News January 26, 2025

APPLY NOW.. 4,597 ఉద్యోగాలు

image

ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(AIIMS)లో 4,597 గ్రూప్-బీ, సీ పోస్టుల భర్తీకి అప్లికేషన్ల ప్రక్రియ కొనసాగుతోంది. మొత్తం 66 విభాగాల్లో జూనియర్ అసిస్టెంట్, రికార్డ్ అసిస్టెంట్, లైబ్రరీ అటెండర్, ఫార్మసిస్ట్, యోగా ఇన్‌స్ట్రక్టర్ వంటి పోస్టులను భర్తీ చేయనున్నారు. తెలుగు రాష్ట్రాల్లోనూ ఖాళీలు ఉన్నాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ <>క్లిక్<<>> చేయండి. దరఖాస్తుకు ఈ నెల 31 చివరి తేదీ.

News January 26, 2025

ఈ నెల 31న టీటీడీ పాలకమండలి భేటీ

image

AP: టీటీడీ పాలకమండలి జనవరి 31న అత్యవసర సమావేశం కానుంది. టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు ఆధ్వర్యంలో రథసప్తమి ఏర్పాట్లపై పాలకమండలి సభ్యులు, అధికారులు సమీక్ష నిర్వహించనున్నారు. ఇటీవల తిరుపతి తొక్కిసలాట ఘటన దృష్ట్యా పటిష్ఠ ఏర్పాట్లు చేస్తున్నారు. అటు ఫిబ్రవరి 3 నుంచి 5 వరకు సర్వదర్శనం టోకెన్లను రద్దు చేశారు. ఫిబ్రవరి 4న ఆర్జిత సేవలు, సిఫార్సు లేఖలపై వీఐపీ బ్రేక్ దర్శనాలనూ రద్దు చేశారు.

News January 26, 2025

APPLY NOW: స్కాలర్‌షిప్ దరఖాస్తు గడువు పెంపు

image

CBSE సింగిల్ గర్ల్ చైల్డ్ స్కాలర్‌షిప్ దరఖాస్తు గడువును FEB 8 వరకు పెంచారు. CBSEలో 70% మార్కులతో టెన్త్ పాసైన అమ్మాయిలు అర్హులు. తల్లిదండ్రులకు ఏకైక సంతానంగా ఉన్న ఆడపిల్లల్ని ప్రోత్సహించేలా దీన్ని అమలు చేస్తున్నారు. ఎంపికైన వారికి నెలకు ₹1000 చొప్పున రెండేళ్లు అందుతాయి. కుటుంబ వార్షికాదాయం ₹8లక్షలలోపు ఉండాలి. 11వ తరగతి పూర్తైన వారు మళ్లీ రెన్యువల్ చేసుకోవాలి. దరఖాస్తు కోసం ఇక్కడ <>క్లిక్ <<>>చేయండి.

News January 26, 2025

ఏడాదికే మళ్లీ పెళ్లి చేసుకున్న హీరోయిన్.. కానీ..

image

నటి శ్వాసికా విజయ్ ఏడాది వ్యవధిలో రెండోసారి పెళ్లి చేసుకున్నారు. అయితే రెండు సార్లూ తన ప్రియుడు ప్రేమ్‌తోనే కావడం విశేషం. గత ఏడాది జనవరి 26న వారికి కేరళ సంప్రదాయంలో తొలిసారి పెళ్లైంది. అయితే తమిళ సంప్రదాయంలో మరోసారి ఏకమవ్వాలని భావించి వారు తాజాగా పెళ్లి చేసుకున్నారు. శ్వాసిక అసలు పేరు పూజా విజయ్. వైగై అనే తమిళ మూవీతో ఆమె సినిమాల్లోకి వచ్చారు. చివరిగా లబ్బర్ పందూ సినిమాలో నటించారు.

News January 26, 2025

అనర్హులకు పథకాలు వస్తే మధ్యలోనే ఆపేస్తాం: మంత్రి

image

TG: పథకాల కోసం అర్హులైన వారెవరూ రూపాయి లంచం కూడా ఇవ్వాల్సిన అవసరం లేదని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. వరంగల్‌లో మంత్రి కొండా సురేఖతో కలిసి 4 పథకాల ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. పథకాల కోసం కొత్త దరఖాస్తులు ఎన్ని వచ్చినా తీసుకుంటామని స్పష్టం చేశారు. అనర్హులకు లబ్ధి చేకూరినట్లు తేలితే వారికి మధ్యలోనే పథకాలను ఆపేస్తామన్నారు. త్వరలో ఇంటింటికి సన్న బియ్యం పంపిణీ చేస్తామని పేర్కొన్నారు.

News January 26, 2025

బంగ్లాదేశ్‌కు అమెరికా షాక్

image

అప్పుల ఊబిలో ఉన్న బంగ్లాదేశ్‌కు అమెరికా షాకిచ్చింది. ఆ దేశానికి ఇచ్చే అన్ని రకాల సాయాలను నిలిపివేస్తున్నట్లు అమెరికా దాతృత్వ సంస్థ USAID ప్రకటించింది. బంగ్లాతో ప్రస్తుతం జరుగుతున్న, మున్ముందు జరగాల్సిన అన్ని సహాయక కార్యక్రమాలను నిలిపేస్తున్నట్లు స్పష్టం చేసింది. భారత విదేశీ వ్యవహారాల మంత్రి జైశంకర్‌తో భేటీ అయిన కొన్ని రోజులకే అమెరికా ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం.

News January 26, 2025

కుటుంబానికి పదవులు ఇచ్చి దోచే వ్యక్తిని కాదు: రేవంత్

image

TG: కొడంగల్(ని) చంద్రవంచ బహిరంగ సభలో KCR టార్గెట్‌గా CM రేవంత్ రెడ్డి ప్రసంగించారు. KCR కుటుంబంలా తమ ఇంట్లో అందరూ పదవులు పొందలేదని చెప్పారు. కుమారుడు, కుమార్తె, అల్లుడు, బంధువులకు KCR పదవులు ఇచ్చారని, కుమార్తె MP ఎన్నికల్లో ఓడిపోతే వెంటనే MLC చేశారని వెల్లడించారు. ఇలా బంధువులందరికీ పదవులు ఇస్తే మంచిదా? అని ప్రశ్నించారు. కుటుంబానికి పదవులు ఇచ్చి దోపిడీ చేసే వ్యక్తిని తాను కాదని CM స్పష్టం చేశారు.

News January 26, 2025

మాజీ MLC కన్నుమూత.. నేతల సంతాపం

image

TG: కరీంనగర్ మాజీ MLC, సీనియర్ జర్నలిస్టు ఆర్.సత్యనారాయణ అనారోగ్యంతో సంగారెడ్డిలోని తన నివాసంలో మృతి చెందారు. ఆయన మృతి పట్ల CM రేవంత్, BRS అధినేత KCR, మంత్రి పొన్నం ప్రభాకర్, హరీశ్‌రావు సహా పలువురు నేతలు సంతాపం తెలియజేశారు. 2007లో కరీంనగర్ గ్రాడ్యుయేట్ MLCగా గెలిచిన ఆయన, 2008లో తెలంగాణ ఉద్యమం కోసం ఆ పదవికి రాజీనామా చేశారు. TSPSC సభ్యుడిగానూ వ్యవహరించారు. గతేడాది కాంగ్రెస్ పార్టీలో చేరారు.

News January 26, 2025

జనసేన కార్యకర్తలకు మంత్రి వార్నింగ్

image

AP: కూటమి మధ్య విభేదాలు సృష్టించేలా జరుగుతున్న ప్రచారంపై మంత్రి నాదెండ్ల మనోహర్ ఘాటుగా స్పందించారు. కొందరు అసత్య ప్రచారాలు చేస్తున్నారని దుయ్యబట్టారు. తామెప్పుడూ సమస్యలపైనే పోరాటం చేశామని తెలిపారు. పదవుల కోసం టైమ్ వేస్ట్ కార్యక్రమాల్లో పాల్గొనవద్దని జనసేన కార్యకర్తలకు ఆయన వార్నింగ్ ఇచ్చారు. పార్టీ సిద్ధాంతం కోసమే అందరూ నిలబడాలని, రహస్యంగా లేఖలు, సమావేశాలు వద్దని సూచించారు.

News January 26, 2025

విడిపోయిన వారి పిల్లలకు గుండె జబ్బులొచ్చే ప్రమాదం: అధ్యయనం

image

తల్లిదండ్రులు విడిపోయిన పిల్లలకు పెద్దయ్యాక గుండెపోటు వచ్చే ప్రమాదం ఎక్కువని కెనడా పరిశోధకుల అధ్యయనంలో తేలింది. ‘65 ఏళ్లు దాటిన 13వేలమందిపై మా సర్వే నిర్వహించాం. 18 ఏళ్లు వచ్చేలోపు తల్లిదండ్రులు విడిపోవడాన్ని చూసినవారిలో 60శాతంమందికి గుండెపోటు వచ్చింది. వారు డిప్రెషన్, డయాబెటిస్ వంటివాటితో బాధపడుతున్నట్లు గుర్తించాం. ఇవన్నీ కలగలిపే గుండెపోటుకు దారి తీస్తున్నాయి’ అని తమ నివేదికలో వివరించారు.