News November 18, 2024

రాహుల్.. మీ CMను నియంత్రించలేరా?: KTR

image

లగచర్ల బాధితులు 9నెలలుగా పోరాడుతున్నారని, పేద గిరిజనుల బాధలు రాహుల్ గాంధీకి కనిపించట్లేదా? అని KTR ప్రశ్నించారు. మీ పార్టీ CMను నియంత్రించే పరిస్థితి లేదా అని నిలదీశారు. లగచర్లలో అర్ధరాత్రి మహిళలపై పోలీసులు దాడి చేశారని, ఈ అంశాన్ని పార్లమెంట్‌లో లేవనెత్తుతామన్నారు. మణిపూర్ లాగే లగచర్లలో దాడులు జరుగుతున్నాయని చెప్పారు. 300రోజులు దాటినా ఒక్క హామీ అమలు చేయలేదని ఢిల్లీలో విమర్శించారు.

News November 18, 2024

తాను చనిపోయినా.. నలుగురికి ప్రాణం పోసిన రెండేళ్ల బాలుడు

image

కెన్యాకు చెందిన రెండేళ్ల లుండా యుంబా చనిపోతూ భారత్‌లోని నలుగురికి ప్రాణం పోశారు. రెండో అంతస్తు నుంచి పడిపోవడంతో లుండా తలకు గాయం అయింది. చికిత్స పొందుతూ అక్టోబర్ 26న బ్రెయిన్ డెడ్‌తో మృతి చెందారు. దీంతో అతని అవయవాలు దానం చేసేందుకు లుండా తల్లి ముందుకొచ్చారు. ఇండియాలో పాంక్రియాస్ గ్రంథి దానం చేసిన అత్యంత పిన్న వయస్కుడు లుండానే. చండీగఢ్‌లోని PGI ఆస్పత్రి వైద్యులు లుండాకు ఘన నివాళులర్పించారు.

News November 18, 2024

దూరదృష్టితో కులగణన చేపట్టాం: పొంగులేటి

image

TG: గత ప్రభుత్వం సమగ్ర సర్వే నివేదికను ఎందుకు బయటపెట్టలేదని మంత్రి పొంగులేటి ప్రశ్నించారు. KCR ప్రభుత్వ తప్పులను సరిదిద్దుతున్నట్లు చెప్పారు. మంచి ప్రతిపక్షంగా విలువైన సూచనలు ఇస్తే స్వీకరిస్తామన్నారు. దూరదృష్టితో తమ ప్రభుత్వం కులగణన సర్వే చేపట్టిందని తెలిపారు. తాము ఏ పనినీ కక్షపూరితంగా చేయడం లేదని మంత్రి స్పష్టం చేశారు. గత ప్రభుత్వంలో నేతలు చేసిన అక్రమాలపై చట్టపరంగానే చర్యలుంటాయని వెల్లడించారు.

News November 18, 2024

RECORD: ఒకే రోజు 5 లక్షల మంది విమాన ప్రయాణం

image

దేశీయ విమాన రంగంలో సరికొత్త రికార్డు నమోదైంది. నవంబర్ 17న 3,173 విమానాల్లో 5,05,412 మంది ప్రయాణం చేశారు. ఒక రోజులో ఇంత మంది ప్రయాణించడం ఇదే తొలిసారి. అన్ని విమానాల్లో 90 శాతంపైన ఆక్యుపెన్సీ నమోదవగా, పలు కారణాలతో సర్వీసులన్నీ ఆలస్యంగానే నడిచాయి. ఫెస్టివల్, పెళ్లిళ్ల సీజన్ కారణంగానే ఈ ట్రాఫిక్ నమోదైందని అధికార వర్గాలు వెల్లడించాయి. ఇదే డిమాండ్ వింటర్ అంతా కొనసాగుతుందని ఆశాభావం వ్యక్తం చేశాయి.

News November 18, 2024

పవన్ కళ్యాణ్‌పై MIM కార్యకర్త ఫిర్యాదు

image

TG: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌పై MIM కార్యకర్త ‘X’లో పోలీసులకు ఫిర్యాదు చేశారు. హైదరాబాద్, ఓల్డ్ సిటీ వాసులు భారతీయ సంస్కృతిని విమర్శిస్తారంటూ పవన్ వ్యాఖ్యానించారని పేర్కొన్నారు. HYDలో 2దశాబ్దాలుగా మతపరమైన గొడవలు జరగలేదని, పవన్‌ తాజా వ్యాఖ్యలు అవమానకరమని రాసుకొచ్చారు. ఆయనపై చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు. దీనిపై లీగల్ ఒపీనియన్ తీసుకుంటున్నామని హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ సమాధానమిచ్చారు.

News November 18, 2024

GREAT: కంటిచూపు లేకపోయినా గ్రూప్-4 జాబ్

image

ఖమ్మం జిల్లా కారేపల్లి(M) చీమలవారిగూడెంకు చెందిన మానస అంధురాలు. టెన్త్ వరకు గ్రామంలో, అనంతరం ఫ్రెండ్స్ సాయంతో కారేపల్లికి 4KM నడిచి వెళ్లి ఇంటర్, డిగ్రీ చదివారు. ఇంటి వద్దే ప్రిపేరై 2022లో బ్యాంక్ జాబ్ సాధించిన మానస.. సహాయకురాలి చేయూతతో గ్రూప్-4 పరీక్ష రాశారు. తన కృషికి ఫలితాల్లో జూనియర్ అకౌంటెంట్ ఉద్యోగానికి ఎంపికయ్యారు. తపన ఉంటే లక్ష్యసాధన కష్టం కాదని మానస నేటి యువతకు ఆదర్శంగా నిలుస్తున్నారు.

News November 18, 2024

అది మంచి పద్ధతి కాదు: RBI గవర్నర్ వార్నింగ్

image

బ్యాంకులు తప్పుడు లేదా అరకొర సమాచారంతో కస్టమర్లకు ప్రొడక్ట్స్ విక్రయించడంపై RBI గవర్నర్ శక్తికాంత దాస్ ఆందోళన వ్యక్తం చేశారు. ఇది సరైన పద్ధతి కాదన్నారు. ఈ విధానంతో షార్ట్ టర్మ్‌లో లాభపడినా లాంగ్‌టర్మ్‌లో నష్టపోతారని హెచ్చరించారు. KYC వెరిఫికేషన్ కాకుండా అకౌంట్లు తెరవడం, మిస్ సెల్లింగ్ వంటి అనైతిక పద్ధతులను అడ్డుకోవాలన్నారు. వీటికి తావులేకుండా స్టాఫ్ ఇన్సెంటివ్స్‌ను రూపొందించాలని సూచించారు.

News November 18, 2024

లగచర్ల ఘటనలో పంచాయతీ సెక్రటరీ సస్పెండ్

image

TG: లగచర్ల ఘటనలో కొత్తకోణం వెలుగులోకి వచ్చింది. గ్రామస్థులు, రైతులను రెచ్చగొట్టారని దౌల్తాబాద్(M) సంగయ్యపల్లి పంచాయతీ సెక్రటరీ రాఘవేందర్‌ను వికారాబాద్ కలెక్టర్ సస్పెండ్ చేశారు. దాడి సమయంలో ఇతను కీలకంగా ఉన్నట్లు పోలీసుల వద్ద ఆధారాలున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే రాఘవేందర్ రిమాండ్‌లో ఉండగా, మరిన్ని కేసుల నమోదుకు అవకాశం ఉంది. ఈ కేసులో A1 పట్నం నరేందర్ రెడ్డి అరెస్ట్ కాగా, A2 సురేశ్ పరారీలో ఉన్నారు.

News November 18, 2024

ఎంత మంది పిల్లలు ఉన్నా పోటీకి అర్హత.. కారణం ఇదే

image

AP: గత మూడు దశాబ్దాల్లో జనాభా నియంత్రణకు తీసుకున్న చర్యలతో సంతానోత్పత్తి రేటు బాగా తగ్గిపోయిందని ప్రభుత్వం తెలిపింది. 2001లో 2.6 నుంచి 1.5కు తగ్గిందని.. జనన, మరణాల నిష్పత్తిలో ఏపీ బాగా వెనుకబడిందని పేర్కొంది. ఇదే సమయంలో వృద్ధుల జనాభా రేటు ఎక్కువగా ఉందని తెలిపింది. అందుకే తాజాగా స్థానిక ఎన్నికల్లో <<14644385>>ఎంత మంది పిల్లలు<<>> ఉన్నా పోటీకి అర్హత కల్పిస్తున్నట్లు వివరించింది.

News November 18, 2024

వామ్మో.. రోజూ 40 సిగరెట్ల కాలుష్యాన్ని పీలుస్తున్నారు

image

ఢిల్లీలో తీవ్రమైన వాయు కాలుష్యం కలవరపెడుతోంది. అక్కడ ఒక్కో వ్యక్తి రోజూ సగటున 40 సిగరెట్లు తాగినంత పొల్యూషన్‌ను పీలుస్తున్నారని ఓ అధ్యయనం వెల్లడించింది. ఆ తర్వాత హరియాణా(29), బిహార్(10), UP(9.5), రాజస్థాన్‌, బెంగాల్, ఒడిశా(7.5), MP(5.5) ఉన్నాయి. లద్దాక్, లక్షద్వీప్ 0, ఈశాన్య రాష్ట్రాలు, J&K, కర్ణాటక, హిమాచల్, కేరళ 0.5-1, AP, TG ప్రజలు రెండు సిగరెట్ల కాలుష్యాన్ని పీలుస్తున్నారు.