India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
TG: సిద్దిపేట ట్రాఫిక్ ఏసీపీ సుమన్ కుమార్, బిజినెస్మ్యాన్ జైపాల్రెడ్డిను HYDలోని మధురానగర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మద్యం తాగి వాహనం నడపడంతో పాటు SRనగర్ ట్రాఫిక్ పోలీసులతో వాగ్వాదానికి దిగినట్లు తెలుస్తోంది. బ్రీత్ ఎనలైజర్ పరీక్ష నిర్వహించకుండా అధికారులను ఏసీపీ అడ్డుకున్నట్లు సమాచారం.
టాయిలెట్లోకి మొబైల్ తీసుకెళ్లి అరగంటైనా కూర్చోనిదే కొందరికి సంతృప్తి కలగదు. కాలకృత్యాలు తీసుకునే సమయంలో ఇలాంటి అలవాటు ఏమాత్రం మంచిదికాదని వైద్యులు హెచ్చరిస్తున్నారు. అయితే, 3-5 నిమిషాల్లోపే ఈ పని కానివ్వాలంటున్నారు. టాయిలెట్ కమోడ్పై ఎక్కువ సేపు కూర్చోవడం వల్ల తుంటిపై ఒత్తిడి కలుగుతుంది. రక్త ప్రసరణను ప్రభావితం చేస్తుంది. ఇది పైల్స్కు దారితీస్తుంది.
సక్సెస్ అంటే ఏంటని అడిగేవారికి బాలీవుడ్ నటుడు పంకజ్ త్రిపాఠి జర్నీని చూపించాలని నెటిజన్లు చర్చించుకుంటున్నారు. పట్నాలో తాను పనిచేసిన హోటల్కు ఇటీవలే వెళ్లినప్పుడు మేనేజర్ వచ్చి రిసీవ్ చేసుకున్నారని పంకజ్ చెప్పారు. అప్పట్లో వెనుక గేటు నుంచి వెళ్లేవాడినని ఆయన గుర్తుచేసుకున్నారు. ఇప్పుడు అదే హోటల్కు మెయిన్ గేట్ నుంచి లోపలికి వెళ్లానని, GM వచ్చి స్వాగతం పలికారని ఇదే విజయం అని ఆయన పేర్కొన్నారు.
వెస్టిండీస్, ఐర్లాండ్తో భారత మహిళల జట్టు స్వదేశంలో టీ20, వన్డే సిరీస్లు ఆడనుంది. ఇందుకు సంబంధించిన షెడ్యూల్ను బీసీసీఐ రిలీజ్ చేసింది. డిసెంబర్ 15 నుంచి 27 వరకు వెస్టిండీస్తో 3టీ20లు నవీ ముంబైలో, 3 వన్డేలు బరోడాలో జరగనున్నాయి. 2025 జనవరి 10 నుంచి ఐర్లాండ్తో రాజ్కోట్ వేదికగా మూడు వన్డేల సిరీస్ నిర్వహించనున్నట్లు బీసీసీఐ తెలిపింది.
ప్రముఖ సోషల్ మీడియా మెసేజింగ్ యాప్ ఇన్స్టాగ్రామ్లో సాంకేతిక లోపం తలెత్తింది. తాము లాగిన్ కాలేకపోతున్నామని, ఫొటోలు & వీడియోలు పోస్ట్ చేయలేకపోతున్నామని యూజర్లు ట్విటర్లో ఫిర్యాదులు చేస్తున్నారు. అయితే, దీనిపై ఇన్స్టా యాజమాన్యం స్పందించలేదు. కొందరికి మాత్రమే ఇలాంటి సమస్య ఎదురవుతున్నట్లు తెలుస్తోంది. మీకూ ఇలా జరిగిందా?
టీమ్ఇండియా యంగ్ క్రికెటర్, తెలుగు తేజం తిలక్ వర్మ సౌతాఫ్రికాతో మూడో టీ20లో అదరగొట్టారు. కేవలం 51 బంతుల్లో సెంచరీ చేసి ఔరా అనిపించారు. దీంతో క్రికెట్ అభిమానులు తిలక్ను అభినందిస్తూ పోస్టులు పెడుతున్నారు. ‘వర్తు వర్మా.. వర్తు’ అంటూ ఆయన ప్రదర్శనను కొనియాడుతున్నారు. వర్మ సెంచరీతో టీమ్ఇండియా 219 రన్స్ చేయగలిగింది. ఈ కుర్రాడి బ్యాటింగ్ మీకెలా అనిపించిందో కామెంట్ చేయండి.
మార్వెల్ సినిమాల్లో గ్రూట్ పాత్ర ఎంతో మెప్పించిన విషయం తెలిసిందే. వీటిల్లో గ్రూట్ పలుమార్లు ‘అయామ్ గ్రూట్’ అనే పదాన్ని చెప్తుంటుంది. అయితే, దీనికి హాలీవుడ్ స్టార్ నటుడు విన్ డీజిల్ వాయిస్ అందించారు. కేవలం ‘అయామ్ గ్రూట్’ అనే పదాన్ని చెప్పినందుకు ఆయనకు $54 మిలియన్లు (రూ.450 కోట్లు) ఇచ్చినట్లు గతంలో వార్తలొచ్చాయి. కాగా, ఈ వార్తలను ఫిల్మ్ మేకర్ జేమ్స్ గన్ ఖండించారు.
AP: బ్రిటిష్ హైకమిషనర్ లిండీ కామెరాన్ తనతో భేటీ కావడంపై
సీఎం చంద్రబాబు స్పందించారు. రాష్ట్ర ప్రాముఖ్యతపై ఆమెతో చర్చించినట్లు వెల్లడించారు. భారత్-యూకే భాగస్వామ్యం బలోపేతం దిశగా సమాలోచనలు చేశామని, కీలక రంగాల్లో మెరుగైన సహకారం దిశగా మాట్లాడినట్లు ఆయన వెల్లడించారు. అనంతరం ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకుడు రవిశంకర్ కూడా సీఎంను మర్యాదపూర్వకంగా కలిశారు.
మహేశ్, రాజమౌళి కాంబినేషన్లో తెరకెక్కనున్న SSMB29 సినిమాలో హీరోయిన్ పాత్ర కోసం ఎప్పటికప్పుడు కొత్త పేర్లు తెరపైకి వస్తున్నాయి. దీపికా పదుకొణె, ఇండోనేషియా నటి చెల్సియా ఇస్లాన్ను తీసుకున్నారంటూ గతంలో వార్తలు రాగా తాజాగా హాలీవుడ్ హీరోయిన్ నవోమీ స్కాట్ పేరు వినిపిస్తోంది. ది మార్షియన్, అల్లాదీన్, ఛార్లీస్ ఏంజెల్స్ వంటి పలు సినిమాల్లో ఆమె నటించారు.
సౌతాఫ్రికాతో మూడో టీ20లో మొదట బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లలో 219/6 స్కోర్ చేసింది. తిలక్ వర్మ 107, అభిషేక్ శర్మ 50 పరుగులతో రాణించారు. సౌతాఫ్రికా బౌలర్లలో కేశవ్ మహరాజ్ 2, సిమెలనే 2 వికెట్లు తీయగా, జాన్సెన్ ఒక వికెట్ పడగొట్టారు. ఈ మ్యాచులో గెలవాలంటే SA 20 ఓవర్లలో 220 రన్స్ చేయాలి.
Sorry, no posts matched your criteria.