ఆయన భార్య సైరా బాను విడిపోతున్నట్లు ఆమె తరఫు న్యాయవాది ప్రకటించారు. ‘వారి బంధం చాలాకాలంగా ఒడిదుడుకులతో సాగుతోంది. 29 ఏళ్ల వివాహ బంధం నుంచి తప్పుకోవాలన్న కఠిన నిర్ణయాన్ని సైరా తీసుకున్నారు. తమ మధ్య ఏర్పడిన అగాథం ఇక పోదని ఇద్దరూ భావిస్తున్నారు. ఈ కష్టకాలంలో తన ప్రైవసీని గౌరవించాలని ప్రజల్ని బాను కోరుతున్నారు’ అని ఓ ప్రకటనలో తెలిపారు. వారికి ముగ్గురు పిల్లలున్నారు.