India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
* RRR(రీజనల్ రింగ్ రోడ్) ప్రాజెక్టు డైరెక్టర్గా IAS హరిచందన నియామకం
* RRR దక్షిణ భాగం ప్రాజెక్ట్ కన్సల్టెంట్ నియామకానికి గవర్నమెంట్ అనుమతి
* రూ.4,170 కోట్లతో వరంగల్ భూగర్భ డ్రైనేజీ నిర్మాణం
* HYDను మించి వరంగల్ అభివృద్ధి: కొండా సురేఖ
* లగచర్ల వెళ్తున్న ఈటల, డీకే అరుణను అడ్డగించిన పోలీసులు
* TGలో భూసేకరణ పేరుతో దౌర్జన్యం: ఢిల్లీలో BRS MP సురేశ్ రెడ్డి
* BRS, BJP రెండూ ఒకటే: మహేశ్ గౌడ్
గ్యాంగ్స్టర్ లారెన్స్ బిష్ణోయ్ తమ్ముడు అన్మోల్ బిష్ణోయ్ను అమెరికాలో అరెస్టు చేసినట్టు తెలుస్తోంది. దీనిపై మరింత సమాచారం రావాల్సి ఉంది. ముంబైలో పొలిటికల్ పార్టీ యాక్టివిటీస్లో అతడు జోక్యం చేసుకుంటున్నట్టు NIA ఈమధ్యే గమనించింది. అతడి సమాచారమిస్తే రూ.10 లక్షల బౌంటీ ఇస్తామని ప్రకటించింది. యాక్టర్ సల్మాన్ ఇంటిపై కాల్పుల కేసులో అన్మోల్ మోస్ట్ వాంటెడ్గా ఉన్నాడు.
రెండోసారి తండ్రయిన రోహిత్ శర్మ భార్య, బిడ్డలతో గడపడానికి BGT తొలి టెస్టుకు దూరమయ్యారు. ఈ నిర్ణయాన్ని తాను 100 శాతం సపోర్ట్ చేస్తానని ఆసీస్ ప్లేయర్ ట్రావిస్ హెడ్ వెల్లడించారు. ఆ పరిస్థితుల్లో తాను ఉన్నా అదే పనిచేస్తానన్నారు. ‘క్రికెటర్లుగా మేం ఎన్నో త్యాగాలు చేస్తాం. వ్యక్తిగత జీవితంలో ఎన్నో ముఖ్యమైన ఘట్టాలకు దూరమవుతాం. ఆ సమయం మళ్లీ తిరిగిరాదు’ అని పేర్కొన్నారు.
పిల్లలకు మంచి చదువును అందించాలని ప్రతి తల్లిదండ్రులు అనుకుంటారు. అయితే, ఆ చదువిప్పుడు కాస్ట్లీగా మారిపోయిందని ఆవేదన వ్యక్తం చేస్తూ ఓ నెటిజన్ చేసిన ట్వీట్ వైరలవుతోంది. తన కుమార్తె గ్రేడ్ 1 ఫీజు చూసి షాక్ అయ్యానని ఆయన చెప్పారు. రిజిస్ట్రేషన్ ఛార్జీ రూ.2వేలు, అడ్మిషన్ ఫీజు రూ.40వేలు, వార్షిక ఫీజు రూ.2.52 లక్షలు, బస్ ఫీజు రూ.1.08 లక్షలు, స్టేషనరీకి రూ.20వేలు ఇలా మొత్తంగా ఫీజు రూ.4.20లక్షలని తెలిపారు.
శ్రీవాణి ట్రస్టు(శ్రీ వేంకటేశ్వర ఆలయ నిర్మాణ ట్రస్ట్) పేరు రద్దు వేళ సర్వత్రా చర్చ జరుగుతోంది. ట్రస్టుకు ₹10వేలు విరాళమిస్తే తొలి గడప నుంచి దర్శనం చేసుకోవచ్చు. ప్రతి నెలా 23న ఆన్లైన్, ఆఫ్లైన్లో టికెట్లు అందుబాటులో ఉంటాయి. విరాళమిచ్చిన ఏడాదిలో(రూమ్, VIP టికెట్ ₹11,500) 12ఏళ్ల లోపు పిల్లలను తీసుకెళ్లొచ్చు. నిధుల దుర్వినియోగం ఆరోపణలతో ట్రస్టును రద్దు చేసి, TTD ఖాతా ద్వారా లావాదేవీలు జరపనున్నారు.
అక్కినేని నాగచైతన్య హీరోగా సాయి పల్లవి హీరోయిన్గా నటిస్తోన్న ‘తండేల్’ నుంచి అప్డేట్ వచ్చింది. ఈ చిత్రంలోని ఫస్ట్ సింగిల్ ‘బుజ్జి తల్లి’ సాంగ్ను ఈనెల 21న రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. చందూ మొండేటి తెరకెక్కించిన ఈ చిత్రం వచ్చే ఏడాది ఫిబ్రవరి 7న విడుదల కానుంది. దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నారు.
మణిపుర్లో పరిస్థితులపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా సోమవారం హై లెవల్ మీటింగ్ నిర్వహించారని తెలిసింది. ఆదివారం సైతం ఝార్ఖండ్లో ఎన్నికల ప్రచారాన్ని మధ్యలోనే వదిలేసి ఆయన సమీక్షించడం గమనార్హం. మైతేయ్ ప్రజలపై కుకీ మిలిటెంట్లు దాడులు చేయడంతో రాష్ట్రంలో మళ్లీ హింస చెలరేగింది. దీంతో కేంద్రం అదనంగా 50 కంపెనీల సాయుధ బలగాలను అక్కడికి తరలించింది. ఇప్పటికే మోహరించిన వాటితో కలిపి ఈ సంఖ్య 70కి చేరింది.
TG: వికారాబాద్ జిల్లా లగచర్లలో కలెక్టర్, అధికారులపై దాడి ఘటనలో DSPపై వేటు పడింది. పరిగి డీఎస్పీ కరుణసాగర్ రెడ్డిని డీజీపీ ఆఫీస్కు అటాచ్ చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. పరిగి కొత్త DSPగా శ్రీనివాస్ను ఉన్నతాధికారులు నియమించారు. ఈ ఘటనలో ఇవాళ దౌల్తాబాద్ మండలం సంగయ్యపల్లి పంచాయతీ సెక్రటరీని సస్పెండ్ చేస్తూ వికారాబాద్ కలెక్టర్ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.
‘బుల్డోజర్ న్యాయం’ సరికాదని సుప్రీం ఆగ్రహం వ్యక్తం చేసిన కొన్ని రోజులకే UP CM యోగి మళ్లీ అలాంటి కామెంట్స్ చేశారు. ఝార్ఖండ్ ఎన్నికల ప్రచారంలో మాట్లాడుతూ ‘సోరెన్ ప్రభుత్వం కేంద్ర నిధులను కొల్లగొట్టింది. వాటిని రికవరీ చేయడానికి బుల్డోజర్ సిద్ధంగా ఉంది. బంగ్లా వలసదారులు, రోహింగ్యాల చొరబాట్లను సర్కారు ప్రోత్సహిస్తోంది. వీరి వల్ల బేటీ, మటీ, రోటీ(కూతురు, భూమి, రొట్టె)కి ముప్పు ఏర్పడింది’ అని చెప్పారు.
రాజస్థాన్ జైసల్మేర్ వేదికగా DEC 21న GST కౌన్సిల్ 55వ సమావేశం జరగనున్నట్లు కేంద్రం వెల్లడించింది. ఈ భేటీకి అన్ని రాష్ట్రాలు/UTల నుంచి ప్రతినిధులు హాజరుకానున్నారు. రూ.5 లక్షల వరకు ఆరోగ్య బీమా, లైఫ్ ఇన్సూరెన్స్పై GST మినహాయింపుపై(ప్రస్తుతం 18%) నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. 20 లీటర్ల డ్రింకింగ్ వాటర్ బాటిల్స్, సైకిళ్లు, నోట్బుక్స్పై GSTని 5 శాతానికి తగ్గించడంపై చర్చిస్తారు.
Sorry, no posts matched your criteria.