News November 13, 2024

‘ప్రభాస్‌లా జుట్టు పెంచుకుంటాం.. పర్మిషన్ ఇవ్వండి’

image

TG: ఆహారం బాలేదనో, వార్డెన్ల గురించో రెసిడెన్షియల్ విద్యార్థులు కంప్లైంట్ చేస్తుంటారు. కానీ, వరంగల్ జిల్లాలో తమకు ప్రభాస్ లాగా హెయిర్ స్టైల్ కావాలని అబ్బాయిలు, చీర కట్టుకునేందుకు పర్మిషన్ ఇవ్వాలని అమ్మాయిలు ఫిర్యాదుల బాక్సుల్లో లేఖలు వేశారు. భావాలను వ్యక్తపరచడం సరైందే అని, కానీ ఈ విద్యార్థుల అభ్యర్థనలు ఆసక్తికరంగా ఉన్నాయని ఓ అధికారి చెప్పారు. ఇదంతా సోషల్ మీడియా ప్రభావమే అని నిపుణులు అంటున్నారు.

News November 13, 2024

కుట్ర కోణం ఉందని అనుకోవట్లేదు: డీకే అరుణ

image

TG: లగచర్ల ఘటనలో కుట్ర కోణం ఉందని అనుకోవట్లేదని బీజేపీ ఎంపీ డీకే అరుణ అన్నారు. ‘కుట్ర కోణం ఉందంటే ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఏం చేస్తోంది? కలెక్టర్ వెళ్లినప్పుడు ఎందుకు భద్రత కల్పించలేదు? ఘటన జరిగినప్పుడు అన్ని పార్టీల కార్యకర్తలు ఉన్నారు. ఫార్మా కంపెనీపై గ్రామాల్లో వ్యతిరేకత ఉంది. ప్రజలు వ్యతిరేకిస్తున్న ప్రాజెక్టుపై సీఎంకు ఎందుకంత ప్రేమ? శాంతిభద్రతలను కాపాడటంలో ప్రభుత్వం విఫలమైంది’ అని విమర్శించారు.

News November 13, 2024

డిప్యూటీ స్పీకర్‌గా RRR.. జగన్ అసెంబ్లీకి వస్తారా?

image

AP: రఘురామకృష్ణరాజు(RRR)ను అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ పదవికి ఎంపిక చేశారు. ఈ నేపథ్యంలో మాజీ సీఎం జగన్ అసెంబ్లీకి వస్తే ఎలాగుంటుందనే దానిపై రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. RRR వైసీపీలోనే ఉంటూ ఆ ప్రభుత్వంపై గతంలో నిత్యం విమర్శలు చేయడంతో ఆయనపై రాజద్రోహం కేసు పెట్టారు. RRR సభ కార్యకలాపాలు నడిపిస్తే, జగన్ సభకు వస్తారా? ఒకవేళ వస్తే ఇద్దరి మధ్య సంభాషణ ఎలా ఉంటుందనేది ఆసక్తిగా మారింది. దీనిపై మీరేమంటారు?

News November 13, 2024

ప్రీమియం ధరకే లిస్టైన స్విగ్గీ షేర్లు.. వెంటనే నష్టాల్లోకి

image

ఇన్వెస్టర్లు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న తరుణం రానేవచ్చింది. ఫుడ్ అగ్రిగేటర్ కంపెనీ స్విగ్గీ షేర్లు స్టాక్‌మార్కెట్లలో లిస్టయ్యాయి. IPO ధర రూ.390తో పోలిస్తే NSEలో 8% ప్రీమియంతో రూ.420, BSEలో 5.64% ప్రీమియంతో రూ.412 వద్ద నమోదయ్యాయి. గతవారం వచ్చిన ఈ IPOకు 3 రెట్ల స్పందన లభించింది. ఓవరాల్ మార్కెట్ కండిషన్ బాగాలేకపోవడంతో ఈ షేర్లు ప్రస్తుతం 4.38% నష్టంతో రూ.401 వద్ద ట్రేడవుతున్నాయి.

News November 13, 2024

డిగ్రీ సిలబస్ మారబోతోంది!

image

TG: రాష్ట్రంలో డిగ్రీ సిలబస్ మారబోతోంది. 2019 నుంచి అవసరాలకు తగ్గట్లు కొత్త అంశాలు చేర్చలేదనే విమర్శలున్నాయి. దీంతో డిగ్రీ పాఠ్యాంశాలు మార్చేందుకు ఉన్నత విద్యామండలి నిర్ణయించింది. ఏటా సుమారు 2లక్షల మంది డిగ్రీలోని వివిధ కోర్సుల్లో చేరుతున్నారు. అటానమస్ కాలేజీలు సిలబస్‌లో మార్పులు చేసుకుంటుండగా, మిగతా వాటిల్లో అది జరగట్లేదు. ఈ క్రమంలో ఉన్నత విద్యామండలి తాజా నిర్ణయం తీసుకుంది.

News November 13, 2024

5000 ఉద్యోగులకు రూ.9000 కోట్లు పంచిన స్విగ్గీ!

image

స్విగ్గీ ఉద్యోగులు జాక్‌పాట్ కొట్టేశారు. ESOP విధానంలో కంపెనీ వారికి షేర్లు కేటాయించినట్టు తెలిసింది. 5000 మంది ఉద్యోగులు రూ.9000 కోట్లమేర పొందబోతున్నారు. అందులో 500 మంది కోటీశ్వరులు అవుతున్నారు. కంపెనీ కో ఫౌండర్స్ శ్రీహర్ష, నందన్ రెడ్డి, ఫణికిషన్, ఫుడ్ మార్కెట్ ప్లేస్ CEO రోహిత్, INSTAMART హెడ్ అమితేశ్, CFO రాహుల్, HR హెడ్ గిరీశ్, CTO మధుసూదన్ సహా మరికొందరికే రూ.1600 కోట్లు దక్కినట్టు సమాచారం.

News November 13, 2024

అశ్విన్ కంటే లయన్ మెరుగైన ఆటగాడు: మాజీ స్పిన్నర్

image

భారత స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ కంటే ఆస్ట్రేలియా స్పిన్నర్ నాథన్ లయనే మెరుగైన బౌలర్ అని సౌతాఫ్రికా మాజీ స్పిన్నర్ పాల్ ఆడమ్స్ పేర్కొన్నారు. ‘లయన్ ఒక కంప్లీట్ బౌలర్. ఉపఖండపు పిచ్‌లైనా, ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా పిచ్‌లైనా ప్రభావం చూపించగలరు. అశ్విన్ కంటే లయనే బ్యాటర్లను ఎక్కువగా ఇబ్బంది పెడుతుంటారు’ అని వివరించారు. లయన్ 129 మ్యాచుల్లో 530 వికెట్లు తీయగా అశ్విన్ 105 టెస్టుల్లో 536 వికెట్స్ తీశారు.

News November 13, 2024

RGV కోసం హైదరాబాద్‌కు ఒంగోలు పోలీసులు

image

దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు నోటీసులు అందించేందుకు ఒంగోలు పోలీసులు హైదరాబాద్ చేరుకున్నారు. మద్దిపాడు ఎస్ఐ శివరామయ్య టీమ్ ఇవాళ ఆర్జీవీకి సమన్లు అందజేయనున్నట్లు తెలుస్తోంది. కాగా ‘వ్యూహం’ సినిమా ప్రమోషన్లలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేశ్‌ వ్యక్తిత్వాలు కించపరిచేలా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారంటూ మద్దిపాడు పోలీస్ స్టేషన్‌లో ఆర్జీవీపై కేసు నమోదైంది.

News November 13, 2024

STOCK MARKETS: ఈ సెక్టార్ తప్ప అన్నీ రెడ్‌జోన్లోనే..

image

బెంచ్‌మార్క్ సూచీలు భారీ నష్టాల్లో మొదలయ్యాయి. గ్లోబల్ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు, FIIలు వెళ్లిపోతుండటం, డాలర్ బలపడటం నెగటివ్ సెంటిమెంటుకు దారితీశాయి. సెన్సెక్స్ 78,384 (-300), నిఫ్టీ 23,765 (-118) వద్ద ట్రేడవుతున్నాయి. Pvt Banks మినహా అన్ని రంగాల షేర్లపై సెల్లింగ్ ప్రెజర్ నెలకొంది. మీడియా, ఆటో, మెటల్ షేర్లు విలవిల్లాడుతున్నాయి. M&M, BEL, TATA STEEL, HEROMOTO, HINDALCO టాప్ లూజర్స్.

News November 13, 2024

క్రికెట్‌లోకి యశస్వీ జైస్వాల్ సోదరుడు రీఎంట్రీ

image

టీమ్ ఇండియా క్రికెటర్ యశస్వీ జైస్వాల్ అన్న తేజస్వీ జైస్వాల్ క్రికెట్‌లోకి రీఎంట్రీ ఇచ్చారు. త్రిపుర తరఫున బరోడాతో జరిగిన మ్యాచ్‌లో తేజస్వీ (87) అర్ధ సెంచరీ సాధించారు. కాగా తొలుత యశస్వీ, తేజస్వీ ఇద్దరూ క్రికెట్ ఆడేవారు. కానీ యశస్వీ కోసం తేజస్వీ క్రికెట్ వదిలి ఢిల్లీలోని ఓ దుకాణంలో సేల్స్‌మెన్‌గా పనిచేశారు. అంతర్జాతీయ క్రికెట్‌లో యశస్వీ నిలదొక్కుకున్నాక తేజస్వీ మళ్లీ క్రికెట్‌లోకి రీఎంట్రీ ఇచ్చారు.