India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ప్రపంచస్థాయి మ్యూజిక్ స్కూల్ను ప్రారంభించాలనేది తన కల అని సంగీత దర్శకుడు తమన్ తెలిపారు. తన పుట్టినరోజు సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ‘సంగీత పాఠశాల నా కల. ఆర్థికంగా వెనుకబడిన వారికి అందులో ఉచితంగా సంగీతం నేర్పిస్తాను. సంగీతం ఉన్నచోట నేరాలు తక్కువగా ఉంటాయి. మరో మూడేళ్లలో మన వద్దే నిర్మిస్తాను. స్థలం ఇవ్వమని కాకుండా ప్రభుత్వాలు సాయమేమైనా చేస్తాయేమో అడుగుతాను’ అని పేర్కొన్నారు.
TG: శంషాబాద్ ఎయిర్పోర్ట్లో బాంబు బెదిరింపు కలకలం రేపింది. హైదరాబాద్ నుంచి షార్జా వెళ్తున్న విమానంలో ఎక్కిన ఓ ప్రయాణికుడు బాంబు ఉందంటూ కేకలు వేశాడు. అప్రమత్తమైన విమాన సిబ్బంది అతడిని అదుపులోకి తీసుకొని, విమానంలో తనిఖీలు చేశారు. బాంబు లేదని తేల్చారు.
SAపై నాలుగో T20లో సెంచరీ చేసిన అనంతరం సంజూ శాంసన్ కాస్త ఎమోషనల్ అయ్యారు. ఇన్నింగ్స్ బ్రేక్లో మాట్లాడుతూ ‘శ్వాస వేగంగా తీసుకుంటున్నా. మాట్లాడటం కష్టంగా ఉంది. జీవితంలో ఎన్నో ఫెయిల్యూర్స్ను ఎదుర్కొన్నా. ఎంతో కష్టపడి ఇంత వరకు వచ్చా. ఈ సిరీస్లో ఓ సెంచరీ తర్వాత వరుసగా రెండుసార్లు డకౌట్ అయ్యా. దీంతో ఎన్నో విషయాలు నా తలలో తిరిగాయి. ఈ ఇన్నింగ్స్లో అభిషేక్, తిలక్ నాకు హెల్ప్ చేశారు’ అని పేర్కొన్నారు.
సౌతాఫ్రికాపై నిన్న జరిగిన టీ20తో సహా సిరీస్లో 2సెంచరీలు చేసిన తిలక్ వర్మ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్, ఫ్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డులు దక్కించుకున్నారు. ఇది తనకు గొప్ప అనుభూతి అని, గతేడాది ఇక్కడ తొలి బంతికే అవుట్ అయినట్లు చెప్పారు. సౌతాఫ్రికాలోని ఛాలెంజింగ్ కండీషన్లలో 2సెంచరీలు చేస్తానని ఎప్పుడూ అనుకోలేదన్నారు. మరోవైపు, ఓ టీ20 సిరీస్లో MOTM, MOTS అవార్డులు అందుకున్న యంగెస్ట్ క్రికెటర్గా నిలిచారు.
భారత్లో దొంగతనానికి గురై వివిధ మార్గాల ద్వారా తమ దేశానికి చేరిన 1,400కు పైగా కళాఖండాలు, వస్తువులను US తిరిగిచ్చింది. వీటి విలువ $10 మిలియన్లు ఉంటుందని తెలిపింది. ఇందులో ఖగోళ నర్తకి ఇసుక రాయి శిల్పం అరుదైనదని, ఇది ఇండియా నుంచి లండన్కు, అక్కడి నుంచి US మ్యూజియంకు చేరిందని వెల్లడించింది. అక్రమ రవాణాదారుల నెట్వర్క్పై ఫోకస్ చేశామని, దీని వెనుక తమిళనాడుకు చెందిన సుభాష్ కపూర్ హస్తం ఉందని పేర్కొంది.
టాలీవుడ్ సింగర్లు అనురాగ్ కులకర్ణి, రమ్య బెహరా పెళ్లి చేసుకున్నారు. సడన్గా వీరి పెళ్లి ఫొటోలు సోషల్ మీడియాలో ప్రత్యక్షం కావడంతో అంతా సర్ప్రైజ్ అయ్యారు. వీరిద్దరూ కలిసి ఇస్మార్ట్ శంకర్లో ‘ఉండిపో’, ఆచార్య సినిమాలో ‘నీలాంబరి’ పాటలు పాడారు. వేర్వేరుగా ఎన్నో హిట్ సాంగ్స్తో ప్రేక్షకులను అలరించారు.
UPలోని మిర్జాపుర్లో BJP MP వినోద్ కుమార్ బింద్ కార్యాలయంలో ఓ కమ్యూనిటీ సమావేశం, విందు ఏర్పాటు చేశారు. దాదాపు 250 మంది హాజరయ్యారు. విందుకు వచ్చిన అతిథుల్లో ఒక వ్యక్తికి మటన్ ముక్కలు వేయకుండా కేవలం గ్రేవీ వేయడంతో రచ్చ మొదలైంది. తనకు ముక్కలు వేయలేదని వాగ్వాదానికి దిగిన సదరు అతిథి వడ్డించే వ్యక్తి చెంపపై కొట్టడం, తోపులాట జరిగి కొట్టుకున్నారు. ఆ తర్వాత కొందరు కవర్లలో మటన్ను నింపుకొని వెళ్లిపోయారు.
AP: రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లోని బీసీ స్టడీ సర్కిళ్లలో నేటి నుంచి డీఎస్సీకి ఉచిత శిక్షణ ప్రారంభిస్తున్నట్లు మంత్రి సవిత వెల్లడించారు. వారికి ట్రైనింగ్ సమయంలో నెలకు ₹1,500 స్టైఫండ్, మెటీరియల్ కోసం ₹1,000 ఇస్తామన్నారు. త్వరలోనే 16,347 టీచర్ పోస్టుల భర్తీకి మెగా DSCని విడుదల చేస్తామని తెలిపారు. కాగా ప్రభుత్వం 5,200 మంది BC, SC, STలకు, 520 మంది EWS అభ్యర్థులకు ఫ్రీ కోచింగ్ ఇవ్వనుంది.
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. టోకెన్లు లేని భక్తులకు వేంకటేశ్వరుడి దర్శనానికి 8గంటల సమయం పడుతోంది. నిన్న శ్రీవారిని 61,613మంది భక్తులు దర్శించుకోగా, 20,291మంది తలనీలాలు సమర్పించారు. శుక్రవారం స్వామివారి హుండీ ఆదాయం రూ.3.12కోట్లు వచ్చినట్లు తిరుమల తిరుపతి దేవస్థానం(TTD) అధికారులు తెలిపారు. కార్తీక పౌర్ణమి సందర్భంగా నిన్న తిరుమల మాడ వీధుల్లో వైభవంగా గరుడసేవ నిర్వహించారు.
TG: రాష్ట్రంలో నేడు తరగతుల బహిష్కరణ చేపట్టనున్నట్లు BC సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు R.కృష్ణయ్య ప్రకటించారు. ప్రభుత్వం విద్యార్థులకు స్కాలర్షిప్, పెండింగ్ ఫీజులను విడుదల చేయకపోవడాన్ని నిరసిస్తూ కలెక్టరేట్లు, ఆర్డీవో, తహసీల్దార్ కార్యాలయాలను ముట్టడిస్తామని చెప్పారు. స్కాలర్షిప్లను రూ.5,500 నుంచి రూ.20వేలకు పెంచాలని డిమాండ్ చేశారు. ఏపీలో రూ.20వేలు, కర్ణాటకలో రూ.15వేలు ఇస్తున్నారని తెలిపారు.
Sorry, no posts matched your criteria.