News February 15, 2025

ఘోర రోడ్డు ప్రమాదం.. 10 మంది మృతి

image

యూపీలోని ప్రయాగ్‌రాజ్‌-మీర్జాపూర్ హైవేపై ఘోర ప్రమాదం జరిగింది. ఛత్తీస్‌గఢ్ నుంచి మహా కుంభమేళాకు భక్తులతో వెళ్తున్న బొలెరో ఓ ట్రావెల్ బస్సును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 10 మంది భక్తులు చనిపోయారు. 19 మందికి గాయాలయ్యాయి. అర్ధరాత్రి 2 గంటల సమయంలో మేజా సమీపంలో ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో బొలెరో నుజ్జునుజ్జయింది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాలను బయటకు తీశారు.

News February 15, 2025

WPL: నేడు ముంబైతో ఢిల్లీ ఢీ

image

ఉమెన్స్ ప్రీమియర్ లీగ్‌-2025లో ఇవాళ ముంబై ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. వడోదరలోని కోటంబి స్టేడియంలో రాత్రి 7.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. తొలి సీజన్‌లో విజేతగా నిలిచిన ముంబై గత సీజన్‌లో స్థాయికి తగ్గట్లు రాణించలేదు. మరోవైపు గత రెండు సీజన్లలో ఫైనల్‌కు చేరిన ఢిల్లీ టైటిల్ సాధించలేకపోయింది. స్టార్ స్పోర్ట్స్, జియో హాట్ స్టార్‌లో LIVE చూడవచ్చు.

News February 15, 2025

‘బార్బోన్ విస్కీ’పై టారిఫ్ తగ్గించిన భారత్

image

అమెరికాకు చెందిన మోస్ట్ పాపులర్ ‘బార్బోన్ విస్కీ’పై భారత ప్రభుత్వం టారిఫ్ రేటును తగ్గించింది. ఇదివరకు ఈ విస్కీ దిగుమతులపై 150% టారిఫ్ ఉండగా, దాన్ని 100%కి తగ్గించింది. మిగిలిన ఆల్కహాల్ ఉత్పత్తులపై 150% టారిఫ్ కొనసాగనుంది. 2023-24లో భారత్ 2.5 మి. డాలర్ల విలువైన బార్బోన్ విస్కీని దిగుమతి చేసుకుంది. భారత్ దిగుమతులపై అధిక టారిఫ్స్ వేస్తోందని ట్రంప్ విమర్శించిన తర్వాతి రోజే కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది.

News February 15, 2025

GOOD NEWS: పప్పుల రేట్లు తగ్గాయ్

image

TG: భారీగా పెరిగిన పప్పుల ధరలు దిగొస్తున్నాయి. గతేడాది రూ.200-240 వరకు వెళ్లిన క్వాలిటీ కేజీ కందిపప్పు ప్రస్తుతం రూ.150-160కి వచ్చింది. క్వాలిటీ తక్కువుండే పప్పు రూ.110-125 పలుకుతోంది. శనగ పప్పు రూ.150 నుంచి రూ.135కు, మినప పప్పు రూ.160 నుంచి రూ.150కి, మైసూర్ పప్పు రూ.130 నుంచి రూ.115కి తగ్గింది. రాష్ట్రంలో పప్పుధాన్యాల సాగు, మార్కెట్లకు సరఫరా పెరగడమే ధరల తగ్గుదలకు కారణమని వ్యాపారులు చెబుతున్నారు.

News February 15, 2025

బర్డ్ ఫ్లూ.. ఈ నంబర్లకు ఫోన్ చేయండి!

image

AP: బర్డ్ ఫ్లూతో భారీ సంఖ్యలో కోళ్లు చనిపోవడంతో రాష్ట్ర ప్రజలు భయాందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో వైరస్‌కు సంబంధించి ప్రజలు, కోళ్ల పెంపకందారుల సందేహాలు తీర్చేందుకు పశుసంవర్ధక శాఖ టోల్ ఫ్రీ నంబర్లు ఏర్పాటు చేసింది. ఎవరికైనా సందేహాలుంటే ఉ.6 నుంచి రా.9 గంటల మధ్య 0866 2472543, 9491168699 నంబర్లలో సంప్రదించాలని సూచించింది.

News February 15, 2025

లోన్ కట్టలేదని గేటు ఊడదీసుకుపోవడం ఏంటి?: తుమ్మల

image

TG: లోన్ చెల్లించలేదని బ్యాంకు అధికారులు ఓ రైతు ఇంటి గేటు తీసుకెళ్లిన <<15446915>>ఘటనపై<<>> వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల స్పందించారు. అప్పులు చెల్లించని డిఫాల్టర్లకు బ్యాంకులు రూ.కోట్లతో రుణాలు ఇస్తున్నాయని, రైతులు సకాలంలో లోన్ కట్టకపోతే గేటు ఊడదీసుకుపోవడం ఏంటని ప్రశ్నించారు. మానవీయ కోణంలో వ్యవహరించాలని నాబార్డు రుణ ప్రణాళిక సదస్సులో ఆయన సూచించారు. అన్నదాతలకు రుణాలు ఇవ్వడంలోనూ నిర్లక్ష్యం తగదన్నారు.

News February 15, 2025

జయలలిత బంగారు ‘ఖజానా’!

image

మాజీ సీఎం జయలలిత ఆస్తులు, పత్రాలను తమిళనాడు ప్రభుత్వానికి బెంగళూరు కోర్టు అధికారులు అప్పగించారు. ఇందులో 27 కిలోల బంగారం, 1,116 కిలోల వెండి, రత్నాలు, వజ్రాభరణాలు, 10 వేల చీరలు, 750 జతల చెప్పులు, 1,672 ఎకరాల భూముల పత్రాలు, ఇళ్ల దస్తావేజులు, 8,376 పుస్తకాలు ఉన్నాయి. వీటన్నింటిని 6 ట్రంకు పెట్టెల్లో తీసుకువచ్చి అప్పగించారు. వీటి విలువ ప్రస్తుతం రూ.4,000 కోట్లుగా ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు.

News February 15, 2025

నేటి నుంచి CBSE 10, 12వ తరగతి ఎగ్జామ్స్

image

నేటి నుంచి దేశవ్యాప్తంగా CBSE బోర్డ్ ఎగ్జామ్స్ ప్రారంభం కానున్నాయి. ఇందుకోసం 7842 సెంటర్లు ఏర్పాటు చేశారు. 24.12 లక్షల మంది 10వ, 17.88 లక్షల మంది 12వ తరగతి విద్యార్థులు ఈ పరీక్షలు రాయనున్నారు. ఉ.10.30 నుంచి మ.1.30 గం. వరకు ఎగ్జామ్స్ ఉంటాయి. అడ్మిట్ కార్డులతో పాటు స్కూల్ ఐడెంటిటీ కార్డులు తీసుకెళ్లాలి. యూనిఫాం తప్పనిసరి. మార్చి 18న టెన్త్, ఏప్రిల్ 4న 12వ తరగతి బోర్డ్ ఎగ్జామ్స్ ముగుస్తాయి.

News February 15, 2025

‘స్థానిక’ ఎన్నికలు.. ఇవాళ పోలింగ్ కేంద్రాల జాబితా విడుదల

image

TG: ఒకవైపు బీసీలకు 42% రిజర్వేషన్లపై క్లారిటీ తర్వాతే ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తుండగా మరోవైపు అధికారులు ఎలక్షన్స్‌ ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడొచ్చినా సిద్ధంగా ఉండాలని పంచాయతీరాజ్ శాఖ డైరెక్టర్ సృజన అధికారులను ఆదేశించారు. 570 ZPTC, 5,817 MPTC స్థానాల్లోని పోలింగ్ కేంద్రాల జాబితాను ఇవాళ ప్రకటించాలని సూచించారు. పోలింగ్ సిబ్బందికి శిక్షణను పూర్తి చేయాలన్నారు.

News February 15, 2025

బైక్ నడుపుతున్నారా? ఈ జాగ్రత్తలు పాటించండి

image

*రోడ్లపై స్పీడ్ లిమిట్ ఫాలో అవ్వండి
*ట్రాఫిక్ సిగ్నల్స్ జంప్ చేయొద్దు
*స్లోగా వెళ్లేవారు ఎడమవైపు వెళ్లాలి. కుడి వైపు నుంచి ఓవర్ టేక్ చేయాలి.
*ట్రాఫిక్ చలాన్ల నుంచి తప్పించుకోవడానికి లో క్వాలిటీ హెల్మెట్లు వాడతారు. వీటి వల్ల మన ప్రాణాలకు గ్యారంటీ ఉండదు. అందుకే ISI మార్క్ ఉన్న క్వాలిటీ హెల్మెట్ వాడాలి.
*బైక్ నడుపుతూ సెల్ ఫోన్ వాడొద్దు.
*రాత్రి వేళల్లో ప్రయాణాలు వద్దు.