News April 21, 2024

హంతకులకు ఓటు వేయొద్దు: వైఎస్ సునీత

image

AP: నేర చరిత్ర కలిగిన హంతకులకు ఎన్నికల్లో ఓటు వేయొద్దని వైఎస్ సునీత కోరారు. ‘క్రిమినల్ కేసులు ఉన్న వైఎస్ అవినాశ్ రెడ్డికి ఎందుకు టికెట్ ఇచ్చిందో వైసీపీ చెప్పాలి? నేర చరిత్ర ఉన్న వారికి టికెట్ ఇవ్వడంపై ఆ పార్టీ వెబ్‌సైట్‌లో పేర్కొనాలి. అవినాశ్ నేరచరిత్రపై ఈసీకి ఎందుకు తెలపలేదు? అభ్యర్థిపై క్రిమినల్ కేసులుంటే అఫిడవిట్‌లో తెలపాలి. కానీ ఈ నిబంధనలన్నీ వైసీపీ తుంగలో తొక్కింది’ అని ఆమె విరుచుకుపడ్డారు.

News April 21, 2024

25 రోజుల్లో రూ.150 కోట్ల కలెక్షన్లు

image

మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ లీడ్ రోల్‌లో తెరకెక్కిన చిత్రం ‘ఆడుజీవితం(ది గోట్ లైఫ్)’. ఈ సినిమా విడుదలైన 25 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.150 కోట్లకు పైగా వసూలు చేసినట్లు చిత్ర యూనిట్ ట్వీట్ చేసింది. నవల ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రంలో పృథ్వీరాజ్ నటనకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి.

News April 21, 2024

RCB ముందు భారీ టార్గెట్

image

కోల్‌కతా 222 పరుగుల భారీ స్కోరు చేసింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన కేకేఆర్‌కు ఓపెనర్ సాల్ట్ శుభారంభాన్ని ఇచ్చారు. 14 బంతుల్లోనే 48 రన్స్‌తో విధ్వంసం సృష్టించారు. పవర్ ప్లే తర్వాత చకచకా వికెట్లు పడటంతో కెప్టెన్ అయ్యర్ 50 పరుగులతో జట్టును ముందుండి నడిపించారు. చివర్లో రమణ్‌దీప్ 9 బంతుల్లో 24* రన్స్‌తో రాణించారు. RCB బౌలర్లలో గ్రీన్, యశ్ చెరో రెండు వికెట్లు తీశారు.

News April 21, 2024

గులకరాయి డ్రామాను ప్రజలు ఛీ కొడుతున్నారు: చంద్రబాబు

image

AP: సీఎం జగన్ గులకరాయి డ్రామాను ప్రజలు ఛీత్కరించుకుంటున్నారని TDP చీఫ్ చంద్రబాబు అన్నారు. ‘బీ ఫామ్ అందుకున్న ప్రతీ అభ్యర్థి గెలిచి రావాలి. 3 పార్టీల మధ్య ఓటు బదిలీ జరగాలి. కొత్త అభ్యర్థులు పార్టీ నిబంధనలు పాటించాలి. ప్రజలు గెలవాలి.. రాష్ట్రం నిలవాలన్నదే నా ఆశయం. ప్రజాగళానికి వస్తున్న ఆదరణ చూసి జగన్ వణికిపోతున్నారు. రాష్ట్రానికి ఏం చేశారో చెప్పుకోలేకే జగన్ డ్రామాలాడుతున్నారు’ అని ఆయన మండిపడ్డారు.

News April 21, 2024

IAS అధికారుల జీతంపై CA పోస్ట్ వైరల్

image

ఐఏఎస్‌ల జీతంపై ఓ చార్టెడ్ అకౌంటెంట్ పెట్టిన పోస్ట్ వైరల్‌గా మారింది. జీతం తక్కువని తెలిసినా ఐఏఎస్ అవ్వాలని ఎందుకు అనుకుంటారో అర్థం కావట్లేదు? అని చిరాగ్ చౌహాన్ అనే సీఏ ట్వీట్ చేశారు. IAS అధికారుల సగటు జీతం CA ఉద్యోగులకు వచ్చే ఆరంభ వేతనంతో సమానం అని తెలిపారు. దీనిపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. ‘గౌరవం, ప్రజా సేవ కోసం ఐఏఎస్ అవుతారు. డబ్బు కోసం కాదు’ అని కొందరు కామెంట్స్ చేస్తున్నారు.

News April 21, 2024

NTR ‘దేవర’లో పూజా హెగ్డే ఐటమ్ సాంగ్?

image

యంగ్‌టైగర్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న ‘దేవర’ మూవీలో పూజా హెగ్డే ఓ ఐటెమ్ సాంగ్‌లో నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఆమెను మూవీ మేకర్స్ సంప్రదించగా ఒప్పుకున్నట్లు సమాచారం. కాగా పూజా ‘రంగస్థలం’ సినిమాలో కూడా ఓ ఐటెమ్ సాంగ్ చేశారు. కొరటాల శివ తెరకెక్కిస్తున్న ఈ మూవీలో జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. సైఫ్ అలీఖాన్ విలన్ పాత్ర పోషిస్తున్నారు. అనిరుధ్ మ్యూజిక్ అందిస్తున్నారు.

News April 21, 2024

RCB చెత్త రికార్డు

image

ఐపీఎల్-2024లో వరుస పరాజయాలతో సతమతమవుతున్న ఆర్సీబీ ఓ చెత్త రికార్డును నమోదు చేసింది. ఒక ఎడిషన్‌లో పవర్ ప్లేలో ఎక్కువసార్లు 70+ స్కోర్లు సమర్పించుకున్న జట్టుగా నిలిచింది. ఈ సీజన్‌లో ఇప్పటివరకు 8 మ్యాచుల్లో 4 సార్లు ఆ జట్టు బౌలర్లు PPలో 70కి పైగా రన్స్ ఇచ్చారు. కేకేఆర్(85/0, 75/1), ముంబై (72/0), SRH (76/0)తో జరిగిన మ్యాచుల్లో బ్యాటర్లను కట్టడి చేయలేకపోయారు.

News April 21, 2024

కాంగ్రెస్ పార్టీకి అభ్యర్థులు కరవు: మోదీ

image

ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ 400 సీట్లు గెలుచుకుందని.. కానీ ఇప్పుడు ఆ పార్టీకి అభ్యర్థులు కరవయ్యారని ప్రధాని మోదీ ఎద్దేవా చేశారు. ‘ఇండియా కూటమి పేరుతో అవకాశవాద కూటమి ఏర్పడింది. ఆ కూటమిలోని పార్టీలే ఒకదానిపై మరొకటి పోటీ పడుతున్నాయి. అడ్డదారిన రాజ్యసభకు వెళ్లేందుకు రాజస్థాన్ అడ్డాగా మారింది. సోనియా, మన్మోహన్, కేసీ వేణుగోపాల్‌లు ఇదే దారిలో రాజ్యసభకు వచ్చారు’ అని ఆయన ఫైర్ అయ్యారు.

News April 21, 2024

కూటమికి చిరంజీవి మద్దతులో ఆశ్చర్యమేం లేదు: సజ్జల

image

AP: కూటమి అభ్యర్థులకు చిరంజీవి మద్దతు ప్రకటించడంలో ఆశ్చర్యమేమీ లేదని వైసీపీ నేత సజ్జల రామకృష్ణా రెడ్డి అన్నారు. ‘చిరంజీవే కాదు, ఎంతమంది కలిసొచ్చినా కూటమికి ఒరిగేదేమీ లేదు. ఏపీలో గుంటనక్కలు, తోడేళ్లు ఒక్కటయ్యాయి. అవి ఒకవైపు, జగన్ ఒక్కడే ఒకవైపు. జనం ఆయనతోనే ఉన్నారు. జగన్ ఈనెల 25న నామినేషన్ వేస్తారు. 2 రోజుల్లో మేనిఫెస్టో విడుదల చేస్తాం’ అని స్పష్టం చేశారు.

News April 21, 2024

మీకు బ్రేకప్ అయ్యిందా? అయితే సెలవు తీసుకోండి!

image

భారత్‌లోని ప్రముఖ ఫైనాన్షియల్ టెక్నాలజీ కంపెనీ ‘స్టాక్‌గ్రో’ తమ ఉద్యోగుల కోసం వినూత్న పాలసీని తీసుకొచ్చింది. రిలేషన్‌షిప్ బ్రేకప్స్, వ్యక్తిగత సమస్యలతో బాధపడుతున్న వారికి సెలవు ఇవ్వనున్నట్లు తెలిపింది. ఎలాంటి ప్రశ్నలు అడగబోమని, ఆధారాలు చూపాల్సిన అవసరం లేదని పేర్కొంది. వీరు అవసరాన్ని బట్టి సెలవును పొడిగించుకోవచ్చని చెప్పింది. కాగా స్టాక్‌గ్రోకు 30 మిలియన్ల మంది యూజర్లు ఉన్నారు.